Saturday, April 26, 2014

కుప్ప కూలింది

                                               
                                                       లేదా
                                            (we) share (your) market


        అది మధ్య తరగతికి చెందిన ఆవాసము(కాలని). ఉదయాన్నించి చాలా గందర గోళముగాఉన్నది. ఒక్కొక్కరింట్లో చాలా మంది చేరి, దీర్ఘముగా ఆలోచిస్తున్నారు. కొందరు, నిజానికి వచ్చే ఏడుపును అపేసుకుంటున్నారు. చాలా మందికి రేపు ఎలా చేయాలనేదే ప్రశ్న.
          ఒక ఇంట్లో డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు అలోచించి పెట్టాలి. ఉన్న డబ్బులంతా  ఊ డ్చి తగలేసినారు. నెలలో  కూతురు పెళ్లి ఉన్నాది. భార్య చాలా ఆవేశముగా ఉన్నది.
          మరొక ఇంట్లో నెలలో యజమాని పదవీ విరమణ చేయ బోతున్నారు. కాస్త  జాగ్రత్తగా ఉండండి అని మొత్తుకుంటే విన్నారు కాదు., ముక్కులు ఎగ బీలుస్తున్నది.
          మరొక ఇంట్లో , నాకు కాసు బంగారము కొనమంటే, చూడు, ఒకటేమిటి, పది కాసులు కొని పెడుతాను చూడు. అన్నారు. ఏదీ, ఆ పది కాసులు అఖ్ఖర లేదు. ఆ ఒక్క కాసు కొని పెట్టండి చాలు., అన్నది ఇంటావిడ.
          వార్తా పత్రికలలో కొన్ని ఆత్మ హత్యల సమాచారము వచ్చినది. కానీ, రేడియో మరియు దూరదర్శన్ లలో ఆర్ధిక మంత్రి సుదీర్ఘమయిన ఒక ఉపన్యాసమిచ్చి, మీ పెట్టుబడులకు  మేము హామీ, అన్నీ పరిస్థితులు చక్క బదేతట్లు చూస్తాము అన్నారు. అయినా మార్కెట్ లో ఒడిదుడుకులకు మేము భాధ్యులము కాము అన్న హామీ ఆ యా కంపెనీల నుండి ఉన్నాది కదా.
          ఇప్పటికి అంతా అర్థమయిందనుకుంటాను, సమస్య ఏమిటో? ఆ రోజు ఒక్క సారిగా షేర్ మార్కెట్ వెయ్యి పాయింట్ల మీద కూలి పోయిందట. ఈ దెబ్బతో బాగా విలువ యున్న షేర్లను కుడా అమ్మి వేయడము మొదలు పెట్టినారు. అమ్మకాలకు డిమాండ్ పెరిగేసరికి సూచిక ఇంకా పడిపోతుందని అందరూ భయ పడుతున్నారు.  బ్రోకర్ల దగ్గిర , స్టాక్ మార్కెట్ దగ్గిర విపరీతముగా జనము చేరి పోయినారు.
          షేర్ మార్కెట్ ను ఆర్ధిక రంగములో ఒక అద్భుత మయిన ప్రక్రియ గా భావించే వారు చాలా మంది యున్నారు. కానీ, అది మానసిక ప్రపంచములో నడిచే సైకలాజికల్ గేమ్ గా అర్థము చేసుకో లేక పోతున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టె చాలా మందికి ఇది ఎలా నడుస్తుందో తెలియదు. తెలిసిన వారికి కావలసినంత తెలివి తేటలు చూపించి, ఎప్పుడూ ఏరును దాటేస్తుంటారు.
          మరి ఈ ప్రక్రియ ఎలా ప్రారంభమయిందో  నాకూ తెలియదు, తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు.  కానీ, లోపల జరుగుతున్నదేమిటో మాత్రము తెలుస్తూనెఉన్నది.
          భౌతిక శాస్త్రములో ఎంట్రపి అనే పరిమాణము ఉన్నది. ఇది భౌతిక ప్రపంచములో జరిగే గందరగోళమునకు సూచిక. ఈ విశ్వము నడుస్తున్నంత సేపూ అది పెరుగుతూఅన్నా ఉంటుంది, లేదా స్థిరముగా ఉంటుంది.  మరొక మాటలో చెప్పాలంటే, ఈ విశ్వములో ప్రతి భౌతిక చర్య ఎంట్ర పి పెరిగే దిశలో నడుస్తుంది.  దీనినే ద్వితీయ ఉష్ణ గతి సూత్రము గా చెబుతారు. భౌతిక శాస్త్ర పరముగా ఇది ఖచ్చితమయినది. అయితే, తరువాత కాలములో కొన్ని చర్యలలో ఇది తగ్గుతుంది కొంత మంది సూత్రీకరించినారు. భౌతిక శాస్త్ర వేత్తలు దీనిని పూర్తిగా అంగీ కరించక పోయినా అది ఏమిటో ఈ వ్యాసములో కానీ తదుపరి వ్యాసాలలో దానిని గూర్చి చర్చిద్దాము.
          ఉష్ణ గతి భౌతిక విజ్ఞానములో ఎంట్రపి కి  దీటు వచ్చేది  వాణిజ్య ఆర్థిక విజ్ఞానములో షేర్ మార్కెట్ యొక్క సూచి. లేదా ఇండెక్స్. న్యాయము ప్రకారము ఇది కూడా ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి, లేక పొతే ఆ దేశము ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలినట్లే.  ఇది నిజమేనా?
          మాస్టారూ! మీరు పొరపాటు పడుతున్నారు,  ఎంట్రపి పెరగడమేమిటి, ఈ ఇండెక్స్ పడిపోవదమేమిటి? .ఇది ఒక  నిజముగా వివరించ వలసిన ప్రశ్న. కానీ దీనికి జవాబు రావాలంటే చాలా విషయాలు తెలియాలి. ఇక్కడ ఒక చిన్న కథను చెప్పుకుందాము.
          రంగయ్య, రాజయ్య మరియు రామయ్య మంచి స్నేహితులు.. ముగ్గురికి వ్యవసాయపు భూములు ఉన్నాయి. వరిని పండిస్తారు. వాళ్ళ ఊరిలో ధాన్యాన్ని బియ్యముగా మార్చే మర ఏమీ లేదు. ప్రతి దానికి ఎడ్ల బండి మీద పక్క ఊరికి వెళ్ళాలి.  ఒక రోజు రంగయ్య ఆలోచించినాడు. స్వంత ఊరిలొనె బియ్యపు మర ఉంటే బాగుంటుంది అని. బయట విచారిస్తే పదిహేను లక్షలు పెట్టుబడి అవసరమవుతుందన్నారు. మరి తన దగ్గిర అంతా సొమ్ము లేదు.  ఇద్దరు మిత్రులతో తన ఆలోచన చెప్పగానే చెరో అయిదు లక్షలు ఇస్తామన్నారు. వచ్చిన లాభాన్ని ముగ్గురూ సమానముగా పంచుకోవాలి అని, అనుకున్నారు.  చివరకు ఊరిలో ఒక బియ్యపు మర ఏర్పడింది. ఊరిలో ప్రధాన వృత్తి వ్యవసాయము కనుక లాభాలు బాగుగానే వస్తున్నవి. ముగ్గురూ సంతోషముగా ఉన్నారు. ఇక్కడే కొత్త సమస్యలు మొదలయినాయి.
          వీళ్ళ పరిస్థితిని చూచిన తరువాత మరికొంత మంది ఇంకొక బియ్యపు మరను పెట్టాలనుకున్నారు. తము కూడా ఉన్న వారితో కలిస్తే శ్రమ తగ్గుతుంది, లాభాలను పంచుకోవచ్చు అనుకున్నారు. తమ ఉద్దేశ్యాన్ని వారికి చెప్పినారు. ఇంతలో రామన్న కూతురు పెళ్లి నిశ్చయ మయినది. ఇందుకోసమై చేతిలో ఉన్న సొమ్ముకు అదనముగా మరో రెండు లక్షలు కావలసి వచ్చినది. ఆ సొమ్ము బియ్యపు మరలో తను పెట్టిన పెట్టుబడి లో తీసుకోవాలనుకున్నాడు. అలా తీసుకుంటే వచ్చిన ఆదాయాన్ని ఎలా పంచుకోవాలి? అప్పుడు ఉన్న పెట్టుబడుల నిష్పత్తి లో పంచుకోవాలి అనుకున్నారు. అయినా పంపకము సులభము గా ఉండాలంటే పది రూపాయలను ఒక యూనిట్ క్రింద మార్చి, దానిని షేర్ అని అన్నారు. అంటే పదిహేను(౧౫) లక్షల రూపాయలు ఒక లక్షా పదిహేను వేల షేర్ లు అన్న మాట.
          ఇక్కడే పాశ్చాత్య సంస్కృతి ప్రభావము ఏర్పడింది. భారతీయ సంస్కృతి న్యాయమైన లాభాల గురించి మాట్లాడితే, పాశ్చాత్య సంస్కృతి గిరాకీ ని బట్టి లాభాలను గురించి మాట్లాడింది. అంటే గిరాకీని బట్టి ప్రజలు ఎంత ధరకు కొనడానికి సిద్ధ బడుతారో అంతకు అమ్మడము అన్న మాట. దీనినే వారి భాషలో మార్కెట్  ఎకనమి (వ్యాపార ఆర్దికత )అని అన్నారు. ఈ విధముగా ఎక్కువ డబ్బు పెట్ట గల వారికే మంచి సరుకు దొరుకుతుంది. మనిషికి అత్యవసర మయిన వైతే ఎంత ధర కయినా అమ్మ వచ్చు. ఉదాహరణకు రైల్వే ప్లాట్ ఫారమ్ లపై మంచి నీరును లీటర్ ఇరువది అయిదు రూపాయలకు అధికారికముగా అమ్మినా అడిగే దిక్కు లేని సంస్కృతి మనకు వచ్చినది. పకృతి ఇచ్చిన సంపద  పై వ్యాపారము పెరగడానికి వారు పెట్టె లక్షల రూపాయల ఖర్చు కూడా మనమే ఇచ్చుకోవాలి కదా! పది రూపాయల లోపు అమ్మబడే విక్స్ కోసము ఎన్ని లక్షల రూపాయలు ప్రకటనలకు ఖర్చు పెడుతున్నారో గమనిస్తే తెలుస్తుంది.
          కాపిటల్  లేదా పెట్టుబడి రెండు రకాలుగా లెఖ్ఖ కట్ట వచ్చును.మన పద్ధతిలో అక్కడ నికరముగా యున్న సంపద విలువను బట్టి లెక్క కడుతాము. ఇది న్యాయమైన మార్గము. వాటాలు తీసుకొనే వారు ఎంత విలువకు కొన్నారో, దాన్ని అనుసరించి లెఖ్ఖ కట్టడము ఇప్పుడు అనుసరిస్తున్న పధ్ధతి. దీనిని ప్లావిత విలువ లేదా ఫ్లోటింగ్ వాల్యు అని అనాలి. ఇది ఇప్పుడు అనుసరించ బడే పధ్ధతి. అంటే ఇప్పుడు పది లక్షలున్న వ్యాపారము రేపు వాటా లేదా షేర్ విలువ పడి పొతే పది వేలు గా లెఖ్ఖ కట్ట బడ వచ్చును. ఇటువంటి మార్పులు వచ్చిన తరువాత మానవ విలువలు పడి పోవడము మనము స్పష్టముగా గమనించ వచ్చును. ఈ నాదు కొన్ని ప్రాంతాలలో జనము కొనక పండ్లు కుళ్ళి పోయినా వదిలి వేస్తున్నారు, కానీ, ధర తగ్గించి అమ్ముట లేదు. అమెరికా లో ఒక సారి, పంటలు ఎక్కువ పండితే మార్కెట్ లో ధరలు పడిపోఆయని పంటను సముద్రము పాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది మార్కెట్ ఎకనమి ప్రభావము. భారత దేశములో దీనిని మహా పాపముగా భావించే వారు. కానీ ఆ సంస్కృతి ప్రభావము ఇప్పుడు మన రక్తములో కూడా కలుస్తున్నది.
          మన కథలోనికి తిరిగి వెళ్దాము.  సీనన్న కొంత పెట్టుబడి పెట్టాలని అనుకున్నాడు. దీనితో బాటు మరికొందరు షేర్లు కొనాలనుకుంటున్నారు.  అంటే షేర్ కు డిమాండ్ లేదా గిరాకీ పెరిగింది. అప్పుడు పడి రూపాయల షేర్ ముప్పది రూపాయలకు అమ్ముతామని అంటారు.  అంటే పదిహేను లక్షల ఆస్తి నలుబది ఐదు లక్షల ఆస్తిగా మారి పోతుంది. దీనినే షేర్ మార్కెట్ లో లాభము వచ్చిందని అంటారు.
          ఇక ధాన్యము మిల్లును వదిలి వేద్దాము. ఒక ఎలెక్ట్రానిక్ పరిశ్రమ కు వెళు తాము.  పోటీ  వలన వ్యాపారములో  ఒడిదొడుకులు సహజము గా వస్తాయి. లాభము బాగా వచ్చినపుడు తగిన నిష్పత్తిలో పంచుతారు. లేదా అధికారికము గా షేర్ విలువ పెంచు తారు. ఈ విధముగా షేర్ విలువ రెండు రకములుగా పెరుగ వచ్చును, ఒకటి, వచ్చే లాభాల వలన లేదా ఆ  షేర్  లకున్న గిరాకీ వలన. ఇక్కడే మానసిక ప్రవర్తన ప్రభావము కనిపిస్తుంది.  పది రూపాయల షేర్ వంద రూపాయలకు అమ్మినపుడు సంస్థలలో మనకు పంచ బడే లాభాలు అవే నిష్పత్తిలో ఉండవు.  అంటే  తక్కువ రేటు కు కొన్న షేర్ ఎక్కువ రేటు కు అమ్మితేనే లాభాలు, అందు వలన షేర్ విలువ పెరిగితేనే ఆదాయము మరియు లాభము. అందువలన షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టె వారు  ఎక్కువగా  వ్యాపారములో లాభము కంటే షేర్ అమ్మి లాభము సంపాదించాలనే అనుకుంటారు. అంటే లాభాలు రావాలంటే షేర్ విలువ పెరుగుతూనే ఉండాలి. అది ఆగి పోయిందా పెట్టుబడులు పోతాయి.
          మరి ఇక్కడ జనము ఎలా మోస పోతారు? ఒక వ్యక్తీ ఎక్కువ పెట్టుబడి పెట్టి నాలుగు రోజులు తన మనుషుల చేత వరుసగా షేర్ లు కొనిపిస్తాడు. ఈ విధముగా ఆ షేర్ విలువ పెరుగుతుందన్న అభిప్రాయము అందరికి కలిగిస్తాడు.  దీనితో జనము ఎగ బడి ఆ  షేర్ లు కొంటారు.  దీనితో ఆ షేర్ విలువ విపరీతముగా పెరుగుతుంది. ఇదే అదునుగా తీసుకొని మొదట షేర్ లు కొన్న వ్యక్తి తను కొన్న షేర్ లు ఎక్కువ గా అప్పుడున్న రేటు కు అమ్మి వేసి లాభాలు తన ఖాతా లో వేసుకుంటాడు. ఎప్పుడయితే ఈ వేగము తగ్గుతుందో షేర్ విలువ పడి పోవడము మొదలవుతుంది. ఈ విధముగా తరువాత షేర్ లు కొన్న వారి కి నష్టము వస్తుంది. ఈ విధముగా  హర్షద్ మెహతా మొదలుకొని ఎంతో మంది స్టాక్ మార్కెట్ ను మోసగించినారు. ఈ విధముగా మధ్యలో షేర్ లు కొన్న వారంతా నెత్తిన గుడ్డను వేసుకుంటారు. ఇటువంటి మోసాలను నియంత్రించడానికే  సెబి ఏర్పడింది. ఇది చైన్ స్కీమ్ లేదా గొలుసు పధ్ధతి లో జనాన్ని ఆకర్షించే లానే ఉంటుంది.
          ఈ సంస్థలలో వచ్చే లాభాలలో కొంత మూల ధనానికి వెళితే సహజముగా షేర్ విలువ పెరుగుతుంది.  ఇదే కారణము వలన నష్టాలలో నడుస్తున్న సంస్థలలో షేర్ విలువ పడి పోతుంది. ఒక్కొక్క  షేర్  మార్కెట్  లో కొన్ని సంస్థలు తమను నమోదు చేసు కుంటాయి. ఈ సంస్థల సగటు ఆదాయమును బట్టి ఆ మార్కెట్ యొక్క సూచి మారుతుంది. సూచి మరీ పడి పోతే షేర్ మార్కెట్ నష్టాలలో పడి పోతుంది. నిజాయితీ లోపించి నప్పుడు కృత్రిమముగా షేర్ విలువ పెంచాలని చూస్తారు. ఈ ప్రయత్నాలు తాత్కాలికముగా ప్రయోజనాన్ని ఇచ్చినా తరువాత ఆర్ధిక వ్యవస్థ మీద గట్టి దెబ్బ కొడుతుంది.
          సామర్థ్యము లేని డబ్బున్న ప్రతి వాడికి పరిశ్రమలు పెట్టడానికి అనుమతి ఇస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఒక పరిశ్రమ పెట్టాలంటే ముందు ఆర్ధిక వనరులు, స్థలము, మూల వసతులు అత్యంత ప్రధానమయినవి. అటు తరువాత బయటకు వచ్చే పరికరాలకు బయట పోటీ ఉత్పత్తి ఏమయినా యున్నదా? ఆ పోటీ కి తాము తట్టుకొన గలరా,  తమ పోటీ గా తయారవుతున్న పరికరాలలో తమ వాటి కంటే ప్రత్యేకతలు ఏమయినా ఉన్నాయా, ఇటువంటి వాటిని పరిశీలించాలి.  ఇందులో వాడే ముడి పదార్థాలు అందు బాటులో ఉన్నాయా, వ్యర్థ పదార్థాలు ఏర్పడుతాయా, వాటి వలన పర్యావరణానికి ఏమయినా హాని యున్నదా, ఇటువంటి వాటికి సమాధానము రాబట్టు కోవాలి. విలువయిన నీటిలో తమ మురికిని వదలి ఎంతో మిగుల్చుకో వచ్చును. కానీ అదే నీరు లీటర్ పాతిక రూపాయలు పెట్టి బయట జనము కొనుక్కోవాలన్న విషయాన్ని  విస్మరించ కూడదు. కొన్ని ఎలెక్ట్రానిక్ పరిశ్రమలలో ఆర్సెనిక్ లాంటి విష పదార్థాలు వాతావరణము లోనికి వెళుతున్నవి. వీటి వలన పరిసరాలలో యున్న జనానీకము మీద దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడా వచ్చును.  అందు వలన చుట్టు ప్రక్కల జనాలలో వ్యతిరేకత వచ్చి  ఆ పరిశ్రమను మూసి వెయ వలసిన పరిస్థితులు రావచ్చును.
          మరొక విషయము గుర్తు పెట్టుకొన వలసి యున్నది. తమ ఉత్పత్తుల వినియోగములో ప్రధాన భాగము ఆ దేశము లో యుంటే మంచిది. లేక పొతే అమెరికన్ మార్కెట్ కొఱకు ఉత్పత్తి చేసిన చైనా ఉత్పత్తులు అమెరికన్ ఆర్ధిక స్థితి పడిపోగానే తను నష్ట పోతుంది. ఇదే పరిస్థితులు ప్రతి యొక్కరికి రా వచ్చును.
          సత్య సాయి బాబా గారు ఒక విషయాన్ని స్పష్టము చేసే వారు. వ్యాపారము ధర్మము ఆధారముగా జరగాలి. ఇదే విషయాన్ని ఆయన తన భక్తులకు నొక్కి చెప్పే వారు. ధర్మానికి వ్యాపారానికి పొత్తు కుదరదని ఎక్కువ మంది చెబుతున్న ఈ రోజుల్లో ఆయన ఆలోచనను అనుసరించిన వారు ఖచ్చితమయిన విజయాన్ని సాధించినారు. ఇందులో స్వదేశీయులు  మరియు విదేశీయులు కూడా ఉన్నారు. మన వ్యాపారము వినియోగ దారుడి నమ్మకము మీద ఆధార పడాలి. అంతే కాని మన గుప్పించే ప్రకటనల మీద కాదు.
          ఒక సోనీ సంస్థలో ఒక ఉత్పత్తిలో నాణ్యము తగ్గినది. పరికరము అప్పటికి పని చేస్తుంది. కానీ సోనీ యజమాని ఒక మాట చెప్పినాడు. ఎంత నష్టము వచ్చినా ఆ ఉత్పత్తులు మార్కెట్ లోకి ప్రవేశించ కూడదు,అని. ఎందుకంటే సోనీ ఉత్పత్తులు అత్యున్నత ప్రమాణాలతోయున్నాయన్న నమ్మకాన్నిపొగొట్టు కొనకూడదు. ఇటు వంటి నియమాలతో కూడిన సంస్థలు స్టాక్ మార్కెట్ ప్రవేసిస్తే సూచీ ఎప్పుడూ పైకే ఉంటుంది.
          విలువలు లేనపుడు స్టాక్ మార్కెట్ పడి పోతూనే ఉంటుంది, ఎంత లేపినా సరే.


Wednesday, April 9, 2014

బుడగ తామర

                                                       

 నా పేరు బుడగ తామర. బహుశా మీరు తెలుగు పదాలను మరిచి పోయి ఉంటారు. అందరూ నన్ను వాటర్ హేసెన్త్ అని అంటున్నారు. ఇప్పటి ఆధునిక ప్రపంచములో నా మీద చాల ఆరోపణలు మరియు నిందలు వస్తున్నాయి. ఎప్పుడూ నీటిలో ఉండే నేను నీటి ప్రవాహానికి అడ్డు వస్తున్నానుట. నా వలన నీటి ప్రవాహము ఎక్కువయి  వరదలు వచ్చే పరిస్థితులు వచ్సినాయిట. ప్రతి సారి నన్ను తొలగించడానికి చాలా ఖర్చు పెట్ట వలసి వస్తున్నాదిట. ఇంతకూ ముందు అలా తీసి పడేసే వారు. ఇప్పుడు ఏవో విష పదార్థాలు చల్లి నన్ను చంపేస్తున్నారు. లూయీస్ పాశ్చర్ ఏమి మాయ చేసాడో కానీ, ప్రతి దానికి విష పదార్థాలు వాడి భూమిని విష పూరితము చేయడము బాగా అలవాటు అయింది. ఇపుడు మీరు ఉన్న వేగములో నేను ఏమి చెప్పినా మీకు వినే ఓపిక ఉన్నదని నేను అనుకోను, అయినా చెప్పడము నా భాద్యతగా భావించి విషయము చెప్పాలని అనుకుంటున్నాను.
          సుమారు ముప్పది లేక నలువది ఏళ్ల క్రిందట, మేము  ఎక్కడో చెరువులలో, నూతులలో, ఒక మూల ఉండే దాన్ని. అసలు మేమున్నామన్న విషయము మాకు తప్ప మరొకరికి తెలిసేది కాదు. క్రమ క్రమముగా  నగరాలు పెరిగే కొద్దీ కొన్ని మార్పులు వచ్చినవి. పల్లెలకు నగరాలు పాకిన తరువాత  పంట కాలువల పక్కనే పెద్ద భవనాలు వచ్చినాయి. అప్పుడు ఆ నీరు పొలాలకు పోవడమే కాదు. దారిన పోయే వారు ఎవరయినా దాహము వేస్తె నేరుగా కాలువలో నిరు త్రాగే వారు. ఆ పని ఇప్పుడు మీరు చేయండి, మీరు వైద్యుడి దగ్గిరకి వెళ్ళాలా, కాటికి వెళ్ళాలా అనే విషయము మీకే తెలియదు.  ఇప్పుడు సమస్య మరో రకముగా వచ్చినది.  ఈ పంట కాలువల  ప్రక్కన వచ్చిన భవనాల నుండి వచ్చిన నిషిద్ద మల మూత్ర పదార్థములతో కూడిన నీరు నేరుగా ఈ కాలువల లోనికి వదలుట మొదలు పెట్టినారు. ఈ విధముగా ఒకప్పుడు అందరు త్రాగే నీరు అపరి శుభ్రము అయినవి.
          వృక్ష జాతికి చెందిన మేము ఎప్పుడూ ప్రకృతిని శుభ్రము చేయుటకే ప్రయత్నమూ చేస్తున్నాము. మీకు గుర్తు ఉంటే ఒక చిన్న తామర జాతికి చెందిన చిన్ని మొక్కలను నూతిలో నీళ్ళలో వేసే వారు. వాటి వలన నీరు శుభ్ర పడడమే కాదు, నీరు ఎంతో తియ్యగా తయారు అయేది. సీసాల్లో నీళ్ళు తప్ప వేరే నీరు తాగని మీకు అవి ఎక్కడ గుర్తు ఉంటాయి లెండి? మరొక విషయము చెప్పాలి. ఇది కొన్ని దశాబ్దాల క్రిందట జరిగినది. ఈ సంఘటన హిందు అనే ఆంగ్ల పత్రికలో పెద్ద వ్యాసముగా వచ్చినది. కాస్త జ్ఞాపక శక్తి యున్న వారికి ఈ విషయము గుర్తుండే యుంటుంది. ఒక విదేశీ యాత్రికుడు ఉదక మండలము కొండల పైన వాహ్యాళి చేస్తున్నాడు. బాగా దాహము వేసినది. అంతా చూచినాడు. ప్రక్కనే కొండ పై భాగము నుండి జల ధార వస్తున్నది. చేతులతో పట్టుకొని త్రాగినాడు. నీరు చాలా రుచిగా ఉన్నది. త్రాగిన  తరువాత అనుమానము వచ్చినది, ఇప్పుడు వర్షా కాలము కూడా కాదు కదా! ఈ నీరు ఎక్కడినుండి వచ్చినది? అని. ఆ నీటి ధార ప్రక్కనే నెమ్మదిగా కొండ పైకి ఎక్కినాడు.  కొండ పైకి చేరిన తరువాత ఆశ్చర్య పోయినాడు. ఎందుకంటే ఆ నీరు పైన యున్న అతిథి గృహము నుండి బయటికి వస్తున్న మురికి నీరు . అక్కడ భయంకరముగా దుర్వాసన వేస్తున్నది. తనకు ఏ జబ్బు వస్తుందో అని భయము వేసినది. వెంటనే తను నీరు త్రాగిన చోట నీరు సీసాలో పట్టి  రసాయనిక విశ్లేషణ కు పంపించినాడు. అది ఏ దోషము లేని మంచి నీరు అని వారు తేల్చి చెప్పినారు. అంటే ఆ నీరు ఆ వాలులో గడ్డి పైన దిగుతున్నపుడు  శుభ్ర పడినాయన్న మాట.
                   మ ళ్ళీ చెబుతున్నాను, మా వృక్ష జాతి వలన మీకు మేలు జరుగుటున్నదే కాని, కీడు జరుగుట లేదు. ఈ నాడు పట్టణాలు పల్లె ల లోకి పెరిగిన తరువాత పంట కాలువల ప్రక్కన భవనాలు బాగా పెరిగినవి. ఆ భవనాల లోని
మురికి నీరు అంతా పంట  కాలువల లోనికి వదులుతున్నారు. ఈ విధముగా పంట కాలువల లో మురికి ఎక్కువగా చేరినపుడు, మేము అక్కడ చేరుతున్నాము. మీరొక సారి పరీక్ష గా చూడండి. మా ఆకుల క్రింద నీరు  మా వెలుపల యున్న నీరు పరీక్ష గా చూడండి. మా క్రింద నీరు ఎంత శుభ్రముగా యుందో  మీకు తెలుస్తుంది. అంతే కాదు, కొన్ని రకాల విష మూలకాల నుండి భూమి పై  మట్టిని మేము శుభ్రము చేస్తాము. నీరు శుభ్రము చేయడములో మా సంఖ్య సరి పోవుట లేదు. అయినా మా సంఖ్య ఎక్కువయి వరదలు వస్తున్నాయి అని అంటున్నారు. రహదారులు పూర్తిగా జనముతో నిండి పోయినపుడు మీరు వేగముగా ఆ దారిలో వెల్ల గలరా?
          మిమ్ములను గూర్చి నేను చెబితే మీకు చాలా కోపము వస్తుంది. అయినా చెబుతాను. నేను చెప్పేవన్నీ మీకు తెలియనివి కాదు.
          ఒకప్పుడు ధర్మము నాలుగు పాదాలలో నడిచే రోజులలో ఒక ఋషి యాత్ర లోయున్నాడుట. విపరీతముగా ఆకలి వేసినది. భిక్ష కోసము చూస్తే పరిసరాల్లో ఎవరూ లేరు. ఎదురుగా ఒక మామిడి తోట కనిపించినది.  బాగుగా పండిన మామిడి పండ్లు చెట్లకు వ్రేలాడుతున్నవి. వాటితో ఆకలి తీర్చుకోవాలని చుట్టు పక్కల తోట మాలి కోసము వెదికినాడు. ఎవరూ కనిపించ లేదు. ఆకలి భరించ లేక ఒక పండు కోసుకొని తిన్నాడు. కాస్త ఆకలి తీరగానే తనలో  తప్పు చేసినానన్న భావన విపరీతముగా పెరిగినది. ఎవరి అనుమతి లేకుండా తను తిన్న పండుకు తను ఎంత దుష్కర్మను అనుభవించ వలనో అని అనిపించినది.
          వెంటనే ఆ ప్రాంతమును ఏలుతున్న రాజు దగ్గరికి వెళ్ళినాడు.  యజమాని అనుమతి లేకుండా పండు కోసుకొని తిన్నందుకు, ఆ దొంగ తనానికి తనను శిక్షించ వలసినదిగా కోరినాడు. ఆ రాజు ఇతడిని చూచినాడు, గొప్ప తపస్విలా కనిపిస్తున్నాడు. ఇతడిని శిక్షింప గలిగిన శక్తిమంతుడు కాదు తను. అదే మాట అన్నాడు. అతడు మరీ బలవంతము చేస్తే తన ఆస్థానములో పని చేస్తూ ధర్మ శాస్త్ర కోవిడుదయిన బ్రాహ్మణుడిని పిలిపిస్తాడు. ఆ తపస్వి ఇతడి తమ్ముదేనని అప్పుడు తెలిసినది. అతడి సలహా మీద తపస్వి పండు కోసిన చేతిని ఖండించమని ఆజ్ఞాపించాడు. అప్పుడు అన్న తన తమ్ముడిని దగ్గిరలో యున్న ఒక నది లో మునిగి లెమ్మని చెబుతాడు. అతడు అలా చేసేసరికి ఆని చేయి తిరిగి వస్తుంది.  
ఆ నదిని తరువాత బాహుదా నది పేరుతొ పిలిచినారు. బాహుదా అంటే చేతులను ఇచ్చినది అని అర్థము. అది యొక పవిత్రమయిన నదిగా పేరు కన్నది. అదే నది ఈ నాడు చిత్తూరు పట్టణము మధ్యలో ఒక మురుగు కాలువ వలె పారుతున్నది. వాయు పురాణములో ఒక పవిత్ర మయిన నదిగా పేరు కన్న గోస్తని నది ఇప్పుడు పరిశ్రమల మురికిని భారముగా మోసుకొని వెళుతున్నది. మీరే చెప్పండి, నేను నేను చెప్పేది నిజమే కదా!
          ఒకప్పుడు ఇంటి చుట్టు చెట్లుంటే చాలా మంచిదను కొనే వారు. ఇప్పుడు ప్రాకారము లోపల చెట్లుంటే రోజు వాటి ఆకులను చిమ్మాలిట, ఇది చాలా శ్రమతో కూడిన పని అట. మరి మీరు వాడే ప్లాస్టిక్ మురికి కంటే మా మురికి ఎక్కువ ఇబ్బంది కలిగిస్తున్నదా? మా వృక్ష జాతి వదిలే ఆకులు మట్టిలో కలిసి కరిగి పోతాయి. మరి ప్లాస్టిక్ అలా కలుస్తుందా? మా చెట్లు మీకు ప్రాణ వాయువు ను ఇస్తున్నది, వేసవిలో చల్లని నీడను ఇస్తున్నది, పండ్లు, కాయలు ఇస్తున్నది. అంతే కాదు, మీకు బాగా నీరసముగా యున్నపుడు యాచిస్తే ప్రాణ శక్తిని కూడా చాలా సంతోషముగా ఇస్తుంది. ఇదే మా జాతి యొక్క ప్రత్యేకత.
          ఇంత వఱకు నా గురించి చెప్పుకున్నాను. మీ గురించి చెప్ప వలసినది చాలా యున్నది.
          చెట్లను నరకి వేస్తున్నారు. అడవులు తగ్గిపోతున్నాయి. అందువలన సక్రమమయిన వర్షాలు తగ్గి పోయినాయి. మురికినంతా నీటి ప్రవాహాలలో వదిలి వేస్తున్నారు. కీటకాల పేరు చెప్పి పొలాలన్నీ విషమయము చేస్తున్నారు. నీటిని మురికి చేయకుండా యుంటే మీకు నీటి కరువు ఎక్కడున్నది? ఇంట్లో మురికిని కాలువలలో కల్పి వేసి చేతులు విదిలించి వేసుకుంటున్నారు. కానీ, తము మురికి చేసే నీళ్ళకు బదులుగా త్రాగే నీటిని లీటర్ ఇరువది రూపాయలకు అమ్ముతున్నారన్న విషయాన్నీ మఱచి పోయినారు. ఇన్ని నదులు కలిగి యున్న మన దేశములో మంచి నీటిని అమ్మే స్థితికి తీసుక వచ్చిన పాలకులు దేశాన్ని సిగ్గు పడే స్థితికి తీసుకు వచ్చినారు. ఈ నాడు ఆన కట్టలను కట్టడానికి అయే ఖర్చులో కొంత భాగము మురికి నీరు శుభ్రము చేయడానికి కాక నీరు మురికి చేయకుండా చేసే మంచి పద్ధతుల కొఱకు పరిశోధనలు చేస్తే దేశము బాగు పడుతుంది.
          మేము నీటిని శుభ్రము చేయాలని ఎంత ప్రయత్నము చేసినా మురికిని తాయారు చేసే మీ వేగాన్ని అందుకోలేక పోతున్నాము. అయినా మీ చేత శత్రువులుగా భావించ బడుతున్నాము.  మీరు శుభ్రతను నేర్చుకొని మన భూమికి సహకరిస్తారన్న ఆశతో-----------మీ బుడగ తామర.

         



Sunday, March 23, 2014

గీతాంజలి ౨౦


కుసుమించినదది కమలమ్మని
నే గుర్తించగ లేదు.
ఎదలో రగిలే మథనము లో నే
విరులను చేర్చగ లేదు.
మెల మెల్లగ సోకెను దక్షిణ గాలులు
చల్లగ మేల్కొలుప
వ్యథ తో నిండిన హృది నది లేపెను
తీయని విరి తావి
తవి తీరని కోర్కెలు రేపెను నాలో
చల్లగ పూ తావి
గ్రీష్మర్తువు యొక్కచవరి దశ
దరి చేరినదని తెలియకనే మది
మాధుర్యము సోకె

ఎదఅంచుల తాకె. 

Monday, March 17, 2014

దోమ

                                                                                      
ఏమండోయ్ నేనే, దోమను. కొందరు నన్ను మశ్చికం అంటారు. వాళ్లకు కొంత భాషాభిమానము ఎక్కువ లెండి. సింపుల్ గా నన్ను దోమ అంటే చాలు. మా జాతి మీద మీకు చాలా కోపముగా యున్నది. ఆ విషయము మీకూ  తెలుసు. అది సహజము కూడా. ఎందుకంటే మేము రక్త పిశాచ జాతికి చెందిన వాళ్లము. అంటే అన్ని రకాల జీవుల రక్తము మీద జీవిస్తాము కాబట్టి. అయినా మేము మానవ జాతి యొక్క దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నామంటే మీరు ఆశ్చర్య పోతారు. కానీ, నిజాము మాత్రమదే.
సుమారుగా ఏబది ఏళ్ల క్రిందట  పల్లెటూళ్ళలో ఆరు బయట చల్లని గాలిలో  మంచాలు వేసుకొని పండుకొనే వారు. ఎందుకంటే అప్పుడు మా జనాభా అంతగా పెరగ లేదు. ఇప్పుడలా పండుకోంది చూద్దాము. మా జనాభా మిమ్ములనలా పండుకోనిస్తున్దేమిటి? మాకు మీ రక్తముతో బాటు మురికి పదార్థాలు అన్నా ఇష్టమే. అందుకీ మా గుడ్లను మురికి గుంటల లోనే పెడుతాము. ఆ రోజుల్లో నత్తలు కప్పలు నేరుగా వచ్చి మాగుడ్లను తిని వేసేవి. వాటిని తప్పించుకొని పగిలిన గుడ్లే మా జాతిని నిలిపేవి. ఆ సమయములో మా జాతి అందుకే వేగముగా పెరిగేది కాదు.
ఈ విషయము లోనే మేము మేము మానవ జాతికి ఏంటో ఋణ పడి యున్నాము. ఎందుకంటే వాళ్ళు పరిశోధనలకనీ, వంటల కనీ కప్పలను ఖాళీ చేయించేసినారు. అంతే కాక చేపల చెరువుల్లో ఆహారము గా వేయుటకై నత్తలన్నిటినీ ఏరి, చితగ కొట్టి వేసేస్తున్నారు. దీనితో మాకు ప్రాథమిక శత్రువులు పోయినారు.
పాత రోజుల్లో ఇళ్ళల్లో సాంబ్రాణి లాంటి ధూపాన్ని తరచుగా వేసే వారు. ఆ వాసన మాకు అసలు పడదు. అందుకని మేము లోపలి ప్రవేశించే వాళ్లము కాదు. ఇప్పుడు బొగ్గులు పొడి చేసి అందులో సాంబ్రాణి వేసి ధూపము వేయాలంటే మీకు బాగా బద్ధకము వచ్చేసింది. దీనితో మాకు బాగా స్వాతంత్రము వచ్చేసింది.
          మా వలన మలేరియా లేదా చలి జ్వరము వ్యపిస్తున్నాడని తెలిసిన తరువాత మేమంటే జనానికి భయము పెరిగినది. ఆ తరువాత వ్యాధుల పట్టీలో డింగీ బర్డ్ ఫ్లూ లాటి విష జ్వరాలు చేరిన తరువాత  మమ్ములను నియంత్రించుటకై బజారులో పొగ చుట్టాలు, కిరసిన్న్ పొగ డబ్బాలు చాలా వచ్చినాయి. వాటి దెబ్బకు మా దోమలు చాలా చని పోతున్నాయి. అయితే ఇప్పటికీ జనానికి అర్థము కానిదొకటి యున్నది. దోమ నివారణ రసాయనాలు  పెరిగినాయి, దోమలు కూడా చాల చని పోతున్నాయి, అయినా మా సంఖ్య పెరుగుతూనే యున్నది.అది మీకు పూర్తిగా అర్థము కావుట లేదు.
అంతకంటే గమ్మత్తయిన విషయమున్నది. దోమలకు రోగ నిరోధక శక్తి కూడా పెరిగినది. ఇంతకుముందు కొద్ది మోతాదుకు చని పోయే దోమలు ఇప్పుడు ఎక్కువ మోతాదుల విషాన్ని కూడా తట్టుకొన గలుగుతున్నవి. ఈ విషయములో నా చిన్న బుఱ్ఱకు తోచినదొకటే. విష ప్రయోగము వలన కొన్ని బలహీనమయిన దోమలు చని పోయిన కొలదీ మిగిలిన దోమలకు దొరికే ఆహారము పెరిగి వాటి శక్తి కూడా పెరుగుతున్నది.మరొకటేమిటంటే మీ లోని కొంత మంది శాస్త్ర వేత్తలు చెపుతున్న దాన్ని బట్టి, (మ్యుటేషన్  అనబడే జీవ లక్షణమును అనుసరించి ) మా యొక్క రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతున్నది. అందుకనే మీ విష పదార్థముల ప్రభావము తగ్గిపోతున్నది. మీ ఓర్పు మరీ తగ్గి పోయి మమ్ములను పూర్తిగా నాశనము చేయాలన్న కసి కొద్దీ  మీరు భూమిని విష పదార్థములతో నింపి వేస్తున్నారు.
ఒక మహర్షి చెప్పినారు, మీరు మరొకరిని పరోక్షముగా నిందించుట వలన ఏర్పడే శక్తి మాకు బలాన్ని చేకురుస్తున్నాదని. అది, నిజమో కాదో నా చిన్ని బుఱ్ఱకు అర్థము కాదు, కానీ,భౌతిక వాదముతో కొట్టుక పోతున్న మీకు ఈ విషయాన్ని అంగీకరించే శక్తి లేదన్న మాట మాత్రము నిజము. 
మధ్యలో మరొక సరాగము. ఇటీవల ఈగ అనబడే పేరుతొ సినీమా వచ్చినది. చని పోయిన కథానాయకుడు ఈగ దేహములో చేరి పగ తీర్చుకుంటాడు. అంత పగను పెంచుకొని ప్రతి నాయకుడిని గుర్తుంచుకొనే శక్తి ఈగ మెదడుకు ఉందా? నాకు అర్థము కాలేదు. అది వీలయితే రేపు నేను కూడా అలాటి పనులు చేయ వచ్చును .
మళ్ళీ ఎపుడో కలుద్దాము.

మీ చిన్ని దోమ.   

Tuesday, February 18, 2014

సరికొత్త సామాజిక వాదము



 లేని వారు ఎదో యొకటి ఆలోచిస్తూనే యుంటారు. పనికి వచ్చేది  మాత్రము కాదు.  ఎదో యొకటి వ్రాస్తుంటారు., ఇదీ అంతే. ఇటువంటిదే ఇటీవల ఒక పత్రికలో ఒక వ్యాసము వచ్చినది. అదేమిటంటే, ఎడమ చేయి ఏమి పాపము చేసినది?  మూఢ నమ్మకాల నుండి మార్క్సిజం వరకు అందరూ మా ట్లాడేస్తూ ఉంటారు.  అయన/ఆమె బాధ ఏమిటంటే ఎడమ చేయిని చిన్న చూపు చూస్తున్నామా? , అని. ఇక్కడ నుండి సరిక్రొత్త సిద్ధాంతాలు, రాద్ధాంతాలు మొదలవుతాయి.
          ఒక సారి నేనొక ప్రొఫెసర్ ఇంట్లో రాత్రి విందుకు వెళ్ళినాను. అక్కడ ఒక అమెరికన్  జాతీయుడు కూడా అతిథి.  నేను గమనిస్తూ ఉన్నాను. అందరమూ అలవాటుగా కుడి చేతితో అన్నము కలుపుకొని తింటున్నాము.  అప్పటికే ఆయన తనకు అలవాటు అయిన రీతిలో రెండు చేతులను అన్నిటికి వాడుతూ తింటూ,క్రమ క్రమముగా అందరిని  గమనించి కుడి చేతి తో అన్నము తిన సాగినాడు.  ఇందులో ఎవరిదీ మంచి పధ్ధతి, లేదా కాదు అన్న ప్రశ్నే లేదు.  కాని, పదుగురు వెళ్ళే మార్గములో వెళ్ళాలని అందరూ  ప్రయత్నిస్తారు. అంతే గానీ దీనిని ఎదో ఒక తీవ్రమయిన విషయముగా భావించ వలసిన విషయము కాదు. ఈ తత్వము ఇంతటితో ఆపితే బాగుంటుంది, కానీ, అన్ని విషయాల్లో చేతులు పెడతారు.
          అదే పత్రికలో మరొక వ్యాసములో ఒక రచయితకు తెలుగు మీద సంస్కృతం యొక్క అత్తగారి పెత్తనము కనిపించినది. కానీ, ఆ రచయిత/రచయిత్రి  భారతీయ భాషలన్నీ సంస్కృతము నుండి వచ్సినాయన్న విషయాన్ని మఱచి పోయినాడు. అంటే కాదు, వారికి  ఆంగ్లము ( పొరపాటయింది ), ఇంగిలీషు మామ గారి పెత్తనము కూడా కనిపించినది.
          మనము చరిత్ర పూర్తిగా చదివి అర్థము చేసుకోకుండా ఈ విధమయిన మిడి మిడి జ్ఞానముతో ప్రతి విషయానికి సామ్య /సామాజిక వాడమును  ఆపాదించు కుంటూ పొతే గోరిల్లాలకు కూడా సరి అయిన న్యాయము అందించ వలసి యుంటుంది. అవి కూడా మనలాగే  ఆహారము తింటాయి, నడుస్తాయి, కాస్త అలవాటు చేస్తే చిన్న చిన్న మాటలు కూడా మాట్లాడుతాయి. వాటికి మన లాగే కాస్త కోపము కూడా ఎక్కువగానే యుంటుంది. ఈ సరికొత్త సామాజిక వాదులకు అది కనిపించదనుకుంటాను.
          గౌతమ  బుద్ధుడు కూడా తన మొదటి ప్రవచనాలన్నీ సంస్కృతం లోనే చేసినారన్న విషయము చాలా మందికి తెలిసి యుండక పోవచ్చును.  కానీ, అవి సామాన్యులకు అర్థము కావటము లేదన్న భావముతో పాళీ భాషలో తన బోధనలను చేసినాడు. అంటే ఆయనకు సంస్కృతము మీద అభిమానము తగ్గినదని  లేదా  పాళీ భాష  మీద అభిమానము పెరిగినదని కాదు. ఎవరికీ అయనా ఏదయినా అందించాలంటే అందుకు అనుగుణమైన భాషలో చెప్పాలన్నది, ప్రాచీన కాలమునుండి ఋషులు అనుసరిస్తున్న విధానము. అంతే కానీ ప్రధానమైన భాషను దిగజార్చుట వారి ఉద్దేశ్యము కాదు. మరొకటి గమనించాలి, భారత దేశము నుండి, టిబెట్  మరియు చైనా లకు వెళ్ళిన బౌద్ధ గ్రంథాలు ఎక్కువగా సంస్కృత గ్రంథాలే.
          మన ప్రధాన మయిన ఇతిహాసాలన్నీ సంస్కృతము లో యున్న రోజుల్లో మహా భారతాన్ని పంప కన్నడము లోనికి అనువదించినాడు. అదే సమయములో నన్నయ భట్టారకుడు భారతాన్ని తెలుగు లోకి అనువదించి నాడు. వచనములో కంటే పద్యము లో యున్న సంగీత పరత్వానికి తెలుగు ప్రజలు పరవ శించినారు. నన్నయ తో మొదలయిన ఈ ప్రయత్నము తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ ల తో పూర్తి అయింది. దీని తో తెలుగు కు సాంస్కృతికము గా ప్రాధాన్యము లభించినది. క్రమ క్రమముగా భాష మీద పటుత్వము లేని వారందరూ సరి క్రొత్త సూక్తులు మొదలు పెట్టినారు.  మా భావాలను ఛందస్సుతో బందీలుగా చేయ లేమని సరికొత్త  నినాదాలను సృష్టించినారు. ప్రతి యొక్కరికి తమకు నచ్చిన రీతిలో వ్రాసే అధికారము ఎప్పుడూ ఉంది. అందుకని తమను మేధావి వర్గముగా మిగిలిన వారు  చాందసులుగా ప్రకటించు కోవలసిన అవసరము లేదు. నిజానికి ఛాందసులంటే ఛందస్సు ను ఉపయోగించే వారని అర్థము. అంతే కాని అది చెడు పదము కాదు. కెవ్వు కేక లాంటి కవితలు వచ్చే కొద్దీ ప్రజలకు భాష మీద పటుత్వము తగ్గి పోయింది. అటువంటి పరిస్థితులలో మాండలికాలు పెరిగి పోయి, అసలు భాష జనానికి దూరము అవుతుంది. అయిదు వేల నాటి సంస్కృతము ఈ నాటికీ అర్థము అవుతుంది. కానీ అయిదు వందల నాటి ఆంగ్లము ఇప్పటి వారికి పూర్తిగా అర్థము కాదు. కారణము  ఒకటే. ఖచ్చితముగా వ్యాకరణ సూత్రాలను పాటించక పోవడము వలన భాష స్వరూపము మారి పోతుంది.
          ఒక సారి ఒక బెంగాలీ స్నేహితుడి తో భాష మీద ఒక చర్చ వచ్చినది.  రవీంద్ర అనకుండా రబీంద్ర అని ఎందుకు ఉచ్చరిస్తారని నేను ప్రశ్నించి నాను. ఆయన ఒక సిద్ధాంతము చెప్పినాడు. జీవ భాషలు నిరంతరము మార్పు చెందుతాయని ఆయన చెప్పినాడు. ఆ క్రమములోనే వ యున్న చోట బ వచ్చిందని అన్నాడు. ఆధునిక భాషా శాస్త్రము (లిమ్గిస్తిక్స్ )లో ఇటువంటి సిద్ధాంతము యున్నదని నాకు అప్పుడు తెలిసింది. వెంటనే నేను ఒక ప్రశ్న వేసినాను. మీ తాత గారు వ్రాసినది మీకు అర్థము కాక పొతే అది ఖచ్చితముగా జీవ భాషే కదాఅని. సంస్కృతాన్ని మృత భాష అని ఎందుకంటారో కూడా అప్పుడు నాకు తెలిసింది. కొన్ని వేల సంవత్సరాలుగా సంస్కృత భాషా నిర్మాణము లో మార్పు లేదు కదా.  అంటే కాని సంస్కృతాన్ని జనము ఇంకా వాడుతున్నారా అనే ప్రశ్న ఇక్కడ లేదు. కొన్ని సిద్ధాంతాలు ఇలాగే యుంటాయి.
          ఆ తరువాత మన అంటే తెలుగు భాష చాలా గొప్ప భాష అని విదేశీయులు ఎప్పుడు పొగిడినారో నాకు అర్థము కా లేదు. మన బ్రౌన్ లాటి వారికి తప్ప అలా పొగిడే అలవాటు వారికి ఎప్పుడూ లేదు. వాళ్ళు అన్నది ఒకే మాట. తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. అంటీ ప్రాచ్య ఇటాలియన్ భాష అని యన్నారు. అంతే.  దీనిని పొగడ్త గా ఎవరూ ఎలా అర్థము చేసుకున్నారో కూడా తెలియ లేదు.  నిజానికి భారత దేశపు  భాషలలో ఎక్కువ భాషలు హల్లులతో అంతమవుతాయి, సంస్కృతము, తెలుగు మరియు కన్నడము తప్ప.  అందులో తెలుగు కన్నడాలను అజంత భాషలు అంటారు. యూరప్ లో ఇటువంటి లక్షణము ఉండేది ఒక ఇటాలియన్ భాషకు మాత్రమె. అందరూ రోం  అంటే వాళ్ళు రోమా అని అంటారు. అందరూ పొప్ అంటే వాళ్ళు పాపా అంటారు.వాళ్ళ కంపెనీ పేరు కూడా పియాగ్ లేదా పియాగియ్ అని యుండదు. స్పష్టముగా పియాగియో అని యుంటుంది. తెలుగు పదాలకు అవే లక్షణాలున్నాయని వారన్నారు, అంతే.
          ఇటు వంటిదే  మరొక విషయము చెప్ప వలసి యున్నది. భారతీయులకు అందులో ప్రధానముగా తెలుగు వాళ్లకు ఏ మాత్రము ఎదుటి వాళ్ళు పొగిడినా పడి పోయే అలవాటు ఉన్నది. భారతీయ గణితములో స్థానాన్ని బట్టి విలువ ఇచ్చే అంకెలతో సున్నకు యున్న ప్రాధాన్యత అందరికి తెలుసు. కానీ పాశ్చాత్యులు వాడే వాక్యమేమంటే గణితానికి భారతీయుల ప్రధానమయిన ప్రతిపాదన సున్నఅని.( Indian contribution to mathematics is zero)  ఇది చూచి మనము మనలను గురించి గర్వ పడ వచ్చును. ఇందులో ఇంకో అర్థము కూడా వస్తుంది. అది పట్టుకొని వాళ్ళు మనలను గేలి చేయ వచ్చును కూడా. అందుకే భారతీయుల గురించి పాశ్చాత్యుల కొన్ని ఉవాచలు అర్థము కావు. అంతకంటే అద్భుత మయిన గణిత ప్రతిపాదనలు పరిజ్ఞానము పాశ్చాత్యులకంటే కొన్ని వందల సంవత్సరాల ముందే భారతీయ గ్రంథాలలో యున్నవి.  న్యూటన్ వాడిన కొన్ని ప్రక్రియలు కొన్ని వందల సంవత్సరాలకు ముందే భాస్కరాచార్యులు తమ సిద్ధాంత శిరోమణి లో వాడినారన్న విషయము ఎవరికీ గుర్తుండదు. అందుకే కొన్ని నిజానికి పొగడ్తలు అయినా మనకు వాటిని అనుమానించ వలసి వస్తుంది.
          కొన్ని శతాబ్దాల పర్యంతము సముద్ర మార్గము వచ్చే వరకు భారత దేశమునకు సింధు నది దాటి రావలసి యండేది. మన  శబ్దమును సరిహద్దు లోని పార్సీలు క్రింద పలికే వారు. ఆ విధముగా హిందూ నదిని దాటి వెళ్ళే దేశము కాబట్టి ఈ దేశమును హిందూ దేశము అని పిలిచినారు. అదే విధముగా దక్షిణముగా యున్న సముద్రానికి హిందూ మహా సముద్రము అని పిలిచినారు. ఈ పేరు పెట్టింది విదేశీయులే. ఇక్కడ సంప్రదాయమును హిందూ మతము అని అన్నారు.  ఈ దేసానికి అసలు ప్రాచీన మయిన పేరు అజనాభ దేశము. ఋషభుడి కుమారుడయిన భరతుడి పేరున ఇది భారత దేశము అయినది. అటువంటిది కొన్ని సంవత్సరాల క్రిందట మన పొరుగు దేశము ఒక మహా సముద్రానికి ఒక మతము పేరు ఎలా పెడతారని అంతర్జాతీయ వేదిక మీద గొడవ చేయాలనీ ప్రయత్నించిన విషయము అందరూ మర్చి పోయి యుంటారు. ఏమయినా మనము, మన ప్రభుత్వము నాలుక లేనివి కదా!
          పైన చెప్పా బడిన వాటిలో ఏది యథార్థ వాడమో, ఏది మూర్ఖ వాడమో అర్థము కాదు. మనుషుల మధ్య యుండ వలసినది ప్రేమ గానీ తార్కికి వివాదాస్పద విశ్లేషణలు కాదు.
       ఒక్క మాట చెప్పాలంటే నేను కూడా పని లేని వాడినే. ఎందుకంటే ఇటువంట పని లేని విశ్లేషణలకు స్పందిన్చినాను. మరి నేను కూడా మామూలు మనిషినే కదా!


  Also visit varasatvamu.blogspot.in

Friday, February 14, 2014

శ్రీ చదువు

                                               


                 ఏమోయ్ రాజూ! ఏమి చేస్తున్నావు?
                ఇంజనీరింగ్ చదువుతున్నాను, బాబాయ్!
                మరి, నీ సంగతేమిటోయ్, చందూ!
                ఇంజనీరింగ్ చదువుకుంటున్నాను
              రాజేమో ఎదో చదువుతున్నానన్నాడు. మరి, చందూ  ఏమో చదువు కుంటున్నా నన్నాడు.  మరో వ్యక్తీ     చదువు కొంటున్నానన్నాడు. ఇందులో ఎవరిదీ సరి అయిన జవాబు?
        ఇక్కడ చదువు విషయములో ఎవరికీ ఏ అనుమానము రాదు, ఈ రోజుల్లో  అందరూ చదువుకొంటున్నారు, నిజమే చదువును కొంటున్నారు.
      కొన్నాళ్ళ క్రిందట  విద్యార్థి అనే పదాన్ని అందరూ వాడే వారు, ఇప్పుడు కూడా వాడుతున్నారు. అర్థము మాత్రము మారి పోయినది. విద్యనూ అర్థించే వాడు, అంటే విద్యనూ భిక్షగా ఇమ్మని యాచించే వాడు విద్యార్థి. అటువంటి విద్యలలో ఉన్నత స్థాయికి చెందిన ఒక విద్యనూ శ్రీ విద్య అనే వారు. దీనిని అందుకోవాలంటే, శిష్యుడు గురువు దగ్గిర చాలా కఠిన మయిన లేదా తీవ్రమయిన సాధనను చేయ వలసి యుండేది. ఎందుకంటే మంత్ర శాస్త్రములో యే యొక్క బీజము మారి పోయినా ప్రభావము మారి పోతుంది. అందు వలన వచ్చే ఫలితానికి నేర్చుకున్న వాడు బాధ్యుడవుతాడు. ఉచ్చారణ చాలా ప్రాధాన్యతను కలిగి యుంటుంది. ఏ మాత్రము తేడా వచ్చినా ఫలితాలు చాలా తీవ్రముగా యుంటాయి. విత్ ధాతువుకు అర్థము జ్ఞానము. య కు ఎక్కడ యున్నదో అన్న అర్థము వస్తుంది. యథా రాజా తథా ప్రజా లాంటి వాక్యాలు ఇలా శబ్దము నుండి వచ్చినవే. ఎక్కడయితే జ్ఞానమున్నదో అదే విద్య.  అంతే గానీ, జపాన్ రాజధాని టోక్యో యని, మనకింతకు ముందు ఇంతమంది మంత్రులున్నారని, అశోకుడు రహదారుల కిరువైపులా చెట్లని నాటించినారని  చెప్పేది, విద్యార్థులకు నేర్పిస్తే అది చదువు అవుతుంది కానీ, విద్య కాదు.
          ఇక్కడ నుండి శ్రీకాకుళం కు పని మీద బస్సు లో వెళుతున్నామని అనుకుందాము.  మనస్సు పని మీద మాత్రమే యుంటే రహదారి కి ఇరు వైపులా ఏమి జరుగుతున్నదనే విషయము దృష్టి కి రాదు. అది లేనపుడు  ప్రక్కనున్న వాటిని కూడా చూచుకుంటూ వెళుతాము. ఇదే విధముగా మనము లక్ష్యము వైపు వెళుతున్నపుడు దారిలో కనిపించేవి గుర్తు సంభాలు, అంతే కానీ, అవి మన లక్ష్యాలు కాదు.

          భౌతిక శాస్త్రము అభ్యసించేటపుడు డెమోక్రటేస్, న్యూటన్ మరియు ఐన్ స్టీన్న్ లాంటి వారు శాస్త్రము నేర్చుకొనే దారిలో కనిపించే స్తంభాల లాంటి వారే కానీ, వారు శాస్త్రము కాదు. ఈ విషయములోనే భారతీయ మరియు పాశ్చాత్య
శాస్త్ర గ్రంథాల్లో తేడా కనబడుతుంది.  ఉదాహరణకు చరక సంహిత ఒక ఆయుర్వేద గ్రంథము. పాశ్చాత్య సంప్రదాయము నకు అలవాటు పడిన వారు, ఆ గ్రంథాన్ని చరకుడు అనే వ్యక్తీ వ్రాసినారు అని అన్నారు.  కానీ,  ఒక చోటి నుండి, మరొక చోటికి, మందులు తీసుకొని వెళ్లి వైద్యము చేసే వాళ్ళను ప్రాచీన భారతీయ సాంప్రదాయములో చరకులు అంటారు అని, వారికొరకు వ్రాసిన సంహితను చరక సంహిత అనెదరని మరొక వాదన యున్నది.  కానీ, నిజానికి ఆ గ్రంథాన్ని వ్రాసినదెవరో ఎవరికీ తెలియదు. మన భారతీయ శాస్త్ర విజ్ఞాన ద్రష్టల గురించి మనకు ఎటువంటి సమాచారము దొరకదు.
ఈ అద్భుత నిర్మాణమును ఎవరూ చేసినారో ఎవరికీ తెలియదు. వారందరికీ వందనములు. కానీ, వారి ఉనికి అప్పుడప్పుడు కనబడుతూనే ఉంటుంది.
          ఒక సాధకుడికి ఒక కొబ్బరి తోట ఉన్నది. అందు లోకి ఒక  పేద వాడు వచ్చినాడు. మంచి ఆకలి మీద యున్నాడు. చెట్టి ఎక్కి కొబ్బరి కాయ కోయ బోయినాడు. దీనిని యజమాని అయిన సాధకుడు గమనించి అతడిని అక్కడే బంధించినాడు.  ఇంటికి వెళ్లి, పాత్ర నిండా ఆహార పదార్థములు, కొన్ని కొబ్బరి కాయలు తెచ్చి వాటిని తీసుకొమ్మని చెప్పి వెళ్లి పొమ్మని చెప్పినాడు. దీనిని చూచిన ఒక వ్యక్తి, నీకు పిచ్చి పట్టిందా ఏమిటి? దొంగను ఇలా ఎవరయినా సత్కరిస్తారా? అని అడిగినాడు. అప్పుడా సాధకు డన్నాడు,అవసరము లేదు, అతడికి ఎక్కడ శిక్ష పడాలో అక్కడ పడింది, ఇంకా అతడు దొంగ తనము చేయ లేదు. అన్నాడు. నిజమే అతడికి భౌతిక మయిన శిక్ష లభిస్తే బహుశా దొంగగా ఉంది పోయే వాడేమో? కానీ, దెబ్బ మనసుకు తగిలినది. ఆ సాధకుడు మరో మాట అంటాడు. ఇటువంటి విద్యను నేర్పే శాస్త్రాలు కను మరగు అయి పోయినాయి అని. ఈ సంఘటన అయ్యర్ నిర్మించిన శంకరాచార్య  చిత్రములో చూపించ బడినది.
          ఇందులో శ్రీ సత్య సాయి బాబా భక్తుడయిన హోల్ హోనిగ్ న్యూయార్క్ లో పెట్టుకున్న ఆహార వితరణ కార్యక్రమమును ప్రస్తావిస్తాను. బాబా యొక్క ప్రభావము వలన అయన రోజూ సాంద్ విచ్ లను, కుకీ లను ఆకలి మీద యున్న పేద వారికి న్యూయార్క్ నగరములో నున్న మూలలలో నున్న ప్రదేశాలలో పంచడము అలవాటు చేసుకున్నాడు. ఒక సారి రైలు బండిలోవీటిని పంచుతుంటే, ఒక బలముగా కనిపించే వ్యక్తీ ఎగుడు దిగుడు జుట్టుతో, ఇష్టము వచ్చినట్లు కదులుతూ కనిపించినాడు. అనాగరికంగా కథినము గా కనిపిస్తున్న అతడు డబ్బులు అడుగుతున్న విధానము అందరికి భయము వేస్తున్నాది. పైన చెప్పిన భక్తుడిని కూడా ప్రక్కనున్న వారు అతడి గురించి హెచ్చరించినారు. అయినా ధైర్యము చేసి, నీకు సాండ్ విచ్ కావాలా? అని అడిగినాడు. అతడు నాకు చాలా ఆకలి గా ఉన్నది అని, ఆత్రము గా తీసుకొని గబగబా తిని ముందుకు వెళ్లి పోయినాడుట. ఆహారము తీసుకున్న తరువాత అతడి ముఖములో అంతకు ముందున్న క్రూరత్వము మాయమయి పోయిందని  హోల్  హోనిగ్ చెబుతాడు.
          చిన్నప్పుడు నా జీవితములో జరిగిన సంఘటను ఒక దానిని ప్రస్తావిస్తాను.  నేను పుట్టి, పెరిగిన ఊరు పేరు
 పైనాం పురం. నేను చదువుకున్న ఉన్నత పాథ శాల ఈదూరు అనే గ్రామములో యున్నది. ఈ రెండిటి మధ్య దూరము సుమారుగా మూడు మైళ్ళు లేదా అయిదు కిలో మీటర్లు. మరో వసతి లేనందు వలన రొజూ నడచి వెళ్ళాలి. దారిలో అన్నీ పంట పొలాలు. ఒక రోజు నేనూ నాతొ బాటు వారు, దారిలో ఒక వేరు శనగ వేసి యున్న ఒక పంట పొలములో దిగినాము. వేరు శనగ మొక్కలను పెకలించి కాయలను అందరూ తింటున్నారు. ఇంతలో ఆ పొలానికి సంబంధించిన వ్యక్తి అందరిని తిట్టి బయటికి పంపించినాడు, కానీ, నన్నేమి అన లేదు. నన్ను ఒక చూపు చూచి నాడు అంతే. అతడు మా నాన్న దగ్గిరకు తరచు వస్తూ యుంటాడు. నిజానికి అతడు మా నాన్నకు నా మీద ఎలాటి పితూరీ చెప్ప లేదు. కానీ, అతడి ఈ ప్రవర్తన నన్ను ఎంత బాధ పెట్టిందంటే, ఆ తరువాత నేను ఆ విధముగా ఎవరి పొలములో దిగ లేదు.
          మరొక సంఘటన. ఒక సారి మా వారి పోలములో పనను దొంగిలించినారు. ఈ పని మాదగ్గిర పని చేసే వారే చేసినారని మా దాయాదులు వదంతులు రేపినారు. ఆ పని చేసే వ్యక్తికీ ఏబది ఏండ్ల పైనే యుంటుంది. భయముతో దిగులు పెట్టుకుని జ్వరము తెచ్చుకున్నాడు. అప్పుడు అతడిని మా అమ్మ పిలిపించింది. వేడి వేడి గా అన్నము పెట్టింది. మా అమ్మ , నాన్న ఇద్దరూ, ఇన్నాళ్ళు పని చేస్తున్న మిమ్ములను నమ్మక పొతే ఇంక ఎవరిని నమ్ముతాము? ఎవరేమన్నా పట్టించు కోవద్దు.. అని చెప్పి పంపించినారు. అప్పటి, ఆ ప్రేమలు, ఆపేక్షలు ఇప్పటి జనానికి అర్థము అవుతాయా?    
          ఈ విధముగా మనము చెప్పే విద్యలు ఎక్కవలసినది బుర్రకు కాదు, మనసుకు.  మా మాస్టారు ఒక ఉన్నత విద్యా సంస్థలో పని చేసి పదవీ విరమణ చేసినారు. ఆయన చెప్పిన ఒక విషయము: ఒక జర్మన్ ప్రొఫెసర్ తో సోక్రటిక్ విద్యా విధానము గూర్చి అడిగితే ఆయన మీరు పూర్తిగా మరిచి పోయిన ఉపనిషదిక్ పధ్ధతి మించిన విద్యా విధానము ఎక్కడుంది? అని తిరిగి ప్రశ్నించినాడుట. అందులో శాస్త్ర విదానముతోబాటు శీల గుణాలకుఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారు.
          కృష్ణ యజుర్వేదములో శిష్యుడికి చదువు అయిపోయిన తరువాత కొన్ని నియమాలను బోధిస్తాడు. అందులో కొన్ని,
మాతృ దేవో భవ|
పితృ దేవో భవ|
ఆచార్య దేవో భవ|
  అందులో మనకు అంతర్లీనముగా తన బిడ్డలు ఎక్కడ ఎలా కష్ట పడుతున్నారో,తపన పడే తల్లి ని,
బిడ్డ ఎలా కష్ట పడినా ఫరవాలేదు, విద్యావంతుడు కావాలనుకొనే తండ్రిని,  శిష్యుడికి ప్రధానమయినది  జ్ఞానార్జన,దాని కోసము నిప్పుల్లో పడినా ఫరవాలేదు, నేను రక్షించుకోగలను అన్న ధీమాతో జీవించే గురువును ఏ రీతిలో గౌరవించాలో
చెబుతారు. వీరే శిష్యుడికి మొదటి దేవుళ్ళు. ఇదే మన ప్రాచీన భారతీయ సాంప్రదాయానికి మూల స్తంభాలు. ఈ నాదు మన  పిల్లలకు ఇటువంటి ఆలోచనలను ఈయ గలుగుతున్నామా?
          అందులోనే సత్యం వద , ధర్మం చర  అని శిష్యుడిని ఆదేశిస్తాడు. అంటే సత్యమునే పలుకుము, ధర్మమునందే సంచ రింపుము,అని.
          స్వాధ్యాయాన్మా ప్రమదః అని బోధిస్తారు, అంతే కాదు. స్వాధ్యాయ ప్రవచానాభ్యాం నా  ప్రమదితవ్యం అని ఆదేశిస్తారు. మొదట నిరంతరమూ, చదువుకొనుట మరియు అవగాహన చేసుకొనుటలో పొరపాటు పడ వద్దు. అంటే కాదు,నీవు నేర్చుకున్న దానిని ఇతరులకు చెప్పుటలో కూడా పొరపాటు పడ వద్దు. అని చెబుతారు. ఇక్కడ స్వాధ్యాయము అంటే పుస్తక/విజ్ఞాన భాండాగారాలను బుర్రకు ఎక్కించడము మాత్రమే కాదు, శీల గుణ వ్యవహారాలలో తనను కూడా నిరంతరము తనను అధ్యయనము చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా కలిస్తేనే విద్య అవుతుంది.
          ఇవి అన్నీ లేక పొతే అది చదువు అవుతుంది. విద్య చదువు ఒకటి కాదా? వేర్వేరేనా? అంటే ఆంగ్ల భాషలో కూడా వేర్వేరు పదాలున్నవి. రీడ్ అంటే చదువుట, స్టడీ అంటే అధ్యయనము చేయుట. స్టూడెంట్ అంటే అధ్యయనము చేసే వాడు, అంతే, కానీ, రీడ్ చేసే వాడు కాదు. ఒక పాఠ్య గ్రంథాన్ని మొదటి నుండి అర్థము చేసుకోకుండా అప్ప చెప్పే వాడిని స్టూడెంట్ అని అన కూడదు, రీడర్ అని అన వచ్చు అనుకుంటాను. 
          ఒకప్పుడు మంచి శిష్యుడి కొఱకు గురువులు ఎంతో ఎదురు చూచే వారు. తరువాత కాలము లో మంచి గురువు కోసము శిష్యులు వారణాసి, ఉజ్జయిని లాంటి స్థలాలకు వెదుకుతూ వెళ్ళే వారు. కానీ ఈ నాడు, పాథ శాలలు బాగా పెరిగినవి, కానీ, మంచి, గురువు, మంచి శిష్యుడు, దొరకడము కష్టముగానే యున్నది. కారణము ఒకటే, మన విద్యా వ్యవస్థ లో శీల నిర్మాణము పై తగ్గిన శ్రద్ధ.
          విద్య లక్ష్మి తో కూడుకున్నది. అందుకనే దానికి శ్రీ విద్య అని పేరు వచ్చినది. ఆ లక్ష్మి, మనము సృష్టించినది కాదు. ధనమగ్ని ర్ధనం వాయు ధనం భూతాని పంచచ అన్న ఋషి వాక్యమును గమనిస్తే మనము సక్రమముగా యుంచిన ప్రకృతే మన సంపద. మనము సృష్టించుకున్న కోట్ల రూపాయల సంపద యున్నా కంపు కొట్టే వాతావరణములో ఉండ లేము కదా!

          కానీ ఈ నాడు చదువు భౌతిక మయిన సంపదతో సంబంధాన్ని కలిగి మానవత్వానికి దూరముగా పోతున్నది.  అందుకే దాన్ని శ్రీ చదువు అందాము. ఇది త్వరలో శ్రీ విద్యగా మారే రోజు కోసము ఎదురు చూస్తాము.