Monday, December 19, 2016

నేను దేవుడిని



“ఆత్మలన్నీ ఒక్కటే పరమాత్మకు దరి చేరు.
జీవులన్నీ ఒక్కటే  పరమేస్వరునే చేరు.”
ఎవరో గుడిలో పెద్ద స్వరముతో పాడుచున్నారు. జనమంతా ఆనందముగా వింటున్నారు. అప్పుడప్పుడు అందరూ గొంతు కలుపుతున్నారు.
          కార్యక్రమము అంటా అయింది. గోపయ్యకు కాస్త ఆవేశము ఎక్కువ. బయటికి వచ్చినాడు. బయట గట్టు మీద నారాయణ  కూర్చొని ఉన్నాడు.  గోపయ్యకు నారాయణ దగ్గిర చనువు ఎక్కువే.
          “సామే! అందరూ ఒకటే కదా! మీఋ అయినా నేను అయినా అందరమూ ఒక్కటే కదా!”
          “ఏం గోపయ్యా! ఏమంత హుషారు గా ఉన్నావు?  ఏమయిందేమిటి?” నారాయణ ఏమీ తెలియనట్లే అడిగినాడు.
          “ఏమీ లేదు సామే! మనమంటే ఎవరు? మన ఆత్మలు అంటే ఏంటి? ఆటమలన్నే ఒకటే అయితే మనమంతా ఒకటే కదా?”
          “అంటే  మీ వాళ్ళు  కిట్టయ్య, చెంచయ్య, రాముడు అందరూ ఒకటే అంటున్నావు. అంతేనా?”
          “అంటే కదా సామీ!”
          ?మరి నీ పెళ్ళాము రత్తాలు?”
          “అంతే సామీ!”
          “అయితే  రాత్తాలును, మాటి  మాటికీ  తిడుతూ, కొడుతూ ఉంటావు ఎందుకు? అలా దేవుడు చేస్తాడా?”
          “నిజమే సామీ! మరి రత్తాలు నన్ను ఎదో ఒకటి అని కోపము తెప్పిస్తుంది  ఆ....” ముఖము మాడ్చుకున్నాడు.
          “మరి దేవుడికి కోపముంటున్డా?”
          “అయితే కిట్టయ్యకు కోపము వచ్చి ఎంత మందిని చంప లేదు? రామయ్యకు కోపము వచ్చి ఎంత మందిని చంప లేదు?”
                “నీ మాట బాగానే ఉంది. కృష్ణుడు ఎవరిని చంపాడు?”
“సొంత మేన మామ కంసుడిని చంప లేదేమిటి?”
“ఎందుకు చంపేడు?”
“ఎందుకేమిటి? ఎంత చెడ్డ వాడయితే మాత్రము  మేన మామను చంపదమేనా?”
“మరి కంసుడు  ఏమి చేసేడు?”
“అమ్మను నాన్నను జైలులో పెట్టినాడు.”
“అంతేనా?”
“కృష్ణుడిని చంపాలని అప్పుడే పుట్టిన  పసి పిల్లలను అందరినీ చంపించినాడు.”
“అయినా నీకు చాలా విషయాలు తెలుసే? అంతేనా? ఇంకేమీ లేవా?”
బుర్రను గీక్కుంటూ  అన్నాడు, “ఇంకా  ఏమున్నాయి సామీ!”
“పూతన, కేశి, తృణావర్తుడు, లాంటి  రాక్షసులను తన దగ్గిర ఉంచుకొని, పోషించినాడంటే ప్రజలు అతడికి ఎటువంటి గౌరవము ఇస్తారంటావు? దుర్మార్గుల స్నేహము చేసే వాడు మంచి వాడేనా?”
“నిజమే సామీ! మరి నాదొక  ప్రశ్న. యుద్ధము పేరుతొ దుర్యోధనుడిని తమ్ములన్దరితో చంపించినాడు కదా? నెత్తుటి ఏర్లు పారినాయి. ఇదేమి న్యాయము సామీ!”
“ఎంత సేపు నిలబడతావు? రా. ఇటు వచ్చి కూర్చో.”
“మీ పక్కనా? వద్దు సామీ! మీరు చానా మంచోళ్ళు,  గొప్పోళ్ళు.”
“మరి ఇప్పుడే చెప్పావు కదా. అందరూ దేవుళ్ళేనని. ఇంకా అనుమానమెందుకు? రా. వచ్చి కూర్చో.”
గోపయ్య వద్దంటూనే బలవంతముగా అరుగు మీద కూర్చున్నాడు. చుట్టూ మరి కోన మనిచేరినారు.
“అమ్మయ్య నీకు నిలువు జీతము ఇవ్వాల్సి వస్తుందేమో అని భయ పడ్డాను. ఇప్పుడు చెప్పు యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది?”
“పాండవులు, కౌరవుల మధ్య .”
“కృష్ణుడు యుద్ధము చేసినాడా?”
“లేదు.”
“మరి పాండవులు యుద్ధము ఎందుకు చేసినారు?”
“బారాలాడి కౌరవులు  పాండవుల రాజ్యమును కొట్టేసినారు. వన వాసము, అజ్ఞాత వాసములు అయిన తరువాత రాజ్యము తిరిగి ఇస్తామన్నారు.  కానీ తిరిగి ఇవ్వ లేదు.”
“అంతేనా?”
“ద్రౌపది అమ్మను నిండు సభలో  అవమానించినారు.”
అంటే యుద్ధమునకు మూల  కారణము  ఆస్తా, ఆ ఉత్తమ స్త్రీ యొక్క ఆక్రోశమా? పైకి చెప్పే కారణము ఒకటయితే, అంతరంగములో మరొకటి ఉంటుంది. ఋషులకు  కొన్ని నియమాలున్నాయి. ఏది వ్రాసినా  మంచి వాళ్ళ చరిత్ర ఎక్కువ, దుర్మార్గుల చరిత్ర కుదించి వ్రాయడము జరుగుతుంది. లేక పోతే  దుర్మార్గులు వాళ్ళ కథా నాయకులు అవుతారు. ఒక కులమింటి స్త్రీని, అందులో యజ్ఞ పునీతురాలిని నిండు సభలో అవమానించిన వారు, ఒక సామాన్య స్త్రీని ఏ విధముగా చూచే వారో అని, చదువరులకు ప్రశ్న వేసినారు. ఒక ఆడ దాన్ని గౌరవించని సమాజము సర్వ నాశనము అవుతుంది. ద్రౌపది చేసిన ఆక్రందన కృష్ణుని  గుండెలను కలచింది. అంతరంగములో ఇదే ప్రధాన కారణమని అనిపిస్తుంది.”
“మరి సామీ! ఈ భారతమంతా ఎవరు చెప్పినా వినే వాడిని. అందుకే నాకు కథంతా తెలుసు. మరి భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడిని  అలా చంపేసేరేమిటి సామీ!”
“ఎవరేలాటి వారయినా ధర్మాన్ని నిలుపక పోతే ఖచ్చితముగా కూలి పోతారు. భీష్ముడు, ద్రోణుడు ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రత్యక్ష సాక్షులు. వాళ్ళు లేచి నిలబడితే అలా జరిగేది కాదు. కానీ వాళ్ళు ఆ పని చేయ లేదు. అజ్ఞాత వాసమునుండి తిరిగి వచ్చిన పాండవులకు వాళ్ళకు ఈయ వలసిన రాజ్య భాగాన్ని ఇప్పించ గలిగి  యుండి కూడా భీష్ముడు గట్టిగా మాట్లాడ లేదు. కౌరవుల తిండి తిన్నాము కాబట్టి, వారు చెప్పిన మాట విన వలసినదే అనే దృష్టిలో ద్రోణుడు ఉన్నాడు. ఇంకా కర్ణుడి విషయము చూద్దాము.  దుర్యోధన దుశ్శాసనులతో కలిసి నిండు సభలో ద్రోపదిని అవమానించిన వారిలో కర్ణుడు కూడా ఒకడు. ద్రౌపదీ స్వయంవరములో, ఘోష యాత్రలో, ఉత్తర గోగ్రహణములో ఓటమి చవి జూచిన కర్ణుడు, తను అర్జునిడి మీద గెలుస్తానని దుర్యోధనుడిలో నమ్మకము కలిగించి పరోక్షముగా కర్ణుడు యుద్ధానికి కారణము అయినాడు. ఇదీ వాళ్ళ కథ. ఇప్పుడు చెప్పవయ్యా గోపన్నా!”
“నిజమే సామీ! నేనంత ఆలోచించ లేదు.”
“మరి రాముడు సీత కోసము రావణుడి బంధు బలగాన్ని అంతా నాశనము చేసినాడు. అదే నాకు అర్థము కావటము లేదు సామీ!”
“”ఇటువంటి అనుమానాలు ప్రేరేపించే వారు చాలామంది ఉన్నారయ్యా!అడవిలో  పూజలు హోమాలు చేసుకుంటున్న వారందరి మీద దాడి  చేసే వారు వారి స్త్రీల మీద దాడి చేస్తున్న వారు, అటువంటి ఋషులు అందరూ రాముడిని వేడుకుంటే రాముడు రాక్షసులను ఎదుర్కొని వారికి రక్షణ కల్పిస్తానని మాట ఇచ్చినారు. కానీ దయామయి సీతమ్మ తల్లి “ వాళ్ళు మన జోలికి రానప్పుడు వాళ్ళ మీద  దాడి చేయడము బాగుండదేమో” అని అన్నది. అందుకనే ఏమో శూర్పణఖ ద్వారా మొదటి దాడి సీతమ్మ మీదే జరిగింది. అందుకే రామ  రావణ  యుద్ధము జరిగింది. ఇందులో అంటే ఈ యుద్ధములో పైకి  కనిపించే కారణము సీతా సంరక్షణ. అసలు కారణము ధర్మ సంరక్షణ.  అందుకే గోపన్నా! గుర్తు పెట్టుకో. మహాత్ములు వ్యక్తిగత కారణాలతో ఏదీ చేయరు.”
“చాలా బాగుంది సామీ ఎవరడిగినా ఇదే మాట చెబుతా. ఇంకో ప్రసన సామీ! ఎదో సినిమా లో దేవుడు పెళ్లి చేసుకున్నాడని చెప్పారని ఒక మతము వాళ్ళు ఆ సినిమా థియేటర్ల దగ్గిర గొడవ చేసారు కదా సామీ! ఇదేమిటి?”
“అవన్నీ మనకెందుకులే గోపన్నా! మన విషయములో సివయ్యకు పార్వతమ్మ ఉంది, నారాయనయ్యకు లక్ష్మమ్మ ఉంది, ఇంకా బ్రహ్మయ్యకు సరస్వతమ్మ ఉంది. ఇంకా ఇంద్రయ్యకు శచమ్మ ఉంది. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి కదా.”
ఈ లోపల  “ఏమిటి నారాయణా! మీకు ఈ రోజు గోపయ్య దొరికినాడా? వాడు అయిపోయినట్లే “ అంటూ రామా రావు వచ్చినాడు.
“అదేమిటి సామీ అలా అంటారు? నాకు నారాయణ బాబు గారు ఎన్ని విషయాలు చెప్పరనుకున్నారు?” అన్నాడు గోపయ్య. మళ్ళీ, “ఇంతకూ సామీ! మనము దేవుళ్ళమా?  కాదా?”అని అడిగినాడు.
నారాయణ అన్నాడు, ”నీ లాగా ఒకడు సత్య సాయి బాబా వారి దగ్గిరకు వెళ్లి, “బాబా! మీరు దేవుడత కదా!”అని అడిగినాడ ఆయన జవాబు ఇచ్చినారుట, ”నిజమే బంగారూ! నేనే కాదు, నీవు కూడా దేవుడివే. “అదేమిటి బాబా!”అని అంటే,” నేను దైవత్వాన్ని గుర్తించి ఆ అనుభూతి లోనికి వెళ్ళినాను, నీ ఉ ఆ స్థితికి వెళ్ళే వరకూ మామూలు మనిషివే.”అన్నారట.  గోపయ్యా! దేవుడు అంటే సర్వజ్ఞుడు అంటే అన్నే తెలిసిన వాడు, సర్వ వ్యాపి అంటే అన్ని చోట్లా ఉంటాడు, సర్వ శక్తి మంతుడు అంటే అన్నిటి కంటే శక్తి గలిగిన వాడు. అపరిమిత మయిన ప్రేమ కలిగిన వాడు. నేను దేవుడిని అని ప్లేటు మీద వ్రాసి మేడలో తగిలించుకోనక్ఖర లేదు. ఆ మానసిక స్థితిని అందుకున్న ప్రతి యోక్కరిని అందరూ దేవుడి వలెనె చూస్తారు. నేను దేవుడిని అనుకోవడము కంటే, నేను దేవుడిని ఎలా అవుతాను అని ప్రస్నించు కోవడము ముఖ్యము.”
“సామీ! మీ దగ్గిరకు నేను మళ్ళీ రావచ్చునా?” అని అడిగినాడు, గోపన్న.
“తప్పకుండా.” జవాబు వచ్చింది.


***************************************************************
visit  varasatvamu.blogspot.in

Monday, November 14, 2016

యంత్రాలు వస్తున్నాయి జాగ్రత్త. 1


          ఇదేమి పేరు అనుకుంటున్నారా?
గతములో ఒక రచయితా నత్తలు వస్తున్నాయి జాగ్రత్త పేరుతొ  ఎదో వ్రాసినట్లు గుర్తు. మరి అంత ప్రముఖ వ్యక్తీ వ్రాసిన రచనను కూడా గుర్తు పెట్టుకోలేని  మీకు సాహిత్యముతో ఏమి సంబంధమని అంటున్నారా? రావణుడిని, దుర్యోధనుడిని కర్ణుడిని మహా నాయకులుగా అంగీకరిస్తున్న ఇప్పటి సాహిత్య వేత్తల ముందు నేను ఏ విధముగా తుల తూగ లేను, క్షమించాలి.
అంతే కాదు, ఒక ఆధ్యాత్మిక వేత్తగా అనబడుతున్న ఒక వ్యక్తీ ఆవులకు ఉన్న రక్షణ మనుషులకు కూడా ఇవ్వడము  లేదని వాపోయినాడు. ఆయన మరిచి పోయినాడేమో? ఒక మనిషి మీద అత్యాచారము చేస్తే శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి.(అవి ఎలా అమలు చేస్తున్నారనేది మరో విషయము.)  కాని ఒక ఆవును రక్షించు కోవడానికి ఎటువంటి చట్టాలు లేవని.
ఆవును ఎందుకు రక్షించాలి? అది మనకు ఖాద్య వస్తువే అని వాదించే వాళ్ళు ఉన్నారు, ఉద్యమాలు లేపాలని అనే వారు ఉన్నారు. కానీ  నర మాంస భక్షకులు ఉన్న చోట మనిషిని మనిషి తిన్నా దోషము లేదు.
ఒకప్పుడు ఇంట్లో పని, బయట పని అన్నిటిని మనిషే చేసే వాడు. తల్లులు రుచి గా వండి పెట్టి, ఇంటిని అలంకరించి  ఉంచితే మగ వారు పొలానికి వెళ్లి పని చేసే వారు. అక్కడ వారికి తోడుగా ఎద్దులు పొలానికి దుక్కి పని చేసేవి, పొలము  నూర్పిడి లో పని చేసేవి, పంటను బండిలో వేస్తే ఇంటికి ఆ బండి ని లాగు కొని వచ్చేవి. వాటితో ఎంత అనుబంధము ఉండేదంటే  “ఒరే రాముడూ!” అంటే ఎద్దు పరిగెత్తుకొని వచ్చేది. వాటికి ముద్దు ముద్దు గా పేర్లు పెట్టుకొని వాటిని పిలుస్తూ యజమాని వాటిని ఎంతో ప్రేమగా చూసే వాడు. అవి పడిన కష్టానికి ఇంట్లో తగిన ప్రతిఫలముండేది. అందుకే అవి కుటుంబ సభ్యులుగా ఉండేవి.
ఒకప్పుడు ప్రజల సంపదను వారికున్న పశు సంపదతో కొలిచే వారు. మహాభారతములో పశు సంపద కోసము ఉత్తర మరియు దక్షిణ గోగ్రహణ యుద్దాలు జరిగినాయి. ఇప్పటికి శ్రీ కాకుళము జిల్లాలో ఆవులను సొమ్ములని అంటారు. ఇక్కడ మరొక సంఘటన గురించి చెప్పాలి. ఇది నా బంధువు ద్వారా తెలిసింది. మహారాష్ట్ర లో ఒక  రైతుకు చాలా పశువులు ఉండేవి. అడవిలో మేస్తున్న పశువులు ఒక రోజు  మిట్ట మధ్యాహ్నమే మేత మాని వేసి, కాపర్లు అడ్డము పడినా ఆగకుండా ఇంటికి పరుగెత్తుకొని వచ్చినాయిట. విచిత్రము ఏమిటంటే వాటి యజమాని  అంతకు ముందే చని పోయినాడు. అవి అంతగా ప్రేమించిన ఆ యజమాని చని పోయినాడని వాటికి ఎ చైతన్యము తెలిపిందో తెలియదు. ఇంకొక సంఘటన. ఒక సారి బస్ ఎక్కించడానికి వెళ్లి అక్కడ పుచ్చ కాయ  ముక్క ఒక ఆవు దూడకు పెట్టినాను. వెంటనే ఆ దూడ పరిగెత్తుకుంటూ వెళ్లి మరి కొన్ని దూడలను పిలుచు కొని వచ్చింది. వాటికి కూడా పుచ్చ కాయ ముక్కలను ఇప్పించే వరకూ అవి నన్ను వదిలి పెట్ట లేదు.
పాశ్చాత్య దేశాలలో పశు మాంసాన్ని భక్షించే వారు ఎక్కువ. వారికి పశువులతో ఎటువంటి అనుబంధము లేదు.  మన రాష్ట్రములో  కూలీ పని చేసే వారు తక్కువై పని వారు దొరకనందు వలన యంత్రాలు పొలాలలో దిగినవి.  పని వేగము పెరిగింది . లోతుగా తవ్వుట వలన భూమిలో సారము బయటకు వచ్చింది. రసాయనిక ఎరువుల వలన సహజముగా ఉన్న నేల సత్తువ తరిగింది. అందు వలన  అదే పంటకు పూర్తిగా రసాయనిక ఎరువులు వాడ వలసిన పరిస్థితి వచ్చింది. వీటి వలన పంటకు సహజముగా ఉన్న రోగ నిరోధక శక్తి తగ్గి అవి పురుగుల దాడికి గురి అయి, ప్రత్యేకముగా వాటి కోసము పురుగు మందులు వాడ వలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పంటలను తిన్నందు వలన మన దేహము లోనికి ఈ ఆహారముతో బాటు పురుగు మందులు కూడా ప్రవేశిస్తున్నవి.
ఈ పరిస్థితి వ్యవసాయ రంగము లోనే కాక అన్ని రంగములలో ప్రవేశించింది. సంపద పెరిగే కొద్దీ ఇంకా సంపద కావాలి. ఇంకా.. ఇంకా.. దీనికి అంతు లేదు అన్ని రంగాలలోనూ ఆధునిక యంత్రాల వాడుక పెరిగింది. కమ్మరి, కుమ్మరి, చాకలి వీరి వారి అవసరము సమాజానికి లేదు. అన్ని రంగాలలోనూ యంత్రాలు రోబోలు ప్రవేసించినవి. గుమాస్తాలు పోయి అన్ని రంగాలలోనూ కంప్యూటర్లు వచ్చినవి.ఇంట వరకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పేరుతొ కంప్యూటర్లకు ప్రోగ్రామ్లు వ్రాస్తున్నారు. త్వరలో కంప్యూటర్లకు కంప్యూటర్లే వ్రాయ వచ్చు అని అంటునారు. అటు తరువాత స్థాయి ఏమిటంటే కంప్యూటర్లు మన చేత మనుషుల చేత పనులు చేయించ వచ్చును.
అందుకే అంటారు, మనుషులు  అద్భుతమయిన యంత్రాలను తయారు చేసినాడు. కానీ మనస్సు కలిగిన మనిషిని తయారు చేయ లేక పోతున్నాడు. ఇంకా మనిషి తను పెంచు కొనే సంపద కోసము కుటుంబానికి , సమాజానికి దూరమవుతున్నాడు. పిల్లల భాద్యత కూడా వదిలి వేసి వారిని కార్పోరేట్ కళాశాలలకు వదిలి వేసి తను వారి కోసము ఎంతో త్యాగము చేస్తున్నానని అనుకుంటున్నాడు. కానీ మానవ సంబంధాలను వారికి నేర్ప లేక పోతున్నాడు. ఇంక పిల్లలు  పోటీ పరీక్షలలో రాంకుల కోసము కష్ట పదుతూ మిగిలిన విషయాలను అన్నీ వదిలి వేసి ఒక రకముగా చెప్పాలంటే యంత్రము లాగా తయారవుతున్నాడు. ఇంక కార్పోరేట్ కళాశాలలు పోటీ మనస్తత్వాని పెంచుతూ పిల్లలకు జీవితమంటూ లేకుండా చేసి యంత్రాలలాగా చేస్తున్నారు. వారిలో సృజనాత్మకతను వివేకాన్ని మాత్రము పెంచ లేక పోతున్నారు.
ఈ యంత్రాలు ఎ పని అయినా చేయ గలవు, కానీ తోటి మనిషిని ప్రేమించ లేవు. కారణము, వీటిని తయారు చేసే వాడికి కూడా ప్రేమ అనే పదాన్ని మరచి పోతున్నాడు. భవిష్యత్తులో యంత్రాలకే అధికారమనిపిస్తుంది. అయినా ఈ యంత్రాలు ఎవరో కాదు మన తోటి మనుషులే. అందుకే గుర్తు పెట్టుకోండి.

                                      యంత్రాలు వస్తున్నాయి జాగ్రత్త.

Tuesday, August 30, 2016

మోతోయామా



హిరోషి  మొతోయామా జపాన్  కు చెందిన ప్రముఖ  కంప్యూటర్ శాస్త్ర  వేత్త. ప్రస్తుతము  అమెరికా లో పని చేస్తున్నాడు. అతడి జీవితము లో జరిగిన ఒక సంఘటన ఇందులో ప్రస్తావించ బడినది.
అతడు చిన్నప్పుడు  తల్లిదండ్రులతో ఉన్నప్పుడు  తండ్రి తల్లిని చాలా బాధించే వాడు.  ఇంట్లో ఎప్పుడూ అశాంతిగా ఉండేది.  మనశ్శాంతి కోసము  తల్లి తన కొడుకుతో సహా దగ్గిరలో ఉన్న బౌద్ధ ఆశ్రమము(లామాసరీ) కు వెళ్ళేది. అక్కడున్న ఒక లామా మొతోయామా లో ఏదో ఆకర్షణను చూచినాడు. వచ్చినపుడల్లా మొతోయామా ను దగ్గిరకు పిలిచి కబుర్లు చెప్పే వాడు. ఒక రోజు మొతోయామా తను ఒక్కడే  వెళ్ళినపుడు ఇంట్లో ఉన్న అశాంతి ని గూర్చి చెప్పినాడు. ఆ  లామా అప్పటికే మొతోయామా కు కొన్ని ధ్యాన ప్రక్రియలను పరిచయము చేసినాడు. మొతోయామా సమస్య విన్న తరువాత  అతడి చేత ఒక ప్రత్యేకమయిన ధ్యానము చేయించినాడు. అందులో ఒక చరిత్ర కన బడింది.
కొన్ని వందల సంవత్సరాల క్రితము  కొరియా దేశము నుండి జపాన్ వచ్చిన రాయబారి  జపాన్ రాజ కుటుంబముతో చాలా సన్నిహితముగా ఉండే వాడు. అతడికి రాజ కుటుంబమునకు సంబంధించి అన్ని  విషయాలు తెలిసేవి. కొన్ని నాళ్ళ తరువాత అతడిని తిరిగి రమ్మని ఆదేశిస్తూ వేరొక రాయబారిని కొరియా ప్రభుత్వము పంపించినది. జపానుకు చెందిన మంత్రి “రాజ కుటుంబానికి చెందిన  అన్ని విషయాలు తెలిసిన ఈ రాయబారి తిరిగి కొరియా వెళితే రాజ్య క్షేమమునకు మంచిది కాదని” భావించి, ఒక రోజు అతడికి ఆహారములో విషము కలిపి పెట్టినాడు. విష ప్రభావముతో చని పోతున్న రాయబారి తన చావుకు కారణమెవరో తెలిసి అతడిపై విపరీతమయిన ద్వేషముతో చనిపోయినాడు. ( ఏ వ్యక్తికీ అయినా చనిపోయినపుడు ఏ ఆలోచన తీవ్రముగా ఉంటుందో అది అతడి  మరు జన్మలో జీవితాన్ని నడిపిస్తుందనేది జగద్విదితము. )  అటు తరువాత ఆ  మంత్రి రాయబారిని కారణము లేకుండా అనుమానించి చంపించినాడన్న బాధతో చని పోయినాడు. ఈ విధముగా ఆ మంత్రికి రాయబారికి కర్మ బంధము ఏర్పడింది. ఆ మంత్రి భార్య గా ఆ రాయబారి భర్త గా జీవితాన్ని పొందినారు. వారే మొతోయామా తల్లిదండ్రులు.
మొతోయామా తన ఇంట్లో అశాంతి ఎలా తొలగి పోతుందని అడిగినాడు. ఆ లామా తండ్రి కోపాన్ని తగ్గించుటకు కొన్ని సాధనలు చేయించినాడు. తండ్రిలో మంచి మార్పు వచ్చింది. ఇంట్లో అశాంతి తొలగి పోయింది. కొన్నాళ్ళు చాలా హాయిగా గడచింది. ఈ లోపల తండ్రికి మళ్ళీ జబ్బు చేసింది. దానిని వైద్యులు కాన్సర్ గా నిర్ధారించినారు.
మొతోయామా ఈ విషయమై లామాను అడిగినాడు. అప్పుడు లామా కొంత సేపు ధ్యానము లోనికి వెళ్లి , తిరిగి చెప్పినాడు.” మీ తల్లికి తండ్రికి మధ్య ద్వేషము కారణము గా కలిసి బ్రదుక వలసిన కర్మ బంధము ఏర్పడినది. నీ యొక్క ధ్యానము వలన మీ తండ్రికి ద్వేషము తొలగి  ఆ బంధము తొలగి పోయింది. ఇంకా ఆయనకు  ఈ దేహముతో చేయ వలసిన పనులు లేవు. అందుకే అతడి జీవాత్మ తిరుగు ప్రయాణానికి సిద్ధమయింది.  ఇంకా మనము చేయ గలిగినది ఏమీ లేదు”, అని చెప్పినాడు. ఇంకా తల్లికి బిడ్డపై ఉన్న ప్రేమ బంధము వలన కొంత కాలము జీవిస్తుంది.  ఈ విధముగా ఇప్పటి మన కర్మలు రాబోయే జీవితాలను నడిపిస్తాయి.
ఇటువంటిదే మనకు తెలిసిన కథ ఒకటుంది.  ఒక సాధువు ఒక చెప్పులు కుట్టే వ్యక్తీ నుండి ఒక వరహా తీసుకుంటాడు. అది తిరిగి ఈయ లేక అప్పు తీర్చ లేదన్న ఆలోచనతోనే చని పోతాడు. అతడు ఆ చెప్పూ కుట్టే వ్యక్తిక్ర్ కొడుకు గా జన్మిస్తాడు. వయస్సు వచ్చే కొద్దీ వేదాంత పాఠాలు వల్లే వేస్తూ ఉంటాడు. ఇది గమనించిన తండ్రి ఒక యోగి దగ్గిరకు వెళ్లి తన కొడుకు విషయము ప్రస్తావిస్తాడు. ఆ యోగి చెప్తాడు,”నీవు చాలా అదృష్టవంతుడవు. అటువంటి వ్యక్తీ నీకు కొడుకుగా పుట్టడము నీ అదృష్టము. అయితే అతడు ఎక్కువ రోజులు బ్రదుకడు.” అని చెబుతాడు.
“మరెలా స్వామీ!” అని తండ్రి ప్రశ్నిస్తాడు.
“ఏమీ లేదు అతడి దగ్గిర ఎప్పుడూ ఏవిధముగా డబ్బులు తీసుకోవద్దు.” అని చెబుతాడు.
ఆ పిల్ల వాడు ఒక రోజు తను సంపాదించిన డబ్బులు దాచి పెట్టమని తండ్రికి ఇస్తాడు.ఆ వెంటనే ఒక పాము కరిచి చని పోతాడు.
ఋణానుబంధాలు ఇలాగే ఉంటాయి.
(ఇందులో మొతోయామా కథ శ్రీ ఎక్కిరాల వేదవ్యాస గారి పుస్తకము నుండి స్వీకరించా బడినది)

                                        ఓం స్వస్తి. 

Saturday, April 2, 2016

ఆహారము



రాఘవ తన కొడుకును చూచుటకై మలేసియా  వెళ్ళినాడు. కొడుకు నాలుగు రోజులు సెలవు పెట్టి తన వెంట అన్ని ప్రదేశాలను చూపించినాడు. అక్కడ ఉండే హిందూ దేవాలయాలతో బాటు పెద్ద హోటళ్ళు, భవనాలు, పార్కులు అన్నిటికి వెళ్ళినారు.
రాఘవ స్వతహాగా మాంసాహారి. అయినా వయస్సు పెరిగే కొద్దీ మాంసాహారాన్ని తినుటను తగ్గించుకుంటూ వచ్చినాడు ఎవరయినా బంధువులు వస్తే మొహమాటానికి మాంసాహారాన్ని  నాలుకకు అంటించు కొంటున్నాడు.. అంటే గానీ ఇష్ట పడి తినుట లేదు.
నాల్గవ రోజు వాళ్ళ అబ్బాయి “నాన్నగారు! ఈ రోజు మీకు స్పెషల్ మీల్స్ పెట్టిస్తాను” అన్నాడు.
“”వద్దురా. ఇటీవల నాకు మాంసము నోటికి పడటము  లేదు.”  అంటే “ఇంకొక్క సారి మిమ్ములను పిలువను. మీతో కలిసి నాకు ఆ స్పెషల్ డిష్ తినాలని ఉంది . రండి “ అంటూ బలవంతముగా తీసుకొని వెళ్ళినాడు.
హోటల్ లోకి ప్రవేశించ గానే ఎదురుగా పంజరాలలో ఎన్నో రకాల పక్షులు కనిపించినాయి. అందులో కొన్ని పిచ్చుకలు కూడా కనిపించినాయి.
“ఏమిట్రా? వీళ్ళు  ఈ పక్షులను అంతట ప్రేమగా పెంచుకుంటారా?’ అని అడిగినాడు.
విషయము తెలిస్తే తండ్రి అక్కడి నుండే వెనుకకు తిరుగుతాడని భయముతో  “అవును” అని చెప్పి డైనింగ్ హాలుకు తీసుకొని వెళ్ళినాడు. అక్కడ తెలుగు వచ్చిన వాడు లేక పోవడము కూడా అదృష్టము అనుకున్నాడు. ఉంటే ఆయన ప్రశ్నలకు ఎగతాళి చేస్తారు.
తరువాత లోపల బిరియానీ లాటివి వడ్డించినారు. ఎందుకో రాఘవకు నోటికి వెళ్ళుట లేదు. అయినా కొడుకు కోసము బలవంతముగా కుక్కుకున్నాడు. తినడము అయిన తరువాత అనుమానము వచ్చినది.
“ఇంతకూ మనము తిన్నది ఎ మాంసము రా?” అడిగినాడు.
“ఏదయితే ఏమిటి? తినడానికి బాగుంది కదా.”
ఒక సర్వరును అడిగితే అక్కడ వచ్చీ రాని తెలుగులో ఒక సర్వరు పిచ్చుకను చూపించినాడు.
దానితో రాఘవకు షాక్  తిన్నట్లనిపించినది. వాంతి వచ్చేట్లు అనిపించినది. ఇబ్బంది రాకుండా నోట్లో బిగ గట్టుకున్నాడు. హోటల్ గది లోనికి రాగానే మొత్తం వాంతి అయి పోయింది.
“ఏమయింది నాన్నా!” అని అడిగిన కొడుకుతో వెంటనే ఇలా అన్నాడు.
“ఇది మీకు చెబితే అర్థము కాదురా. నీ మీద గారాబముతో నిన్ను ఎప్పుడు పొలాల మీదకు పంప లేదు.  అందుకే నీకు అక్కడ ప్రకృతితో అనుబంధము ఏర్పడ లేదు. అందుకే మీకు నేను ఏమి చెప్పినా అర్థము కాదు.”
“ఉదయాన్నే పక్షుల కలకలాలు ఎంత బాగుంటాయో మీకు అర్థము కాదు. మైకేల్ జాక్సన్ కేకలు మీ చెవుల్లో హోరేస్తుంటే పక్షుల కలకలాలు మీకు ఎక్కడ వినిపిస్తాయి? పంటలు వచ్చినపుడు ఆ కంకులు వాకిట్లో కడితే అప్పుడు పిచ్చుకలు ఆ కంకులు తింటూ కబుర్లు చెప్పుకొనేటప్పుడు ఆ కల కలలుకు అలవాటు పడిన మాకే తెలుస్తాయి. ఇపుడు ఆ పిచుకలు ఏమయి పోయినాయో? పల్లెటూర్లో మాకే కనిపిచుట లేదు. కొంత మంది మొబైల్స్ తరంగాల వలన అవి నశించిననాయని అంటున్నారు.”
రాఘవ తిరిగి వచ్చిన తరువాత స్వామి శివానందను కలిసినారు.  ఆయన తో కొంత సేపు ఉండి తన అనుమానాలను తీర్చుకోవాలని అనుకున్నాడు.
“స్వామీజీ! మలేసియా లో అన్ని రకాల జీవులను భోంచేస్తారు. ఒక సారి పిచ్చుక మాంసము తిన్న తరువాత  అది ఏమిటో తెలిసింది. కానీ ఈ నా దేహము దాన్ని అంగీకరించ లేదు. వాంతి అయింది. ఎందుకలా జరిగింది? ఆ తరువాత మాంసాహారాన్ని మాని వేయాలని అనిపిస్తున్నది. ఎదో అశాంతి? కారణము తెలియుట లేదు.”
“ రాఘవా! నీ బాధ నాకు అర్థమయింది. రోజు తినే ఆహారము లోనూ జీవ హింస జరుగుతున్నది. కానీ అవి తినడాని కొరకే ఉన్నాయన్న భావన వలన నీ మనస్సు దానిని గుర్తించ లేదు. అదే పిచ్చుకల లాంటి జీవుల మీద నీకున్న అనుబంధము వలన  వాటి మాంసాన్ని నీ మనస్సు అంగీకరించుట లేదు.”
“ మరి మాంసాహారము తినుట వలన ఏ దోషము లేదంటారా?”
“ఖచ్చితముగా దోషముంది. కానీ అది నీ యొక్క పరిణామ స్థితిని అనుసరించి ఉంటుంది. ఈశావాస్య ఉపనిషత్తులో సమస్త జీవులలో నీలో ఉన్న దైవము ఒకటే అన్న విషయాన్ని గుర్తించమంటారు.”
“అంటే నాకు అర్థము కావటము లేదు.”
“ఒక్కొక్క విషయము వారి ఆధ్యాత్మికముగా ఎదిగిన స్థాయి మీద ఆధార పడుతుంది. ఋషులు ఏ విషయాన్నీ ఖచ్చితముగా ఆదేశించారు. ఒక సారి ఒకరు గౌతమ బుద్ద్దుడి దగ్గిరకు వచ్చినాడుట. “దేవుడున్నాడా? “ అని అడిగినాడుట.”ఔను ఉన్నాడు” అని బుద్దుడు చెప్పినాడుట.  తరువాత మరొకరు వచ్చి “దేవుడంటూ ఎవరు లేరు కదా.” అని అడిగినాదుట. బుద్ధుడు,”ఔను లేరు.” అని చెప్పినాదుట. వెంటనే అడిగిన వాడు వెళ్లి పోయినాడు. రెండు జవాబులు విన్న శిష్యుడు అడిగినాదుట. “గురు వర్యా! ఆ విధముగా వ్యతిరేకమయిన జవాబులు చెప్పినారేమిటి?” అప్పుడు శిష్యుడికి బుద్ధుడు జవాబు చెప్పినారుట.
“ఏమన్నారు?”
“మొదట వచ్చిన వాడు దేవుడు ఉన్నాడు అనే నిశ్చయముతో వచ్చినాడు. రెండవ వాడు దేవుడు లేడనే నిశ్చయముతో ఉన్నాడు. ఇద్దరికీ వివరణలు చర్చలు అక్ఖర లేదు. అందుకే వారికి అటువంటి జవాబులు వచ్చినవి. తెలుసుకోవాలి అనుకున్న వారికే చర్చలు, వివరణలు కావాలి. వారి కవసరము లేదు. తమ అభిప్రాయాలు సరి అయినవి అనుకున్న వారికి  వివరణలు అక్ఖర లేదు.”
“మరి తెలుసుకోవాలంటే ఎలా?”
“గురువు మీద సమర్పణ భావము ఉండాలి. నిజముగా తెలుసుకోవాలి అన్న భావన ఉండాలి.. అప్పుడే సరి అయిన సమాదానము వస్తుంది. అంటే కానీ, కథలను వక్రీకరించే కుకవులను దగ్గిరకు చేరనీయ కూడదు.”
“కుకవులంటే?”
“ప్రతి విషయాన్నీ లేదా ప్రతి కథను సత్యానికి కాకుండా తన భావాలకు అనుగుణముగా మార్చి చెప్పే వారిని కుకవులని అంటారు.”
“కుకవి పేరు ఎలా వచ్చిందో చెబుతారా?”
“నిజానికి కవి అంటే ప్రజ్ఞను కలిగిన వాడు. సృజనాత్మకతను కలిగిన వాడు. గురువు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింప చేస్తే  శుక్రుడు లోకములో ఎ పనిని అయినా ప్రజ్ఞతో ఎలా నిర్వహించాలో చెబుతాడు. అందుకే జ్యోతిషములో ఉన్నత మయిన సృజనాత్మకతకు అధిపతి శుక్రుడు. అందుకే మన పురాణాలలో శుక్రుడికి మరో పేరు ఉంది. అది కవి. దీనికి కు ముందు కలిపితే కుకవి ఏర్పడుతుంది. కుమతి కూడా ఇలాటి పదమే. కు శబ్దమునకు పృథ్వి అని అర్థము. పృధ్వీ తత్త్వము అంటే ఎప్పుడు భౌతిక స్థాయిని దాటాడు. తను ఎంత సేపు ఎలా బ్రదకాలి, ఎలా తినాలి అని తప్ప పైకి ఎదగని వారి స్థితిని కు శబ్దము సూచిస్తుంది. భూమికి పుట్టిన వాడిని కుజుడు అంటారు. భూవలయాన్ని కువలయము అంటారు. తన దేహము తన ఉనికి ని మించి ఆలోచించ లేని ఈ వర్గము లోనికి వస్తారు. వీరు పూర్తి స్వార్థ పరులు.”
“మరి దానికి ఉదాహరణ చెబుతారా?”
“నేను చెప్పిన బుద్ధుడి కథనే మరొకరు ఇంకో రకముగా చెప్పడము విన్నాను. ఒకరు బుద్ధుడి దగ్గిరకు వెళ్లి “దేవుడున్నాడా?” అని అడిగితే “లేదు” అని చెప్పినారుట. “మరొకరు వెళ్లి దేవుడు లేడు కదా?” అని అడిగితే “ఉన్నాడు” అని చెప్పినారుట. ఇది నేను ఇప్పుడు నేను చెప్పిన కథకు పూర్తిగా వ్యతిరేకము. వారు చెప్పిన దానికి వ్యతిరేకముగా చెబితే బుద్ధుడు వారి అంతరంగములో విమర్శ పెంచాలని ఇలా చెప్పినారని ఆకథలో చెబుతారు. ఇక జ్ఞాన సముపార్జనలో రెండు మార్గములున్నాయి. అందులో మొదటిది ధ్యాన మార్గము. ఇందులో ఎటువంటి సంఘర్షణ  ఉండదు. ఈ మార్గములో మనస్సు లోతులకు వెళితే మనలో అంతః శక్తులు మేలుకొని వారిని సరి చేస్తాయి. ఇక రెండవది సంఘర్షణ మార్గము. ఇది చర్చ తో కూడినది. ఏది సరి అయినది అని చర్చిస్తూ అవసరమయితే తలలు పగుల కొట్టుకొనే మార్గము. బుద్ధుడి మార్గము మాత్రము ఇది కాదు. ఆయన పద్ధతిలో తర్కానికి స్థానము లేదు. అనుభూతి మాత్రమె ప్రధానము. వ్యతిరేక మార్గములో జవాబు చెప్పుట బుద్ధుడి మార్గము కాదు. ఇది ఎవరిదో స్వయం కల్పితము. ఇక అసలు విషయానికి వస్తాము.”
ఒకప్పుడు కాశ్మీరము శైపాగమ శాస్త్రాలకు ప్రసిద్ధి. విజ్ఞాన భైరవ తంత్రము, శివ సూత్రాలు వంటి గ్రంథాలు అక్కడి నుండే వచ్చినవి. ఇందులో విజ్ఞాన భైరవ తంత్రము లో జగన్మాత పార్వతి పరమేశ్వరుడిని ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. ప్రతి ప్రశ్నకు ఒక సాధనా మార్గమును శివుడు జవాబు గా ఇస్తాడు. ఇందులో ఒక సాధనా మార్గమే బౌద్ధము లోనికి వచ్చింది.”
“ఇవన్నీ ఎందుకు చెప్ప వలసి వచ్చిందంటే శాస్త్ర విషయాలను కూడా వక్రీ కరించుట చాలా జరిగిందని చెప్పడానికి. ఇక ఆహారము విషయానికి వస్తాము. మానవేతర జీవి మొదటి సారి మనిషిగా పుట్టినపుడు, గత జన్మ సంస్కారాలు తమతో తీసుకొని వస్తుంది. ఇక మాంసాహారముతో జీపించేటప్పుడు ఆ మాంసము గతములో ఎ జీవి దేహములో భాగమో  ఆ సంస్కారాలు కూడా అందులో చేరుతుంది. అందుకే వారి మానసిక స్థాయి ఎదగడానికి అడ్డు పడుతుంది. ఇక మాంసాహారపువంటకాలలో మసాలాలు కూడా దండిగా చేరుతాయి. నోరు లేదా నాలుక రుచి బాగుందని అంటూనే ఉంటుంది. ఇక బొజ్జలో మంట రేగుతుంది. అందుకే వారిలో కోపముతో బాటు ఇతర గుణాలు కూడా చేరుతాయి. బుద్ధి సునిసితత్వము తగ్గుతుంది.ఇక ప్రసార మాధ్యమాలు వ్యాపారానికి ఎన్నో వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నాయి. ఇక సినిమాల విషయము చెప్పనక్ఖర లేదు. ఒక సినిమాలో కథా నాయకుడు త్రాగుడు, క్లబ్ జీవితాల్లో హుషారుగా తిరుగుతూ కూడా చదువులో అందరికంటే ముందు ఉంటాడు. మరొక సినిమా లో కథా నాయిక అంటుంది,””నేను రోజు చికెన్ తింటున్నా నాకు ఫాస్ట్ మార్కు వచ్చింది” ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ వారే నిర్ణయించుకోవాలి.”
“ఇక ఆధ్యాత్మికత లో ఎదుగుదల వచ్చే కొద్దీ కొన్ని మార్పులు తమంతట తాము వస్తాయి. ముందు మాంసాహారాన్ని వదిలి వేస్తారు. తరువాత మసాలాలను వదిలి వేస్తారు. తరువాత వండిన ఆహార పదార్థాలను వదిలి వేసి పచ్చి కూరలకు వస్తారు. అటు తరువాత నీటిని మాత్రమె త్రాగే వారున్నారు. ఇక సూర్యుడి కిరణాలతో బ్రదికే వారున్నారు.
అటువంటి వారి ప్రజ్ఞలో తీవ్రమయిన మార్పు వస్తుంది. అది ఒకరు చెబితే తెలిసేది కాదు. స్వంత అనుభవములో తెలిసేది.
ఈ ఆహారము మంచిదనేది ఒకరు చెబితే తెలిసేది కాదు. అందుకే విని, చేసి, ఎవరూ నేర్చుకోలేరు, అది వారి అనుభవానికి అందితే తప్ప.
ఇక భూమి మీద  ప్రశాంతతకు సహకరించాలనుకున్న వారు, ఆవేశము ప్రశాంతత కావాలనుకున్న వారు ఏదో ఒక రోజు శాకాహారానికి రాక తప్పదు. ఇది శాసనము కాదు.
ప్రకృతి యొక్క అనుశాసనము..”
                     ***************************


Thursday, March 3, 2016

నిజం





మనసు లోని భావనలను మనసు లోనె దాచుకొని
వాటికి వేరే కారణమును రూపొందించుకొని
తను బలహీనుడనని మరి మరి తను తలచుకొని
కలగి పోవుటది వృధా లెమ్ము, లెమ్ము, లేలెమ్ము.

జపములు సాధనములు, ధ్యానములు, మార్గములు,
చేరుటకు తీరమ్మును,చుక్కానిగ దారి చూపు
నా దేశము తక్కువ యని పల్కు వారి నోరు మూసి,
చేర గలము తీరమ్మును, బల హీనత తరిమి వేసి.

కత్తి మొన మీద నడక జీవితమున ఇది నిజం
పూల దారి మన కొఱకు పఱవరు ఎవరు.
మన పూర్వీకులు ఋషులు, మన పురాణ వీరులు
మనకు ఎపుడు ఆదర్శము నడిపింతురు వారు.

నడవాలి నడవాలి, అలసట మనసుకు లేదు.
ఒంటరిగా లేము మనము వెంటనె యున్నారు వారు
ఒంటరి వారము కాము ఇది నిజము నిజమ్ము.

గతమున మనమెవ్వరమో ఏమి పనుల చేసితిమో
ఎఱుక చేసుకొని ఒకపరి పిరికితనము తరిమి వేసి
మాటలోని నీరసమును మూలలకు పంపి వేసి
చేయగలము మనము చూడు నిక్కమ్మిది నా మాట.

Friday, February 5, 2016

బహుమతి




తేజ ఇంటికి రాగానే ముందు అమ్మ విరుచుక పడింది.
బాగా ప్రిపేర్ అయినావు కదా. ఆ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్ప లేక పోయినావు. మీ నాన్న వస్తే నన్నే తిదుతాడు.”
తేజ జవాబు ఈయ లేదు.
ఎంత? లక్ష రూపాయల బహుమతి. నీవెప్పుడయినా సంపాదించ గలవా? అంట మొత్తాన్ని.”
తేజ నుండి జవాబు రాలేదు.
ఏమిటి? దేనికీ జవాబు చెప్పవు.”
ముందే చెప్పాను కదమ్మా! గుర్తు రాలేదని.”
నేను నమ్మను.”
మరేమి చేసేది?”
నీవేమో ఇలా చేసేవు. మీ నాన్న నన్నే అడుగుతాడు. నేనేమి జవాబు చెప్పేది? ఇంక నీతో మాట్లాడను.” జయ విసురుగా లోపలికి వెళ్లి పోయింది.
తేజ గది లోకి వెళ్లి పండుకున్నాడు. కళ్ళల్లో నీళ్ళు కారుతుంటే ఎవరికీ కనిపించకుండా పక్కకు తిరిగి పండుకున్నాడు.
జయ కాసేపు కోపముతో ఉడికి పోయింది. తరువాత నెమ్మదిగా చల్ల పడింది.
ఇటీవల ఒక టీవీ చానల్లో మేధావి పేరు తొ ఒక క్విజ్ పోటీలు జరుపుతున్నారు. పది బృందాలుగా చేసి ప్రతి బృందాన్ని విడి విడి గా పరీక్షించి ఒకరిని తీసుకొని తిరిగి ఫైనల్లో ఆ గెలిచిన పది మందికి పోటీ పెడతారు. ప్రశ్న అడిగి నాలుగు జవాబులు ఇస్తారు. అందులో ఏది సరి అయినదో చెప్పాలి. ఇవి కూడా లాటరీ లాగా తయారయిందని విమర్శలు వచ్చేసరికి కొద్దిగా మార్చినారు. సరి అయిన జవాబు చెపితే ఓకే మార్కు, వివరణ ఇస్తే రెండు మార్కులు పెట్టినారు. ఇది కొంత మందికి ఇబ్బంది అనిపించినా లక్ష రూపాయల అంతిమ బహుమతి అనేసరికి చాలా మంది పోటీకి వచ్చినారు. తేజ నాన్న గారి తేజ ఇండస్త్రీస్ కూడా దీన్ని స్పాన్సర్ చేసినారు.
చివర్లో పోటీ రవి మరియు తేజాల మధ్య ఎక్కువగా ఉండినది. చివర్లో ఒక్క ప్రశ్న తేజ చెప్పకుండా రవి చెప్పేసరికి లక్ష రూపాయల బహుమతి రవికి వచ్చింది. తేజ అమ్మ నాన్నలకు ఇదే బాధ కలిగించినది. అందుకే తేజ అమ్మ అంట కోప పడినది.
ఇంట్లో హడావిడిగా తిరుగుతూ ఉండే పిల్లాడు అలా పండుకొని ఉండే సరికి జయకు మళ్లీ జాలి వేసింది. తను అనవసరముగా తిట్టే నేమో అనిపించినది. నెమ్మదిగా తేజ దగ్గరి కి వెళ్ళింది. వాడి పక్క మీద కూర్చుంది. వాడి తలను తన వైపు తిప్పుకుంది. వాడి కళ్ళల్లో నీళ్ళు చూచేసరికి దిగులు వేసింది.
ఏం నాన్నా నిజముగా గుర్తుకు రాలేదా?” నెమ్మదిగా అడిగింది.
అమ్మా! నీవు ఏమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను.”
చెప్పు నాన్నా!”
నేను కావాలనే జవాబు చెప్ప లేదు.”
జయకు మళ్ళీ కోపము వచ్చింది. అయినా సర్దుకొని “ఏమి నాన్నా!” అని అడిగింది.
నీకు రవి తెలుసు గదమ్మా!”
ఆ మొదటి బహుమతి వచ్చిన వాడే కదా.”
అవునమ్మా! నా పుట్టిన రోజుకు పిలవడానికి వాడింటికి వెళ్లి నానమ్మా! ఇంట్లో అంతా గొడవగా ఉంది. రవికి నాన్న లేడమ్మా! అమ్మే బయట ఎక్కడో పని చేసి గడుపుతున్నాది’ రెండు నెలలుగా అద్దె కట్ట లేదట. ఇల్లు గల ఆయన బెదిరించి వెళ్ళినాడు. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు. ఆ సమయములో నేను వెళ్ళడము నాకే సిగ్గు వేసింది. “
అయితే”
రవి చాలా మంచి వాడమ్మా. మేమిద్దరమూ కూర్చుంటే సైన్స్ తప్ప వేరే విషయము మాట్లాడుకోము. ఏ విషయమైనా ఎంత బాగా వివరిస్తాడనుకున్నావు. “ కా సేపు ఆగినాడు.
జయ వాడి వైపే చుస్తున్నాది.
అమ్మా! నా పుట్టిన రోజున నాన్న అంత ఖర్చు పెట్టినాడు కదా. ఒక వేయి రూపాయలు రవి కి సాయము చేస్తే మనకు నష్టము లేదు కదమ్మా.”
నాన్నను అడిగినానమ్మా! రవిని చూస్తే నాకు ఏడుపు వస్తుందమ్మా! కానీ నాన్న సాయము చేయడానికి ఒప్పుకోలేదమ్మా!”
మళ్ళీ ఆగినాడు.
రవి కి సాయము చేద్దామని ఉంది. కాని ఎలా చేయాలో తెలియ లేదమ్మా!”
ఈ పోటీ లో గెలిస్తే మేము ఇద్దరమే గెలవాలి. కానీ రవి ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనేదే నన్ను ఎడిపిస్తున్నాది.”
మళ్ళీ ఆగినాడు.
అందుకనే జవాబు గుర్తు రాలేదా?” జయ అడిగింది.
అమ్మా! ఈ బహుమతి రాక పోయినా మనకు ఏ విధముగా నష్టము లేదు. అదే రవికి వస్తే ఇంట్లో ఇబ్బందులు కొంత తీరి రవి ముఖములో సంతోషము కనిపిస్తుంది. అందుకే అమ్మా! ఆఖరులో జవాబు తెలిసి కూడా ఉంది పోయాను.”
అమ్మా! నాకు గుర్తు లేదని అబద్ధము చెప్పాను. క్షమించవా? సారీ అమ్మా!”
నిజం చెప్పు అమ్మా! మనకు ఆ లక్ష రూపాయలు అంట అవసరమని అంటావా?” ఏడుపు ముఖముతో తేజ అడిగే సరికి జయ కు జాలి వేసింది.
నాన్నా! నీవు మంచి పనే చేసినావు. మీ నాన్నకు నేను చెబుతాలే. ముందు వెళ్లి ముఖము కడుక్కో.” జయ నవ్వుతూనే అనేసరికి తేజ హుషారుగా లేచి కుళాయి దగ్గిరకు పరుగెత్తాడు.
**********************************************************************************