గొపీ ఒక సారి తన బాంక్ అకౌంర్ చూచుకున్నాడు. తన జీవన విధానము
వలన బాగానే గుల్చుకున్నాడు. సుమారుగా ముప్పయి
లక్షల వరకు తన ఖాతా లో ఉంది. తండ్రి ఇంకా ఉద్యోగమూ లోనే ఉన్నాడు. అందుకని
ఆర్ధిక పరమయిన ఒత్తిళ్ళు ఏమీ లేవు.
తల్లి ఇంటిని చక్కగా చూచుకుంటూ సాహితీ సేవ
చేస్తున్నది. తను వచ్చిన కుటుంబము వలన సాంప్రదాయాలు, విలువలు అంటే తల్లిక్ మక్కువ ఎక్కువ.
తాతగారి దైనందినులు
గోపీని ఎక్కువ ప్రభావితము
చేస్తున్నాయి. ఒకప్పుడు పచ్చని పొలాలతో ఏంటో మందిని పోషించన ఆ ఊరు ఖాళీ అయి పోతున్నది.
వెళ్లి పోయిన వారు పోగా అనుబంధము పెంచుకున్న వారు ఊళ్ళో బ్రదుక లేక బయటికి వెళ్ళ
లేక బాధ పడుతున్నారు. మంచి నీరు కూడా
దొరకక ఉప్పు నీరు త్రాగుతున్నారు.
ఇన్ని మార్పులు వచ్చిన
తరువాత కూడా తమ కుటుంబానికి చెందిన
ఆస్తులు ఇంకా ఆ ఊళ్ళో ఉన్నాయి. .ఉప్పులు
తేలిన తమ పంట పొలాలలో ఇప్పుడెవరూ పంటలు
వేయటము లేదు. పని చేయడానికి కూలీలు కూడా
దొరుకుట లేదు. పాడు బడిన తాత గారి ఇంటి
చుట్టూ ఇసుక దిబ్బలున్నాయి. అది ఎవరికీ అమ్ముడు పోలేదు, ఖాళీగానే యున్నది. వరకవి
పూడి చెరువు నుండి పంజల మడుగు ద్వారా వచ్చే నీరు కూడా తగ్గిపోయినది. ఏమని
అడిగే సత్తా ఎవరికీ లేదు.
ఒక సంవత్సరముగా తన ఆలోచనలు అన్నీ ఆ ఊరి చుట్టే తిరుగుతున్నాయి. అక్కడే ఉండాలంటే అమ్మా నాన్నా ఏమంటారో అన్న భయము. చెల్లెలు
మాత్రము తనను హుషారు చేస్తున్నది. “అన్నయ్యా! ముందు నువ్వు వేళ్ళు, తరువాత నేనూ వచ్చేస్తాను.”అంటున్నది.
ఒకసారి అమ్మతో
ప్రస్తావించినాడు.
“అమ్మా! తాతగారున్న ఊరికి
ఒక సారి వెళ్లాలని ఉంది.”
“ఇటీవలే వెళ్లి వచ్చావు కదా!”
“అక్కడే కొన్నాళ్ళు ఉండాలని ఉంది.తాతయ్య ఉన్నపుడు ఆ ఊరు ఎంత
బాగుండేదో? నీకు తెలుసు కదా!”
“అక్కడకు వెళ్లి ఎక్కడుంటావు? ఏమి చేస్తావు? ఇల్లు అంతా కూలి పోయింది కదా!”
అమ్మ గొప్పతనము ఇదే.
మరోకరయితే, చేతిలో మంచి ఉద్యోగమంటే, దాన్ని చూచుకోకుండా, ఇవేమీ ఆలోచనలని అనే వారు. ఆ మాట అమ్మ నోటి నుండి రాలేదు.
“ఆ ఊరిని తిరిగి పైకి
లేపాలని ఉందమ్మా! మళ్ళీ ఆ ఊరిని ఆదర్శ
గ్రామముగా మార్చాలని ఉంది.”
“ఆదర్శాలు బాగానే ఉంటాయి
నాన్నా! అవి చేయడానికి తగిన పరిస్థితులు కూడా ఉండాలి కదా! అంతే కాదు, మాకు కూడా నీ
మీద కొన్ని ఆశలు ఉంటాయి. నీవు స్థిర పదాలని, నీకు పెళ్లి చేయాలనీ’
“అమ్మా! నీ మాటను
ఎప్పుడయినా కాదన్నానా?”
“అంటే”
“నాకు ఒక సంవత్సరము సమయాన్ని ఇవ్వండి. ఇవిగో ఇవన్నీ చూడు.” అన
దగ్గిర ఉన్న వ్రాత సంకలనాలనన్న్టినీ ముందు పెట్టినాడు. “ఇవన్నీ ఒక సారి చదివి
అప్పుడు నా అభిప్రాయము తప్పనిపిస్తే చెప్పమ్మా!”
అందులో తను అమెరికాలో
వ్రాసుకున్న విషయాలు బెంగుళూరు లో తన స్నేహితులతో చర్చలు అన్నీ ఉన్నాయి.
ఒక క్షణము కొడుకు నిర్ణయము శారదకు బాధను కలిగించింది. ఈ నాడు తమకు ఎటువంటి ఆర్ధిక పరమయిన ఒత్తిడులు లేవు. గొపీ తలచుకుంటే
ఎటువంటి సంస్థలో నయినా వెంటనే ఉద్యోగమూ వస్తుంది. అంతే కాదు,కావాలంటే తనే ఒక సంస్థను స్థాపించి నిర్వహించ గలిగిన సత్తా ఉంది. అందుకే తగిన
అమ్మాయితో వివాహము చేసి, ఇంట్లో కోడలు పిల్లలు తిరుగుతూ ఉంటె చూడాలన్న ఆశ ఉంది.
తనకు ఇంతకు ముందున్న భావ
జాలము ఆమెకు గుర్తుకు వచ్చింది. విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని తను ఇంట్లో
వాదించేది. “చదువుకున్న మనమే పట్టించుకోక పొతే
సమాజాన్ని ఎవరు పట్టించుకుంటారు?” అని వాదించేది. స్వామీ వివేకానంద
యొక్క భావ జాలముతో తన మెదడు ను
నింపేసింది.
ఇదే ప్రశ్న ఇప్పుడు మళ్ళీ
పైకి లేచింది. “ఎదో చేస్తానంటున్న కొడుకును
ఎలాగైనా ఆపాలనుకుంటున్నది. అన్నీ
తెలిసిన మనమే ఏమీ చేయక పొతే మరెవరు పట్టించుకుంటారు?
“అమ్మా! నీవు నాకు ఎన్నో
చెప్పే దానివి. నాన్న గారి దగ్గర
కంటే నీ దగ్గరే నేను ఎన్నో
నేర్చుకున్నాను. ఈ దేశము, ఇక్కడి ఋషులు, వారి జీవన విధానము, యోగులు....వీరందరి
గురించి నాకు తెలిసింది నీ నుంచే. నా
ప్రణాళిక ఈ కాగితాలలో ఉంది. అన్నీ చదువు.
ఆ తరువాత కూడా నీ మాట కాదని నేను ఏదీ
చేయను.ఎందుకంటే నాలో నున్న భావ జాలము నీ నుండి వచ్చిందే.
ఇంక శారదకు ఏమి చెప్పాలో
తెలియ లేదు. ఒక వైపు ఆదర్శాలు, మరొక వైపు ఆశలు.
మామ గారి దైనందినులు తను
కూడా చూచింది.గొపీ ప్రణాళికలన్నిటినీ ఒక సారి చూచింది.
భర్త శ్రీనివాసు చదువు
ఉద్యోగమూ తప్ప వేరే వాటిని గురించి ఆలోచంచే వాడు కాదు. ఆయనతో ఈ విషయమై
ప్రస్తావించింది. మొదట ససేమిరా వద్దన్నాడు. వరే చోట ఉద్యోగములో చేరమన్నాడు.
నెమ్మదిగా స్వంత ఊరి మీద
అభిమానముతో సరే అన్నాడు, అదీ కొన్ని
షరతులతో. అవసరమయితే తనూ శారద అక్కడే ఉంటె
బాగుంతున్దన్నాడు. అందుకని తను పదవీ విరమణ కోర వచ్చును. కానీ కూతురు ఉమ చదువు
పూర్తీ కాలేదు. ఈ సమయములో ఉమకు తమ అవసరము ఎంతయినా ఉన్నది. అందుకే నీర్నయము
తీసుకోలేక పోయినాడు.
చివరకు ఒక మాట
చెప్పినాడు.అక్కడ ఉండుటకు ఒక ఇల్లు కట్టి , అది పూర్తీ ఆయె వరకు తన ప్రణాలికను
వాయిదా వ్సుకోమన్నాడు.
ఈ నిర్ణయము కఠినమయినదే,
కానీ, కాల ప్రవాహములో వచ్చే మార్పులకు అందరూ కొట్టుకొని పోయే వారే. ఆగి, ఆలోచించే
వారు కనిపించుట లేదు. ఒక వినోబా భావే, ఒక రాజేంద్ర సింగ్,... ఇటువంటి వారే
చరిత్రలో నిల బడుతారు. మిగిలిన వాళ్ళు కాల ప్రవాహములో కట్టుకొని పోతారు.
మన పురాణ పురుషులలో
ఒకరయిన బలి శుక్రాచార్యులతో అంటారు.
“కారే రాజులు
రాజ్యముల్ గెలువరే
గర్వోన్నతిన్ పొందిరే
వారేరీ సిరి
మూట గట్టుకొని పోవం జాలిరే
భూమిపై
పేరైనన్ గలదే శిబి
ప్రముఖులున్ ప్రీతిన్ యశః కాములై
ఈరే కోర్కెలు వారలన్ మరచిరే ఇక్కాలమున్
భార్గవా! “
ఒక్క క్షణము
అనిపిస్తుంది,”శిబి లాంటి వారు కీర్తి
కోసము ఈ పని చేసినారా?” అని.
నిజానికి అది కారణము కాదు.ఆర్తి తో అడిగిన
వారికి ఇచ్చుట వారి ప్రవృత్తి. తీసుకున్న వారి ముఖములో ఆనందాన్ని వారు పంచుకుంటారు. అంతే కానీ, ఇది
పాపమా, పుణ్యమా,అని ఆలోచించే సంస్కారము వారికి లేదు.
బలి కూడా ఇటువంటి
సంస్కారానికి గుర్తు. కానీ శుక్రాచార్యుడు భౌతిక ప్రపంచాముకు ప్రతినిధి. అందుకే
బలి రాక్షస రాజు అయినప్పటికీ ప్రాచీన చరిత్రలో చిర స్థాయిని అందుకున్నాడు.
శ్రీనివాసు ఒక సారి
పైనంపురము వెళ్ళినాడు. తరువాత తహసిల్దారు కార్యాలయములో తమ ఆస్తి హక్కులకు
సంబంధించన కాగితాలన్నీ సేకరించినాడు. మూడు గదులు, వంట గది సమావేశపు గది ఉన్న ఇంటి నిర్మాణానికి అనుమతి
తీసుకున్నాడు.