Wednesday, March 22, 2017

రెండు చిలుకలు



ఈ రోజు అమ్మ వస్తుందిట నాన్న చెప్పినారు. ఎన్ని సంవత్సరాలు  అయిందో అమ్మను చూచి.  నేను అమ్మను మఱచి పోయినానా?  లేదే అమ్మ ఎప్పుడూ నాకు గుర్తు ఉంది. అయితే అమ్మకు ఎన్ని పనులో? అందుకే అయింది ఎన్ని సంవత్సరాలో.
మరి నాన్న అమ్మను మరిచి పోయినాడా? లేదు. మరచి పోయినట్లయితే అమ్మ వస్తుందని చెప్పినపుడు నాన్న ముఖములో సంతోషము ఎందుకు కన బడుతుంది?
“మీ అమ్మ రేపు వస్తుందిట ఏమి చేస్తావో చేయి.” అన్నాడు.
“అత్తయ్యను అడుగుదామని అనుకుంది, “ఏమి చేస్తే బాగుంటుందో?”కాదు తను ఆలోచించి తనే చేయాలి. ఈ మొద్దు బుఱ్ఱకు  ఏమి చేయాలో తెలియుట లేదు. నెత్తిన ఒక మొట్టి కాయ వేసుకున్నది. వెంటనే పండుగలకు  ఏమి చేస్తారో గుర్తుకు వచ్చింది. పక్కన ఉన్న మామిడి చెట్ల నుండి ఆకులు కోసి తోరణాలుగా వాకిట్లో కట్టింది. చాలా కష్ట  పది తనకు వచ్చిన ముగ్గులన్నీ వాకిట్లో పెట్టింది. తన కిష్టమయిన గులాబీ మొక్క దగ్గిరకు వెళ్లి రేపు ఉదయాన్నే మా అమ్మ వస్తుంది అని చెప్పింది. అమ్మకు ఏమి ఇష్టమో, ఏమి చేయాలో నాన్న గారు వచ్చిన తరువాత కనుక్కోవాలి. అమ్మకు ఇష్టమయిన కూరలు చేసి ఇవన్నీ నేనే చేసాను అమ్మా అని చెప్పాలి.
రామచంద్రమూర్తి ఒక్క సారి తన గతములోనికి వెళ్ళినాడు. అమ్మ వస్తుందని తన కూతురికి చెప్పినపుడు వాణి ముఖములో సంతోషాన్ని గమనించినాడు.  రోజా లేదా సరోజ తన భార్య పేరు. తను మాస్టర్ డిగ్రీ కోసము చదువుతున్న రోజుల్లో తనే తన వెంట బడినది. ఆఖరికి ఇంటికి వచ్చి నాన్న గారితో కూడా పరిచయము పెంచుకుంది. పెళ్లి వరకు తీసుకొని వచ్చింది. అమ్మ, నాన్న కూడా తనకు లోబడి పోయినారు. కాని, ఆమె లోతుగా ఉన్న ఆలోచనలను వారు పసి గట్ట లేక పోయినారు. తమకు ఇద్దరు పిల్లలు. పెద్ద పిల్ల పేరు శ్రీ వాణి. తనే ఆ పేరు పెట్టినాడు.  రెండవ పిల్లకు తనే పేరు పెట్టింది, రాణి సంయుక్త అని. పిలిచే పేరు మాత్రము రాణి అయింది.  చివరకు తను దూరముగా వెళ్లి పోయింది. వాణి తన తోనే ఉండి పోయింది. రాణిని తన వెంట తీసుకొని వెళ్ళింది.
గతమంతా ఒక్క సారి కనుల ముందు తిరిగి కళ్ళల్లో నీళ్ళు నిలిచినాయి. ఒక్క  సారి గతమంతా సినీమా రీలు లాగా కన్పించినది. 
అవి రామ చంద్ర మూర్తి అలియాస్ రాము తిరుపతి శ్రీ వెంకటేశ్వర  విశ్వ  విద్యాలయములో  ఫిజిక్స్  పిజి  చదువుతున్న రోజులు. తండ్రి గారికి కాస్త  ఛాందస మెక్కువ.  హాస్టల్ లో ఎటువంటి తిండి తింటాడో అని ఒక భయము. అంతే  కాదు, సంధ్యా వందనము చేసుకుంటాడో లేదో అన్నది మరో భయము. చివరకు ఎట్లో ఒప్పుకున్నాడు. హాస్టల్  లో కాకుండా బయట ఒక గది తీసుకొని అందులో ఉండే ఏర్పాటు చేసినాడు. దగ్గిర లోనే కాశీపతి పేర ఒక బ్రాహ్మణ మెస్ లో భోజనము.
తన ఇంట్లో పరిస్థితులు, పరిమితులు తనకు  బాగా తెలుసు. తనకు ఉపనయనము అయింది. రోజూ  సంధ్యా వందనము చేసుకోవాలి. అదే తనకు రక్ష యని నాన్నగారి నమ్మకము.  ఉదయాన్నే అయిదు గంటలకు లేచి , స్నానము చేసి, కార్యక్రమములు పూర్తి చేసు కొనే వాడు. మిగతా సమయమంతా చదువు కోసమే. ప్రతిదీ చదవడము మాత్రమె కాకుండా క్షుణ్ణంగా అర్థము చేసుకోవడానికి ప్రయత్నమును చేసే వాడు. మొదటి సంవత్సరము మంచి రాంకే వచ్చింది. తనకు బి యస్సి లో వచ్చిన మార్కుల వలన మెరిట్ స్కాలర్షిప్  కూడా వచ్చింది. అందు వలన తండ్రికి ఎక్కువ భారము లేకుండా చూచు కోవాలని  అనుకున్నాడు.
తను చాలా మిత భాషి. ఎవరితో కలిసే వాడు కాదు. ఖాళీ ఉంటె గ్రంధాలయములో గడిపే వాడు.
రెండవ సంవత్సరము లో కూడా తను అదే గదిలో ఉన్నాడు. ఆ గదికి బాల్కనీ కూడా ఉంది. అందులో కూర్చొని రోడ్డును చూస్తూ తను చదువు కొనే వాడు. ఎదురుగా ఉండే ఇంటిలో కొత్తగా ఒక కుటుంబము చేరింది. అందరూ రాలేదు. ఒక పెద్దావిడ ఒక అమ్మాయి అందులో చేరినారు. కొన్ని రోజుల తరువాత ఆ అమ్మాయి తననే గమనించడము గమనించినాడు.  తన ప్రత్యేకమయిన మనస్తత్వము వలన బాల్కనీలో కూర్చోవడము  మాని వేసినాడు.
తను ఎవరినీ ప్రత్యేకముగా గమనించే వాడు కాదు. ఒక రోజు డిపార్ట్  మెంట్లో తను క్లాసు వెళ్ళుతుంటే “ఏమండీ” అంటూ ఆ అమ్మాయి ఎదురు వచ్చింది. “మీరు మాకు సీనియర్ అన్న మాట” తను నవ్వి ఊరుకున్నాడు. “నా పేరు  సరోజ. మీరున్న ఎదురు బిల్డింగు లోనే ఉంటున్నాను.”
“నేను చూచాను.” అని, వెంటనే తను వేగముగా క్లాసు లోకి వెళ్లి పోయినాడు.
అప్పటినుండీ ఎప్పుడు ఎదురయినా నమస్తే చెప్పి పలకరించేది. అది ఎంత  అలవాటు అయిందంటే ఆమె అలా కనిపించని రోజు  “ఈ రోజు ఏమయింది, తనకు ఒంట్లో బాగు లేదా?” అని యనిపించేది. అది తనకు సంబంధము లేని విషయమని తనకు తాను సర్ది చెప్పుకొనే వాడు.
ఆ రోజు ఆది వారము. ఆ రోజు ఉదయాన్నే తన గది లోనికి పుస్తకాలతో వచ్చేసింది. “ మీ సంధ్యా వందనము  అన్నీ అయినాయి కదా.” అని, “ నాకు పూర్తిగా అర్థము కాలేదు. కాస్త క్లాసికల్ మెకానిక్స్ చెప్పరా?” అని అడిగింది. ఏదో తెలియనివి చెప్పించు కోవడము కాదు, తనకు ఉన్న అనుమానాలన్నీ స్పష్టముగా ఉన్నాయి. చాలా శ్రద్ధగా విన్నది.  ఉత్సుకత ఉన్న వాళ్ళకు చెప్ప వలసిన భాద్యత తెలిసిన ప్రతి యొక్కరికీ ఉందని నాన్నగారు చెప్పే వారు. అందు వలనే సంశయించకుండా తనకు తెలిసినంత వరకు చెప్పినాడు. ఇలా తాము ఇద్దరము మాత్రమే ఉండడము చూస్తే ఎవరయినా ఏమనుకుంటారో అని భయము తనను పీకుతూనే ఉంది. అంతా అయిన తరువాత టైం  చూచుకున్నాడు.  తన మెస్ మధ్యాహ్నము మూసి వేసే సమయము దాటి పోయింది. ఇంక తనకు హోటల్  లో టిఫినే గతి అనుకున్నాడు.
“ఏం మెస్ కు వెళ్ళటము లేదా ?”అని అడిగింది.
“మెస్ టైం అయిపొయింది.  బయటకు వెళ్లి టిఫిన్ చేసి వస్తాను” అంటూ లేచినాడు.
“అయ్యయ్యో! ఎంత పని చేసినాను. ఇంత సేపు కూర్చొని మీకు తిండి లేకుండా చేసినాను. పది నిముషాలుండండి. ఇప్పుడే వస్తాను” అంటూ బయటికి పరుగు తీసినట్లుగా వెళ్ళింది.
ఆ అమ్మాయి వచ్చే లోపల తాళం వేసుకొని బయలు దేరాలని  అనుకున్నాడు. ముఖము కడుక్కొని బట్టలు మార్చుకోవటానికి కాస్త సమయము పట్టింది. బయటకు వచ్చి తాళము  వేస్తున్నాడు. సరోజ తనకు అడ్డము వచ్చేసింది కారియర్ తీసుకొని.
“మీరు అంత కష్టపడి నా అనుమానాలన్నీ తీర్చినారు. మీకు ఆ మాత్రము చేయ లేనా? ముందు తలుపు తాళము తీయండి.” గదమాయించినట్లు అన్నది.   తను అసలే బెదురు గొడ్డు లాంటి వాడు. ఇంక గతి లేక తిరిగి లోపలి వెళ్ళినాడు.  తను  ఒక పేపర్ ప్లేట్ కూడా  తెచ్చింది. తనే  వడ్డించింది. మామూలుగా కంటే  ఎక్కువ తిన్నాడు. పొట్ట నొప్పి కూడా వచ్చింది.
పేపర్ ప్లేట్ బయట పడేసి  మళ్ళీ థాంక్స్ చెప్పింది. “మీరు చెప్పినపుడు  అర్థమయినంత బాగా క్లాస్  లో అర్థము  కాలేదు. మిమ్ములను బాగా ఇబ్బంది  పెట్టేసినాను. ఇంకో సారి  వీలు చూచుకొని క్వాంటం  మెకానిక్స్ గూర్చి చెప్పరూ?”, అడిగింది. కడుపు నిండా తిన్నాడు. మొహమాటము వచ్చేసింది. నెమ్మదిగా”అలాగే” అన్నాడు.
ఆ అమ్మాయి  బయటకు వెళ్లేసరికి  తన నాడి ఒక సారి చూచుకున్నాడు. “అమ్మయ్య ! మామూలు  స్పీడుకు వచ్చేసింది”, అనుకున్నాడు.
తనకు ఎటువంటి ఆకర్షణ  కలుగ లేదు. దానికి  కారణము తనకున్న ఒకే లక్ష్యం. తను మంచి డిగ్రీ తీసుకోవాలి. తన క్లాసు లో  ఏంతో మంది అమ్మాయిలు పలకరించే వారు. అన్నిటికీ ముక్త సరిగా జవాబు చెప్పే వాడు.  వారు తనకు పెట్టిన పేరు, “పప్పు సుద్ద”. పేరేమి పెట్టినా వారు తన జోలికి రాకుండా ఉంటే చాలు అనుకున్నాడు.
సరోజ విషయములో ఇంకో నిజము కూడా ఉంది. తను ఫిజిక్స్ తప్ప మరో విషయము మాట్లాడేది కాదు. అందు వలన బ్రదికి పోయానని తనకు అనిపించింది. మామూలుగానే రోజూ డిపార్ట్  మెంట్లో తనను పలకరించేది. తను నవ్వి ఊరుకొనే వాడు. ఇంక వేరే మాటలు ఉండేవి కాదు.
ఇంత వరకు వారి కుటుంబము  గురించి తనకు తెలియదు. తన కుటుంబము గురించి వారికి తెలియదు. అది అంతటితో ఆగి పోలేదు.
సరోజ ఒక ఆదివారము ఉదయాన్నే హడావుడిగా వచ్చింది. అప్పటికి తన అనుష్ఠానము కూడా పూర్తి కాలేదు. ఎదురుగా వచ్చి ఒక నిముషము ఆగింది. తన అనుష్ఠానము ఆపి ఏమిటన్నట్లు ముఖము పెట్టినాడు.
“ఈ రోజు నా పుట్టిన రోజు.”
“కంగ్రాట్యులేషన్సు”
“అంతే కాదు. ఈ రోజు మా నాన్న గారు కూడా వచ్చినారు. మిమ్ములను తప్ప ఇంకెవరినీ పిలుచుట లేదు.”
“చాలా మంచిది”
“ మీ ద్వారా చాలా నేర్చుకున్నాను కదా. నాన్నగారు కూడా మిమ్ములను చూడాలని అంటున్నారు.”
“ఈ రోజు  చాలా పని ఉంది. నేను చాలా వ్రాసుకోవాలి.”
“ఎక్కువ సేపు ఉండ వలసిన పని  లేదు. అయినా మీకంత  ఖాళీ లేక పొతే నాన్నగారే వస్తారు”
“అక్ఖర లేదు. నాకోసము ఆయనను కష్ట పెట్టడమెందుకు? ఒక గంట ఆగి నేనే వస్తాను.” చివరకు మర్యాద కోసమయినా ఒప్పుకోక తప్పింది కాదు.
అక్కడకు వెళ్ళగానే  తన అమ్మ, నాన్నలకు పరిచయము చేసింది. ఆయన పేరు కృష్ణ శాస్త్రి. దిల్లీ  విశ్వ విద్యాలయములో ఫిజిక్స్  ప్రొఫెసర్ అట.  అంటే తండ్రి ప్రభావములో తను ఫిజిక్స్ తీసుకున్నదన్న మాట. అంతే కాదు. సరోజ తాతగారు నెల్లూరు వారేనట. ఆయన ధిల్లీ వెళ్లి అక్కడ స్థిర పడినారుట. ఇంక వాళ్ళ  నాన్న గారి బాల్యము చదువు ధిల్లీ లోనే జరిగిందిట. తన ఊరు, ఇంటి పేరు గోత్రము అన్నీ అడిగినారు. ఇదంతా ఏదో కబుర్ల వలెనె జరిగింది. అప్పుడే వాళ్ళ అభిప్రాయమేమిటో అని తనకు అనుమానము వచ్చింది. తనకు ఊహకు అందని ప్రణాలికలు వారి మనస్సులో ఉన్నాయని అనిపించింది.
అక్కడ కేకు కోయడము, దీపాలు ఆర్పడము ఏమీ జరుగ లేదు. అక్షతలు వేసి ఆశీర్వదించినారు. కొంచెము సాంప్రదాయ కుటుంబము వలెనె అనిపించినది. మర్యాద కోసము ఒక గంట ఉండి తన గదికి వచ్చేసినాడు. భోజనానికి ఉండమన్నా ఉండ లేదు. మర్నాడు తను మళ్ళీ సాయంత్రము వచ్చింది. వాళ్ళ నాన్న గారు, అమ్మగారు ఐ .యస్. మహల్లో ఎదో సినీమా చూడాలనుకుంటున్నారుట. నేను కూడా వాళ్ళతో వస్తే బాగుంటుందని.
తను చూచినా సినిమాలు చాలా తక్కువ . ఇది అందరికీ తెలుసు. కొన్ని శాంతారామ్ హిందీ సినిమాలను చూచినాడు. ఇంకా  విశ్వనాథ్ బాపు సినిమాలను కూడా అన్నీ చూడ లేదు. ఇంకా తను సినిమాకు వెళితే ఎంత సమయము వృథా అయిందా అనిపిస్తుంది. మానేసి మధ్యలో వెనక్కు రాలేదు. అందుకే వాటిని చూడటము తగ్గించి వేసినాడు. అందుకే తను రాలేనన్నాడు.
‘ మా నాన్న కోసము కాదు. నా కోసము ఒక్క సినిమా రాలేరా?”
“నాకు చాలా పని ఉంది. సెమినార్  కు సిద్ధము కావాలి. అన్నీ వ్రాసు కోవాలి.”
“అంతగా అవసరమయితే మీరు చెబితే నేను వ్రాసి పెడతాను. పిపిటి కూడా చేసి పెడతాను.”బ్రదిమాలుకుంది.
“నీవా సబ్జెక్ట్ చదవ లేదు, వ్రాయలేవు”
చాలా సేపు వాదించింది, బ్రదిమాలుకుంది. ఇంక ఒత్తిడి తట్టుకోలేక ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నానా అని తనకే ఆశ్చర్యమేసింది. అంతే , అప్రయత్నముగా తన చేయి పట్టుకొని లాక్కు వెళ్ళింది.
అసలు అలా లాక్కు వెళుతుందని తను ఊహించ లేదు. ఒక విధమయిన షాక్ కు గురి అయినాడు.
అటు తరువాత తను వస్తే  పాఠాలయితే చెప్పే వాడు. మరి ఏ  ఇతరమయిన ప్రతిపాదనలను తెచ్చినా తెలివిగా తప్పించుకొనే వాడు.  తమ మధ్య దూరము పెరిగినట్లే అనిపించినది. అందుకు తానేమీ బాధ పడ లేదు.
పరీక్షలు అయిపోయినాయి. అన్నీ చాలా బాగా వ్రాసినాడు. ఇంకా ఒకే ఒక లేబరేటరీ పరీక్ష ఉంది.  తనకు పై చదువులు వెళ్ళాలనే ఆలోచనలు ఏ కోశానా లేవు. దగ్గిరలో ఉన్న కళాశాలలో పాఠాలు చెప్పుకుంటూ తల్లి దండ్రులను దగ్గిరుండిది చూచుకోవాలని అనుకున్నాడు.
తను ఈ ఆలోచనలో ఉండగానే సరోజ వచ్చింది. ముఖము చాలా దీనముగా ఉంది.
“రేపటితో మీ పరీక్షలు అయి పోతాయి. మీరు వెళ్లి పోతారు. నేను ఇంకా ఒక సంవత్సరము ఉండాలి. మనము విడి పోతున్నాము. మీకు దిగులుగా లేదా?”
“ఏమో ? నేనెపుడూ  ఆలోచించ లేదు. నా ధ్యాస అంతా ఎప్పుడు ఊరికి వెళ్లి పోదామా అని ఉంది.”
“అవును మీ మగ వాళ్ళంతా ఇంతే. మీకు ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. అయినా కాన్వోకేషన్కు వస్తారు కదా.”
ఒక నిముషము ఆగి మళ్ళీ అడిగింది,”మీరు డాక్టరేట్ చేయ వచ్చును కదా.”
“”నేను అటువంటివి ఏమీ ఆలోచించ లేను. ముందు మా అమ్మా నాన్నలను చూచుకోవాలి.” అన్నాడు. అక్కడే తన ముఖము వైపు చూస్తూ చాలా సేపు కూర్చుంది. తరువాత తనకు అనుమానాలున్నాయని కాస్త సబ్జెక్ట్ చెప్పించుకుంది. ఇంకా మాట్లాడుటకు ఏమీ లేనందు వలన దిగులుగా ఇంటికి వెళ్ళింది. మర్నాడు కూడా అతడిని గమనిస్తూనే ఉంది.

తను గదిని ఖాళీ చేసి సామానుతో బయటకు వచ్చినాడు. తను అడగకుండానే ఆటో  తీసుకొని వచ్చింది. అంటే కాదు. “నేను కూడా బస్ స్టాండ్ కు వస్తున్నానని అతడి కంటే ముందు ఆటో ఎక్కి బస్ స్టాండ్ చేరింది .అక్కడే వీడ్కోలు 

Thursday, March 16, 2017

శ్లేష


ఒక వైపు  భారతీయులు  గంగి గోవు  లాంటి  వారు , అమాయకులు. మరొక కోణము  కూడా ఉంది. భారతీయులు మేధావులు. రెండూ  నిజమే కావచ్చును. గొప్ప శాస్త్ర వేత్త  లౌకికత్వానికి ఎంత దూరముగా  ఉంటారో తెలియని విషయము కాదు. మరి భారతీయుల విషయములో రెండూ నిజమేనా?
ఆంగ్లేయులు వారి అనుయాయులు  భారత దేశము గురించి  చాలా పరిశోధనలు చేసినారు. శాస్త్ర  విజ్ఞానము వచ్చి, వాటిని బోధించే విశ్వ విద్యాలయాలు రాక పూర్వము, యూరోప్ లో ఉన్న విద్యలో ఎక్కువ భాగము మత విద్య మాత్రమె. మనకు తెలిసిన చాలా మంది శాస్త్ర వేత్తలు మొదట చదువుకున్నది  మతమును గూర్చి మాత్రమె.  అందు వలన వారి ఆలోచనా కోణము కూడా అందుకు అనుగుణముగా ఉంటుంది.
స్థాన విలువ గలిగిన అంకెలు మన దేశములో వేల సంవత్సరాలకు ముందే వాడుకలో ఉన్నవి. ఇందుకు మూల స్థానము దశము అంటే పది. అందుకే దీనిని దశాంశ పధ్ధతి అని అన్నారు. ప్రపంచములో మరెక్కడా ఇటువంటి పధ్ధతి లేదా అని అడుగ వచ్చును. యూరోపియన్ల ప్రకారము మధ్య ప్రాచ్యములో (మెస పోటేమియయా లేదా బాబిలోనియా దేశాలలో) పదహారు (౧౬) ఆధారముగా గలిగిన అంకెలను వాడినట్లు తెలుపుతున్నవి. కాని, అది ఇప్పుడు లేదు.  మన జ్యోతిష గ్రంథాలను మొదట అరబ్బీ భాష లోనికి హరూన్ అల్ రషిద్ కాలములో అనువాదము చేయబడినవి. వారి ద్వారా మన అంకెలు యూరోప్ లోకి ప్రవేసించినవి.  ఫిబోనాక్సీ, కోపెర్నికస్ ల కాలములో మన ప్రాచీన గ్రంథాలలో ప్రస్తావించ బడిన హేమ చంద్ర సంఖ్యలు  ఫిబోనాక్సీ సంఖ్యలుగా మారినవి. కోపెర్నికాస్ ద్వారా  ఖగోళ గణితము అక్కడ ప్రవేశించింది.
గ్రీకు, లాటిన్ అంకెలు వాడుతున్న వారు ఈ అంకెలలో సులభత్వాన్ని అందులో శూన్యము లేదా  సున్నకు  ఉన్న ప్రాధాన్యతను చూచి వారు ఆశ్చర్య పడినారు. వారు చెప్పిన మాట ఏమిటంటే ‘ ప్రపంచ గణిత సామ్రాజ్యములో  భారతీయుల విశిష్ట ప్రతిపాదన శూన్యము/సున్న.  “India’s contribution to the world of mathematics is zero’. ఇక్కడ ఉన్న శ్లేష  భారతీయ మేధావులకు ఎవరికీ అంతు బట్టదు. మనకు సున్నా అనేది గొప్ప ప్రతిపాదన అనీ,  బయటి వారికి మన  పాత్ర శూన్యము అంటే ఏమీ లేదని. చాలా మందికి ఇందులో  ఎటువంటి శ్లేష కనిపించదు. అందుకే  భారతీయులు నిజముగా గంగి గోవులే.
మరొక ఉదాహరణ. అది ప్రధానముగా తెలుగు భాష మాట్లాడే వారి గురించి. విజయ నగర సామ్రాజ్య కాలములో వచ్చిన విదేశీ రాయ బారులు వాలు విన్న తెలుగు భాషను  Italina of the east అంటే ప్రాచ్య దేశాలలో ఇటాలియన్ భాష వలే ఉన్నదనీ చమత్కరించినారు. ఈ మాటను ఒక పొగడ్త గా తీసుకొన్న వారు చాలా మంది ఉన్నారు. అతి ప్రాచీన యూరోపియన్ భాషలు గ్రీకు మరియు లాటిన్.  వారి మొట్ట మొదటి గ్రంథాలన్నీ ఈ భాషల లోనే వచ్చినాయి. ఇంకా హోమర్ నాటి గ్రీకు భాషకు, ఇప్పటి గ్రీకు భాషకు చాలా తేడాలు ఉన్నాయి. అలాగే లాటిన్  నుండి ఇప్పటి ఇటాలియన్ భాష వచ్చినది. ఇంకా ఇటాలియన్ కు తెలుగు భాషకు ఉన్న సమాంతర ధర్మమూ ఒకటుంది. రెండు భాషలు అజంతములే. అంటే అచ్చులతో పదము పూర్తి అవుతుంది. హిందీ లో రామ్  అంటే తెలుగులో రాము లేదా రాముడు అని పలుకుతాము. అదే విధముగా పాపా, రోమా లాంటి పదాలు అజంతములు. అజంతము అయిన పదము కలిగి ఉండుట  ఆ భాష లక్షణమే గాని దానిని విశిష్ట  లక్షణముగా పొగుడుతున్నారని అనుకోవడము  మన వారు అల్ప సంతోషులని చెప్పకనే చెబుతున్నది.
మరొక ఉదాహరణ. బ్రిటిషు వారు మన సాంస్కృతిక మూలాలను దెబ్బ గోడితే తప్ప మనను తమ గుప్పిట్లో పెట్టుకోలేమని చెయ్యని ప్రయత్నమూ లేదు. అందులో చరిత్ర భాగాన్ని విలియం జోన్స్ తీసుకుంటే పవిత్ర గ్రంథాల భాద్యతను మాక్స్ మూలార్ తీసుకున్నాడు. అతడు ఏనాడూ భారత దేశాన్ని సందర్శించ లేదని కొందరు చెబుతారు. అందులో నిజము తెలియదు. ఆయన కొంత మంది సంస్కృత  పండితులను పట్టుకొని విరివిగా డబ్బు ఇచ్చి వేదాలను ఆంగ్ల భాష లోని అనువదింప చేసినాడు. అంతే గాక తనను మోక్ష మూలరు గా చెప్పుకున్నాడు.  ఇంత చేసీ తన భార్యకు ఒక ఉత్తరములో ఇలా వ్రాసినాడు,” నేను చేయించిన అనువాదాలను అనుసరించిన భారతీయుడు వేదాలను గౌరవించడు”  దీనితో అతడి వ్యక్తిత్వము మరియు లక్ష్యము ఏమిటో తెలుస్తుంది. దీని వలన అతడి లక్ష్యము నెరవేరక పోయినా సంస్కృతము, వేదాలు అనబడేవి పాశ్చాత్య ప్రపంచానికి పరిచయము చేయ బడినాయి. ప్రధానముగా జర్మన్లు సంస్కృతాన్ని ఎక్కువగా అభిమానించినారు. ప్రముఖ జర్మన్ కవి గోతే  కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతలాన్ని ఎంతో అభిమానించినాడు. ఇంకా కాళిదాసును ఎలా పొగడాలో తెలియక ఆంగ్లేయులు  కాలిదాసుకు ఒక బిరుదును ఇచ్చినారు. అది ఏమిటంటే Shakespeare of the East.. అంటే ప్రాచ్య షేక్స్పియర్. ఎవరయినా ప్రాచీనులయిన వారి పేరుతొ ఇప్పటి వారిని గౌరవిస్తారు. నిజానికి కాళిదాసు కాలానికి ఆంగ్ల భాషకు ఉనికే లేదన్న విషయాన్ని వారు మరిచిపోయినారు. ఆ పదాన్ని అలాగే వాడుతున్న మన పండితులను చూస్తే బాధ వేస్తుంది.
ఒక సర్దార్జీ యొక్క  హాస్య ప్రహేళిక లేదా జోక్ ఉంది. ఇంగ్లాండ్ వెళ్లి వచ్చిన ఒక సర్దార్జీ ని మిత్రులు అంతా చుట్టుముట్టి ప్రశ్నించినారుట, ”అక్కడ విశేషాలు ఏమిటి?” అని.  ఆ సర్దార్జీ చెప్పినాడుట,” మన పిల్లలు నాలుగేళ్ళు వచ్చిన తరువాత చాలా కష్ట పడి నేర్చుకొనే ఇంగ్లీష్ భాషను ఇంగ్లాండ్ లోని పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరమే చక చకా మాత్లాదెస్తారు. ఆ..” మన దేశములో చాలా మంది తల్లి దండ్రులు అదే ప్రయోగాన్ని వాళ్ళ పిల్లల మీద చేస్తున్నారు. “అమ్మా!” అనే పదాన్ని మరిపించి, ”మమ్మీ” అని పిలవక పొతే మండి పడే తల్లులు, కాన్వెంట్లలో

తెలుగు మాట్లాడితే శిక్షించే  అధ్యాపక వర్గము, యాజమాన్యము భారతీయ భాషలను, భారతీయతను భ్రష్టు పట్టిస్తున్నారు. మన దేశములో ప్రతి  భాషదీ ఇదే పరిస్థితి. దీనికి కారణము అమాయకత్వము కాదు, కరుడు కట్టిన స్వార్థము.
ఇటువంటి స్థితినుండి బయట పడాలి, బయట పడుదాము. సంస్కృతములో భారతీయ భాషలలో అద్భుత విన్యాసాలను ప్రదర్శించిన  భారతీయుల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి.
                                                 ఓం శాంతి.


పిచ్చి మొక్క


నా ఆత్మా కథను వింటారా? నా వ్యథ ను తీరుస్తారా? నేనొక  పిచ్చి మొక్కను. నా లాంటివి చాలా ఉన్నాయి. అన్నిటికి అదే బాధ.  మీకు మేము ఏమి అపకారము చేసినాము? మమ్ములను బ్రదుక నీయరా?
ఒకప్పుడు పొలాల గట్లపై ,కాలువ  గట్లపై, ఇళ్ళ  మధ్య ఖాళీ స్థలాలలో ఎక్కడ బడితే అక్కడ ఉండే వారము. అంతే కాక, మీకు వచ్చిన చిన్న వ్యాధుల నివాతనకు మా సహకారముఉండేది.
అడవులలో నివసించే వారు ఏ  చిన్న గాయమైనా ఎదో ఒక ఆకు పసరు రుద్దుకొని నయము చేసుకొనే వారు.అందుకే మా బ్రతుకుకు ఒక ప్రయోజనము ఉండేది. ప్రతి చెట్టుకు ఒక ప్రాధాన్యత ఉండేది. కొన్ని చెట్లు/మొక్కలు దైవములా పూజను అందుకోనేవి. ఆయుర్వేద వైద్యమునకు ఆదరణ ఉన్నంత కాలము మా పరిస్థితి బాగుగానే ఉండేది. ఉత్తరేణి ఆకులను ఉపయోగించి నాగు పాము విష ప్రభావము కూడా తగ్గించ గలిగిన  సత్తా ఉన్న వారు ఉండే వారు. సరస్వతి ఆకు ఇళ్ళ మధ్యనే ఉండేది. మేధస్సు పెరగడానికి సరస్వతీ ఆకులను తేనే లో నిల్వ ఉంచి దానిని తీసుకొనే వారు. ఏ  మాత్రము గాయము తగిలినా ఉత్తరేణి లేదా నేల పొగడ (దీనిని గాయపు ఆకు అని కూడా పిలుస్తారు) మన అవసరాలను తీర్చేది. ఈ రకముగా పల్లెటూళ్ళలో చాలా మందికి చాలా మొక్కలు  తెలిసి ఉండేవి. తులసి దేవతా మొక్కగా గుర్తింపు వలన  దానికి ప్రత్యెక రక్షణ ఉన్నది.
ఒక ప్రాచీన గురుకులములో గురువు శిష్యులను పిలిచి అడవి అంతా వెదికి ఎవరికీ పనికి రాని ఒక మొక్కను పట్టుకొని రమ్మన్నారట. ఒక్కరు తప్ప అందరూ తలా ఒక మొక్కను పట్టుకొని వచ్చినారుట. ఆ ఒక్కడు తనకు పనికి రాణి మొక్క ఏదీ కనిపించ లేదని చెప్పినాడట. ఆ గురువు అతడినే ఉత్తమ శిష్యుడిగా గుర్తించినారుట. అంతే కాక ప్రాచీన ఆయుర్వేద వైద్యులు  ఒక్కొక్క మొక్క దగ్గిర ధ్యానము చేసి  ఆ మొక్కల సముదాయానికి ప్రయోజనాన్ని ఆ మొక్క అధిదేవత ద్వారా తెలుసు కొనే వారుట. ఇది ఒకప్పటి ఆయుర్వేద వైద్యుల స్థితి.
ఈనాడు ఇళ్ళ  పెరళ్ళలో నున్న మొక్కలని పిచ్చి మొక్కలని  మమ్ములను తొలగించి వీధిలో పడేస్తున్నారు. ఇంటి ప్రాంగణమంతా సిమెంటు చేసి, మాకున్న కొద్ది స్థలాని కూడా మాకు పనికి రాకుండా చేస్తున్నారు.రోడ్డుకు ఇరు వైపులా ఉన్న మొక్కలను  కూడా శుభ్రత పేరుతొ పీకి వేస్తున్నారు. ఇంత శుభ్రత కోరుకునే వారు కాలువల నీటిని అపార్టుమెంట్ల వ్యర్థాలతో మరియు పరిశ్రమల వ్యర్థాలతో నింపి పాడు చేస్తుంటే ఎవరూ అడగరేమి?ఇంకా వారి శుభ్రతకు మేమే అడ్డము వచ్చినామా? అలా అని మమ్ములను ఎవరయినా విడిగా పెంచుతున్నారా? కొన్ని మొక్కలను నిర్మూలించడానికి  ఒక్కొక్క సారి మా మొక్కలపై విష పదార్థాలను చల్లుతున్నారు.  మీరు ఒక విషయము గుర్తించు కోవాలి. సున్నితమయిన మొక్కలు వాటి వలన పోతున్నాయి. ఇంకా మిగిలిన మొక్కలు మీకు విషాన్నే అందిస్తాయి. (ఆలోచించండి)
ఒకప్పుడు రోడ్లకు ఇరు వైపులా బ్రహ్మాండమయిన చెట్లు ఉండేవి. వాటి వలన ప్రయాణీకులకు చల్లని గాలి తగిలేది. ఈ నాడు వాటిని పూర్తిగా నిర్మూలించి వేసినారు. ఈ నాడు ఆ రోడ్లలో ప్రయాణము ఎంత వేడిగా ఉంటుందో? మీలో స్వార్థము పెచ్చు పెరిగి పోయింది. అది మమ్ములను నిర్మూలించడమే కాదు, వృక్ష సంపదనునాసనము చేసి భూమిని  అగ్ని గుండము గా మార్చి వేస్తుంది. ఆలోచించండి, ఇదే పరిస్థితి కొన సాగితే  చివరకు మీరూ మిగలరు.
జెనెటిక్ ఇంజనీర్
ఒక జెనెటిక్ ఇంజనీర్ హడావిడిగా వాళ్ళ బస్ కలిసి, “సార! గ్రాండ్ సుక్సేస్. తియ్యటి నిమ్మకాయలను సృష్టి చేసినాను.
అప్పుడు బాస్ యొక్క అతిథి ఆనాడు.”దానికి ఇంట కష్ట పడడము ఎందుకు. నిమ్మ కాయకు బదులు కమలా కాయను తింటే సరి పోదా ఏమిటి?”  
జెనెటిక్ మ్యుటేషన్
రాము: రావణాసురుడు గొప్ప జెనెటిక్ ఇంజనీర్ తెలుసా?
భీము:  నీకెలా తెలుసు?
రాము:  ఆశోక వనములో సీతమ్మ చుట్టూ కూర్చున్న  స్త్రీలు అంటా జెనెటిక్ ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ లే కదా.
ఇంకొక ప్రశ్న. ఆధునిక కాలములో మొట్ట మొదటి గొప్ప జెనెటిక్ ఇంజనీర్ ఎవరో తెలుసా?
భీము: నీవు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది?
రాము:  థాలోమైడ్ రసాయనాన్ని తలనొప్పికి మందుగా ప్రయోగించిన వ్యక్తీ.
భీము: ఎందుకని?
రాము: అప్పుడే కదా, కొంత మందికి కాళ్ళు లేకుండా కొంత మందికి చేతులు లేకుండా పిల్లలు పుట్టినారు.

(రావణుడి లంకలో సీతమ్మ చుట్తో ఉన్న స్త్రీలలో చాలా మందికి జన్యు  విపరిణామాలు ఉన్నాయి. చూడండి వాల్మీకి రామాయణము.)

Monday, December 19, 2016

నేను దేవుడిని



“ఆత్మలన్నీ ఒక్కటే పరమాత్మకు దరి చేరు.
జీవులన్నీ ఒక్కటే  పరమేస్వరునే చేరు.”
ఎవరో గుడిలో పెద్ద స్వరముతో పాడుచున్నారు. జనమంతా ఆనందముగా వింటున్నారు. అప్పుడప్పుడు అందరూ గొంతు కలుపుతున్నారు.
          కార్యక్రమము అంటా అయింది. గోపయ్యకు కాస్త ఆవేశము ఎక్కువ. బయటికి వచ్చినాడు. బయట గట్టు మీద నారాయణ  కూర్చొని ఉన్నాడు.  గోపయ్యకు నారాయణ దగ్గిర చనువు ఎక్కువే.
          “సామే! అందరూ ఒకటే కదా! మీఋ అయినా నేను అయినా అందరమూ ఒక్కటే కదా!”
          “ఏం గోపయ్యా! ఏమంత హుషారు గా ఉన్నావు?  ఏమయిందేమిటి?” నారాయణ ఏమీ తెలియనట్లే అడిగినాడు.
          “ఏమీ లేదు సామే! మనమంటే ఎవరు? మన ఆత్మలు అంటే ఏంటి? ఆటమలన్నే ఒకటే అయితే మనమంతా ఒకటే కదా?”
          “అంటే  మీ వాళ్ళు  కిట్టయ్య, చెంచయ్య, రాముడు అందరూ ఒకటే అంటున్నావు. అంతేనా?”
          “అంటే కదా సామీ!”
          ?మరి నీ పెళ్ళాము రత్తాలు?”
          “అంతే సామీ!”
          “అయితే  రాత్తాలును, మాటి  మాటికీ  తిడుతూ, కొడుతూ ఉంటావు ఎందుకు? అలా దేవుడు చేస్తాడా?”
          “నిజమే సామీ! మరి రత్తాలు నన్ను ఎదో ఒకటి అని కోపము తెప్పిస్తుంది  ఆ....” ముఖము మాడ్చుకున్నాడు.
          “మరి దేవుడికి కోపముంటున్డా?”
          “అయితే కిట్టయ్యకు కోపము వచ్చి ఎంత మందిని చంప లేదు? రామయ్యకు కోపము వచ్చి ఎంత మందిని చంప లేదు?”
                “నీ మాట బాగానే ఉంది. కృష్ణుడు ఎవరిని చంపాడు?”
“సొంత మేన మామ కంసుడిని చంప లేదేమిటి?”
“ఎందుకు చంపేడు?”
“ఎందుకేమిటి? ఎంత చెడ్డ వాడయితే మాత్రము  మేన మామను చంపదమేనా?”
“మరి కంసుడు  ఏమి చేసేడు?”
“అమ్మను నాన్నను జైలులో పెట్టినాడు.”
“అంతేనా?”
“కృష్ణుడిని చంపాలని అప్పుడే పుట్టిన  పసి పిల్లలను అందరినీ చంపించినాడు.”
“అయినా నీకు చాలా విషయాలు తెలుసే? అంతేనా? ఇంకేమీ లేవా?”
బుర్రను గీక్కుంటూ  అన్నాడు, “ఇంకా  ఏమున్నాయి సామీ!”
“పూతన, కేశి, తృణావర్తుడు, లాంటి  రాక్షసులను తన దగ్గిర ఉంచుకొని, పోషించినాడంటే ప్రజలు అతడికి ఎటువంటి గౌరవము ఇస్తారంటావు? దుర్మార్గుల స్నేహము చేసే వాడు మంచి వాడేనా?”
“నిజమే సామీ! మరి నాదొక  ప్రశ్న. యుద్ధము పేరుతొ దుర్యోధనుడిని తమ్ములన్దరితో చంపించినాడు కదా? నెత్తుటి ఏర్లు పారినాయి. ఇదేమి న్యాయము సామీ!”
“ఎంత సేపు నిలబడతావు? రా. ఇటు వచ్చి కూర్చో.”
“మీ పక్కనా? వద్దు సామీ! మీరు చానా మంచోళ్ళు,  గొప్పోళ్ళు.”
“మరి ఇప్పుడే చెప్పావు కదా. అందరూ దేవుళ్ళేనని. ఇంకా అనుమానమెందుకు? రా. వచ్చి కూర్చో.”
గోపయ్య వద్దంటూనే బలవంతముగా అరుగు మీద కూర్చున్నాడు. చుట్టూ మరి కోన మనిచేరినారు.
“అమ్మయ్య నీకు నిలువు జీతము ఇవ్వాల్సి వస్తుందేమో అని భయ పడ్డాను. ఇప్పుడు చెప్పు యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది?”
“పాండవులు, కౌరవుల మధ్య .”
“కృష్ణుడు యుద్ధము చేసినాడా?”
“లేదు.”
“మరి పాండవులు యుద్ధము ఎందుకు చేసినారు?”
“బారాలాడి కౌరవులు  పాండవుల రాజ్యమును కొట్టేసినారు. వన వాసము, అజ్ఞాత వాసములు అయిన తరువాత రాజ్యము తిరిగి ఇస్తామన్నారు.  కానీ తిరిగి ఇవ్వ లేదు.”
“అంతేనా?”
“ద్రౌపది అమ్మను నిండు సభలో  అవమానించినారు.”
అంటే యుద్ధమునకు మూల  కారణము  ఆస్తా, ఆ ఉత్తమ స్త్రీ యొక్క ఆక్రోశమా? పైకి చెప్పే కారణము ఒకటయితే, అంతరంగములో మరొకటి ఉంటుంది. ఋషులకు  కొన్ని నియమాలున్నాయి. ఏది వ్రాసినా  మంచి వాళ్ళ చరిత్ర ఎక్కువ, దుర్మార్గుల చరిత్ర కుదించి వ్రాయడము జరుగుతుంది. లేక పోతే  దుర్మార్గులు వాళ్ళ కథా నాయకులు అవుతారు. ఒక కులమింటి స్త్రీని, అందులో యజ్ఞ పునీతురాలిని నిండు సభలో అవమానించిన వారు, ఒక సామాన్య స్త్రీని ఏ విధముగా చూచే వారో అని, చదువరులకు ప్రశ్న వేసినారు. ఒక ఆడ దాన్ని గౌరవించని సమాజము సర్వ నాశనము అవుతుంది. ద్రౌపది చేసిన ఆక్రందన కృష్ణుని  గుండెలను కలచింది. అంతరంగములో ఇదే ప్రధాన కారణమని అనిపిస్తుంది.”
“మరి సామీ! ఈ భారతమంతా ఎవరు చెప్పినా వినే వాడిని. అందుకే నాకు కథంతా తెలుసు. మరి భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడిని  అలా చంపేసేరేమిటి సామీ!”
“ఎవరేలాటి వారయినా ధర్మాన్ని నిలుపక పోతే ఖచ్చితముగా కూలి పోతారు. భీష్ముడు, ద్రోణుడు ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రత్యక్ష సాక్షులు. వాళ్ళు లేచి నిలబడితే అలా జరిగేది కాదు. కానీ వాళ్ళు ఆ పని చేయ లేదు. అజ్ఞాత వాసమునుండి తిరిగి వచ్చిన పాండవులకు వాళ్ళకు ఈయ వలసిన రాజ్య భాగాన్ని ఇప్పించ గలిగి  యుండి కూడా భీష్ముడు గట్టిగా మాట్లాడ లేదు. కౌరవుల తిండి తిన్నాము కాబట్టి, వారు చెప్పిన మాట విన వలసినదే అనే దృష్టిలో ద్రోణుడు ఉన్నాడు. ఇంకా కర్ణుడి విషయము చూద్దాము.  దుర్యోధన దుశ్శాసనులతో కలిసి నిండు సభలో ద్రోపదిని అవమానించిన వారిలో కర్ణుడు కూడా ఒకడు. ద్రౌపదీ స్వయంవరములో, ఘోష యాత్రలో, ఉత్తర గోగ్రహణములో ఓటమి చవి జూచిన కర్ణుడు, తను అర్జునిడి మీద గెలుస్తానని దుర్యోధనుడిలో నమ్మకము కలిగించి పరోక్షముగా కర్ణుడు యుద్ధానికి కారణము అయినాడు. ఇదీ వాళ్ళ కథ. ఇప్పుడు చెప్పవయ్యా గోపన్నా!”
“నిజమే సామీ! నేనంత ఆలోచించ లేదు.”
“మరి రాముడు సీత కోసము రావణుడి బంధు బలగాన్ని అంతా నాశనము చేసినాడు. అదే నాకు అర్థము కావటము లేదు సామీ!”
“”ఇటువంటి అనుమానాలు ప్రేరేపించే వారు చాలామంది ఉన్నారయ్యా!అడవిలో  పూజలు హోమాలు చేసుకుంటున్న వారందరి మీద దాడి  చేసే వారు వారి స్త్రీల మీద దాడి చేస్తున్న వారు, అటువంటి ఋషులు అందరూ రాముడిని వేడుకుంటే రాముడు రాక్షసులను ఎదుర్కొని వారికి రక్షణ కల్పిస్తానని మాట ఇచ్చినారు. కానీ దయామయి సీతమ్మ తల్లి “ వాళ్ళు మన జోలికి రానప్పుడు వాళ్ళ మీద  దాడి చేయడము బాగుండదేమో” అని అన్నది. అందుకనే ఏమో శూర్పణఖ ద్వారా మొదటి దాడి సీతమ్మ మీదే జరిగింది. అందుకే రామ  రావణ  యుద్ధము జరిగింది. ఇందులో అంటే ఈ యుద్ధములో పైకి  కనిపించే కారణము సీతా సంరక్షణ. అసలు కారణము ధర్మ సంరక్షణ.  అందుకే గోపన్నా! గుర్తు పెట్టుకో. మహాత్ములు వ్యక్తిగత కారణాలతో ఏదీ చేయరు.”
“చాలా బాగుంది సామీ ఎవరడిగినా ఇదే మాట చెబుతా. ఇంకో ప్రసన సామీ! ఎదో సినిమా లో దేవుడు పెళ్లి చేసుకున్నాడని చెప్పారని ఒక మతము వాళ్ళు ఆ సినిమా థియేటర్ల దగ్గిర గొడవ చేసారు కదా సామీ! ఇదేమిటి?”
“అవన్నీ మనకెందుకులే గోపన్నా! మన విషయములో సివయ్యకు పార్వతమ్మ ఉంది, నారాయనయ్యకు లక్ష్మమ్మ ఉంది, ఇంకా బ్రహ్మయ్యకు సరస్వతమ్మ ఉంది. ఇంకా ఇంద్రయ్యకు శచమ్మ ఉంది. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి కదా.”
ఈ లోపల  “ఏమిటి నారాయణా! మీకు ఈ రోజు గోపయ్య దొరికినాడా? వాడు అయిపోయినట్లే “ అంటూ రామా రావు వచ్చినాడు.
“అదేమిటి సామీ అలా అంటారు? నాకు నారాయణ బాబు గారు ఎన్ని విషయాలు చెప్పరనుకున్నారు?” అన్నాడు గోపయ్య. మళ్ళీ, “ఇంతకూ సామీ! మనము దేవుళ్ళమా?  కాదా?”అని అడిగినాడు.
నారాయణ అన్నాడు, ”నీ లాగా ఒకడు సత్య సాయి బాబా వారి దగ్గిరకు వెళ్లి, “బాబా! మీరు దేవుడత కదా!”అని అడిగినాడ ఆయన జవాబు ఇచ్చినారుట, ”నిజమే బంగారూ! నేనే కాదు, నీవు కూడా దేవుడివే. “అదేమిటి బాబా!”అని అంటే,” నేను దైవత్వాన్ని గుర్తించి ఆ అనుభూతి లోనికి వెళ్ళినాను, నీ ఉ ఆ స్థితికి వెళ్ళే వరకూ మామూలు మనిషివే.”అన్నారట.  గోపయ్యా! దేవుడు అంటే సర్వజ్ఞుడు అంటే అన్నే తెలిసిన వాడు, సర్వ వ్యాపి అంటే అన్ని చోట్లా ఉంటాడు, సర్వ శక్తి మంతుడు అంటే అన్నిటి కంటే శక్తి గలిగిన వాడు. అపరిమిత మయిన ప్రేమ కలిగిన వాడు. నేను దేవుడిని అని ప్లేటు మీద వ్రాసి మేడలో తగిలించుకోనక్ఖర లేదు. ఆ మానసిక స్థితిని అందుకున్న ప్రతి యోక్కరిని అందరూ దేవుడి వలెనె చూస్తారు. నేను దేవుడిని అనుకోవడము కంటే, నేను దేవుడిని ఎలా అవుతాను అని ప్రస్నించు కోవడము ముఖ్యము.”
“సామీ! మీ దగ్గిరకు నేను మళ్ళీ రావచ్చునా?” అని అడిగినాడు, గోపన్న.
“తప్పకుండా.” జవాబు వచ్చింది.


***************************************************************
visit  varasatvamu.blogspot.in

Monday, November 14, 2016

యంత్రాలు వస్తున్నాయి జాగ్రత్త. 1


          ఇదేమి పేరు అనుకుంటున్నారా?
గతములో ఒక రచయితా నత్తలు వస్తున్నాయి జాగ్రత్త పేరుతొ  ఎదో వ్రాసినట్లు గుర్తు. మరి అంత ప్రముఖ వ్యక్తీ వ్రాసిన రచనను కూడా గుర్తు పెట్టుకోలేని  మీకు సాహిత్యముతో ఏమి సంబంధమని అంటున్నారా? రావణుడిని, దుర్యోధనుడిని కర్ణుడిని మహా నాయకులుగా అంగీకరిస్తున్న ఇప్పటి సాహిత్య వేత్తల ముందు నేను ఏ విధముగా తుల తూగ లేను, క్షమించాలి.
అంతే కాదు, ఒక ఆధ్యాత్మిక వేత్తగా అనబడుతున్న ఒక వ్యక్తీ ఆవులకు ఉన్న రక్షణ మనుషులకు కూడా ఇవ్వడము  లేదని వాపోయినాడు. ఆయన మరిచి పోయినాడేమో? ఒక మనిషి మీద అత్యాచారము చేస్తే శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి.(అవి ఎలా అమలు చేస్తున్నారనేది మరో విషయము.)  కాని ఒక ఆవును రక్షించు కోవడానికి ఎటువంటి చట్టాలు లేవని.
ఆవును ఎందుకు రక్షించాలి? అది మనకు ఖాద్య వస్తువే అని వాదించే వాళ్ళు ఉన్నారు, ఉద్యమాలు లేపాలని అనే వారు ఉన్నారు. కానీ  నర మాంస భక్షకులు ఉన్న చోట మనిషిని మనిషి తిన్నా దోషము లేదు.
ఒకప్పుడు ఇంట్లో పని, బయట పని అన్నిటిని మనిషే చేసే వాడు. తల్లులు రుచి గా వండి పెట్టి, ఇంటిని అలంకరించి  ఉంచితే మగ వారు పొలానికి వెళ్లి పని చేసే వారు. అక్కడ వారికి తోడుగా ఎద్దులు పొలానికి దుక్కి పని చేసేవి, పొలము  నూర్పిడి లో పని చేసేవి, పంటను బండిలో వేస్తే ఇంటికి ఆ బండి ని లాగు కొని వచ్చేవి. వాటితో ఎంత అనుబంధము ఉండేదంటే  “ఒరే రాముడూ!” అంటే ఎద్దు పరిగెత్తుకొని వచ్చేది. వాటికి ముద్దు ముద్దు గా పేర్లు పెట్టుకొని వాటిని పిలుస్తూ యజమాని వాటిని ఎంతో ప్రేమగా చూసే వాడు. అవి పడిన కష్టానికి ఇంట్లో తగిన ప్రతిఫలముండేది. అందుకే అవి కుటుంబ సభ్యులుగా ఉండేవి.
ఒకప్పుడు ప్రజల సంపదను వారికున్న పశు సంపదతో కొలిచే వారు. మహాభారతములో పశు సంపద కోసము ఉత్తర మరియు దక్షిణ గోగ్రహణ యుద్దాలు జరిగినాయి. ఇప్పటికి శ్రీ కాకుళము జిల్లాలో ఆవులను సొమ్ములని అంటారు. ఇక్కడ మరొక సంఘటన గురించి చెప్పాలి. ఇది నా బంధువు ద్వారా తెలిసింది. మహారాష్ట్ర లో ఒక  రైతుకు చాలా పశువులు ఉండేవి. అడవిలో మేస్తున్న పశువులు ఒక రోజు  మిట్ట మధ్యాహ్నమే మేత మాని వేసి, కాపర్లు అడ్డము పడినా ఆగకుండా ఇంటికి పరుగెత్తుకొని వచ్చినాయిట. విచిత్రము ఏమిటంటే వాటి యజమాని  అంతకు ముందే చని పోయినాడు. అవి అంతగా ప్రేమించిన ఆ యజమాని చని పోయినాడని వాటికి ఎ చైతన్యము తెలిపిందో తెలియదు. ఇంకొక సంఘటన. ఒక సారి బస్ ఎక్కించడానికి వెళ్లి అక్కడ పుచ్చ కాయ  ముక్క ఒక ఆవు దూడకు పెట్టినాను. వెంటనే ఆ దూడ పరిగెత్తుకుంటూ వెళ్లి మరి కొన్ని దూడలను పిలుచు కొని వచ్చింది. వాటికి కూడా పుచ్చ కాయ ముక్కలను ఇప్పించే వరకూ అవి నన్ను వదిలి పెట్ట లేదు.
పాశ్చాత్య దేశాలలో పశు మాంసాన్ని భక్షించే వారు ఎక్కువ. వారికి పశువులతో ఎటువంటి అనుబంధము లేదు.  మన రాష్ట్రములో  కూలీ పని చేసే వారు తక్కువై పని వారు దొరకనందు వలన యంత్రాలు పొలాలలో దిగినవి.  పని వేగము పెరిగింది . లోతుగా తవ్వుట వలన భూమిలో సారము బయటకు వచ్చింది. రసాయనిక ఎరువుల వలన సహజముగా ఉన్న నేల సత్తువ తరిగింది. అందు వలన  అదే పంటకు పూర్తిగా రసాయనిక ఎరువులు వాడ వలసిన పరిస్థితి వచ్చింది. వీటి వలన పంటకు సహజముగా ఉన్న రోగ నిరోధక శక్తి తగ్గి అవి పురుగుల దాడికి గురి అయి, ప్రత్యేకముగా వాటి కోసము పురుగు మందులు వాడ వలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పంటలను తిన్నందు వలన మన దేహము లోనికి ఈ ఆహారముతో బాటు పురుగు మందులు కూడా ప్రవేశిస్తున్నవి.
ఈ పరిస్థితి వ్యవసాయ రంగము లోనే కాక అన్ని రంగములలో ప్రవేశించింది. సంపద పెరిగే కొద్దీ ఇంకా సంపద కావాలి. ఇంకా.. ఇంకా.. దీనికి అంతు లేదు అన్ని రంగాలలోనూ ఆధునిక యంత్రాల వాడుక పెరిగింది. కమ్మరి, కుమ్మరి, చాకలి వీరి వారి అవసరము సమాజానికి లేదు. అన్ని రంగాలలోనూ యంత్రాలు రోబోలు ప్రవేసించినవి. గుమాస్తాలు పోయి అన్ని రంగాలలోనూ కంప్యూటర్లు వచ్చినవి.ఇంట వరకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పేరుతొ కంప్యూటర్లకు ప్రోగ్రామ్లు వ్రాస్తున్నారు. త్వరలో కంప్యూటర్లకు కంప్యూటర్లే వ్రాయ వచ్చు అని అంటునారు. అటు తరువాత స్థాయి ఏమిటంటే కంప్యూటర్లు మన చేత మనుషుల చేత పనులు చేయించ వచ్చును.
అందుకే అంటారు, మనుషులు  అద్భుతమయిన యంత్రాలను తయారు చేసినాడు. కానీ మనస్సు కలిగిన మనిషిని తయారు చేయ లేక పోతున్నాడు. ఇంకా మనిషి తను పెంచు కొనే సంపద కోసము కుటుంబానికి , సమాజానికి దూరమవుతున్నాడు. పిల్లల భాద్యత కూడా వదిలి వేసి వారిని కార్పోరేట్ కళాశాలలకు వదిలి వేసి తను వారి కోసము ఎంతో త్యాగము చేస్తున్నానని అనుకుంటున్నాడు. కానీ మానవ సంబంధాలను వారికి నేర్ప లేక పోతున్నాడు. ఇంక పిల్లలు  పోటీ పరీక్షలలో రాంకుల కోసము కష్ట పదుతూ మిగిలిన విషయాలను అన్నీ వదిలి వేసి ఒక రకముగా చెప్పాలంటే యంత్రము లాగా తయారవుతున్నాడు. ఇంక కార్పోరేట్ కళాశాలలు పోటీ మనస్తత్వాని పెంచుతూ పిల్లలకు జీవితమంటూ లేకుండా చేసి యంత్రాలలాగా చేస్తున్నారు. వారిలో సృజనాత్మకతను వివేకాన్ని మాత్రము పెంచ లేక పోతున్నారు.
ఈ యంత్రాలు ఎ పని అయినా చేయ గలవు, కానీ తోటి మనిషిని ప్రేమించ లేవు. కారణము, వీటిని తయారు చేసే వాడికి కూడా ప్రేమ అనే పదాన్ని మరచి పోతున్నాడు. భవిష్యత్తులో యంత్రాలకే అధికారమనిపిస్తుంది. అయినా ఈ యంత్రాలు ఎవరో కాదు మన తోటి మనుషులే. అందుకే గుర్తు పెట్టుకోండి.

                                      యంత్రాలు వస్తున్నాయి జాగ్రత్త.

Tuesday, August 30, 2016

మోతోయామా



హిరోషి  మొతోయామా జపాన్  కు చెందిన ప్రముఖ  కంప్యూటర్ శాస్త్ర  వేత్త. ప్రస్తుతము  అమెరికా లో పని చేస్తున్నాడు. అతడి జీవితము లో జరిగిన ఒక సంఘటన ఇందులో ప్రస్తావించ బడినది.
అతడు చిన్నప్పుడు  తల్లిదండ్రులతో ఉన్నప్పుడు  తండ్రి తల్లిని చాలా బాధించే వాడు.  ఇంట్లో ఎప్పుడూ అశాంతిగా ఉండేది.  మనశ్శాంతి కోసము  తల్లి తన కొడుకుతో సహా దగ్గిరలో ఉన్న బౌద్ధ ఆశ్రమము(లామాసరీ) కు వెళ్ళేది. అక్కడున్న ఒక లామా మొతోయామా లో ఏదో ఆకర్షణను చూచినాడు. వచ్చినపుడల్లా మొతోయామా ను దగ్గిరకు పిలిచి కబుర్లు చెప్పే వాడు. ఒక రోజు మొతోయామా తను ఒక్కడే  వెళ్ళినపుడు ఇంట్లో ఉన్న అశాంతి ని గూర్చి చెప్పినాడు. ఆ  లామా అప్పటికే మొతోయామా కు కొన్ని ధ్యాన ప్రక్రియలను పరిచయము చేసినాడు. మొతోయామా సమస్య విన్న తరువాత  అతడి చేత ఒక ప్రత్యేకమయిన ధ్యానము చేయించినాడు. అందులో ఒక చరిత్ర కన బడింది.
కొన్ని వందల సంవత్సరాల క్రితము  కొరియా దేశము నుండి జపాన్ వచ్చిన రాయబారి  జపాన్ రాజ కుటుంబముతో చాలా సన్నిహితముగా ఉండే వాడు. అతడికి రాజ కుటుంబమునకు సంబంధించి అన్ని  విషయాలు తెలిసేవి. కొన్ని నాళ్ళ తరువాత అతడిని తిరిగి రమ్మని ఆదేశిస్తూ వేరొక రాయబారిని కొరియా ప్రభుత్వము పంపించినది. జపానుకు చెందిన మంత్రి “రాజ కుటుంబానికి చెందిన  అన్ని విషయాలు తెలిసిన ఈ రాయబారి తిరిగి కొరియా వెళితే రాజ్య క్షేమమునకు మంచిది కాదని” భావించి, ఒక రోజు అతడికి ఆహారములో విషము కలిపి పెట్టినాడు. విష ప్రభావముతో చని పోతున్న రాయబారి తన చావుకు కారణమెవరో తెలిసి అతడిపై విపరీతమయిన ద్వేషముతో చనిపోయినాడు. ( ఏ వ్యక్తికీ అయినా చనిపోయినపుడు ఏ ఆలోచన తీవ్రముగా ఉంటుందో అది అతడి  మరు జన్మలో జీవితాన్ని నడిపిస్తుందనేది జగద్విదితము. )  అటు తరువాత ఆ  మంత్రి రాయబారిని కారణము లేకుండా అనుమానించి చంపించినాడన్న బాధతో చని పోయినాడు. ఈ విధముగా ఆ మంత్రికి రాయబారికి కర్మ బంధము ఏర్పడింది. ఆ మంత్రి భార్య గా ఆ రాయబారి భర్త గా జీవితాన్ని పొందినారు. వారే మొతోయామా తల్లిదండ్రులు.
మొతోయామా తన ఇంట్లో అశాంతి ఎలా తొలగి పోతుందని అడిగినాడు. ఆ లామా తండ్రి కోపాన్ని తగ్గించుటకు కొన్ని సాధనలు చేయించినాడు. తండ్రిలో మంచి మార్పు వచ్చింది. ఇంట్లో అశాంతి తొలగి పోయింది. కొన్నాళ్ళు చాలా హాయిగా గడచింది. ఈ లోపల తండ్రికి మళ్ళీ జబ్బు చేసింది. దానిని వైద్యులు కాన్సర్ గా నిర్ధారించినారు.
మొతోయామా ఈ విషయమై లామాను అడిగినాడు. అప్పుడు లామా కొంత సేపు ధ్యానము లోనికి వెళ్లి , తిరిగి చెప్పినాడు.” మీ తల్లికి తండ్రికి మధ్య ద్వేషము కారణము గా కలిసి బ్రదుక వలసిన కర్మ బంధము ఏర్పడినది. నీ యొక్క ధ్యానము వలన మీ తండ్రికి ద్వేషము తొలగి  ఆ బంధము తొలగి పోయింది. ఇంకా ఆయనకు  ఈ దేహముతో చేయ వలసిన పనులు లేవు. అందుకే అతడి జీవాత్మ తిరుగు ప్రయాణానికి సిద్ధమయింది.  ఇంకా మనము చేయ గలిగినది ఏమీ లేదు”, అని చెప్పినాడు. ఇంకా తల్లికి బిడ్డపై ఉన్న ప్రేమ బంధము వలన కొంత కాలము జీవిస్తుంది.  ఈ విధముగా ఇప్పటి మన కర్మలు రాబోయే జీవితాలను నడిపిస్తాయి.
ఇటువంటిదే మనకు తెలిసిన కథ ఒకటుంది.  ఒక సాధువు ఒక చెప్పులు కుట్టే వ్యక్తీ నుండి ఒక వరహా తీసుకుంటాడు. అది తిరిగి ఈయ లేక అప్పు తీర్చ లేదన్న ఆలోచనతోనే చని పోతాడు. అతడు ఆ చెప్పూ కుట్టే వ్యక్తిక్ర్ కొడుకు గా జన్మిస్తాడు. వయస్సు వచ్చే కొద్దీ వేదాంత పాఠాలు వల్లే వేస్తూ ఉంటాడు. ఇది గమనించిన తండ్రి ఒక యోగి దగ్గిరకు వెళ్లి తన కొడుకు విషయము ప్రస్తావిస్తాడు. ఆ యోగి చెప్తాడు,”నీవు చాలా అదృష్టవంతుడవు. అటువంటి వ్యక్తీ నీకు కొడుకుగా పుట్టడము నీ అదృష్టము. అయితే అతడు ఎక్కువ రోజులు బ్రదుకడు.” అని చెబుతాడు.
“మరెలా స్వామీ!” అని తండ్రి ప్రశ్నిస్తాడు.
“ఏమీ లేదు అతడి దగ్గిర ఎప్పుడూ ఏవిధముగా డబ్బులు తీసుకోవద్దు.” అని చెబుతాడు.
ఆ పిల్ల వాడు ఒక రోజు తను సంపాదించిన డబ్బులు దాచి పెట్టమని తండ్రికి ఇస్తాడు.ఆ వెంటనే ఒక పాము కరిచి చని పోతాడు.
ఋణానుబంధాలు ఇలాగే ఉంటాయి.
(ఇందులో మొతోయామా కథ శ్రీ ఎక్కిరాల వేదవ్యాస గారి పుస్తకము నుండి స్వీకరించా బడినది)

                                        ఓం స్వస్తి. 

Saturday, April 2, 2016

ఆహారము



రాఘవ తన కొడుకును చూచుటకై మలేసియా  వెళ్ళినాడు. కొడుకు నాలుగు రోజులు సెలవు పెట్టి తన వెంట అన్ని ప్రదేశాలను చూపించినాడు. అక్కడ ఉండే హిందూ దేవాలయాలతో బాటు పెద్ద హోటళ్ళు, భవనాలు, పార్కులు అన్నిటికి వెళ్ళినారు.
రాఘవ స్వతహాగా మాంసాహారి. అయినా వయస్సు పెరిగే కొద్దీ మాంసాహారాన్ని తినుటను తగ్గించుకుంటూ వచ్చినాడు ఎవరయినా బంధువులు వస్తే మొహమాటానికి మాంసాహారాన్ని  నాలుకకు అంటించు కొంటున్నాడు.. అంటే గానీ ఇష్ట పడి తినుట లేదు.
నాల్గవ రోజు వాళ్ళ అబ్బాయి “నాన్నగారు! ఈ రోజు మీకు స్పెషల్ మీల్స్ పెట్టిస్తాను” అన్నాడు.
“”వద్దురా. ఇటీవల నాకు మాంసము నోటికి పడటము  లేదు.”  అంటే “ఇంకొక్క సారి మిమ్ములను పిలువను. మీతో కలిసి నాకు ఆ స్పెషల్ డిష్ తినాలని ఉంది . రండి “ అంటూ బలవంతముగా తీసుకొని వెళ్ళినాడు.
హోటల్ లోకి ప్రవేశించ గానే ఎదురుగా పంజరాలలో ఎన్నో రకాల పక్షులు కనిపించినాయి. అందులో కొన్ని పిచ్చుకలు కూడా కనిపించినాయి.
“ఏమిట్రా? వీళ్ళు  ఈ పక్షులను అంతట ప్రేమగా పెంచుకుంటారా?’ అని అడిగినాడు.
విషయము తెలిస్తే తండ్రి అక్కడి నుండే వెనుకకు తిరుగుతాడని భయముతో  “అవును” అని చెప్పి డైనింగ్ హాలుకు తీసుకొని వెళ్ళినాడు. అక్కడ తెలుగు వచ్చిన వాడు లేక పోవడము కూడా అదృష్టము అనుకున్నాడు. ఉంటే ఆయన ప్రశ్నలకు ఎగతాళి చేస్తారు.
తరువాత లోపల బిరియానీ లాటివి వడ్డించినారు. ఎందుకో రాఘవకు నోటికి వెళ్ళుట లేదు. అయినా కొడుకు కోసము బలవంతముగా కుక్కుకున్నాడు. తినడము అయిన తరువాత అనుమానము వచ్చినది.
“ఇంతకూ మనము తిన్నది ఎ మాంసము రా?” అడిగినాడు.
“ఏదయితే ఏమిటి? తినడానికి బాగుంది కదా.”
ఒక సర్వరును అడిగితే అక్కడ వచ్చీ రాని తెలుగులో ఒక సర్వరు పిచ్చుకను చూపించినాడు.
దానితో రాఘవకు షాక్  తిన్నట్లనిపించినది. వాంతి వచ్చేట్లు అనిపించినది. ఇబ్బంది రాకుండా నోట్లో బిగ గట్టుకున్నాడు. హోటల్ గది లోనికి రాగానే మొత్తం వాంతి అయి పోయింది.
“ఏమయింది నాన్నా!” అని అడిగిన కొడుకుతో వెంటనే ఇలా అన్నాడు.
“ఇది మీకు చెబితే అర్థము కాదురా. నీ మీద గారాబముతో నిన్ను ఎప్పుడు పొలాల మీదకు పంప లేదు.  అందుకే నీకు అక్కడ ప్రకృతితో అనుబంధము ఏర్పడ లేదు. అందుకే మీకు నేను ఏమి చెప్పినా అర్థము కాదు.”
“ఉదయాన్నే పక్షుల కలకలాలు ఎంత బాగుంటాయో మీకు అర్థము కాదు. మైకేల్ జాక్సన్ కేకలు మీ చెవుల్లో హోరేస్తుంటే పక్షుల కలకలాలు మీకు ఎక్కడ వినిపిస్తాయి? పంటలు వచ్చినపుడు ఆ కంకులు వాకిట్లో కడితే అప్పుడు పిచ్చుకలు ఆ కంకులు తింటూ కబుర్లు చెప్పుకొనేటప్పుడు ఆ కల కలలుకు అలవాటు పడిన మాకే తెలుస్తాయి. ఇపుడు ఆ పిచుకలు ఏమయి పోయినాయో? పల్లెటూర్లో మాకే కనిపిచుట లేదు. కొంత మంది మొబైల్స్ తరంగాల వలన అవి నశించిననాయని అంటున్నారు.”
రాఘవ తిరిగి వచ్చిన తరువాత స్వామి శివానందను కలిసినారు.  ఆయన తో కొంత సేపు ఉండి తన అనుమానాలను తీర్చుకోవాలని అనుకున్నాడు.
“స్వామీజీ! మలేసియా లో అన్ని రకాల జీవులను భోంచేస్తారు. ఒక సారి పిచ్చుక మాంసము తిన్న తరువాత  అది ఏమిటో తెలిసింది. కానీ ఈ నా దేహము దాన్ని అంగీకరించ లేదు. వాంతి అయింది. ఎందుకలా జరిగింది? ఆ తరువాత మాంసాహారాన్ని మాని వేయాలని అనిపిస్తున్నది. ఎదో అశాంతి? కారణము తెలియుట లేదు.”
“ రాఘవా! నీ బాధ నాకు అర్థమయింది. రోజు తినే ఆహారము లోనూ జీవ హింస జరుగుతున్నది. కానీ అవి తినడాని కొరకే ఉన్నాయన్న భావన వలన నీ మనస్సు దానిని గుర్తించ లేదు. అదే పిచ్చుకల లాంటి జీవుల మీద నీకున్న అనుబంధము వలన  వాటి మాంసాన్ని నీ మనస్సు అంగీకరించుట లేదు.”
“ మరి మాంసాహారము తినుట వలన ఏ దోషము లేదంటారా?”
“ఖచ్చితముగా దోషముంది. కానీ అది నీ యొక్క పరిణామ స్థితిని అనుసరించి ఉంటుంది. ఈశావాస్య ఉపనిషత్తులో సమస్త జీవులలో నీలో ఉన్న దైవము ఒకటే అన్న విషయాన్ని గుర్తించమంటారు.”
“అంటే నాకు అర్థము కావటము లేదు.”
“ఒక్కొక్క విషయము వారి ఆధ్యాత్మికముగా ఎదిగిన స్థాయి మీద ఆధార పడుతుంది. ఋషులు ఏ విషయాన్నీ ఖచ్చితముగా ఆదేశించారు. ఒక సారి ఒకరు గౌతమ బుద్ద్దుడి దగ్గిరకు వచ్చినాడుట. “దేవుడున్నాడా? “ అని అడిగినాడుట.”ఔను ఉన్నాడు” అని బుద్దుడు చెప్పినాడుట.  తరువాత మరొకరు వచ్చి “దేవుడంటూ ఎవరు లేరు కదా.” అని అడిగినాదుట. బుద్ధుడు,”ఔను లేరు.” అని చెప్పినాదుట. వెంటనే అడిగిన వాడు వెళ్లి పోయినాడు. రెండు జవాబులు విన్న శిష్యుడు అడిగినాదుట. “గురు వర్యా! ఆ విధముగా వ్యతిరేకమయిన జవాబులు చెప్పినారేమిటి?” అప్పుడు శిష్యుడికి బుద్ధుడు జవాబు చెప్పినారుట.
“ఏమన్నారు?”
“మొదట వచ్చిన వాడు దేవుడు ఉన్నాడు అనే నిశ్చయముతో వచ్చినాడు. రెండవ వాడు దేవుడు లేడనే నిశ్చయముతో ఉన్నాడు. ఇద్దరికీ వివరణలు చర్చలు అక్ఖర లేదు. అందుకే వారికి అటువంటి జవాబులు వచ్చినవి. తెలుసుకోవాలి అనుకున్న వారికే చర్చలు, వివరణలు కావాలి. వారి కవసరము లేదు. తమ అభిప్రాయాలు సరి అయినవి అనుకున్న వారికి  వివరణలు అక్ఖర లేదు.”
“మరి తెలుసుకోవాలంటే ఎలా?”
“గురువు మీద సమర్పణ భావము ఉండాలి. నిజముగా తెలుసుకోవాలి అన్న భావన ఉండాలి.. అప్పుడే సరి అయిన సమాదానము వస్తుంది. అంటే కానీ, కథలను వక్రీకరించే కుకవులను దగ్గిరకు చేరనీయ కూడదు.”
“కుకవులంటే?”
“ప్రతి విషయాన్నీ లేదా ప్రతి కథను సత్యానికి కాకుండా తన భావాలకు అనుగుణముగా మార్చి చెప్పే వారిని కుకవులని అంటారు.”
“కుకవి పేరు ఎలా వచ్చిందో చెబుతారా?”
“నిజానికి కవి అంటే ప్రజ్ఞను కలిగిన వాడు. సృజనాత్మకతను కలిగిన వాడు. గురువు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింప చేస్తే  శుక్రుడు లోకములో ఎ పనిని అయినా ప్రజ్ఞతో ఎలా నిర్వహించాలో చెబుతాడు. అందుకే జ్యోతిషములో ఉన్నత మయిన సృజనాత్మకతకు అధిపతి శుక్రుడు. అందుకే మన పురాణాలలో శుక్రుడికి మరో పేరు ఉంది. అది కవి. దీనికి కు ముందు కలిపితే కుకవి ఏర్పడుతుంది. కుమతి కూడా ఇలాటి పదమే. కు శబ్దమునకు పృథ్వి అని అర్థము. పృధ్వీ తత్త్వము అంటే ఎప్పుడు భౌతిక స్థాయిని దాటాడు. తను ఎంత సేపు ఎలా బ్రదకాలి, ఎలా తినాలి అని తప్ప పైకి ఎదగని వారి స్థితిని కు శబ్దము సూచిస్తుంది. భూమికి పుట్టిన వాడిని కుజుడు అంటారు. భూవలయాన్ని కువలయము అంటారు. తన దేహము తన ఉనికి ని మించి ఆలోచించ లేని ఈ వర్గము లోనికి వస్తారు. వీరు పూర్తి స్వార్థ పరులు.”
“మరి దానికి ఉదాహరణ చెబుతారా?”
“నేను చెప్పిన బుద్ధుడి కథనే మరొకరు ఇంకో రకముగా చెప్పడము విన్నాను. ఒకరు బుద్ధుడి దగ్గిరకు వెళ్లి “దేవుడున్నాడా?” అని అడిగితే “లేదు” అని చెప్పినారుట. “మరొకరు వెళ్లి దేవుడు లేడు కదా?” అని అడిగితే “ఉన్నాడు” అని చెప్పినారుట. ఇది నేను ఇప్పుడు నేను చెప్పిన కథకు పూర్తిగా వ్యతిరేకము. వారు చెప్పిన దానికి వ్యతిరేకముగా చెబితే బుద్ధుడు వారి అంతరంగములో విమర్శ పెంచాలని ఇలా చెప్పినారని ఆకథలో చెబుతారు. ఇక జ్ఞాన సముపార్జనలో రెండు మార్గములున్నాయి. అందులో మొదటిది ధ్యాన మార్గము. ఇందులో ఎటువంటి సంఘర్షణ  ఉండదు. ఈ మార్గములో మనస్సు లోతులకు వెళితే మనలో అంతః శక్తులు మేలుకొని వారిని సరి చేస్తాయి. ఇక రెండవది సంఘర్షణ మార్గము. ఇది చర్చ తో కూడినది. ఏది సరి అయినది అని చర్చిస్తూ అవసరమయితే తలలు పగుల కొట్టుకొనే మార్గము. బుద్ధుడి మార్గము మాత్రము ఇది కాదు. ఆయన పద్ధతిలో తర్కానికి స్థానము లేదు. అనుభూతి మాత్రమె ప్రధానము. వ్యతిరేక మార్గములో జవాబు చెప్పుట బుద్ధుడి మార్గము కాదు. ఇది ఎవరిదో స్వయం కల్పితము. ఇక అసలు విషయానికి వస్తాము.”
ఒకప్పుడు కాశ్మీరము శైపాగమ శాస్త్రాలకు ప్రసిద్ధి. విజ్ఞాన భైరవ తంత్రము, శివ సూత్రాలు వంటి గ్రంథాలు అక్కడి నుండే వచ్చినవి. ఇందులో విజ్ఞాన భైరవ తంత్రము లో జగన్మాత పార్వతి పరమేశ్వరుడిని ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. ప్రతి ప్రశ్నకు ఒక సాధనా మార్గమును శివుడు జవాబు గా ఇస్తాడు. ఇందులో ఒక సాధనా మార్గమే బౌద్ధము లోనికి వచ్చింది.”
“ఇవన్నీ ఎందుకు చెప్ప వలసి వచ్చిందంటే శాస్త్ర విషయాలను కూడా వక్రీ కరించుట చాలా జరిగిందని చెప్పడానికి. ఇక ఆహారము విషయానికి వస్తాము. మానవేతర జీవి మొదటి సారి మనిషిగా పుట్టినపుడు, గత జన్మ సంస్కారాలు తమతో తీసుకొని వస్తుంది. ఇక మాంసాహారముతో జీపించేటప్పుడు ఆ మాంసము గతములో ఎ జీవి దేహములో భాగమో  ఆ సంస్కారాలు కూడా అందులో చేరుతుంది. అందుకే వారి మానసిక స్థాయి ఎదగడానికి అడ్డు పడుతుంది. ఇక మాంసాహారపువంటకాలలో మసాలాలు కూడా దండిగా చేరుతాయి. నోరు లేదా నాలుక రుచి బాగుందని అంటూనే ఉంటుంది. ఇక బొజ్జలో మంట రేగుతుంది. అందుకే వారిలో కోపముతో బాటు ఇతర గుణాలు కూడా చేరుతాయి. బుద్ధి సునిసితత్వము తగ్గుతుంది.ఇక ప్రసార మాధ్యమాలు వ్యాపారానికి ఎన్నో వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నాయి. ఇక సినిమాల విషయము చెప్పనక్ఖర లేదు. ఒక సినిమాలో కథా నాయకుడు త్రాగుడు, క్లబ్ జీవితాల్లో హుషారుగా తిరుగుతూ కూడా చదువులో అందరికంటే ముందు ఉంటాడు. మరొక సినిమా లో కథా నాయిక అంటుంది,””నేను రోజు చికెన్ తింటున్నా నాకు ఫాస్ట్ మార్కు వచ్చింది” ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ వారే నిర్ణయించుకోవాలి.”
“ఇక ఆధ్యాత్మికత లో ఎదుగుదల వచ్చే కొద్దీ కొన్ని మార్పులు తమంతట తాము వస్తాయి. ముందు మాంసాహారాన్ని వదిలి వేస్తారు. తరువాత మసాలాలను వదిలి వేస్తారు. తరువాత వండిన ఆహార పదార్థాలను వదిలి వేసి పచ్చి కూరలకు వస్తారు. అటు తరువాత నీటిని మాత్రమె త్రాగే వారున్నారు. ఇక సూర్యుడి కిరణాలతో బ్రదికే వారున్నారు.
అటువంటి వారి ప్రజ్ఞలో తీవ్రమయిన మార్పు వస్తుంది. అది ఒకరు చెబితే తెలిసేది కాదు. స్వంత అనుభవములో తెలిసేది.
ఈ ఆహారము మంచిదనేది ఒకరు చెబితే తెలిసేది కాదు. అందుకే విని, చేసి, ఎవరూ నేర్చుకోలేరు, అది వారి అనుభవానికి అందితే తప్ప.
ఇక భూమి మీద  ప్రశాంతతకు సహకరించాలనుకున్న వారు, ఆవేశము ప్రశాంతత కావాలనుకున్న వారు ఏదో ఒక రోజు శాకాహారానికి రాక తప్పదు. ఇది శాసనము కాదు.
ప్రకృతి యొక్క అనుశాసనము..”
                     ***************************