గొపీ తిరిగి బెంగుళూరు లో
తన మిత్రులతో సమావేసము అయినాడు. నడుస్తున్న పరిస్థితులను గురించి చర్చించినాడు.
అందరూ ఇప్పుడున్న
వ్యవస్థకు బద్దులే. ఈ దేశములో మొదట గాంధీ స్వాతంత్ర్యము కోసము పోరాడింది రెండు నినాదాలతో. మొదటిది స్వదేశీయత, రెండవది
స్వరాజ్యము. గాంధీ స్వయముగా ఆధ్యాత్మిక వేత్త. స్వరాజ్యము అంటే మొదటి స్థాయిలో
మనలను మనము పాలించుకోనడము. దీని వలన సహజముగా
ఆధ్యాత్మికతలో ముందున్న ఈ దేశములో, ప్రజలలో విదేశీ ప్రభావము
తగ్గుతుంది.వారిలో సహజముగా ఉన్న ఆధ్యాత్మికత వెలుగుతుంది. అప్పుడు రెండవ మెట్టు
ఎక్కుతారు. ఆ స్థాయిలో స్వరాజ్యము అంటే ఆత్మ సామ్రాజ్యము. అందుకు తగిన
వాతావరణాన్ని నిర్మించాలని ఆశ పడినాడు.
ప్రపంచ మంతా భౌతిక వాదము ప్రజ్వరిల్లుతున్న రోజుల్లో వెలుగు చూపించ గలిగిన శక్తి ఒక్క భారత
దేశానికే ఉండినది. కానీ పరాయి పాలన వలన ఆ
వెలుగు బయటకు రావటము లేదు
.పాశ్చాత్యదేశాలలో రెండు ప్రపంచ యుద్ధాల
వలన ప్రజలు బాధలు భరించ లేక అంతరంగము లో
ఏడ్చి ఏడ్చి, ఇంక ఏడుపు కూడా రాని
స్థితికి చేరుకొని నారు. అటువంటి తీవ్రమయిన పరిస్థితులలో వారి భౌతిక దేహమునకు కామ దేహమునకు మధ్య యున్న
పోర చీరి పోయి , మొదటి సారి, ఆ
పరిస్థితులను తట్టుకొని నిలిచినా వారికి కామ
లోకమనే మరో లోకము ప్రత్యక్షమయినదని మహాత్ములు భావిస్తున్నారు. ఈ విధముగా
యూరప్ లో ఆధ్యాత్మికత కొత్త అనుభవాలతో ప్రత్యక్షమయినది. ఇదే సమయములో రాంపా
అనే టిబెట్ యోగి చైనా దేశములో చిత్ర
హింసలను అనుభవించి, ఇంక తనకు సహకరించని
భౌతిక దేహమును వదిలి వేయాలనుకున్న సమయములో
మింగ్ యార్ దొండుప్
పేరు గల అతడి గురువు , ఐరోపా లో భౌతిక లోకము కాక వేరే లోకములున్నాయని వారికి తెలియడానికి , అతడిని ఆత్మ హత్య
చేసుకొనుటకు సిద్ధ పడిన ఒక ఆంగ్లేయుడితో ఒప్పందము చేసుకొని అతడి దేహములో అతడిని
ప్రవేశ పెట్టినాడు. ఆ దేహములో ఆయన తన అనుభవాలను గురించి ఎన్నో పుస్తకములు ఆంగ్ల
భాషలో వ్రాసినాడు. వీటితో పాశ్చా త్యులలో కొత్త అనుభవాలను రేకెత్తించినాయి.
ఇదే సమయములో కొందరు
మహాత్ములు భూమి మీద తమ కార్యక్రమమును సత్వరముగా నిర్వహించుటకు తల్లి దేహములో
ప్రవేశించుటకు బదులు మరణ స్థితిలో యున్న కొంత మంది దేహాలను ఆశ్రయిస్తున్నారని కొంత
మంది పాశ్చాత్యులు భావించినారు. వీరినే
వాకిన్ లు అని వారు పిలిచినారు.కరంచంద్
గాంధీ మరణించ పోతున్న సమయములో ఆయన దేహములో ఒక మహాత్ముడు ప్రవేశించి, ఈ దేశ స్వాతంత్ర్యాని కృషి చేసినాడన్నా మరొక కథన కూడా ఉన్నది. తనను
ఆశ్రయించిన ఆఖరి వ్యక్తీ నిర్వాణము అందుకొనే వరకు భూమి మీద తన కార్యక్రమములు
జరుగుతాయని గౌతమ బుద్ధుడు చెప్పినాడు. వంటి మీద పూర్తిగా అప్పుకోనుటకు దుస్తులు
లేని భారతీయుల దుస్థితికి చింతించిన గాంధీజీ , ఈ పరిస్థితి మారే వరకు పై వస్త్రము
ధరించనని దానిని వదిలి వేసినాడు. ఈ విధముగా ఆయన ఋషుల, రాజర్షుల సాంప్రదాయాన్ని
అనుసరించినాడు. భూమితో, ప్రకృతి తో తాదాత్మ్యము చెంది జీవించే రైతుల ఆవాసమయిన గ్రామాలలో
భారత దేశము యొక్క ఆత్మ ఉందని భావించిన గాంధీ గ్రామాలకు ప్రాధాన్యత ఈయ వలెనని
భావించినాడు.
గ్రంథములలో కూడా సజీవ
మరియు నిర్జీవ గ్రంతములని యున్నవి. ఎన్ని సార్లు చదివినా మన ఆలోచనల పరిధి
మార్చనివి నిర్జీవ గ్రంథము లని అంటారు. అదే భగవద్గీత లాంటిది మన ఆధ్యాత్మిక స్థాయి పెరిగీ దానిని బట్టి ఆ స్థాయికి తగ్గ అర్థములను ఇస్తాయి. అందుకే వాటిని సజీవ
గ్రంతములని అంటారు.
ఇంక స్వదేశి అంటే మన
దేశములో తయారయినవే వాడుకోవాలన్నది ఒక అర్థము. అందు వలన దేశము ఆర్థికముగా ఎదుగుటే కాకుండా పౌరులకు ఆత్మ విశ్వాసమును పెంచుతుంది.
దేశము అనే పదమునకు దేహము అని కూడా అర్థము వస్తుంది.అంటే మనకు కావలసినవి మనము
చేసుకో గలగాలి. గోకులములో శ్రీ కృష్ణుడు ఇటువంటి స్థితినే తీసు కొను వచ్చుటకు
ప్రయత్నమూ చేసినాడు. సత్య సాయి విద్యా సంస్థలలో బాబా ఇటువంటి రాయత్నమునే చేసినాడు.
దీనిని అంగీకరించి
సాధించినపుడు మనకు స్వరాజ్యము వస్తుంది. మన దేశములో ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇదే.
కాని, మనము దానికి దూరముగా వెళ్ళిపోయినాము.
మొదట్లో మనకు పశు సంపద
చాలా ఉండేది. మన జనాభా ముప్పది కోట్లు
ఉన్నప్పుడు మనకున్న ఆవుల సంపద ముప్పది కోట్లు ఉండేదని ఒకరు అన్నారు. పైనాంపురము
చుట్టు పక్కల పశు సంపద చాలా ఉండేది. నర్తనశాల
సినిమా కొరకు ఉత్తర గోగ్రహణ చిత్రీకరణకు
యానాటి చిన్న రాజారెడ్డి యొక్క ఆవులను వాడుకున్నారని ఇక్కడ చెప్పే వారు. అప్పుడు
వరిపంట కూడా బాగా ఎత్తు ఎదిగేది. పంటల కోటలయిన తరువాత వచ్చే గడ్డి చాలా ఎక్కువగానే
ఉండేది. అందు వలన పశువుల మేతకు కుడా ఖర్చు ఎక్కువ అయేది కాదు.పగటి పూట బయట తోపులలో
తిప్పుకొని వచ్చే వారు. సాయంత్రమఎసరికి లేగ దూడలు వాటి వైపు ఆత్రముగా
పరిగెత్తుకొని వచ్చేవి. ఆరోజులల్లో ఆవులకు ఒక పూటే పాలు పితికే వారు. అందుకని
దూడలు కూడా బాగా బలంగా ఎదిగేవి. సాయంత్రము పసిపిల్లలు ఆదూడలతో ఆడుకొనే వారు. వారి
మధ్య స్నేహము ఎంత ఉండేదంటే, పిలిస్తే చాలు అవి పరుగెత్తుకొని వచ్చేవి. ఈ విధముగా
రైతులకు పశువులకు మధ్య తెలియని ఆత్మీయత ఉండేది. మిగిలిన ఎందు గడ్డిని పాకాలకు
కప్పుగా వేసే వారు.
వచ్చిన పంటలో మేలయిన
ధాన్యాన్ని ప్రత్యేకముగా ఎండ బెట్టి దాన్నే తరువాత పంటకు విత్తనాలుగా వాడే వారు.
ఈవిధముగా ఏ నాడూ విత్తనాలను కొనే వారు
కాదు. పశువుల మల మూత్రాలతో కూడి కుళ్ళిన గడ్డినే ఎరువుగా వాడే వారు. జిల్లేడు, వెంపల
లాటి మొక్కలను కూడా ఎరువుగా వాడే వారు. ఈ విధముగా నేలకు సారాన్ని అందించే వారు. అంతే
కాక ఈ రకమయిన వ్యవసాయములో కీటకాల మరియు తెగుళ్ల బాధ ఉండేది కాదు. ఈ విధముగా రైతుకు
కూలీల ఖర్చు తప్ప తక్కువ ఖర్చుతో పంట ఇంటికి వచ్చేది. అంటే కాక రైతుకు కూలీలకు మధ్య స్నేహ భావ
ముండేది.
ఆ సమయములో దేశీయ
అవసరాలకోసమని ఎక్కువ పంట పండించుటకై హరిత విప్లవము మొదలయినది. ఉన్న పొలములో ఎక్కువ
పంట పండించాలన్నదే ఉద్దేశ్యము. ఇందుకోసము మొదట రసాయనిక ఎరువులు ప్రవేశించినాయి.
ఎక్కువ పంట వస్తుందని రైతు ఎగబడినాడు. మొదటి సంవత్సరము, రెండవ సంవత్సరము పంట బాగా
పండినది. మూడవ సంవత్సరము వచ్చేసరికి పంట తగ్గి పోసాగినది. అందుకని ఎరువు మోతాదును
పెంచమన్నారు.క్రమముగా అంతకు ముందు లేని విధముగా పంటల మీద కీటకముల దాడి మొదలయినది.
కొత్తగా ఎరువులతో బాటు పురుగు మందుల ఖర్చు పెరిగింది. క్రమముగా పాత సంప్రదాయ
విత్తనాల స్థానములో డి యన్ ఏ మార్చ బడిన విత్తనాలు
వచ్చి రైతుకు విత్తనాలు కొన వలసిన స్థితి వచ్చినది.
సాంప్రదాయక విత్తనాలు పో గూడదని వేర్వేరు
ప్రజా ఉద్యమాలు వచ్చినవి. క్రమముగా విత్తనాల వ్యాపారములో విదేశీ సంస్థలు కూడా
ప్రవేశించుటతో పరిస్థితిని గమనించిన వందన శివ లాటి సామాజిక వేత్తలు సాంప్రదాయక విత్తనాలను నిలవ
ఉంచుటకు విత్తనాల బాంకులను ఏర్పాటు చేసినారు. ఎందుకంటే ఎప్పుడయినా విదేశీ విత్తనాల
వ్యాపారులు మన మీద పట్టు కోసము నిష్క్రమిస్తే
దేశములో కరువు పరిస్థితులు ఏర్పడుతాయి. అందుకే వ్యతిరేకత వచ్చింది.
ఇన్ని ఉద్యమాలు
నడుస్తున్నా ప్రజల అభిప్రాయముకు వ్యతిరేకముగా ప్రభుత్వముపై పట్టు సాధించిన మాన్
సాంటో లాటి సంస్థలు బి టి ప్రత్తి విత్తనాలను దేశములో ప్రవేశ పెట్టినారు.
వీటిని టెర్మినేటర్ విత్తనాలు అని అంటారు. పంతనుంది వచ్చిన విత్తనాలను తిరిగి
వేస్తే అవి కుళ్ళి పోతాయి తప్ప
మొలకెత్తవు. అంటే భవిష్యత్తులో కంపెనీ విత్తనాలు ఇవ్వక పొతే ఇక పంటలు ఉండవన్న
మాట. బి టి ప్రత్తి వెంటనే బి టి వంకాయ కూడా బయటికి రావడానికి ప్రయత్నము
చేస్తున్నది.
వంకాయకు పుచ్చు రావడము
మామూలే. దాని డియన్ఏ లో సాలీడు డియన్ఏ కు సంబంధించిన అణువును చొప్పించి, పుచ్చు లేని
వంకాయ వచ్చేటట్లు చేసి దాని మీద వ్యాపారము చేయడానికి చాలా ప్రయత్నాలు
జరిగినాయి. తువంటి మార్పుల వలన భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో అనే భయముతో ప్రజా
ఉద్యమాలు వచ్చినాయి.
హైబ్రిడ్ వరి రాకతో పంట
ఎత్తు తగ్గి పోయి పశువుల మేతగా
ఉపయోగపడే గడ్డి రాబడి తగ్గి పోయినది. అంటే
గాక గడ్డి మీద ఆధార పడే అట్టల పరిశ్రమలు
పెరిగి గడ్డికి మరింత గిరాకీ పెరిగినది. పెట్టుబడుల మీద పెరిగిన బారముతో రైతు మరింత ఆదాయము కోసము
గడ్డిని అమ్మడము మొదలు పెట్టినాడు. ఈ
విధముగా పశు గ్రాసము తగ్గింది.
పశువుల పోషణ ఖర్చు పెరిగింది.క్రమముగా
పసువులను పోషించా లేక అమ్మి వేయుట మొదలు పెట్టినాడు. ఇందుకు దుక్కికి నాగళ్ళకు
బదులు ట్రాక్టర్లు ప్రవేశించడము కూడా కారణము అవుతుంది. ఇంతకు ముందు పశువులకు
రైతులకు మధ్య స్నేహ బంధముండేది. వ్యాపార ధోరణి వలన ఇది తగ్గ పోయింది. ఇంతకూ ముందు
పంట తగ్గినా రైతుకు నికర మయిన ఆదాయము ఉండేది.ఎప్పుడయినా ప్రక్రుతి భీభత్సాల వలన
నష్టపోయినా త్వరగా కోలుకో గలిగే వాడు. ఇప్పడు పెట్టుబడులు పెరిగినందు వలన ప్రక్రుతి
విలయాలు వస్తే కోలుకోలేనంతగా క్రుంగి పోతున్నాడు.
ఈ విధముగా మేలు చేయ వలసిన హరిత విప్లవము వలన , వ్యాపారుల పాత్ర వలన,
రైతులకు పెరిగిన అత్యాశ వలన నష్టాలు పెరిగి,నవి. ఇంతకూ ముందు రైతుకు పశువుల మీద, పొలము మీద ఎంతో ప్రేమ ఉండేది.
ఇప్పుడు రైతుకు పొలాన్ని చూస్తె ధనము తప్ప మరేమీ కనిపించుట లేదు.
పారిశ్రామిక విప్లవము
చూపించిన ప్రభావము అంతా ఇంతా కాదు.దీని వలన సంపద పెరిగినది. దీని వలన గ్రామాలలో
ఆస్తులను అమ్ముకొని చాలా మంది పట్టణాలకు బయలు దేరినారు. ఈ విధముగా వ్యసాయము మీద
జనానికి శ్రద్ధ తగ్గినది.
పారిశ్రామిక విప్లవము రాక
ముందు భారత దేశములో ప్రదానముగా గ్రామాలలో
వ్యవస్థ ధర్మమూ చుట్టూ తిరిగేది. పరిశ్రమలు వచ్చిన తరువాత వచ్చే డబ్బు మీద
దృష్టి పడినది. డబ్బు చేరితే వచ్చే సుఖాల
మీద దృష్టి పెరిగినది. ఆర్ద్రత తో కూడిన ప్రేమాను బంధాల స్థాయిలో భేదాలను పెంచే
ఆర్ధిక సంబంధాలు ఏర్పడినవి. సహజముగా వారిలో నున్న ధార్మిక జిజ్ఞాస బలహీన పడినది.
ధర్మము స్థానములో రెండో పురుశార్థమయిన అర్థము/డబ్బు ప్రాధాన్యతను సంతరించుకున్నది.
దీనితో కుటుంబములో, సమాజములో నున్న మానవ
సంబంధాలలో పగుళ్ళు/బీటలు ఏర్పడినవి. ఆర్ధిక భేదాలు వచ్చి, స్వార్థము పెరిగి ఉమ్మడి
కుటుంబాలు విడి పోయినాయి. ఇప్పుడు కుటుంబాలలో అవ్వ, తాత లాంటి పదాలు
దూరమవుతున్నాయి. ఉద్యోగాలు తమ సమయాన్ని తిని వేస్తున్నందువలన మనిషికి ధర్మాచరణకు
కూడా తగ్గి పోయింది. ఒకటి, నాలుగు పురుషార్థాల మీద ఆసక్తి పూర్తిగా పోయి రెండు, నాలుగు అయిన అర్థ కామాల మీదే దృష్టి
నిలిచి పోయింది. కుటుంబ పెద్దలకు వృద్ధాశ్రమాలు
ఏర్పడినవి.
స్వామి వివేకానంద
అమెరికాలో ఉన్నప్పుడు,ఆయనతో వృద్దులయిన తల్లి దండ్రులను ఏంటో శ్రద్ధగా చూచుకున్న
ఒక అమెరికన్ యువకుడి గురించి ఒకరు ఆయనతో ప్రస్తావించినారు. ఈ విషయము మీద స్వామి
నవ్వి ఊర్కున్నాదట. రెట్టించి అడిగితే “మా దేశములో ప్రతి కొడుకు ఈ మాత్రము
చేస్తాడు. దీనిని మాదేసములో గొప్ప తనముగా చెప్పరు. అది కనీస భాద్యతగా భావిస్తారు.”
అని జవాబిచ్చినాడు. అటువంటి మన దేశములో భాధ్యతలను
మరచి పోయినారన్న విషయము గుర్తు చేయకుండా
తల్లులు దినము, తండ్రుల దినము లాంటి తద్దినాలను ఏర్పరచింది.(తత్+దినము అంటే
ఆ దినము)
గొపీ స్నేహితుల మధ్య
ఇటువంటి చర్చలే జరిగేవి. ఈ చర్చలను ఇలా కోన సాగించుత వలన ఎక్కువ ప్రయోజనము లేదని
వారికి తెలుసు. కార్య రంగానికి దిగ వలసిన అవసరముంది.
గ్రామాలలో మృగ్యమయిన నీటి
వసతి కోసము త్రాగు నీరు లాటివి కల్పించి వాటిని పునరుజ్జీవింప చేయాలి. ఇది ఏ
విధముగా చేయాల్?
ప్రపంచములో అత్యంత
ప్రాచీనమయిన నగరాలన్నే నదీ తీరాల వెంబడే ఏర్పడినాయి. అందుకే సింధూ నాగరికత లాంటి
వన్నీ ఆయా నదుల పేర్లతోనే ఏర్పడినాయి.అక్కడ వ్యవసాయాధారిత జీవితాలే నడిచినాయి.
నదులకు దోరముగా ఎక్కడయినా ఏదయినా నాగరికత ఏర్పడిందంటేఅక్కడ జంతువుల వేట ప్రధాన
జీవనాధారముగా ఏర్పడింది. ఇటువంటి జీవితమూ నడిపే వారు ఆహారపు వనరులు తగ్గినపుడు,
మిగిలిన వారి మీద దాడి చేసి, దోపిడీలు చేసి బ్రదికే వారు.ఈ కారణాల వలన ప్రాచీన కాలములో నేటి వనరులున్న స్థలాల కోసము
పోరాడే వారే గానీ,నీటిని పాడు చేసే వారు కాదు.
ప్రాచీన కాలములో అతిథి
ఇంటికి వస్తే,కాళ్ళు కడుగుకొనుటకు
వాకిట్లో నీరుంచే వారు.అంతే కాదు చల్లగా కుండలో నీరు ఇచ్చే వారు.తెలియని వారయినా
నీటి కోసము అడిగితె సాదరముగా ఇచ్చే వారు.
పారిశ్రామిక విప్లవము
వచ్చిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారి పోయినవి. పరిశ్రమలలో వచ్చిన మురికిని ప్రక్కనున్న
నదులలో, కాలువలలో, ఇంకా పంట కాలువలలో కలపడము మొదలు పెట్టినారు. అవేమీ లేక పొతే
లోతుగా గోతులు తవ్వి,,మురికి పదార్థాలను రసాయనాలను ఆ గుంటలోకి తరలించే వారు.ఆ
ప్రాంతాలలో(ఇది రంగా రెడ్డి జిల్లా లో జరిగినది) నూతులలో నీరు విషమయమయింది. ఈ
విధముగా ప్రకృతి మనకు ఉచితముగా ఇచ్చిన నీటిని త్రాగ లేక మంచి నీటిని కూడా కొనుక్కొని
త్రాగ వలసిన పరిస్థితులు ఏర్పడినవి.
కొన్ని రసాయనిక పరిశ్రమలు
తరచుగా వారి బాయిలర్ల లోని మురికినంతా గాలిలోకి వదిలి వేస్తున్నారు. ఈ విధముగా
వాయు కాలుష్యము చేస్తున్నారు. తల్లిదండ్రులు అవసరము లేకున్నా తమ పిల్లలకు
అతివేగముగా నడిచే ద్విశకట వాహనాలను కొని ఇస్తున్నారు.దీని వలన కూడా వాయు కాలుష్యము పెరుగుతున్నది.
ఆకాశమంతా శబ్ద
కాలుశ్యముతో బాటు,ఇంటర్నెట్ పరికరాల ద్వారా , విద్యుదయస్కాంత తరంగాల ద్వారా సరి
కొత్త చెడు సంబంధాలను ప్రేరేపించే భావ కాలుష్యముతో నిండి పోయింది.
ఈ విధముగా భాద్యత తెలియని
మనుషుల ద్వారా పారిశ్రామికీకరణము పంచ భూతాల కాలుష్యానికి దారి తీసింది.
పరిశ్రమలను నిర్వహించే
వారు దేశానికి సంపద పెంచుతున్నారమే మాట నిజమే. కానీ కలుషిత వాతావరణము ద్వారా
ప్రజలు కోల్పోయిన దానికి తాము భాద్యత
వహించాలన్న వారు కానీ, ప్రభుత్వమూ కానీ గుర్తించక పోవడము దురదృష్టకారము. ఇందులో
ఎవరిని ఎవరు నియంత్రిన్చినారనేది అనవసరము.
పల్లెటూళ్ళలో ఒకప్పుడు
మోసము చేసే ప్రవృత్తి ఉండేది కాదు. కానీ, ఈనాడు,సినిమాలు, టీవీ చానల్సు ద్వారా మంచి కంటే ఛీ ఎక్కువ ప్రచారము
చేయబడుతున్నది.గౌరవముగా ఒక తల్లి, చెల్లి, గృహిణి స్థానాలలో గౌరవముగా ఉండ వలసిన
స్త్రీ స్థానము విలాస వస్తువుగా ప్రకటనలలో కనిపిస్తున్నా ప్రశ్నించే సత్తా ఈ నాటి
వ్యవస్థకు లేకుండా పోయింది.
విలువలు కోల్పోయిన
సమాజానికి ప్రశ్నించే అధికారము లేదు. ఈ నాడు జరుగుతున్నది ఆదే.