Thursday, December 5, 2019

జన్యు సాంకేతికత




రాజు అడిగినాడు,” స్వామీ! ఇటీవల జన్యు సాంకేతికత మీద మరియు ఆ రకముగా ఉత్పత్తి చేయ బడిన పదార్థాల మీద  ప్రపంచ మంతా ఎన్నో విమర్శలు వస్తున్నాయి. శాస్త్ర వేత్తలు పంట దిగుబడి పెంచుటకు ఎంతో కష్టాలు పడుతున్నారు. కానీ అదే స్థాయిలో వారి మీద వ్యతిరేకత వస్తున్నది.  ఎందుకంటారు?”
“మార్పు  వచ్చిన ప్రతి సారి  సమాంతరముగా సమస్యలు వస్తాయి. అది సర్వత్రా సహజము. అయితే ఆ మార్పు మంచిదా కాదా అనేది అది తయారు చేసిన వారి విజ్ఞత మీద ఆధార పడుతుంది. ఒక ధాన్య పదార్థము కావచ్చును. ఒక రసాయనము కావచ్చును.  ముందు అది పరీక్షల్లో నెగ్గితేనే అందరికీ నచ్చుతుంది. ఇందుకు ఒక ఉదాహరణగా వారి ధాన్యాన్ని తీసుకుందాము. చాలా కాలము క్రిందట నెల్లూరు జిల్లాలో  ముఖ్యముగా మూడు  రకాల పంటలు ఉండేవి. అందులో ఒకటి మొలగొలకులు. దీనినే రాజనాలు అనే వారు. ఈ ధాన్యము రాజా లాంటిదని అనే వారు. చాలా రుచిగా ఉండేది. ఒక ప్రముఖ తెలుగు ప్రతినాయకుడు ఇంటి పేరు కూడా ఇదే. ఆయన పేరు చివరకు రాజనాల అయింది. తరువాత కేసర. ఇందులో తెల్ల కేసర మరియు ఎర్ర కేసర అని రెండు రకాలు  ఉండేవి. మధ్య తరగతి వాళ్ళు తెల్ల కేసర అన్నము తింటే  శ్రమ ఎక్కువ పడే వారు ఎర్ర కేసర అన్నము తినే వారు.  నిజానికి ఎర్ర కేసర బియ్యము ముతక బియ్యము అయినా ఎక్కువ బలాన్ని ఇవ్వడము వారు గమనించినారు.  ఈ రెండు బియ్యపు గింజల సైజు పెద్దది. ఇవి పంటకు వచ్చుటకు సుమారుగా అయిదు నెలలు పట్టేది. గింజ ప్రమాణము ఎక్కువ కాబట్టి  వంటకు కూడా సమయము ఎక్కువ పడుతుంది.
ఇంకా హరిత విప్లవము అనీ, తక్కువ కాలములో పండించాలని, తక్కువ కాలములో ఆహారము అందించాలనే ఉద్దేశ్యములో ప్రభుత్వము భారతీయ పద్ధతులను పరిశీలించ కుండా విదేశీ వ్యవసాయ పరిశోధనలను ఆధారము చేసుకొని ముందుకు వెళ్ళింది.  ఇది జన్యు సాంకేతికతను ఉపయోగించుటలో మొదటి మెట్టు అయింది. ఇందులో భాగముగా జీబీ అనే పేరుతొ ఒక పంట వచ్చింది. ఇది సన్న బియ్యము.  తక్కువ కాలము పంట. వెంట వెంట నే ఐ ఆర్  అనే పేరు వెంట సంఖ్యలతో కొన్ని పంటలు వచ్చినాయి. కారణము తెలియదు. బహుశా ఈ పంట ప్రకృతి సహజమయిన ఎరువులు స్వీకరించ లేక పొయినాయా? లేదా రసాయనిక ఎరువులు అయితే మంచి దిగుబడి  త్వరగా వస్తుందని అనుకున్నారా? క్రమ క్రమముగా సేంద్రియ ఎరువుల వాడకము తగ్గి పోయింది. దీని ప్రభావము వలన గ్రామీణ వ్యవస్థలో మరొక చెడ్డ మార్పు వచ్చింది. రైతులకు పశు సంరక్షణ పైన ఆసక్తి తగ్గడము మొదలయింది.
మనిషి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ జ్ఞానమును తెలివి తేటలను పెంచుకుంటూ ఒకప్పుడు నియాండర్తల్  స్థితి నుండి ఇప్పటి స్థాయికి ఎదిగినాడన్న విషయాన్ని ఆధునిక మానవుడు అంగీకరిస్తాడు. ఆధ్యాత్మికతలో కూడా వేరు వేరు మూల జాతులు ఒక దాని వెంట మరొకటి మరింత శక్తివంతమయిన దేహముతో మనిషి ఎదుగుతాడని ఆధ్యాత్మికత కూడా ఒప్పుకుంటుంది. ఇది మనుషులకే కాదు ప్రతి జీవ జాతికి జరుగుతుంది. వారి లాంటి ధాన్యానికి కూడా ఇది జరుగుతుంది. ఆ విత్తనాలకు కొన్ని లక్షల సంవత్సరాల పరిణామము ఉంది. ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు అని చెప్ప బడే వారు అంగీకరిస్తారా? ప్రతి జీవికి మూల సాంకేతికతను దాని లోని మూల కణము నిర్దేశిస్తుంది. ఆధునిక సాంకేతికతలో దానిని డీ ఆక్సీ రిబో నూక్లీ యాసిడ్ లేదా  డీఎన్ఏ  అని అంటారు. దీనిని మార్చి వేస్తె ఈ కొన్ని లక్షల సంవత్సరాల పరిణామ చరిత్ర ఆ కణము లో లుప్తము అవుతుంది. అందు వలన వచ్చే ప్రభావము వెంటనే బయట పడదు. కానీ ప్రభావము మాత్రము ఉంటుంది. ఈ కాల వ్యవధి ఎంత ఉంటుందంటే ఆ మార్పులు వచ్చినపుడు అవి ఇందు వలన వచ్చినాయన్న విషయము గుర్తుకు రాదు.
అనుకున్న పంట రావడానికి ఇప్పుడు ఒక క్వింటాల్  ఎరువు అవసరమయితే మరో రెండేళ్లలో అదే దిగుబడికి రెండు క్వింటాల్ ల ఎరువు అవసరమవుతుంది. ఈ విధముగా ప్రతి ఏడూ రైతుకు పెట్టుబడి పెరుగుతుంది. రైతుకు వచ్చే ఆదాయములో పెద్ద వాటా ఎరువుల పరిశ్రమలకు పోతున్నది. కొత్తగా మరొక సమస్య ఏర్పడింది. ఈ పంటలకు రోగ నిరోధక శక్తి తగ్గింది. వివిధ కీటకాల దాడి కూడా పెరిగింది. మొత్తము పంట పోకుండా ఆ కీటకాలను నిరోధించడానికి విష పదార్థాలను వాటి మీద చల్ల వలసి వస్తున్నది.  అందుకోరకు విష పదార్థాలను తిరిగి తయారు చేయ వలసి వచ్చింది.  అందు కొరకు మళ్ళీ రైతుకు ఖర్చు పెరుగుతుంది.  ఆ విష పదార్థాలు పొలములో ఆహ్లాద కర మయిన వాతావరణాన్ని పాడు చేసి అక్కడ మనము ఉండ లేని స్థితిని ఏర్పరుస్తున్నాయి. ఇంకా పండిన ధాన్యములో కూడా విష పదార్థాలు చేరుతున్నాయి. ఈ విధముగా వినియోగ దారుడు ఎంతో కొంత విషాన్ని దేహము లోనికి చేర వేస్తున్నాడు. దీనితో అతడిలో రోగ నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడుతున్నాడు. క్రమ క్రమముగా వైద్యాలయాల అవసరము పెరుగుతున్నది.
మరొక మార్పు కూడా వస్తున్నది.  విష పదార్థములు చల్లబడిన కీటకాలలో ఆ ప్రభావము వలన బలహీన మయిన  జీవులు చనిపోతున్నాయి. బలము కలిగిన వాటికి అందు వలన ఎక్కువ ఆహారము దొరికి  వాటి శక్తి ఇంకా పెరుగుతున్నది. ఇప్పుడు శాస్త్రజ్ఞులే ఒప్పుకుంటున్నారు, వాటిలో జన్యు మార్పిడి జరిగినందు వలన అవి విష ప్రభావమును తట్టుకుంటున్నాయని. ఈ జన్యు మార్పిడిని మ్యుటేషన్ అని అంటారు. ఇక్కడ ఒక్క ప్రశ్న ఉంది. కీటకాలలో జన్యు మార్పిడిని తీసుకొని వచ్చే విష పదార్దాలు ధాన్య గింజలలో తీసుకొని రావా? ఇంకా ఈ విష పదార్థాలను తయారు చేసే పరిశ్రమలకు తమ వ్యర్థాలను ఎలా వదిలించు కోవాలో తెలియదు.. అందుకని పెద్ద గుంట లోతుగా త్రవ్వి దానిని వీటితో నింపి వేస్తున్నారు. దీని వల ఒక రాష్ట్ర రాజధానిలో కొన్ని ప్రాంతాలో భూగర్భ జలాలు విష పూరితమయిన విషయము చాలా మందికి తెలిసినదే.
ఈ ఫలితాల వలన పరిశోధన ఇంకొక మెట్టు ఎక్కింది. ముందు ప్రత్తి పంట తో మొదలు పెట్టినారు. వాటి  DNA లో కొన్ని తేలు, సాలె పురుగు లాటి విష జంతువుల నుండి కొన్ని కణ భాగాలను తీసి అంటిస్తున్నారు. అలా చేస్తే ఈ పంటల జోలికి కీటకాలు రావని వారు చెబుతున్నారు. ఇలా చేసిన పంటలను వారు బిటి పంటలని అంటున్నారు. ఒక అమెరికన్ కంపెని ప్రవేశ పట్టిన ప్రత్తి విత్తనాలను వాడి మన రైతులు చావు దెబ్బ తిన్నారు. ఇప్పుడు వారు మొదట బి టి బ్రింజాల్ అంటే వంకాయ అని కొత్తగా బి టి మస్టర్డ్ అంటే ఆవాలు అని అంటున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో ఈ బి టి పంటల మీద తీవ్రమయిన వ్యతిరేకత వచ్చింది.  మన దేశములో ఇంకా రావాలి. ఇంకా దేశము కొరకు తపన పడే పర్యావరణ శాస్త్ర వేత్తలు(వందనా శివ లాటి వారు) సీడ్ బాంక్స్  లేదా విత్తనాల నిధులు అని మూల మైన విత్తనాలు పూర్తిగా పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వీటి ప్రభావము వలన రైతులు చాలా నష్ట పోతున్నారు .కానీ ప్రభుత్వాలు కొన్ని ఒత్తిడుల వలన వీటిని అనుమతిస్తున్నాయని అనిపిస్తుంది. రైతుకు చేర వలసిన సొమ్ము చేర కూడని చోటికి చేరుతున్నది. కానీ కంపెనీలు తమ కుటిల ప్రయత్నాలను మాత్రము మాన లేదు. విత్తనాలలో కొన్ని మార్పులు చేసినందు వలన పంటలో వచ్చిన గింజలు తిరిగి మొలకెత్తవు. సుమారుగా నలుబది ఏళ్ల క్రిందట రైతుకు విత్తనాలు కొనే అవసరము ఉండేది కాదు. ఈ నాడు విత్తనాల కోసము దళారీల చేతిలో మోస పోతున్నారు.
ఈ విష ప్రభావము ఇంకా పెరిగింది. అన్ని రకాల పండ్లు త్వరగా పక్వము కావాలని వాటి మీద విష పదార్థాలు చల్లుతున్నారు. కొన్ని సంస్థలనుండి కల్తీ పాలు వస్తున్నట్లు వార్తల ద్వారా తెలుస్తున్నది. నాలుగు రోజులు నిలువ ఉండే పండ్లు ఈ విష పదార్థాల వలన త్వరగా కుళ్ళి పోతున్నాయి. ఈ పండ్లు ఎక్కువగా తిన్న వారికి వచ్చే ఆరోగ్య స్థితి ఎలా ఉంటుందో చెప్పనక్ఖర లేదు అన్నిటికి కారణము ఆశ మాత్రము కాదు. ధనార్జన మీద అత్యాశ. కూలి పోయిన నైతిక విలువలు.
మరి దీనికి విరుగుడు ఏమిటి? రైతు ఈ విష వలయము నుండి ఎలా బయటికి వస్తాడు? మన ప్రాచీన సంప్రదాయాన్ని తిరిగి వెలుగు లోనికి తీసుకొని వచ్చిన మహానుభావుడు మహారాష్ట్రకు చెందిన  సుభాష్ పాలేకర్ గారు. తను ఎన్నో ప్రయోగాలు చేసి ఆయన చెప్పి ప్రచారము చేసినారు. ఒక దేశి ఆవు నుండి వచ్చే పేడ ౨౫ ఎకరాల పొలానికి ఎరువుగా సరిపోతుందని ఆయన రుజువు చేసినాడు. రసాయనిక ఎరువులు లేకుండా పూర్తి సేంద్రియ  ఎరువు ద్వారా ఆయన ఆధునిక రైతు పండించే పంటను సాధించినాడు. వ్యవసాయాన్ని తన పిల్లలకు అప్పగించి దేసమంతటా ఈ విషయము ప్రచారము చేస్తున్న కర్మ యోగి ఆయన. ఈ పద్ధతిని అనుసరిస్తే మన రైతు తిరిగి పూర్వ వైభవాన్ని అందుకుంటాడు.
కొస మెరుపుగా ఇంకొక విషయము. కొంత కాలము క్రిందట  యూరప్ లో థాలిడోమైడ్ అనబడు ఒక రసాయనాన్ని తయారు చేసి పరీక్ష చేసి దానిని సర్వ రోగ నివారిణి గా ప్రచారము చేసినారు. ఇంకా గర్భిణీ స్త్రీలు కూడా ఆ మాత్రలను విపరీతముగా వాడినారు.  చాలా పెద్ద సంఖ్యలో వారికి పుట్టిన పిల్లలు కాళ్ళు, చేతులు లేకుండా చేప దొప్పల లాంటి దోప్పలతో జన్మించినారు. చివరకు ఒక పరిశీలనలో ఇలా పిల్లలు పుట్టిన వారందరిక ఉన్న విషయమేమంటే వాళ్ళు  ఈ మందును వాడినారుట. ఇంకొక విషయము ఉంది. విపరీతముగా నొప్పులకు అల్లోపతి మందులు వాడిన వారి మూత్ర పిండాలు నాశనమవుతున్నాయి. ఈ విషయము ప్రతి వైద్యుడికీ తెలుసు. కానీ నియంత్రణ ఎక్కడుంది?
చివరలో మన ప్రాచీన శాస్త్ర వేత్తల్లో గొప్ప జెనెటిక్ ఇంజనీర్ ఎవరు? బహుశా రావణుడేమో? లంక సీతమ్మ చుట్టూ కూర్చున్న రాక్షస స్త్రేల వర్ణన చూసి నాకు ఈ అనుమానము వచ్చింది.
ఒక చిన్న జెనెటిక్ జోక్.ఒక జెనెటిక్ ఇంజనీర్ జన్యు మార్పుల వలన గుమ్మడి కాయంత వంకాయను పండించి ఒక ప్రదర్సనకు పెట్టినాడుట. ఒక్క రైతు అడిగినాడు”దీనికి ఎంత ఖర్చు అయింది?” అని. ఆ ఖర్చును విని “ఇంత ఖర్చు పెట్టాలా? నేను ఒక గుమ్మడి పాదు ఇస్తాను. ఎందుకీ దండగ మారి ఖర్చులు?” అన్నాడుట.
ఈ మార్పులు రావాలంటే ఎదో అద్భుతము జరగాలి. అది జరిగే వరకూ ఎవరూ నమ్మరు. జరిగిన తరువాత దానిని అందరూ మర్చిపోతారు.
              ఓం  స్వస్తి


Friday, November 22, 2019

మన వైద్య శాస్త్రాలు



ఆ సంవత్సరము 1977. నా జీవితములో పెను మార్పులు మొదలయిన సంవత్సరము. ఒక  వర్క్ షాప్ లో పాల్గొంటున్నాను. ఆ సమయములో ఒక రోజు నాకు ఉష్ణోగ్రత వచ్చి లెవ లేక పోయినాను. నా స్నేహితులు నన్ను వైద్య శాలలో చేర్పించినారు. అక్కడ కారణము నాకు తెలియదు కానీ, నగరములో యున్న అన్ని వ్యాధులకు సంబంధించిన మందులు అన్నీ వాడినారు. నాల్గు రోజులకు నా జ్వరము తగ్గింది . కానీ హాస్టల్ లో నా రెండవ అంతస్తులో నున్న గదికి వెళ్ళుటకు శక్తి చాల లేదు. అప్పటినుండీ నేనొక నిర్ణయానికి వచ్చినాను. ఆధునిక/అలోపతీ మందులను వాడకూడదని. ఇప్పటి వరకు (నలువది సంవత్సరాలుగా) నేను ఆ నియమాన్ని పాటిస్తున్నాను.

1997 లో నా  మోకాళ్ళు పట్టి వేసినాయి. కూర్చుంటే నిలబడ లేను. అటువంటి స్థితిలో నన్ను నా స్నేహితులు  చాలా భయ పెట్టినారు. 15రోజులలో   నేను మామూలు స్థితికి వస్తానని చేపినాను. అలాగే జరిగింది. అప్పుడు నేను అలోపతి/ఆయుర్వేదము మాత్రలు వాడ లేదు.

2001 సంవత్సరములో   నాకు చత్వారము వచ్చినది. చదవడానికి చాలా కష్ట పడుతున్నాను. నా స్నేహితుల బలవంతము మీద కంటి వైద్యుడి దగ్గిరకు వెళ్ళినాను. అన్ని పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చినారు. వాటిని వాడడము మొదలు  పెట్టిన తరువాత  చూపు బాగుంది, కానీ తలలో నదురుగా ఏదో నొప్పిగా ఉంటున్నది. కళ్ళద్దాలు వాడే నా మిత్రులు  మొదట్లో అలాగే ఉంటుందన్నారు.  అంతే కాక కళ్ళద్దాలు వాడక ముందు నేను చదవ గలిగిన అక్షరాలను ఇప్పుడు అవి లేకుండా  నేను చదవ లేక పోతున్నాను. అంటే నా కళ్ళ సున్నితత్వము కూడా తగ్గుతున్నది. అప్పుడే  Better Eyesight Without Glasses  పుస్తకాన్ని తెప్పించుకున్నాను. అందులో ఈ నాడు మనము చేస్తున్న పొరపాటు కళ్ళద్దాలను వాడటమే అని వివరించినారు.

నాకు అంతా సమస్య గానే ఉండినది. అందుకని కళ్ళద్దాలను పక్కన పడి వేసినాను. ఆరు నెలల పైన పుస్తకాలను చదువుట మాని వేసినాను.యోగ, ప్రాణ విద్య, రేకి లాటి వన్నీ కళ్ళ విషయములో వాడటము మొదలు పెట్టినాను. సంవత్సరము లోపల నా దృష్టి లో మార్పు వచ్చింది. ఆ తరువాత అన్నీ కళ్ళద్దాలు లేకుండా చదవ గలిగినాను.

నా అనుభవాల కారణముగా నాకు ఆయుర్వేదము, హోమియోపతి, యోగ, ప్రాణవిద్య, రేకి లాంటి వాటిని ఎక్కువ విశ్వసించినాను.

ఏ సమస్యకూ వెంటనే పరిష్కారము లభించదు. లేదా లభించిన పరిష్కారము తాత్కాలికమే.  వ్యాధి  లక్షణాలకు వైద్యము చేస్తే సరి పోదు. హోమియోపతి సూత్ర గ్రంథము ఆర్గనాన్ ను అనుసరించి, వైద్యము చేయ వలసినది రోగానికి కాదు, రోగికి.  అందుకు రోగము యొక్క లక్షణములు ఉపయోగ పడుతాయి. ఇంకా ఆయుర్వేదాన్ని అనుసరిస్తే మరో మెట్టు ఎక్క వలసి వస్తుంది. ఆయుర్వేదము స్వస్థ వృత్తముతో మొదలవుతుంది. తనలో తను ఉంటే స్వస్థత తో ఉన్నారని అంటారు. అంటే మనస్సు నియంత్రణ లో ఉండటము. ఈ విధముగా ప్రతి రోగానికి మనస్సు మూలము అని తెలుస్తుంది. అలోపతి వైద్యము ఈ నాటి వరకు ఈ విషయాన్ని గుర్తించే స్థితికి ఎదగ లేదు. ఇందులో రోగము రావడానికి మన చుట్టూ  ప్రకృతిలో యున్న సూక్ష్మ జీవులే కారణమని ప్రతిపాదించి, అందరి చేత అంగీకరింప చేసి, ఆ సూక్ష్మ జీవులను నాశనము చేయుట అన్ని రకాల విష పదార్థాలన్ ఉపయోగించుట మొదలు పెట్టినారు. వాతావరణములో పెద్ద మార్పులకు కారణ మయినాడు.

  సందర్భములో ఇద్దరు వైద్య పరిశోధకులను గురించి ప్రస్తావించ వలసి యుంది. ఇద్దరూ ఫ్రాన్స్ దేశము వారే.  అందులో మొదటి వాడు సూక్ష్మ జీవుల ప్రభావము గురించి ప్రస్తావించిన  లూయిస్ పాశ్చర్. ఆ సిద్ధాంతాన్ని అనుసరించి, మన వ్యాధులకు కారణము మన మీద దాడి  చేసిన సూక్ష్మ క్రిములు. వాటినుండి మనలను రక్షించుకోవాలి. ప్రతి  వ్యాధికి ప్రత్యేకమయిన సూక్ష్మ క్రిములు కారణము. వీటి కారణముగా వ్యాధి ఎవరికయినా రావచ్చును.

రెండవ వాడు పాశ్చర్ కు సమ కాలీనుదయినా బెచాంప్. ఈయన  సిద్ధాంతము పూర్తిగా వ్యతిరేకముగా ఉంటుంది. దీనిని అనుసరించి మన దేహములోనున్న సూక్ష్మ క్రిములు మన దేహములో జరిగే చర్యలకు తోడ్పడుతాయి. రోగానికి కారణము మనలో ఏర్పడిన అనారోగ్య పరిస్థితులు. సూక్ష్మ క్రిములు రోగానికి కారణమని బెచాంప్ ఎప్పుడూ అంగీకరించ లేదు.

కానీ పాశ్చర్ యొక్క సిద్ధాంతము ఎక్కువ మంది చేత అంగీకరించ బడినది. మనకు వస్తున్న వ్యాదులన్నిటికీ సూక్ష్మ క్రిములే కారణమని నమ్మి, వాటినుండి రక్షణ కొరకు విష పదార్థములను మందుల రూపములో మింగుటకు అలవాటు చేసినారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలన్నీ దీనినే అంగీకరించినాయి. విశ్వ వ్యాప్తముగా ఈ వైద్యము అంగీకరించ బడినది. వేర్వేరు రోగాలకు వేర్వేరు మందులు తయారు చేయ బడినవి.

ఈ విధముగా వైద్య శాలలు, వైద్యులు,.........ఎన్నో వచ్చినవి. వచ్చిన ఫలితాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఈ విధముగా ప్రకటించింది. 1999లో వంద  సంవత్సరాల అలోపతి వైద్యము కొనసాగించిన తరువాత “ప్రపంచములో అంటు రోగాలు పిల్లలను, యువకులను మింగి వేస్తున్నవి. సంవత్సరానికి 1.3 కోట్ల సంఖ్యకు చావులు చేరినవి.” అంతే కాదు, ఉన్న మందులు సూక్ష్మ జీవుల మీద పని చేయని స్థితి వచ్చింది. వాటి మీద యుద్ధము కొన  సాగుతూనే ఉంది. కొత్త రోగాల ఒత్తిడి పెరుగుతూనే ఉంది.”

“గత రెండు దశాబ్దాలుగా  ముప్పయి వ్యాధులు కొత్తగా వచ్చినాయి. పాత రోగాలు  ప్లేగు, డిఫ్తీరియా,ఎల్లో జ్వరము, డెంగీ, మేనిన్జిటిస్ లాంటి పాత రోగాల్ బల పడినాయి.”

ఇక్కడే బెచాంప్ మాటలన గుర్తుంచుకోవాలి. “ఈ సూక్ష్మ క్రిములు మన శత్రువులు కాదు. మనలో చేరిన మురికిని తిని అవి బ్రదుకుతాయి. అందు వలన మనకు వాటి వలన మేలే జరుగుతుంది.” “మనకు రోగాలు అనారోగ్య పరిస్థితుల వలన వస్తాయి. సూక్ష్మ క్రిముల వలన కాదు.”

ఇంకా చాలా మంది ఒప్పుకుంటున్నారు.”ఆరోగ్యవంత మయిన దేహాలలో కూడా సూక్ష్మ క్రిములున్నాయి. వాటి వలన ఎటువంటి హానీ జరుగదు. కానీ వాడిన మందుల వలన అవి కూడా నశిస్తున్నాయి.”

“ఇంక ఇతర వైద్య శాఖలను గురించి తెలుసుకుందాము. ఆయుర్వేదము ప్రకారము మన దేహములో వాత, పిత్త, కఫములనబడు మూడు తత్వాలున్నాయి. అవి సమముగా లేనపుడే వ్యాధులు వస్తున్నాయి. వాటికి సమత్వాన్ని ఏర్పరిస్తే వ్యాధి మాయమవుతుంది. ఇంకా హోమియోపతిలో ఇదే విధముగా సోరా, సిఫిలిస్, సైకోసిస్ తత్వాల వలన వ్యాధులు వస్తాయి. యోగ శాస్త్రము లో మనలో నున్న చక్రాలలో శక్తి క్షీణత వలన రోగాలు వస్తాయి. ఇవి  అన్నీ విజయాన్ని సాధించినవే. ఇవేవీ సూక్ష్మ క్రిములను గురించి మాట్లాడవు.

ప్రకృతిలో ప్రతి జీవి భగవంతుడి స్వరూపమే. అందుకే సూక్ష్మ జీవుల వలన మనకు ఎటువంటి వ్యాధి రాదు. వ్యాధికి కారణము మనలో ఏర్పడిన అనారోగ్య పరిస్థితులే.

మరొక విషయము. ఆరోగ్యవంతుడి మందు ఆహారము. అనారోగ్యవంతుడి  ఆహారము మందు.

డాక్టర్ ఫ్రెంకేల్ చెబుతాడు.” నాజీల నిర్బంధము లో నుండి బయట పడిన వాళ్ళలో ఎక్కువ మంది నిర్దిష్టమయిన జీవితలక్ష్యమున్న వారే. అది యున్న వారిని ఎటువంటి పరిస్థితులు హాని చేయ లేవు.”

మసనోబు ఫుకువోకా తన పొలాలను దున్న లేదు. ఎరువులను వాడ లేదు. పురుగు మందులను చల్ల లేదు. కలుపు మొక్కలను తీయ లేదు. ప్రకృతిని పూర్తిగా అనుసరించి  ఆధునిక వ్యవసాయ పద్ధతులలో అందుకొనే పద్ధతులలో ఫలితాలను అందుకున్నాడు.

అందుకే మన అనారోగ్యానికి కారణము మన మనసు మీద ఉన్న ఒత్తిడి, మనము చూపే ప్రేమ వలన .......ఏ సూక్ష్మ జీవులు మనకు హాన చేయ లేవు.

ఆ సూక్ష్మ జీవుల పేరు చెప్పి, ఫాక్టరీల ద్వారా పొలాల ద్వారా భూమిని విష పదార్థాలతో నింపకండి. భూమిని కాపాడండి.

*****************************క్ష్***********************


Thursday, November 21, 2019

విత్తనము



భూమి మీద ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. అందుకే ప్రతి జీవిని దైవము యొక్క ప్రతిరూపముగా భావించాలని భారతీయ ఆధ్యాత్మికత చెబుతుంది.ఆచరణ అనేది తరువాత సంగతి.

మరి కొన్ని మత సాంప్రదాయాలు  భగవంతుడు అన్నిటిని సృజించి వాటి పై మానవుడికి అధికారము ఇచ్చినాదని (అంటే పరోక్షముగా మానవుడి వలన వాటికి  బాధ కలిగినా తప్పు కాదని అర్థము వచ్చేటట్లు) చెబుతారు. ఇందులో నిజానిజాలు నాకు తెలియవు.

ఈ నాడు మానవుడి ద్వారా వృక్ష జాతికి వచ్చిన ముప్పు సామాన్యమయినది కాదు. ఇది వేర్వేరు దశలలో జరిగింది.

తన కలప కోసము బ్రహ్మాండమయిన వృక్షాలను నరికి వేసినాడు. వాటి స్థానములో తిరిగి వృక్షాలను పెంచాలన్న విషయాన్ని మరచి పియినాడు. అందుకే పచ్చని ప్రదేశాలు ఎడారులుగా మారినాయి.

బ్రహ్మాండమయిన  వృక్షాలను తన కోసము, తన ప్రజ్ఞను చూపించుట కొరకు  మరుగుజ్జు వృక్షాలుగా (బోన్సాయ్) మార్చి పెంచుతున్నాడు. అది తన ప్రజ్ఞకు తార్కాణముగా భావించినాడు. ఆరడుగుల మనుషుల మధ్య మూడడుగుల మరుగుజ్జు యువకుడుంటే  అతడి మనస్సు ఎలా ఉంటుందో ఆలోచించండి.

ముఖ్యమయిన పండుగలు లేదా కలయికలలో మొక్కలను వేర్వేరు డిజైన్లు గా కత్తిరించి తమ ప్రతిభగా చూపించుకున్నా అందులో జరిగిన హింస కనిపించదేమో?

చెట్ల ఎదుగుదలకు వాటి ఏర్పాట్లు వాటికున్నాయి. అందమయిన పూలను, రుచికరమయిన పండ్లను ఇస్తాయి కాబట్టి వాటిని మనమే పెంచి పోషిస్తాము. ఇంకా అడవులలో వాటి పండ్లను తిన్న పక్షులు, జంతువులూ వాటి విత్తనాలను వేరే చోట పడేస్తాయి. అందుకే వృక్ష జాతి విస్తరిస్తుంది. మరి కొన్ని విత్తనాలు నీటి ద్వారా లేదా గాలి ద్వారా వేర్వేరు చోట్లకు విస్తరిస్తాయి. వాటికి సహకరించే కీటకాలకు రక్షణ ఉంటుంది. అని కలిగించే వాటిని పక్షులు భక్షిస్తాయి. ఈ పనులు సహజముగా జరుగుతాయి. కొన్ని తృణ ధాన్యాలు, కూరగాయలు ఆహారము కొరకు మానవుడు పందిస్తున్నాడు.

ఒకప్పుడు ప్రాచ్య/తూర్పు దేశాలు మార్గ దర్శకము చేసే స్థితిలో ఉన్నాయి  వారి ఆలోచనలో సంపద అంటే డబ్బు కాదు. కొన్ని ప్రాచ్య జాతులు ఆవుల  మందను సంపదగా భావించినారు. ధనమగ్నిః, ధనం వాయుః ధనం భూతాని  పంచచ అని వేదము చెబుతుంది. అంటే  పృధ్వీ/నెల , నీరు ,అగ్ని, వాయువు, ఆకాసము ఈ ఐదింటిని పంచ భూతాలని అంటారు. ఇందులో నేల మన స్థితిని చెబుతుంది. నీరు మన లో ద్రవాలను గురించి చెబుతుంది, అగ్ని వాయువు గురించి చెప్పనవసరము లేదు. ఆకాశము మన ఆలోచనలను నదిపీస్తున్నది. ప్రతి విషయములో దోషము లేకుండా చూడ వలసిన భాద్యత మనదే. ఇవి స్వచ్చముగా ఉంటే మన దేశము స్వచ్చ భారతము అవుతుంది.

మ్లేచ్చుల, పాశ్చాత్యుల ప్రభావము పెరిగిన తరువాత  ఆనందము కంటే సుఖ భోగాల మీద దృష్టి పెరిగి ప్రకృతి సంపద కంటే భౌతిక సుఖాల మీద దృష్టి పెరిగింది. దీని ప్రభావముతో మనము మన వసతి కోసము సృష్టించుకొన్న డబ్బు మీద దృష్టి పడింది. ఇటీవలే ఒకరన్నారు.”మనకు ఉన్న జబ్బంతా డబ్బే అని.  మనకు డబ్బు తక్కువయితే ఒక సమస్య. ఎక్కువయితే అంతకంటే పెద్ద సమస్యలు వచ్చి జీవితాన్ని అతలాకుతలము చేస్తాయి.

మణికట్టు పట్టుకొని రోగ నిర్ధారణ చేసే వైద్యులు పోయినారు. ఇంకా స్టెతస్కోప్ కూడా వాడటము చేతకాని వైద్యులు తయారయినారు. వారికి స్టెతస్కోప్ అలంకార ప్రాయముంది. రోగిని చూచి రోగ నిర్ధారణ చేసే శక్తి వైద్యులకు పోయింది. యంత్రాలు చెబితేనే రోగమున్నదని అంటాడు. తిరిగి యంత్రాలు చెబితేనే రోగము తగ్గిందంటాడు. ఆ యంత్రాలకు పెట్టే ఖర్చు రోగి భరించాల్సిందే. ఈ వృత్తిని మరింత స్వచ్చందముగా కార్పొరేట్ వైద్య శాలలు స్వీకరించాయి. రోగి విద్యాలయానికి వెళితే  ఎంత అప్పుతో తిరిగి వస్తాడో తెలియని పరిస్థితి ఇటీవల వార్తలలో ఒక మధ్య తరగతి పౌరుడికి వైద్యము పెను భారము అయిందని వ్రాసినారు.

వైద్యము తరువాత కార్పొరేట్ సంస్థల దృష్టి వ్యవసాయము మీద పడింది. మన  దేశపు రైతులలో స్వయం నిర్ణయము స్వయం పోషకత్వం ఉండేది. ఏ  నాడూ రైతు విత్తనము కొనే వాడు కాదు. ముందు పండిన పంటలో కొంత భాగాన్ని విత్తనాల కొరకు నిలువ ఉంచే వాడు. అందుకని విత్తనాలలో ప్రకృతి సహజమయిన  పరిణామముండేది. ఆ రోజుల్లో కావలసినంత పశు సంపద ఉండేది. వాటికి కొఠ్ఠాలు ఉండేవి. అక్కడ గడ్డి పరచి ఉంచే వారు. పగలంతా పొలాల్లో పచ్చిక బయళ్ళలో తిరిగిన ఆవులు రాత్రి పూట ఆ కొఠ్ఠాలలో విశ్రమించేవి. వాటి మల మూత్రాలతో తడిసిన గడ్డి మంచి ఎరువయ్యేది.

ప్రతి గ్రామానికి ఏదో ఒక చెరువుతో సంబంధముండేది. కావలసిన పొలాలకు ఏటా తామే కాలువలు త్రవ్వు కొనే  వారు. ఖర్చును సమిష్టిగా భరించే వారు. విత్తనాలను చల్లే ముందు పొలాలలో జనుము వెంపల విత్తనాలను చల్లి అవి ఎదిగిన తరువాత వాటితో కలిపి పొలాన్ని దున్నేసే వారు. ఈ విధముగా నేలకు సారమును పెంచి ఆ పొలాలను నారు మళ్ళుగా వాడే వారు. పంట కోతకు వచ్చే ముందు పెసలు లేదా మినుముల బస్తాలలో ఉంచి నాన బెట్టి మోము వచ్చిన తరువాత పొలములో చాల్లే వారు. ఇవి రెండవ పంటగా వచ్చేవి. ఈ విధముగా వ్యవసాయము చేసినపుడు  ఏనాడూ పురుగుల వలన పంట నాశనమయేది కాదు. ఇది చిన్నప్పుడు నేను చూచిన యథార్థము. ఏనాడూ విత్తనాలకు పురుగు మందులకు ఖర్చు పెట్టనందు వలన పండిన పంట అంతా రైతుదే. ఎప్పుడైనా ప్రకృతి విలయము సంభవించినా రైతు సులభముగా కోలుకోన గలిగే వాడు. రైతు చాలా ఆనందంగా ఉండ గలిగే వాడు. సంక్రాంతికి బియ్యపు బస్తా వాకిట్లో పెట్టుకొని వరుసగా వచ్చే జనానికి బియ్యము పంచె వారు.  ఇంకా వాకిట్లో ధాన్యపు కంకులు కట్టి పిచుకలు తింటూంటే ఆనందముగా చూచే వారు.

అపుడే రైతు జీవితములో పెను ముసలము ప్రవేశించింది. పంటలు ఎక్కువ పండుతాయని  సహజముగా యున్న మొలగొలకులు (వీటినే రాజనాలు అంటారు) తెల్లకేసర్లు, ఎర్ర కేసర్లు  కు బదులుగా కొత్తగా జిబి 24,          ఐ ఆర్ 8 మున్నగు పంటలను ప్రచారము చేసి ప్రభుత్వమూ ప్రవేశ పెట్టించింది. అంతే కాక ఇవి తక్కువ కాలము పంటలని వసతి ఉంటే రెండో పంట వేసుకోవచ్చని చెప్పించింది. కొత్త సమస్యలు మొదలయినాయి. ఈ పంటలసు కీటకాలు కమ్మగా చప్పరించి వేస్తున్నాయి. వాటిని నిర్మూలించుటకు కీటక నాశినిని వాడ వలసిందే. ఇంత వరకు నేల సారము గురించ రైతుకు పట్టించుకోవలసిన అవసరము రాలేదు. ఈ పంటలతో నేల యొక్క సారము భయంకరముగా పడి పోతున్నది. అందుకోసము రసాయనిక ఎరువులు సల్ఫేటులు, ఫాస్ఫేటులు లాటివి విరివిగా వాడవలసి వచ్చింది. రైతుకు ఆదాయము పెరిగింది, ఖర్చుకూడా పెరిగింది. రైతుకు అప్పులు చేయ వలసిన పరిస్ఠితులు ఏర్పడినాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ కీటకముల శక్తి పెరిగి శక్తివంతమయిన విష పదార్థాలు ఎక్కువ సార్లు కూడా పిచికారి చేయ వలసి వచ్చింది. దీనితో మధ్య తరగతి రైతు మరింత క్రుంగి పోయినాడు.

ఆశ రేపింది ప్రభుత్వ ప్రచారకులు. అలవాటు పడింది రైతులు. లాభాలు పెంచుకొన్నది ఎరువులు, పురుగు మందుల పరిశ్రమలు.

మరో ప్రమాదకరమయిన పరిస్థితి ఏమిటంటే రైతుకు క్రమనుగా విత్తనాల మీద అధికారము పోయింది. పండిన ధాన్యము విత్తనాలకు పనికి రావు. వీటినే టెర్మినేటర్ర్ విత్తనాలని అన్నారు. ఈ విధముగా రైతు ప్రకృతికి దూరముగా  అద్దములో కనిపించే డబ్బు వైపు ఆశగా చూస్తూ ఉండి పోయినాడు. అన్నీ ఇంట్లోనే సమకూర్చుకో గలిగిన వ్యక్తీ బజారున పడ్డాడు.

ఇంకా రోగ నిరోధక శక్తి పెంచాలని విత్తనాలకు సంబంధించిన మూల కణాల మీద ప్రయోగాలు చేసినారు. ఉదాహరణకు వంకాయ మూల కణములో  తేలు విషానికి సంబంధించిన రసాయనాన్ని కలిపారు. దీని వలన కీటకముల దాడి తగ్గ వచ్చును. కానీ తిన్న వారికి వెంటనే కాక పోయినా కాల క్రమేణా కొత్త  రోగాలు రావని ఎటువంటి  హామీ ఇవ్వ లేరు.  నేను చిన్నప్పుడు ఒక ఆవు  హైబ్రిడ్ జొన్న పంట తిని  చని పోయి ఉండడము చూచినాను. అదేమంటే ఆ జొన్న ఆకులలో సయనైడ్డ్దే ఏర్పడిందిట. ఇటీవలే విజయ వాడలో ఒక గోశాలలో గడ్డి తిని 80 ఆవులు చచ్చి పోయినాయని విన్నాము  ఆ గడ్డి ఏ జెనటిక్ ప్రయోగాలలో వచ్చిందో? ఇలా తయారయిన  హైబ్రిడ్ విత్తనాల ప్రభావము గురించి పూర్తిగా  తెలియదు.

ఒక పర్యావరణ వేత్త అంటాడు.”ఇలా వచ్చిన ధాన్యాన్ని తినగా వచ్చిన జబ్బులకు మందులు కూడా అవే కంపెనీలు తయారు చేస్తున్నాయని.” ఇంకో మాట కూడా ఉంది. తమ పొలములో పండిన పంటను ఎ రైతూ తినడట. ఎందుకంటే తను విష పదార్హాలు ఎన్ని చల్లినాడో తెలుసు కాబట్టి. పక్క వాడు ఎంత చల్లాదో తనకు తెలియదు కాబట్టి.
ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా మందికి నచ్చవు. మానవ జాతి పరిణామములో ప్రతి జీవికి సమున్నత స్థానముంది. విత్తనాలకు జెనెటిక్ కోడె మార్చినందు వలన దాని ఉనికికి ప్రమాదము ఏర్పడింది. ఈ సెంటిమెంట్  ఏమిటి అంటారేమో? పాశ్చాత్య సంస్కృతీ ప్రభావము లాగే అనిపిస్తుంది. మొక్కల దగ్గిర రోజూ కొద్ది సేపు కూర్చొని వాటికి మన ఆలోచనను అందిస్తే అవి స్పందిస్తాయని కొంత మంది తెలుసు.ఆలోచనలతో మొక్కలను ప్రభావితము చేసిన వాళ్ళు ఎందఱో ఉన్నారు. అందులో పరమ హంస యోగానంద శిష్యుడు ఒకరు.లూథర్ బర్బంక్ తన ఆలోచనల ప్రభావముతో రోజా ముళ్ళు లేకుండా పూచేటట్లు చేసినాడు. అతడిని న అనుసరించి అటువంటి ప్రయోగాలు చాలా మంది విజయవంతముగా చేసినారు. ఈ నాడు వ్యాపార మనస్తత్వముతో కొంత మంది మన జీవితాలతో బాటు ఇతర జీవ రాశులను కూడా హిమ్సిస్తున్నాడు.

(వృక్షాలపై జరిగిన ప్రయోగాలను ఇంకో చోట వ్రాయ వలసి ఉంది.)
**************************************************************





Thursday, November 14, 2019

విలన్లు ఎవరు?



ఈ భూమి మీద అత్యంత భయంకరులయిన ప్రతి నాయకులు(విలన్లు) ఎవరో తెలుసా?
మన ప్రాచీన ఋషులు/ రచయితలుఆదర్శముతో జీవిచిన వారు. వారి వ్రాతలలో నాయకులను గుర్తుంచుకున్నంతగా ప్రతినాయకులను గుర్తుంచుకోరు. ఎవరినో కొద్ది మందిని తప్ప ప్రతినాయకులను ఎవరూ గుర్తుంచుకోరు. ఆ మరపు సమాజానికి కొంత మేలు చేస్తుంది.
ఇప్పుడు కాలము రీతి మారింది. కాళీ ప్రభావము ఎంత పెరిగిందంటే ఇటీవలే వాట్సప్  లో ఉన్న ఒక మెసేజ్ రావణుడి స్వగతమంటూ వచ్చింది. అందులో రావణుడు తానేమీ తప్పు చేయనట్లు వివరిస్తూ అందరూ తనను అపార్థము చేసుకున్నారని అంటాడు.
అంతే కాదు. కొందరు కథానాయకులు రావణుడిని, కర్ణుడిని, దుర్యోధనుడిని చివరకు కేచకుడిని కూడా ప్రాధాన్యత కలిగిన ఉదాత్త పాత్రలుగా చేసినారు. ఒక విషయము మాత్రము నిజాము. పాత ప్రతినాయకుడిలో కొన్ని ఉదాత్త లక్షణాలు, ఎక్కువగా దుర్మార్గ  లక్షణాలు ఉంటాయి. అయినా దుర్మార్గ లక్షణాలు సమాజానికి హానికరముగా  మారినపుడు వారిని సమాజమునుండి తొలగించ వలసి యుంది. అందుకే నాకు అనిపిస్తుంది,  అసలు విలన్లకంటే ఈ విలన్లను హీరో లు గా మార్చిన కవులు/రచయితలు ప్రధాన విలన్లు అని.
ఇటీవల వివిధ సంస్థలు తమ చానల్స్ ద్వారా ప్రవహింప చేస్తున్న ధారా వాహికలను చూస్తె నిజ జీవితములో ప్రతినాయకులు/విలన్ల కు రాని ఆలోచనలు అందులో పాత్రలకు వస్తూ ఉంటాయి. అందులో ఉండేది వినోదము కాదు, అహంకారము, క్రూరత్వము, మాత్రమె కావు, పైశాచికత్వము కూడా కనిపిస్తాయి  కొన్నిటిలో ఒక ఉదాత్త పాత్ర ఉంటె మిగిలినవన్నీ అత్యంత క్రూర పాత్రలతో, నడిపించేస్తూ ఉంటారు. హింస ఎంత తీవ్రముగా ఉంటుందంటే వీళ్ళు అసలు మనుషులేనా అనిపిస్తుంది.
ఒక్కొక్క ధారా వాహికలో ఒకే కథా నాయిక/నాయకుడు  మిగిలిన అందరూ దుర్మార్గులు ఉండటం చూస్తుంటే  మనది ప్రజా స్వామ్య దేశము  కదా, ఎవరి సంఖ్య ఎక్కువుంటే  మన ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరించి  వారే నాయకులు/మంచివారు/మార్గదర్సకులు లేదా దార్శనికులు అవుతారు. ఏది మంచో ఏది చెడో తెలియనీకుండా వినోదము పేరుతొ మన సమాజాన్ని నిర్వీర్యము చేస్తున్నారు. ఇటువంటి రచయితలు/రచయిత్రులు నిజమయిన విలన్లని అనిపిస్తుంది.
వీరు శక్తి వంచన లేకుండా ప్రేక్షకులలో తమలో నున్న  దుష్ట భావాలను ప్రచారము చేయడానికి ప్రయత్నము  చేస్తున్నారు.



Monday, September 30, 2019

ప్రస్థానము 10




 గోపీ తిరిగి పైనాంపురము వచ్చినాడు. ఎవరయినా  కనిపిస్తారని రావి చెట్టు చావడి దగ్గిరకు వచ్చినాడు. అక్కడ కాషాయ వస్త్రాలతో ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. పక్కనే మరో ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. గోపీ ఆయన దగ్గరకు వెళ్లి నమస్కారము చేసినాడు.
ఆయనకు గోపీ ని చూడగానీ అంతా అర్థమయింది. “రావయ్యా! కూర్చో. నీవు చాలా చేయాలని అనుకున్నావు. కానీ ఏమి చేయాలో స్పష్టముగా తెలిసినట్లు లేదు.”
“స్వామీ! ఎన్నో సందేహాలు. ఎటు వెళ్లాలనో తెలియటము లేదు.”
“వంద అడుగులు వేయాలనుకున్న వారికి మొదటి అడుగు చాలా ముఖ్యమయినది. అదే తడబడితే ఎక్కడికి వెల్ల గలవు? నీ గురించి చూచాయగా తెలిసింది. ఆశయాలు గొప్పవే. కానీ అడుగు ముందుకు పడాలి కదా. మరొక విషయము.  ఏదయినా మార్పు తీసుకొని రావాలని అనుకున్నప్పుడు అంతకు ముందు పరిస్థితులను గురించి పూర్తీ అవగాహన ఉండాలి.ఒక ఊరికయినా మనిషి కయినా ఇదే వర్తిస్తుంది. కష్ట పడడానికి సిద్ధముగా యున్న వారికి పని ,ఉండడమే కాదు తను తయారు చేసుకున్నవి తను కష్ట పడితేనే వచ్చాయి అన్న భావన విశ్వాసము ఉండాలి. గ్రామములో త్రాగడానికి నీటి వనరులు ఉండాలి. ఇవన్నీ సమకూర్చు కోదానికి ప్రాచీన వ్యవస్థ ఎలా పనిచేసిందో తెలుసుకోవాలి. ఈ  నాటి సైన్సు మరియూ టెక్నాలజీ లు విశ్లేషణాత్మక (analytic)దృష్టిని ఇచ్చాయి. కానీ సమన్వయము(synthesis)  ఎలా చేయాలో తెలుపుట లేదు. ఇప్పటి సమస్యలన్నిటికీ ఇదే ప్రధాన కారణము.”
“మరి కాస్త వివరముగా చెబుతారా?”
“ ఉదాహరణకు ఒక ఊరిలో అందరికీ నీరు కావాలంటే ఏమి చేయాలో చెప్పు.”
“కాలువల ద్వారా నీరు తీసుకొని వచ్చి, ఎత్తుగా కట్ట బడిన టాంకును నీటితో నింపి కుళాయిల ద్వారా అందరికి నీరు అందిస్తున్నారు. అందు కొరకు నీరు నిలువ చేయటానికి నేల మట్టములో చెరువులు త్రవ్విస్తున్నారు. అందులో నీరు నింపి ఉంచుతున్నారు.’
“ఈ సమస్యకు ఈ నాడున్న పరిష్కారాన్ని చెప్పినావు. ఇందులో చాలా నిర్మాణము చేయ వలసి ఉంది. రోజూ టాంకును నీతితో నింపుటకు మోటార్ లాటి హంగామాలు చాలా కావాలి. అంతే కాదు, అందరికీ నీరు సులభముగా అందించ బడుతుంది కాబట్టి దుర్వినియోగము కూడా జరగ వచ్చును. కానీ ప్రాచీన వ్యవస్థ ఈ విధముగా ఉండేది కాదు. ఆ నాటి గ్రామానికి ఆయువు పట్టువు దేవాలయము.  మొత్తము వనరుల నిర్వహణ అక్కడినుండి జరిగేది. ఎక్కడయినా ఎప్పుడయినా ఈ విషయాన్ని గురించి చదివావా?”
“కాస్త వివరముగా చెప్పండి.”
“వేల సంవత్సరాలుగా ఇక్కడున్న వ్యవస్థ అటువంటిది. దేవాలయము అంటే పూజలు జపాలు , వ్రతాలు మాత్రమె కాదు. దేవాలయ పూజారి అంటే ఆ నాడు గ్రామానికి కేంద్ర బిందువు. ఆ నాడు అతడికున్న పరిజ్ఞానము మరొకరికి ఉండేది కాదు. మొదట చెప్పాలంటే అతడు ఒక వైద్యుడు. అతడికి మూలికా వైద్యముతో బాగా పరిచయము ఉండేది. ఉత్తరేణి, కొండ పిండి, నెల వేము, నెల పొగడ,...... లాటి మూలికలు పల్లెలలో ఎక్కడయినా దొరికేవి. ఇంక దేవాలయము గురించి  చెప్ప వలసిన పని లేదు. కొన్ని దేవాలయాల్లో ప్రత్యేకముగా మూలికా వనము కూడా ఉండేది.ఎక్కడికయినా ఏదయినా వాళ్ళే తీసుకొని వెళ్ళాలి కాబట్టి, ప్రతి యొక్కరికి తగిన, పని, వ్యాయామము, వీటితో బాటు ఆరోగ్యము ఉండేది. విపరీతమయిన పరిస్థితులలో    వ్యాధీ వచ్చినా పూజారి ఇచ్చిన మూలికలతో చేసిన మందుతో తగ్గి పోయేది. ఇప్పటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ యొక్క అవసరము అప్పుడు ఉండేది కాదు.”
“ప్రతి ఆలయానికి ఒక కోనేరు అంటే చెరువు ఉండేది. దానిని ఎప్పుడూ నీతితో నింపి ఉంచే వారు. మట్టి పొరలలో నీరు దిగి ఊరంతా నీటి పోర వ్యాపించి ఉండేది. ఎవరికీ వాళ్ళు నుయ్యి త్రవ్వితే  కావలసిన నీరు లభించేది. “
“ఇళ్ళ ప్రక్కన స్థలాలలో ఏదో యొక పూల మొక్కలు, పండ్ల మొక్కలు వేసే వారు.ఏ ప్రాంతములో పెరిగిన కూరలు పండ్లు ఆ ప్రాంతము వారికి ఎక్కువ ఆరోగ్యమిస్తుందని ఆయుర్వేద ము  చెబుతుంది.”
“అంటే స్వామీ! ఆపిల్ లాంటి పండ్లు......”
“అక్కడకే వస్తున్నా. మన ప్రాంతాలలో  పండిన పండ్లు మాత్రమె మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆపిల్ తింటే అనారోగ్యానికి దూరమంటే  ఆ పండ్లు పండే ప్రాంతాలలో అనారోగ్యాలు ఎక్కువ అని కూడా చెప్పవచ్చును. ఆపిల్ పండు దొరకని రోజుల్లో కూడా ఇక్కడ పూర్తీ ఆరోగ్యముతో జీవిస్తారు.”
“మరొక ప్రశ్న. ఎక్కువ మందికి రక్తపు పోటు ఎందుకు వస్తుందో తెలుసు. అతి మధురము(దయబితీస్) కూడా ఒక తీవ్రమయిన వ్యాధి గా మారింది. అది తీపి పదార్థాలు ఎక్కువగా తినడము వలన వచ్చిందని అంటున్నారు. నిజమేనా?”
“గుజరాత్, రాజస్తాన్ లలో మధుర పదార్థాలను ఎక్కువగా తింటారు. ఇక వారణాసి లో వారి ఉదయము జిలేబి తినదముతో మొదలవుతుంది. మరి వారికి దయబెటీస్ ఉందా?”
“శారీరిక  మరియు మానసికమయిన ఒత్తిడి  ఒక స్థితిని దాటినా తరువాత, వ్యాధికి కారణము కావచ్చును. ఇక్కడి నుండే వ్యాధులు మొదలు అవుతాయి. కాన్సరు నుండి రక్తపు పోటు,  డయాబెటీస్ వరకు వచ్చే జబ్బ్బులన్నీ మానసిక  ఒత్తిడి నుండే మొదలవుతున్నాయి. కళ్ళ జబ్బుకు కూడా  మానసిక ఒత్తిడే కారణము. అయిదేళ్ళ పిల్లాడు కూడా లావు కళ్ళద్దాలతో వెళుతుంటే ఆశ్చర్య మేస్తుంది.. ఆటలు, పాటలతో గడప వలసిన చదువుల పేరుతొ పుస్తకాల మూటలను మోస్తూ,ఒక రకముగా జైలు జీవితాన్ని వారు గడుపుతున్నారు. ఇందుకు ప్రధానముగా  కార్పొరేట్  విద్యా సంస్థలను, పిల్లల తల్లి దండ్రులను తప్పు పట్టాలి.”
“స్వామీ! మీతో చాలా విషయాలు మాట్లాడాలి. మీరు ఉంటారా?”
“మహా లక్ష్మి గుడి దగ్గిర ఒక ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు నాకు వేరే పని ఉంది. రేపు మహాలక్ష్మి అమ్మవారి గుడి ముందున్న అరుగు మీద కలుద్దాము.
                         **************************************


Monday, October 1, 2018

ప్రస్థానము 9




గొపీ తిరిగి బెంగుళూరు లో తన మిత్రులతో సమావేసము అయినాడు. నడుస్తున్న పరిస్థితులను గురించి చర్చించినాడు.
అందరూ ఇప్పుడున్న వ్యవస్థకు బద్దులే. ఈ దేశములో మొదట గాంధీ స్వాతంత్ర్యము కోసము పోరాడింది  రెండు నినాదాలతో. మొదటిది స్వదేశీయత, రెండవది స్వరాజ్యము. గాంధీ స్వయముగా ఆధ్యాత్మిక వేత్త. స్వరాజ్యము అంటే మొదటి స్థాయిలో మనలను మనము పాలించుకోనడము. దీని వలన సహజముగా  ఆధ్యాత్మికతలో ముందున్న ఈ దేశములో, ప్రజలలో విదేశీ ప్రభావము తగ్గుతుంది.వారిలో సహజముగా ఉన్న ఆధ్యాత్మికత వెలుగుతుంది. అప్పుడు రెండవ మెట్టు ఎక్కుతారు. ఆ స్థాయిలో స్వరాజ్యము అంటే ఆత్మ సామ్రాజ్యము. అందుకు తగిన వాతావరణాన్ని నిర్మించాలని ఆశ పడినాడు.
ప్రపంచ మంతా  భౌతిక వాదము ప్రజ్వరిల్లుతున్న రోజుల్లో  వెలుగు చూపించ గలిగిన శక్తి ఒక్క భారత దేశానికే  ఉండినది. కానీ పరాయి పాలన వలన ఆ వెలుగు బయటకు రావటము  లేదు .పాశ్చాత్యదేశాలలో  రెండు ప్రపంచ యుద్ధాల వలన ప్రజలు బాధలు భరించ లేక అంతరంగము లో  ఏడ్చి  ఏడ్చి, ఇంక ఏడుపు కూడా రాని స్థితికి చేరుకొని నారు. అటువంటి తీవ్రమయిన పరిస్థితులలో  వారి భౌతిక దేహమునకు కామ దేహమునకు మధ్య యున్న పోర చీరి పోయి , మొదటి సారి,  ఆ పరిస్థితులను తట్టుకొని  నిలిచినా వారికి కామ లోకమనే మరో లోకము ప్రత్యక్షమయినదని మహాత్ములు భావిస్తున్నారు. ఈ విధముగా యూరప్  లో ఆధ్యాత్మికత కొత్త  అనుభవాలతో ప్రత్యక్షమయినది. ఇదే సమయములో రాంపా అనే టిబెట్ యోగి చైనా  దేశములో చిత్ర హింసలను అనుభవించి, ఇంక తనకు సహకరించని  భౌతిక దేహమును వదిలి వేయాలనుకున్న సమయములో  మింగ్  యార్  దొండుప్  పేరు గల అతడి గురువు , ఐరోపా లో భౌతిక లోకము కాక వేరే లోకములున్నాయని  వారికి తెలియడానికి , అతడిని ఆత్మ హత్య చేసుకొనుటకు సిద్ధ పడిన ఒక ఆంగ్లేయుడితో ఒప్పందము చేసుకొని అతడి దేహములో అతడిని ప్రవేశ పెట్టినాడు. ఆ దేహములో ఆయన తన అనుభవాలను గురించి ఎన్నో పుస్తకములు ఆంగ్ల భాషలో వ్రాసినాడు. వీటితో పాశ్చా త్యులలో కొత్త అనుభవాలను రేకెత్తించినాయి.
ఇదే సమయములో కొందరు మహాత్ములు భూమి మీద తమ కార్యక్రమమును సత్వరముగా నిర్వహించుటకు తల్లి దేహములో ప్రవేశించుటకు బదులు మరణ స్థితిలో యున్న కొంత మంది దేహాలను ఆశ్రయిస్తున్నారని కొంత మంది పాశ్చాత్యులు  భావించినారు. వీరినే వాకిన్  లు అని వారు పిలిచినారు.కరంచంద్ గాంధీ మరణించ పోతున్న సమయములో ఆయన దేహములో ఒక మహాత్ముడు ప్రవేశించి,  ఈ దేశ స్వాతంత్ర్యాని కృషి  చేసినాడన్నా మరొక కథన కూడా ఉన్నది. తనను ఆశ్రయించిన ఆఖరి వ్యక్తీ నిర్వాణము అందుకొనే వరకు భూమి మీద తన కార్యక్రమములు జరుగుతాయని గౌతమ బుద్ధుడు చెప్పినాడు. వంటి మీద పూర్తిగా అప్పుకోనుటకు దుస్తులు లేని భారతీయుల దుస్థితికి చింతించిన గాంధీజీ , ఈ పరిస్థితి మారే వరకు పై వస్త్రము ధరించనని దానిని వదిలి వేసినాడు. ఈ విధముగా ఆయన ఋషుల, రాజర్షుల సాంప్రదాయాన్ని అనుసరించినాడు. భూమితో, ప్రకృతి తో తాదాత్మ్యము చెంది జీవించే రైతుల ఆవాసమయిన గ్రామాలలో భారత దేశము యొక్క ఆత్మ ఉందని భావించిన గాంధీ గ్రామాలకు ప్రాధాన్యత ఈయ వలెనని భావించినాడు.  
గ్రంథములలో కూడా సజీవ మరియు నిర్జీవ గ్రంతములని యున్నవి. ఎన్ని సార్లు చదివినా మన ఆలోచనల పరిధి మార్చనివి నిర్జీవ గ్రంథము లని అంటారు. అదే భగవద్గీత లాంటిది  మన ఆధ్యాత్మిక స్థాయి పెరిగీ దానిని బట్టి  ఆ స్థాయికి తగ్గ  అర్థములను ఇస్తాయి. అందుకే వాటిని సజీవ గ్రంతములని అంటారు.
ఇంక స్వదేశి అంటే మన దేశములో తయారయినవే వాడుకోవాలన్నది ఒక అర్థము. అందు వలన దేశము  ఆర్థికముగా ఎదుగుటే  కాకుండా పౌరులకు ఆత్మ విశ్వాసమును పెంచుతుంది. దేశము అనే పదమునకు దేహము అని కూడా అర్థము వస్తుంది.అంటే మనకు కావలసినవి మనము చేసుకో గలగాలి. గోకులములో శ్రీ కృష్ణుడు ఇటువంటి స్థితినే తీసు కొను వచ్చుటకు ప్రయత్నమూ చేసినాడు. సత్య సాయి విద్యా సంస్థలలో బాబా ఇటువంటి రాయత్నమునే చేసినాడు.
దీనిని అంగీకరించి సాధించినపుడు మనకు స్వరాజ్యము వస్తుంది. మన దేశములో ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇదే. కాని, మనము దానికి దూరముగా వెళ్ళిపోయినాము.
మొదట్లో మనకు పశు సంపద చాలా ఉండేది. మన జనాభా  ముప్పది కోట్లు ఉన్నప్పుడు మనకున్న ఆవుల సంపద ముప్పది కోట్లు ఉండేదని ఒకరు అన్నారు. పైనాంపురము చుట్టు పక్కల  పశు సంపద చాలా ఉండేది. నర్తనశాల సినిమా కొరకు ఉత్తర గోగ్రహణ  చిత్రీకరణకు యానాటి చిన్న రాజారెడ్డి యొక్క ఆవులను వాడుకున్నారని ఇక్కడ చెప్పే వారు. అప్పుడు వరిపంట కూడా బాగా ఎత్తు ఎదిగేది. పంటల కోటలయిన తరువాత వచ్చే గడ్డి చాలా ఎక్కువగానే ఉండేది. అందు వలన పశువుల మేతకు కుడా ఖర్చు ఎక్కువ అయేది కాదు.పగటి పూట బయట తోపులలో తిప్పుకొని వచ్చే వారు. సాయంత్రమఎసరికి లేగ దూడలు వాటి వైపు ఆత్రముగా పరిగెత్తుకొని వచ్చేవి. ఆరోజులల్లో ఆవులకు ఒక పూటే పాలు పితికే వారు. అందుకని దూడలు కూడా బాగా బలంగా ఎదిగేవి. సాయంత్రము పసిపిల్లలు ఆదూడలతో ఆడుకొనే వారు. వారి మధ్య స్నేహము ఎంత ఉండేదంటే, పిలిస్తే చాలు అవి పరుగెత్తుకొని వచ్చేవి. ఈ విధముగా రైతులకు పశువులకు మధ్య తెలియని ఆత్మీయత ఉండేది. మిగిలిన ఎందు గడ్డిని పాకాలకు కప్పుగా వేసే వారు.
వచ్చిన పంటలో మేలయిన ధాన్యాన్ని ప్రత్యేకముగా ఎండ బెట్టి దాన్నే తరువాత పంటకు విత్తనాలుగా వాడే వారు. ఈవిధముగా ఏ  నాడూ విత్తనాలను కొనే వారు కాదు. పశువుల మల మూత్రాలతో కూడి కుళ్ళిన గడ్డినే ఎరువుగా వాడే వారు. జిల్లేడు, వెంపల లాటి మొక్కలను కూడా ఎరువుగా వాడే వారు. ఈ విధముగా నేలకు సారాన్ని అందించే వారు. అంతే కాక ఈ రకమయిన వ్యవసాయములో కీటకాల మరియు తెగుళ్ల బాధ ఉండేది కాదు. ఈ విధముగా రైతుకు కూలీల ఖర్చు తప్ప తక్కువ ఖర్చుతో పంట ఇంటికి వచ్చేది.  అంటే కాక రైతుకు కూలీలకు మధ్య స్నేహ భావ ముండేది.
ఆ సమయములో దేశీయ అవసరాలకోసమని ఎక్కువ పంట పండించుటకై హరిత విప్లవము మొదలయినది. ఉన్న పొలములో ఎక్కువ పంట పండించాలన్నదే ఉద్దేశ్యము. ఇందుకోసము మొదట రసాయనిక ఎరువులు ప్రవేశించినాయి. ఎక్కువ పంట వస్తుందని రైతు ఎగబడినాడు. మొదటి సంవత్సరము, రెండవ సంవత్సరము పంట బాగా పండినది. మూడవ సంవత్సరము వచ్చేసరికి పంట తగ్గి పోసాగినది. అందుకని ఎరువు మోతాదును పెంచమన్నారు.క్రమముగా అంతకు ముందు లేని విధముగా పంటల మీద కీటకముల దాడి మొదలయినది. కొత్తగా ఎరువులతో బాటు పురుగు మందుల ఖర్చు పెరిగింది. క్రమముగా పాత సంప్రదాయ విత్తనాల స్థానములో డి  యన్ ఏ మార్చ బడిన విత్తనాలు వచ్చి  రైతుకు విత్తనాలు కొన వలసిన స్థితి వచ్చినది.  సాంప్రదాయక విత్తనాలు పో గూడదని వేర్వేరు ప్రజా ఉద్యమాలు వచ్చినవి. క్రమముగా విత్తనాల వ్యాపారములో విదేశీ సంస్థలు కూడా ప్రవేశించుటతో పరిస్థితిని గమనించిన వందన శివ లాటి  సామాజిక వేత్తలు సాంప్రదాయక విత్తనాలను నిలవ ఉంచుటకు విత్తనాల బాంకులను ఏర్పాటు చేసినారు. ఎందుకంటే ఎప్పుడయినా విదేశీ విత్తనాల వ్యాపారులు మన మీద పట్టు కోసము నిష్క్రమిస్తే  దేశములో కరువు పరిస్థితులు ఏర్పడుతాయి. అందుకే వ్యతిరేకత వచ్చింది.
ఇన్ని ఉద్యమాలు నడుస్తున్నా ప్రజల అభిప్రాయముకు వ్యతిరేకముగా ప్రభుత్వముపై పట్టు సాధించిన  మాన్  సాంటో లాటి సంస్థలు  బి టి  ప్రత్తి విత్తనాలను దేశములో ప్రవేశ పెట్టినారు. వీటిని టెర్మినేటర్ విత్తనాలు అని అంటారు. పంతనుంది వచ్చిన విత్తనాలను తిరిగి వేస్తే అవి కుళ్ళి  పోతాయి తప్ప మొలకెత్తవు.  అంటే భవిష్యత్తులో  కంపెనీ విత్తనాలు ఇవ్వక పొతే ఇక పంటలు ఉండవన్న మాట. బి టి ప్రత్తి వెంటనే బి టి వంకాయ కూడా బయటికి రావడానికి ప్రయత్నము చేస్తున్నది.
వంకాయకు పుచ్చు రావడము మామూలే.  దాని డియన్ఏ లో సాలీడు డియన్ఏ  కు సంబంధించిన అణువును చొప్పించి, పుచ్చు లేని వంకాయ  వచ్చేటట్లు చేసి  దాని మీద వ్యాపారము చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. తువంటి మార్పుల వలన భవిష్యత్తులో ఎటువంటి  ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో అనే భయముతో ప్రజా ఉద్యమాలు వచ్చినాయి.
హైబ్రిడ్ వరి రాకతో పంట ఎత్తు తగ్గి పోయి  పశువుల మేతగా ఉపయోగపడే  గడ్డి రాబడి తగ్గి పోయినది. అంటే గాక గడ్డి  మీద ఆధార పడే అట్టల పరిశ్రమలు పెరిగి గడ్డికి మరింత గిరాకీ పెరిగినది. పెట్టుబడుల మీద  పెరిగిన బారముతో రైతు మరింత ఆదాయము కోసము గడ్డిని అమ్మడము మొదలు  పెట్టినాడు. ఈ విధముగా పశు  గ్రాసము తగ్గింది. పశువుల  పోషణ ఖర్చు పెరిగింది.క్రమముగా పసువులను పోషించా లేక అమ్మి వేయుట మొదలు పెట్టినాడు. ఇందుకు దుక్కికి నాగళ్ళకు బదులు ట్రాక్టర్లు ప్రవేశించడము కూడా కారణము అవుతుంది. ఇంతకు ముందు పశువులకు రైతులకు మధ్య స్నేహ బంధముండేది. వ్యాపార ధోరణి వలన ఇది తగ్గ పోయింది. ఇంతకూ ముందు పంట తగ్గినా రైతుకు నికర మయిన ఆదాయము ఉండేది.ఎప్పుడయినా ప్రక్రుతి భీభత్సాల వలన నష్టపోయినా త్వరగా కోలుకో గలిగే వాడు. ఇప్పడు పెట్టుబడులు పెరిగినందు వలన ప్రక్రుతి విలయాలు వస్తే కోలుకోలేనంతగా క్రుంగి పోతున్నాడు.
ఈ విధముగా మేలు చేయ  వలసిన హరిత విప్లవము వలన , వ్యాపారుల పాత్ర వలన, రైతులకు పెరిగిన అత్యాశ వలన నష్టాలు పెరిగి,నవి. ఇంతకూ ముందు రైతుకు  పశువుల మీద, పొలము మీద ఎంతో ప్రేమ ఉండేది. ఇప్పుడు రైతుకు పొలాన్ని చూస్తె ధనము తప్ప మరేమీ కనిపించుట లేదు.
పారిశ్రామిక విప్లవము చూపించిన ప్రభావము అంతా ఇంతా కాదు.దీని వలన సంపద పెరిగినది. దీని వలన గ్రామాలలో ఆస్తులను అమ్ముకొని చాలా మంది పట్టణాలకు బయలు దేరినారు. ఈ విధముగా వ్యసాయము మీద జనానికి శ్రద్ధ తగ్గినది.
పారిశ్రామిక విప్లవము రాక ముందు భారత దేశములో ప్రదానముగా  గ్రామాలలో వ్యవస్థ ధర్మమూ చుట్టూ తిరిగేది. పరిశ్రమలు వచ్చిన తరువాత వచ్చే డబ్బు మీద దృష్టి  పడినది. డబ్బు చేరితే వచ్చే సుఖాల మీద దృష్టి పెరిగినది. ఆర్ద్రత తో కూడిన ప్రేమాను బంధాల స్థాయిలో భేదాలను పెంచే ఆర్ధిక సంబంధాలు ఏర్పడినవి. సహజముగా వారిలో నున్న ధార్మిక జిజ్ఞాస బలహీన పడినది. ధర్మము స్థానములో రెండో పురుశార్థమయిన అర్థము/డబ్బు ప్రాధాన్యతను సంతరించుకున్నది. దీనితో  కుటుంబములో, సమాజములో నున్న మానవ సంబంధాలలో పగుళ్ళు/బీటలు ఏర్పడినవి. ఆర్ధిక భేదాలు వచ్చి, స్వార్థము పెరిగి ఉమ్మడి కుటుంబాలు విడి పోయినాయి. ఇప్పుడు కుటుంబాలలో అవ్వ, తాత లాంటి పదాలు దూరమవుతున్నాయి. ఉద్యోగాలు తమ సమయాన్ని తిని వేస్తున్నందువలన మనిషికి ధర్మాచరణకు కూడా తగ్గి పోయింది. ఒకటి, నాలుగు పురుషార్థాల మీద ఆసక్తి పూర్తిగా పోయి  రెండు, నాలుగు అయిన అర్థ కామాల మీదే దృష్టి నిలిచి పోయింది. కుటుంబ పెద్దలకు వృద్ధాశ్రమాలు  ఏర్పడినవి.
స్వామి వివేకానంద అమెరికాలో ఉన్నప్పుడు,ఆయనతో వృద్దులయిన తల్లి దండ్రులను ఏంటో శ్రద్ధగా చూచుకున్న ఒక అమెరికన్ యువకుడి గురించి ఒకరు ఆయనతో ప్రస్తావించినారు. ఈ విషయము మీద స్వామి నవ్వి ఊర్కున్నాదట. రెట్టించి అడిగితే “మా దేశములో ప్రతి కొడుకు ఈ మాత్రము చేస్తాడు. దీనిని మాదేసములో గొప్ప తనముగా చెప్పరు. అది కనీస భాద్యతగా భావిస్తారు.” అని జవాబిచ్చినాడు. అటువంటి మన దేశములో భాధ్యతలను  మరచి పోయినారన్న విషయము గుర్తు చేయకుండా  తల్లులు దినము, తండ్రుల దినము లాంటి తద్దినాలను ఏర్పరచింది.(తత్+దినము అంటే  ఆ దినము)
గొపీ స్నేహితుల మధ్య ఇటువంటి చర్చలే జరిగేవి. ఈ చర్చలను ఇలా కోన సాగించుత వలన ఎక్కువ ప్రయోజనము లేదని వారికి తెలుసు. కార్య రంగానికి దిగ వలసిన అవసరముంది.
గ్రామాలలో మృగ్యమయిన నీటి వసతి కోసము త్రాగు నీరు లాటివి కల్పించి వాటిని పునరుజ్జీవింప  చేయాలి. ఇది ఏ  విధముగా చేయాల్?
ప్రపంచములో అత్యంత ప్రాచీనమయిన నగరాలన్నే నదీ తీరాల వెంబడే ఏర్పడినాయి. అందుకే సింధూ నాగరికత లాంటి వన్నీ ఆయా నదుల పేర్లతోనే ఏర్పడినాయి.అక్కడ వ్యవసాయాధారిత జీవితాలే నడిచినాయి. నదులకు దోరముగా ఎక్కడయినా ఏదయినా నాగరికత ఏర్పడిందంటేఅక్కడ జంతువుల వేట ప్రధాన జీవనాధారముగా ఏర్పడింది. ఇటువంటి జీవితమూ నడిపే వారు ఆహారపు వనరులు తగ్గినపుడు, మిగిలిన వారి మీద దాడి చేసి, దోపిడీలు చేసి బ్రదికే వారు.ఈ కారణాల వలన  ప్రాచీన కాలములో నేటి వనరులున్న స్థలాల కోసము పోరాడే వారే గానీ,నీటిని పాడు చేసే వారు కాదు.
ప్రాచీన కాలములో అతిథి ఇంటికి వస్తే,కాళ్ళు  కడుగుకొనుటకు వాకిట్లో నీరుంచే వారు.అంతే కాదు చల్లగా కుండలో నీరు ఇచ్చే వారు.తెలియని వారయినా నీటి కోసము అడిగితె సాదరముగా ఇచ్చే వారు.
పారిశ్రామిక విప్లవము వచ్చిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారి పోయినవి. పరిశ్రమలలో వచ్చిన మురికిని ప్రక్కనున్న నదులలో, కాలువలలో, ఇంకా పంట కాలువలలో కలపడము మొదలు పెట్టినారు. అవేమీ లేక పొతే లోతుగా గోతులు తవ్వి,,మురికి పదార్థాలను రసాయనాలను ఆ గుంటలోకి తరలించే వారు.ఆ ప్రాంతాలలో(ఇది రంగా రెడ్డి జిల్లా లో జరిగినది) నూతులలో నీరు విషమయమయింది. ఈ విధముగా ప్రకృతి మనకు ఉచితముగా ఇచ్చిన నీటిని త్రాగ లేక  మంచి నీటిని కూడా  కొనుక్కొని  త్రాగ వలసిన పరిస్థితులు ఏర్పడినవి.
కొన్ని రసాయనిక పరిశ్రమలు తరచుగా వారి బాయిలర్ల లోని మురికినంతా గాలిలోకి వదిలి వేస్తున్నారు. ఈ విధముగా వాయు కాలుష్యము చేస్తున్నారు. తల్లిదండ్రులు అవసరము లేకున్నా తమ పిల్లలకు అతివేగముగా నడిచే ద్విశకట వాహనాలను కొని ఇస్తున్నారు.దీని వలన కూడా  వాయు కాలుష్యము పెరుగుతున్నది.
ఆకాశమంతా శబ్ద కాలుశ్యముతో బాటు,ఇంటర్నెట్ పరికరాల ద్వారా , విద్యుదయస్కాంత తరంగాల ద్వారా సరి కొత్త చెడు సంబంధాలను ప్రేరేపించే భావ కాలుష్యముతో నిండి పోయింది.
ఈ విధముగా భాద్యత తెలియని మనుషుల ద్వారా పారిశ్రామికీకరణము పంచ భూతాల కాలుష్యానికి దారి తీసింది.
పరిశ్రమలను నిర్వహించే వారు దేశానికి సంపద పెంచుతున్నారమే మాట నిజమే. కానీ కలుషిత వాతావరణము ద్వారా ప్రజలు కోల్పోయిన  దానికి తాము భాద్యత వహించాలన్న వారు కానీ, ప్రభుత్వమూ కానీ గుర్తించక పోవడము దురదృష్టకారము. ఇందులో ఎవరిని ఎవరు నియంత్రిన్చినారనేది అనవసరము.
పల్లెటూళ్ళలో ఒకప్పుడు మోసము చేసే ప్రవృత్తి ఉండేది కాదు. కానీ, ఈనాడు,సినిమాలు, టీవీ  చానల్సు ద్వారా మంచి కంటే ఛీ ఎక్కువ ప్రచారము చేయబడుతున్నది.గౌరవముగా ఒక తల్లి, చెల్లి, గృహిణి స్థానాలలో గౌరవముగా ఉండ వలసిన స్త్రీ స్థానము విలాస వస్తువుగా ప్రకటనలలో కనిపిస్తున్నా ప్రశ్నించే సత్తా ఈ నాటి వ్యవస్థకు లేకుండా పోయింది.
విలువలు కోల్పోయిన సమాజానికి ప్రశ్నించే అధికారము లేదు. ఈ నాడు జరుగుతున్నది ఆదే.