లేదా
(we) share (your) market
అది మధ్య తరగతికి
చెందిన ఆవాసము(కాలని). ఉదయాన్నించి చాలా గందర గోళముగాఉన్నది. ఒక్కొక్కరింట్లో చాలా
మంది చేరి, దీర్ఘముగా ఆలోచిస్తున్నారు. కొందరు, నిజానికి వచ్చే ఏడుపును
అపేసుకుంటున్నారు. చాలా మందికి రేపు ఎలా చేయాలనేదే ప్రశ్న.
ఒక ఇంట్లో “డబ్బులు పెట్టుబడి
పెట్టేటప్పుడు అలోచించి పెట్టాలి. ఉన్న డబ్బులంతా
ఊ డ్చి తగలేసినారు. నెలలో కూతురు
పెళ్లి ఉన్నాది. “ భార్య చాలా ఆవేశముగా ఉన్నది.
మరొక
ఇంట్లో “ నెలలో యజమాని
పదవీ విరమణ చేయ బోతున్నారు. కాస్త
జాగ్రత్తగా ఉండండి అని మొత్తుకుంటే విన్నారు కాదు.”, ముక్కులు ఎగ
బీలుస్తున్నది.
మరొక
ఇంట్లో , “నాకు కాసు బంగారము కొనమంటే, చూడు, ఒకటేమిటి, పది కాసులు కొని పెడుతాను చూడు.
అన్నారు. ఏదీ, ఆ పది కాసులు అఖ్ఖర లేదు. ఆ ఒక్క కాసు కొని పెట్టండి చాలు.”, అన్నది ఇంటావిడ.
వార్తా
పత్రికలలో కొన్ని ఆత్మ హత్యల సమాచారము వచ్చినది. కానీ, రేడియో మరియు దూరదర్శన్ లలో
ఆర్ధిక మంత్రి సుదీర్ఘమయిన ఒక ఉపన్యాసమిచ్చి, “మీ పెట్టుబడులకు
మేము హామీ, అన్నీ పరిస్థితులు చక్క బదేతట్లు చూస్తాము” అన్నారు. అయినా
మార్కెట్ లో ఒడిదుడుకులకు మేము భాధ్యులము కాము అన్న హామీ ఆ యా కంపెనీల నుండి ఉన్నాది
కదా.
ఇప్పటికి
అంతా అర్థమయిందనుకుంటాను, సమస్య ఏమిటో? ఆ రోజు ఒక్క సారిగా షేర్ మార్కెట్ వెయ్యి
పాయింట్ల మీద కూలి పోయిందట. ఈ దెబ్బతో బాగా విలువ యున్న షేర్లను కుడా అమ్మి వేయడము
మొదలు పెట్టినారు. అమ్మకాలకు డిమాండ్ పెరిగేసరికి సూచిక ఇంకా పడిపోతుందని అందరూ భయ
పడుతున్నారు. బ్రోకర్ల దగ్గిర , స్టాక్
మార్కెట్ దగ్గిర విపరీతముగా జనము చేరి పోయినారు.
షేర్
మార్కెట్ ను ఆర్ధిక రంగములో ఒక అద్భుత మయిన ప్రక్రియ గా భావించే వారు చాలా మంది
యున్నారు. కానీ, అది మానసిక ప్రపంచములో నడిచే సైకలాజికల్ గేమ్ గా అర్థము చేసుకో
లేక పోతున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టె చాలా మందికి ఇది ఎలా నడుస్తుందో
తెలియదు. తెలిసిన వారికి కావలసినంత తెలివి తేటలు చూపించి, ఎప్పుడూ ఏరును
దాటేస్తుంటారు.
మరి ఈ
ప్రక్రియ ఎలా ప్రారంభమయిందో నాకూ తెలియదు,
తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. కానీ,
లోపల జరుగుతున్నదేమిటో మాత్రము తెలుస్తూనెఉన్నది.
భౌతిక
శాస్త్రములో ఎంట్రపి అనే పరిమాణము ఉన్నది. ఇది భౌతిక ప్రపంచములో జరిగే
గందరగోళమునకు సూచిక. ఈ విశ్వము నడుస్తున్నంత సేపూ అది పెరుగుతూఅన్నా ఉంటుంది, లేదా
స్థిరముగా ఉంటుంది. మరొక మాటలో
చెప్పాలంటే, ఈ విశ్వములో ప్రతి భౌతిక చర్య ఎంట్ర పి పెరిగే దిశలో నడుస్తుంది. దీనినే ద్వితీయ ఉష్ణ గతి సూత్రము గా చెబుతారు. భౌతిక
శాస్త్ర పరముగా ఇది ఖచ్చితమయినది. అయితే, తరువాత కాలములో కొన్ని చర్యలలో ఇది
తగ్గుతుంది కొంత మంది సూత్రీకరించినారు. భౌతిక శాస్త్ర వేత్తలు దీనిని పూర్తిగా
అంగీ కరించక పోయినా అది ఏమిటో ఈ వ్యాసములో కానీ తదుపరి వ్యాసాలలో దానిని గూర్చి
చర్చిద్దాము.
ఉష్ణ గతి
భౌతిక విజ్ఞానములో ఎంట్రపి కి దీటు
వచ్చేది వాణిజ్య ఆర్థిక విజ్ఞానములో షేర్
మార్కెట్ యొక్క సూచి. లేదా ఇండెక్స్. న్యాయము ప్రకారము ఇది కూడా ఎప్పుడు పెరుగుతూనే
ఉండాలి, లేక పొతే ఆ దేశము ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలినట్లే. ఇది నిజమేనా?
“మాస్టారూ! మీరు
పొరపాటు పడుతున్నారు, ఎంట్రపి
పెరగడమేమిటి, ఈ ఇండెక్స్ పడిపోవదమేమిటి?” .ఇది ఒక నిజముగా
వివరించ వలసిన ప్రశ్న. కానీ దీనికి జవాబు రావాలంటే చాలా విషయాలు తెలియాలి. ఇక్కడ
ఒక చిన్న కథను చెప్పుకుందాము.
రంగయ్య,
రాజయ్య మరియు రామయ్య మంచి స్నేహితులు.. ముగ్గురికి వ్యవసాయపు భూములు ఉన్నాయి.
వరిని పండిస్తారు. వాళ్ళ ఊరిలో ధాన్యాన్ని బియ్యముగా మార్చే మర ఏమీ లేదు. ప్రతి
దానికి ఎడ్ల బండి మీద పక్క ఊరికి వెళ్ళాలి.
ఒక రోజు రంగయ్య ఆలోచించినాడు. స్వంత ఊరిలొనె బియ్యపు మర ఉంటే బాగుంటుంది
అని. బయట విచారిస్తే పదిహేను లక్షలు పెట్టుబడి అవసరమవుతుందన్నారు. మరి తన దగ్గిర
అంతా సొమ్ము లేదు. ఇద్దరు మిత్రులతో తన
ఆలోచన చెప్పగానే చెరో అయిదు లక్షలు ఇస్తామన్నారు. వచ్చిన లాభాన్ని ముగ్గురూ
సమానముగా పంచుకోవాలి అని, అనుకున్నారు.
చివరకు ఊరిలో ఒక బియ్యపు మర ఏర్పడింది. ఊరిలో ప్రధాన వృత్తి వ్యవసాయము కనుక
లాభాలు బాగుగానే వస్తున్నవి. ముగ్గురూ సంతోషముగా ఉన్నారు. ఇక్కడే కొత్త సమస్యలు
మొదలయినాయి.
వీళ్ళ
పరిస్థితిని చూచిన తరువాత మరికొంత మంది ఇంకొక బియ్యపు మరను పెట్టాలనుకున్నారు. తము
కూడా ఉన్న వారితో కలిస్తే శ్రమ తగ్గుతుంది, లాభాలను పంచుకోవచ్చు అనుకున్నారు. తమ
ఉద్దేశ్యాన్ని వారికి చెప్పినారు. ఇంతలో రామన్న కూతురు పెళ్లి నిశ్చయ మయినది.
ఇందుకోసమై చేతిలో ఉన్న సొమ్ముకు అదనముగా మరో రెండు లక్షలు కావలసి వచ్చినది. ఆ
సొమ్ము బియ్యపు మరలో తను పెట్టిన పెట్టుబడి లో తీసుకోవాలనుకున్నాడు. అలా తీసుకుంటే
వచ్చిన ఆదాయాన్ని ఎలా పంచుకోవాలి? అప్పుడు ఉన్న పెట్టుబడుల నిష్పత్తి లో
పంచుకోవాలి అనుకున్నారు. అయినా పంపకము సులభము గా ఉండాలంటే పది రూపాయలను ఒక యూనిట్
క్రింద మార్చి, దానిని షేర్ అని అన్నారు. అంటే పదిహేను(౧౫) లక్షల రూపాయలు ఒక లక్షా
పదిహేను వేల షేర్ లు అన్న మాట.
ఇక్కడే
పాశ్చాత్య సంస్కృతి ప్రభావము ఏర్పడింది. భారతీయ సంస్కృతి న్యాయమైన లాభాల గురించి
మాట్లాడితే, పాశ్చాత్య సంస్కృతి గిరాకీ ని బట్టి లాభాలను గురించి మాట్లాడింది. అంటే
గిరాకీని బట్టి ప్రజలు ఎంత ధరకు కొనడానికి సిద్ధ బడుతారో అంతకు అమ్మడము అన్న మాట.
దీనినే వారి భాషలో మార్కెట్ ఎకనమి
(వ్యాపార ఆర్దికత )అని అన్నారు. ఈ విధముగా ఎక్కువ డబ్బు పెట్ట గల వారికే మంచి
సరుకు దొరుకుతుంది. మనిషికి అత్యవసర మయిన వైతే ఎంత ధర కయినా అమ్మ వచ్చు. ఉదాహరణకు
రైల్వే ప్లాట్ ఫారమ్ లపై మంచి నీరును లీటర్ ఇరువది అయిదు రూపాయలకు అధికారికముగా
అమ్మినా అడిగే దిక్కు లేని సంస్కృతి మనకు వచ్చినది. పకృతి ఇచ్చిన సంపద పై వ్యాపారము పెరగడానికి వారు పెట్టె లక్షల
రూపాయల ఖర్చు కూడా మనమే ఇచ్చుకోవాలి కదా! పది రూపాయల లోపు అమ్మబడే విక్స్ కోసము
ఎన్ని లక్షల రూపాయలు ప్రకటనలకు ఖర్చు పెడుతున్నారో గమనిస్తే తెలుస్తుంది.
కాపిటల్ లేదా పెట్టుబడి రెండు రకాలుగా లెఖ్ఖ కట్ట
వచ్చును.మన పద్ధతిలో అక్కడ నికరముగా యున్న సంపద విలువను బట్టి లెక్క కడుతాము. ఇది
న్యాయమైన మార్గము. వాటాలు తీసుకొనే వారు ఎంత విలువకు కొన్నారో, దాన్ని అనుసరించి
లెఖ్ఖ కట్టడము ఇప్పుడు అనుసరిస్తున్న పధ్ధతి. దీనిని ప్లావిత విలువ లేదా ఫ్లోటింగ్
వాల్యు అని అనాలి. ఇది ఇప్పుడు అనుసరించ బడే పధ్ధతి. అంటే ఇప్పుడు పది లక్షలున్న
వ్యాపారము రేపు వాటా లేదా షేర్ విలువ పడి పొతే పది వేలు గా లెఖ్ఖ కట్ట బడ వచ్చును.
ఇటువంటి మార్పులు వచ్చిన తరువాత మానవ విలువలు పడి పోవడము మనము స్పష్టముగా గమనించ
వచ్చును. ఈ నాదు కొన్ని ప్రాంతాలలో జనము కొనక పండ్లు కుళ్ళి పోయినా వదిలి
వేస్తున్నారు, కానీ, ధర తగ్గించి అమ్ముట లేదు. అమెరికా లో ఒక సారి, పంటలు ఎక్కువ
పండితే మార్కెట్ లో ధరలు పడిపోఆయని పంటను సముద్రము పాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇది మార్కెట్ ఎకనమి ప్రభావము. భారత దేశములో దీనిని మహా పాపముగా భావించే వారు. కానీ
ఆ సంస్కృతి ప్రభావము ఇప్పుడు మన రక్తములో కూడా కలుస్తున్నది.
మన
కథలోనికి తిరిగి వెళ్దాము. సీనన్న కొంత
పెట్టుబడి పెట్టాలని అనుకున్నాడు. దీనితో బాటు మరికొందరు షేర్లు
కొనాలనుకుంటున్నారు. అంటే షేర్ కు డిమాండ్
లేదా గిరాకీ పెరిగింది. అప్పుడు పడి రూపాయల షేర్ ముప్పది రూపాయలకు అమ్ముతామని
అంటారు. అంటే పదిహేను లక్షల ఆస్తి నలుబది
ఐదు లక్షల ఆస్తిగా మారి పోతుంది. దీనినే షేర్ మార్కెట్ లో లాభము వచ్చిందని అంటారు.
ఇక ధాన్యము
మిల్లును వదిలి వేద్దాము. ఒక ఎలెక్ట్రానిక్ పరిశ్రమ కు వెళు తాము. పోటీ
వలన వ్యాపారములో ఒడిదొడుకులు సహజము
గా వస్తాయి. లాభము బాగా వచ్చినపుడు తగిన నిష్పత్తిలో పంచుతారు. లేదా అధికారికము గా
షేర్ విలువ పెంచు తారు. ఈ విధముగా షేర్ విలువ రెండు రకములుగా పెరుగ వచ్చును, ఒకటి,
వచ్చే లాభాల వలన లేదా ఆ షేర్ లకున్న గిరాకీ వలన. ఇక్కడే మానసిక ప్రవర్తన
ప్రభావము కనిపిస్తుంది. పది రూపాయల షేర్
వంద రూపాయలకు అమ్మినపుడు సంస్థలలో మనకు పంచ బడే లాభాలు అవే నిష్పత్తిలో ఉండవు. అంటే
తక్కువ రేటు కు కొన్న షేర్ ఎక్కువ రేటు కు అమ్మితేనే లాభాలు, అందు వలన షేర్
విలువ పెరిగితేనే ఆదాయము మరియు లాభము. అందువలన షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టె
వారు ఎక్కువగా వ్యాపారములో లాభము కంటే షేర్ అమ్మి లాభము
సంపాదించాలనే అనుకుంటారు. అంటే లాభాలు రావాలంటే షేర్ విలువ పెరుగుతూనే ఉండాలి. అది
ఆగి పోయిందా పెట్టుబడులు పోతాయి.
మరి ఇక్కడ జనము ఎలా మోస పోతారు? ఒక
వ్యక్తీ ఎక్కువ పెట్టుబడి పెట్టి నాలుగు రోజులు తన మనుషుల చేత వరుసగా షేర్ లు
కొనిపిస్తాడు. ఈ విధముగా ఆ షేర్ విలువ పెరుగుతుందన్న అభిప్రాయము అందరికి
కలిగిస్తాడు. దీనితో జనము ఎగ బడి ఆ షేర్ లు కొంటారు. దీనితో ఆ షేర్ విలువ విపరీతముగా పెరుగుతుంది.
ఇదే అదునుగా తీసుకొని మొదట షేర్ లు కొన్న వ్యక్తి తను కొన్న షేర్ లు ఎక్కువ గా
అప్పుడున్న రేటు కు అమ్మి వేసి లాభాలు తన ఖాతా లో వేసుకుంటాడు. ఎప్పుడయితే ఈ వేగము
తగ్గుతుందో షేర్ విలువ పడి పోవడము మొదలవుతుంది. ఈ విధముగా తరువాత షేర్ లు కొన్న
వారి కి నష్టము వస్తుంది. ఈ విధముగా
హర్షద్ మెహతా మొదలుకొని ఎంతో మంది స్టాక్ మార్కెట్ ను మోసగించినారు. ఈ
విధముగా మధ్యలో షేర్ లు కొన్న వారంతా నెత్తిన గుడ్డను వేసుకుంటారు. ఇటువంటి
మోసాలను నియంత్రించడానికే సెబి ఏర్పడింది.
ఇది చైన్ స్కీమ్ లేదా గొలుసు పధ్ధతి లో జనాన్ని ఆకర్షించే లానే ఉంటుంది.
ఈ సంస్థలలో వచ్చే లాభాలలో కొంత మూల
ధనానికి వెళితే సహజముగా షేర్ విలువ పెరుగుతుంది.
ఇదే కారణము వలన నష్టాలలో నడుస్తున్న సంస్థలలో షేర్ విలువ పడి పోతుంది. ఒక్కొక్క షేర్
మార్కెట్ లో కొన్ని సంస్థలు తమను
నమోదు చేసు కుంటాయి. ఈ సంస్థల సగటు ఆదాయమును బట్టి ఆ మార్కెట్ యొక్క సూచి
మారుతుంది. సూచి మరీ పడి పోతే షేర్ మార్కెట్ నష్టాలలో పడి పోతుంది. నిజాయితీ
లోపించి నప్పుడు కృత్రిమముగా షేర్ విలువ పెంచాలని చూస్తారు. ఈ ప్రయత్నాలు
తాత్కాలికముగా ప్రయోజనాన్ని ఇచ్చినా తరువాత ఆర్ధిక వ్యవస్థ మీద గట్టి దెబ్బ
కొడుతుంది.
సామర్థ్యము లేని డబ్బున్న ప్రతి వాడికి
పరిశ్రమలు పెట్టడానికి అనుమతి ఇస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఒక పరిశ్రమ
పెట్టాలంటే ముందు ఆర్ధిక వనరులు, స్థలము, మూల వసతులు అత్యంత ప్రధానమయినవి. అటు
తరువాత బయటకు వచ్చే పరికరాలకు బయట పోటీ ఉత్పత్తి ఏమయినా యున్నదా? ఆ పోటీ కి తాము తట్టుకొన
గలరా, తమ పోటీ గా తయారవుతున్న పరికరాలలో
తమ వాటి కంటే ప్రత్యేకతలు ఏమయినా ఉన్నాయా, ఇటువంటి వాటిని పరిశీలించాలి. ఇందులో వాడే ముడి పదార్థాలు అందు బాటులో
ఉన్నాయా, వ్యర్థ పదార్థాలు ఏర్పడుతాయా, వాటి వలన పర్యావరణానికి ఏమయినా హాని
యున్నదా, ఇటువంటి వాటికి సమాధానము రాబట్టు కోవాలి. విలువయిన నీటిలో తమ మురికిని
వదలి ఎంతో మిగుల్చుకో వచ్చును. కానీ అదే నీరు లీటర్ పాతిక రూపాయలు పెట్టి బయట జనము
కొనుక్కోవాలన్న విషయాన్ని విస్మరించ
కూడదు. కొన్ని ఎలెక్ట్రానిక్ పరిశ్రమలలో ఆర్సెనిక్ లాంటి విష పదార్థాలు వాతావరణము
లోనికి వెళుతున్నవి. వీటి వలన పరిసరాలలో యున్న జనానీకము మీద దీర్ఘ కాలిక అనారోగ్య
సమస్యలు ఏర్పడా వచ్చును. అందు వలన చుట్టు
ప్రక్కల జనాలలో వ్యతిరేకత వచ్చి ఆ
పరిశ్రమను మూసి వెయ వలసిన పరిస్థితులు రావచ్చును.
మరొక విషయము గుర్తు పెట్టుకొన వలసి
యున్నది. తమ ఉత్పత్తుల వినియోగములో ప్రధాన భాగము ఆ దేశము లో యుంటే మంచిది. లేక
పొతే అమెరికన్ మార్కెట్ కొఱకు ఉత్పత్తి చేసిన చైనా ఉత్పత్తులు అమెరికన్ ఆర్ధిక
స్థితి పడిపోగానే తను నష్ట పోతుంది. ఇదే పరిస్థితులు ప్రతి యొక్కరికి రా వచ్చును.
సత్య సాయి బాబా గారు ఒక విషయాన్ని
స్పష్టము చేసే వారు. వ్యాపారము ధర్మము ఆధారముగా జరగాలి. ఇదే విషయాన్ని ఆయన తన
భక్తులకు నొక్కి చెప్పే వారు. ధర్మానికి వ్యాపారానికి పొత్తు కుదరదని ఎక్కువ మంది
చెబుతున్న ఈ రోజుల్లో ఆయన ఆలోచనను అనుసరించిన వారు ఖచ్చితమయిన విజయాన్ని
సాధించినారు. ఇందులో స్వదేశీయులు మరియు
విదేశీయులు కూడా ఉన్నారు. మన వ్యాపారము వినియోగ దారుడి నమ్మకము మీద ఆధార పడాలి.
అంతే కాని మన గుప్పించే ప్రకటనల మీద కాదు.
ఒక సోనీ సంస్థలో ఒక ఉత్పత్తిలో నాణ్యము
తగ్గినది. పరికరము అప్పటికి పని చేస్తుంది. కానీ సోనీ యజమాని ఒక మాట చెప్పినాడు.
ఎంత నష్టము వచ్చినా ఆ ఉత్పత్తులు మార్కెట్ లోకి ప్రవేశించ కూడదు,అని. ఎందుకంటే
సోనీ ఉత్పత్తులు అత్యున్నత ప్రమాణాలతోయున్నాయన్న నమ్మకాన్నిపొగొట్టు కొనకూడదు. ఇటు
వంటి నియమాలతో కూడిన సంస్థలు స్టాక్ మార్కెట్ ప్రవేసిస్తే సూచీ ఎప్పుడూ పైకే
ఉంటుంది.
విలువలు లేనపుడు స్టాక్ మార్కెట్ పడి
పోతూనే ఉంటుంది, ఎంత లేపినా సరే.