Saturday, April 2, 2016

ఆహారము



రాఘవ తన కొడుకును చూచుటకై మలేసియా  వెళ్ళినాడు. కొడుకు నాలుగు రోజులు సెలవు పెట్టి తన వెంట అన్ని ప్రదేశాలను చూపించినాడు. అక్కడ ఉండే హిందూ దేవాలయాలతో బాటు పెద్ద హోటళ్ళు, భవనాలు, పార్కులు అన్నిటికి వెళ్ళినారు.
రాఘవ స్వతహాగా మాంసాహారి. అయినా వయస్సు పెరిగే కొద్దీ మాంసాహారాన్ని తినుటను తగ్గించుకుంటూ వచ్చినాడు ఎవరయినా బంధువులు వస్తే మొహమాటానికి మాంసాహారాన్ని  నాలుకకు అంటించు కొంటున్నాడు.. అంటే గానీ ఇష్ట పడి తినుట లేదు.
నాల్గవ రోజు వాళ్ళ అబ్బాయి “నాన్నగారు! ఈ రోజు మీకు స్పెషల్ మీల్స్ పెట్టిస్తాను” అన్నాడు.
“”వద్దురా. ఇటీవల నాకు మాంసము నోటికి పడటము  లేదు.”  అంటే “ఇంకొక్క సారి మిమ్ములను పిలువను. మీతో కలిసి నాకు ఆ స్పెషల్ డిష్ తినాలని ఉంది . రండి “ అంటూ బలవంతముగా తీసుకొని వెళ్ళినాడు.
హోటల్ లోకి ప్రవేశించ గానే ఎదురుగా పంజరాలలో ఎన్నో రకాల పక్షులు కనిపించినాయి. అందులో కొన్ని పిచ్చుకలు కూడా కనిపించినాయి.
“ఏమిట్రా? వీళ్ళు  ఈ పక్షులను అంతట ప్రేమగా పెంచుకుంటారా?’ అని అడిగినాడు.
విషయము తెలిస్తే తండ్రి అక్కడి నుండే వెనుకకు తిరుగుతాడని భయముతో  “అవును” అని చెప్పి డైనింగ్ హాలుకు తీసుకొని వెళ్ళినాడు. అక్కడ తెలుగు వచ్చిన వాడు లేక పోవడము కూడా అదృష్టము అనుకున్నాడు. ఉంటే ఆయన ప్రశ్నలకు ఎగతాళి చేస్తారు.
తరువాత లోపల బిరియానీ లాటివి వడ్డించినారు. ఎందుకో రాఘవకు నోటికి వెళ్ళుట లేదు. అయినా కొడుకు కోసము బలవంతముగా కుక్కుకున్నాడు. తినడము అయిన తరువాత అనుమానము వచ్చినది.
“ఇంతకూ మనము తిన్నది ఎ మాంసము రా?” అడిగినాడు.
“ఏదయితే ఏమిటి? తినడానికి బాగుంది కదా.”
ఒక సర్వరును అడిగితే అక్కడ వచ్చీ రాని తెలుగులో ఒక సర్వరు పిచ్చుకను చూపించినాడు.
దానితో రాఘవకు షాక్  తిన్నట్లనిపించినది. వాంతి వచ్చేట్లు అనిపించినది. ఇబ్బంది రాకుండా నోట్లో బిగ గట్టుకున్నాడు. హోటల్ గది లోనికి రాగానే మొత్తం వాంతి అయి పోయింది.
“ఏమయింది నాన్నా!” అని అడిగిన కొడుకుతో వెంటనే ఇలా అన్నాడు.
“ఇది మీకు చెబితే అర్థము కాదురా. నీ మీద గారాబముతో నిన్ను ఎప్పుడు పొలాల మీదకు పంప లేదు.  అందుకే నీకు అక్కడ ప్రకృతితో అనుబంధము ఏర్పడ లేదు. అందుకే మీకు నేను ఏమి చెప్పినా అర్థము కాదు.”
“ఉదయాన్నే పక్షుల కలకలాలు ఎంత బాగుంటాయో మీకు అర్థము కాదు. మైకేల్ జాక్సన్ కేకలు మీ చెవుల్లో హోరేస్తుంటే పక్షుల కలకలాలు మీకు ఎక్కడ వినిపిస్తాయి? పంటలు వచ్చినపుడు ఆ కంకులు వాకిట్లో కడితే అప్పుడు పిచ్చుకలు ఆ కంకులు తింటూ కబుర్లు చెప్పుకొనేటప్పుడు ఆ కల కలలుకు అలవాటు పడిన మాకే తెలుస్తాయి. ఇపుడు ఆ పిచుకలు ఏమయి పోయినాయో? పల్లెటూర్లో మాకే కనిపిచుట లేదు. కొంత మంది మొబైల్స్ తరంగాల వలన అవి నశించిననాయని అంటున్నారు.”
రాఘవ తిరిగి వచ్చిన తరువాత స్వామి శివానందను కలిసినారు.  ఆయన తో కొంత సేపు ఉండి తన అనుమానాలను తీర్చుకోవాలని అనుకున్నాడు.
“స్వామీజీ! మలేసియా లో అన్ని రకాల జీవులను భోంచేస్తారు. ఒక సారి పిచ్చుక మాంసము తిన్న తరువాత  అది ఏమిటో తెలిసింది. కానీ ఈ నా దేహము దాన్ని అంగీకరించ లేదు. వాంతి అయింది. ఎందుకలా జరిగింది? ఆ తరువాత మాంసాహారాన్ని మాని వేయాలని అనిపిస్తున్నది. ఎదో అశాంతి? కారణము తెలియుట లేదు.”
“ రాఘవా! నీ బాధ నాకు అర్థమయింది. రోజు తినే ఆహారము లోనూ జీవ హింస జరుగుతున్నది. కానీ అవి తినడాని కొరకే ఉన్నాయన్న భావన వలన నీ మనస్సు దానిని గుర్తించ లేదు. అదే పిచ్చుకల లాంటి జీవుల మీద నీకున్న అనుబంధము వలన  వాటి మాంసాన్ని నీ మనస్సు అంగీకరించుట లేదు.”
“ మరి మాంసాహారము తినుట వలన ఏ దోషము లేదంటారా?”
“ఖచ్చితముగా దోషముంది. కానీ అది నీ యొక్క పరిణామ స్థితిని అనుసరించి ఉంటుంది. ఈశావాస్య ఉపనిషత్తులో సమస్త జీవులలో నీలో ఉన్న దైవము ఒకటే అన్న విషయాన్ని గుర్తించమంటారు.”
“అంటే నాకు అర్థము కావటము లేదు.”
“ఒక్కొక్క విషయము వారి ఆధ్యాత్మికముగా ఎదిగిన స్థాయి మీద ఆధార పడుతుంది. ఋషులు ఏ విషయాన్నీ ఖచ్చితముగా ఆదేశించారు. ఒక సారి ఒకరు గౌతమ బుద్ద్దుడి దగ్గిరకు వచ్చినాడుట. “దేవుడున్నాడా? “ అని అడిగినాడుట.”ఔను ఉన్నాడు” అని బుద్దుడు చెప్పినాడుట.  తరువాత మరొకరు వచ్చి “దేవుడంటూ ఎవరు లేరు కదా.” అని అడిగినాదుట. బుద్ధుడు,”ఔను లేరు.” అని చెప్పినాదుట. వెంటనే అడిగిన వాడు వెళ్లి పోయినాడు. రెండు జవాబులు విన్న శిష్యుడు అడిగినాదుట. “గురు వర్యా! ఆ విధముగా వ్యతిరేకమయిన జవాబులు చెప్పినారేమిటి?” అప్పుడు శిష్యుడికి బుద్ధుడు జవాబు చెప్పినారుట.
“ఏమన్నారు?”
“మొదట వచ్చిన వాడు దేవుడు ఉన్నాడు అనే నిశ్చయముతో వచ్చినాడు. రెండవ వాడు దేవుడు లేడనే నిశ్చయముతో ఉన్నాడు. ఇద్దరికీ వివరణలు చర్చలు అక్ఖర లేదు. అందుకే వారికి అటువంటి జవాబులు వచ్చినవి. తెలుసుకోవాలి అనుకున్న వారికే చర్చలు, వివరణలు కావాలి. వారి కవసరము లేదు. తమ అభిప్రాయాలు సరి అయినవి అనుకున్న వారికి  వివరణలు అక్ఖర లేదు.”
“మరి తెలుసుకోవాలంటే ఎలా?”
“గురువు మీద సమర్పణ భావము ఉండాలి. నిజముగా తెలుసుకోవాలి అన్న భావన ఉండాలి.. అప్పుడే సరి అయిన సమాదానము వస్తుంది. అంటే కానీ, కథలను వక్రీకరించే కుకవులను దగ్గిరకు చేరనీయ కూడదు.”
“కుకవులంటే?”
“ప్రతి విషయాన్నీ లేదా ప్రతి కథను సత్యానికి కాకుండా తన భావాలకు అనుగుణముగా మార్చి చెప్పే వారిని కుకవులని అంటారు.”
“కుకవి పేరు ఎలా వచ్చిందో చెబుతారా?”
“నిజానికి కవి అంటే ప్రజ్ఞను కలిగిన వాడు. సృజనాత్మకతను కలిగిన వాడు. గురువు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింప చేస్తే  శుక్రుడు లోకములో ఎ పనిని అయినా ప్రజ్ఞతో ఎలా నిర్వహించాలో చెబుతాడు. అందుకే జ్యోతిషములో ఉన్నత మయిన సృజనాత్మకతకు అధిపతి శుక్రుడు. అందుకే మన పురాణాలలో శుక్రుడికి మరో పేరు ఉంది. అది కవి. దీనికి కు ముందు కలిపితే కుకవి ఏర్పడుతుంది. కుమతి కూడా ఇలాటి పదమే. కు శబ్దమునకు పృథ్వి అని అర్థము. పృధ్వీ తత్త్వము అంటే ఎప్పుడు భౌతిక స్థాయిని దాటాడు. తను ఎంత సేపు ఎలా బ్రదకాలి, ఎలా తినాలి అని తప్ప పైకి ఎదగని వారి స్థితిని కు శబ్దము సూచిస్తుంది. భూమికి పుట్టిన వాడిని కుజుడు అంటారు. భూవలయాన్ని కువలయము అంటారు. తన దేహము తన ఉనికి ని మించి ఆలోచించ లేని ఈ వర్గము లోనికి వస్తారు. వీరు పూర్తి స్వార్థ పరులు.”
“మరి దానికి ఉదాహరణ చెబుతారా?”
“నేను చెప్పిన బుద్ధుడి కథనే మరొకరు ఇంకో రకముగా చెప్పడము విన్నాను. ఒకరు బుద్ధుడి దగ్గిరకు వెళ్లి “దేవుడున్నాడా?” అని అడిగితే “లేదు” అని చెప్పినారుట. “మరొకరు వెళ్లి దేవుడు లేడు కదా?” అని అడిగితే “ఉన్నాడు” అని చెప్పినారుట. ఇది నేను ఇప్పుడు నేను చెప్పిన కథకు పూర్తిగా వ్యతిరేకము. వారు చెప్పిన దానికి వ్యతిరేకముగా చెబితే బుద్ధుడు వారి అంతరంగములో విమర్శ పెంచాలని ఇలా చెప్పినారని ఆకథలో చెబుతారు. ఇక జ్ఞాన సముపార్జనలో రెండు మార్గములున్నాయి. అందులో మొదటిది ధ్యాన మార్గము. ఇందులో ఎటువంటి సంఘర్షణ  ఉండదు. ఈ మార్గములో మనస్సు లోతులకు వెళితే మనలో అంతః శక్తులు మేలుకొని వారిని సరి చేస్తాయి. ఇక రెండవది సంఘర్షణ మార్గము. ఇది చర్చ తో కూడినది. ఏది సరి అయినది అని చర్చిస్తూ అవసరమయితే తలలు పగుల కొట్టుకొనే మార్గము. బుద్ధుడి మార్గము మాత్రము ఇది కాదు. ఆయన పద్ధతిలో తర్కానికి స్థానము లేదు. అనుభూతి మాత్రమె ప్రధానము. వ్యతిరేక మార్గములో జవాబు చెప్పుట బుద్ధుడి మార్గము కాదు. ఇది ఎవరిదో స్వయం కల్పితము. ఇక అసలు విషయానికి వస్తాము.”
ఒకప్పుడు కాశ్మీరము శైపాగమ శాస్త్రాలకు ప్రసిద్ధి. విజ్ఞాన భైరవ తంత్రము, శివ సూత్రాలు వంటి గ్రంథాలు అక్కడి నుండే వచ్చినవి. ఇందులో విజ్ఞాన భైరవ తంత్రము లో జగన్మాత పార్వతి పరమేశ్వరుడిని ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. ప్రతి ప్రశ్నకు ఒక సాధనా మార్గమును శివుడు జవాబు గా ఇస్తాడు. ఇందులో ఒక సాధనా మార్గమే బౌద్ధము లోనికి వచ్చింది.”
“ఇవన్నీ ఎందుకు చెప్ప వలసి వచ్చిందంటే శాస్త్ర విషయాలను కూడా వక్రీ కరించుట చాలా జరిగిందని చెప్పడానికి. ఇక ఆహారము విషయానికి వస్తాము. మానవేతర జీవి మొదటి సారి మనిషిగా పుట్టినపుడు, గత జన్మ సంస్కారాలు తమతో తీసుకొని వస్తుంది. ఇక మాంసాహారముతో జీపించేటప్పుడు ఆ మాంసము గతములో ఎ జీవి దేహములో భాగమో  ఆ సంస్కారాలు కూడా అందులో చేరుతుంది. అందుకే వారి మానసిక స్థాయి ఎదగడానికి అడ్డు పడుతుంది. ఇక మాంసాహారపువంటకాలలో మసాలాలు కూడా దండిగా చేరుతాయి. నోరు లేదా నాలుక రుచి బాగుందని అంటూనే ఉంటుంది. ఇక బొజ్జలో మంట రేగుతుంది. అందుకే వారిలో కోపముతో బాటు ఇతర గుణాలు కూడా చేరుతాయి. బుద్ధి సునిసితత్వము తగ్గుతుంది.ఇక ప్రసార మాధ్యమాలు వ్యాపారానికి ఎన్నో వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నాయి. ఇక సినిమాల విషయము చెప్పనక్ఖర లేదు. ఒక సినిమాలో కథా నాయకుడు త్రాగుడు, క్లబ్ జీవితాల్లో హుషారుగా తిరుగుతూ కూడా చదువులో అందరికంటే ముందు ఉంటాడు. మరొక సినిమా లో కథా నాయిక అంటుంది,””నేను రోజు చికెన్ తింటున్నా నాకు ఫాస్ట్ మార్కు వచ్చింది” ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ వారే నిర్ణయించుకోవాలి.”
“ఇక ఆధ్యాత్మికత లో ఎదుగుదల వచ్చే కొద్దీ కొన్ని మార్పులు తమంతట తాము వస్తాయి. ముందు మాంసాహారాన్ని వదిలి వేస్తారు. తరువాత మసాలాలను వదిలి వేస్తారు. తరువాత వండిన ఆహార పదార్థాలను వదిలి వేసి పచ్చి కూరలకు వస్తారు. అటు తరువాత నీటిని మాత్రమె త్రాగే వారున్నారు. ఇక సూర్యుడి కిరణాలతో బ్రదికే వారున్నారు.
అటువంటి వారి ప్రజ్ఞలో తీవ్రమయిన మార్పు వస్తుంది. అది ఒకరు చెబితే తెలిసేది కాదు. స్వంత అనుభవములో తెలిసేది.
ఈ ఆహారము మంచిదనేది ఒకరు చెబితే తెలిసేది కాదు. అందుకే విని, చేసి, ఎవరూ నేర్చుకోలేరు, అది వారి అనుభవానికి అందితే తప్ప.
ఇక భూమి మీద  ప్రశాంతతకు సహకరించాలనుకున్న వారు, ఆవేశము ప్రశాంతత కావాలనుకున్న వారు ఏదో ఒక రోజు శాకాహారానికి రాక తప్పదు. ఇది శాసనము కాదు.
ప్రకృతి యొక్క అనుశాసనము..”
                     ***************************


Thursday, March 3, 2016

నిజం





మనసు లోని భావనలను మనసు లోనె దాచుకొని
వాటికి వేరే కారణమును రూపొందించుకొని
తను బలహీనుడనని మరి మరి తను తలచుకొని
కలగి పోవుటది వృధా లెమ్ము, లెమ్ము, లేలెమ్ము.

జపములు సాధనములు, ధ్యానములు, మార్గములు,
చేరుటకు తీరమ్మును,చుక్కానిగ దారి చూపు
నా దేశము తక్కువ యని పల్కు వారి నోరు మూసి,
చేర గలము తీరమ్మును, బల హీనత తరిమి వేసి.

కత్తి మొన మీద నడక జీవితమున ఇది నిజం
పూల దారి మన కొఱకు పఱవరు ఎవరు.
మన పూర్వీకులు ఋషులు, మన పురాణ వీరులు
మనకు ఎపుడు ఆదర్శము నడిపింతురు వారు.

నడవాలి నడవాలి, అలసట మనసుకు లేదు.
ఒంటరిగా లేము మనము వెంటనె యున్నారు వారు
ఒంటరి వారము కాము ఇది నిజము నిజమ్ము.

గతమున మనమెవ్వరమో ఏమి పనుల చేసితిమో
ఎఱుక చేసుకొని ఒకపరి పిరికితనము తరిమి వేసి
మాటలోని నీరసమును మూలలకు పంపి వేసి
చేయగలము మనము చూడు నిక్కమ్మిది నా మాట.

Friday, February 5, 2016

బహుమతి




తేజ ఇంటికి రాగానే ముందు అమ్మ విరుచుక పడింది.
బాగా ప్రిపేర్ అయినావు కదా. ఆ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్ప లేక పోయినావు. మీ నాన్న వస్తే నన్నే తిదుతాడు.”
తేజ జవాబు ఈయ లేదు.
ఎంత? లక్ష రూపాయల బహుమతి. నీవెప్పుడయినా సంపాదించ గలవా? అంట మొత్తాన్ని.”
తేజ నుండి జవాబు రాలేదు.
ఏమిటి? దేనికీ జవాబు చెప్పవు.”
ముందే చెప్పాను కదమ్మా! గుర్తు రాలేదని.”
నేను నమ్మను.”
మరేమి చేసేది?”
నీవేమో ఇలా చేసేవు. మీ నాన్న నన్నే అడుగుతాడు. నేనేమి జవాబు చెప్పేది? ఇంక నీతో మాట్లాడను.” జయ విసురుగా లోపలికి వెళ్లి పోయింది.
తేజ గది లోకి వెళ్లి పండుకున్నాడు. కళ్ళల్లో నీళ్ళు కారుతుంటే ఎవరికీ కనిపించకుండా పక్కకు తిరిగి పండుకున్నాడు.
జయ కాసేపు కోపముతో ఉడికి పోయింది. తరువాత నెమ్మదిగా చల్ల పడింది.
ఇటీవల ఒక టీవీ చానల్లో మేధావి పేరు తొ ఒక క్విజ్ పోటీలు జరుపుతున్నారు. పది బృందాలుగా చేసి ప్రతి బృందాన్ని విడి విడి గా పరీక్షించి ఒకరిని తీసుకొని తిరిగి ఫైనల్లో ఆ గెలిచిన పది మందికి పోటీ పెడతారు. ప్రశ్న అడిగి నాలుగు జవాబులు ఇస్తారు. అందులో ఏది సరి అయినదో చెప్పాలి. ఇవి కూడా లాటరీ లాగా తయారయిందని విమర్శలు వచ్చేసరికి కొద్దిగా మార్చినారు. సరి అయిన జవాబు చెపితే ఓకే మార్కు, వివరణ ఇస్తే రెండు మార్కులు పెట్టినారు. ఇది కొంత మందికి ఇబ్బంది అనిపించినా లక్ష రూపాయల అంతిమ బహుమతి అనేసరికి చాలా మంది పోటీకి వచ్చినారు. తేజ నాన్న గారి తేజ ఇండస్త్రీస్ కూడా దీన్ని స్పాన్సర్ చేసినారు.
చివర్లో పోటీ రవి మరియు తేజాల మధ్య ఎక్కువగా ఉండినది. చివర్లో ఒక్క ప్రశ్న తేజ చెప్పకుండా రవి చెప్పేసరికి లక్ష రూపాయల బహుమతి రవికి వచ్చింది. తేజ అమ్మ నాన్నలకు ఇదే బాధ కలిగించినది. అందుకే తేజ అమ్మ అంట కోప పడినది.
ఇంట్లో హడావిడిగా తిరుగుతూ ఉండే పిల్లాడు అలా పండుకొని ఉండే సరికి జయకు మళ్లీ జాలి వేసింది. తను అనవసరముగా తిట్టే నేమో అనిపించినది. నెమ్మదిగా తేజ దగ్గరి కి వెళ్ళింది. వాడి పక్క మీద కూర్చుంది. వాడి తలను తన వైపు తిప్పుకుంది. వాడి కళ్ళల్లో నీళ్ళు చూచేసరికి దిగులు వేసింది.
ఏం నాన్నా నిజముగా గుర్తుకు రాలేదా?” నెమ్మదిగా అడిగింది.
అమ్మా! నీవు ఏమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను.”
చెప్పు నాన్నా!”
నేను కావాలనే జవాబు చెప్ప లేదు.”
జయకు మళ్ళీ కోపము వచ్చింది. అయినా సర్దుకొని “ఏమి నాన్నా!” అని అడిగింది.
నీకు రవి తెలుసు గదమ్మా!”
ఆ మొదటి బహుమతి వచ్చిన వాడే కదా.”
అవునమ్మా! నా పుట్టిన రోజుకు పిలవడానికి వాడింటికి వెళ్లి నానమ్మా! ఇంట్లో అంతా గొడవగా ఉంది. రవికి నాన్న లేడమ్మా! అమ్మే బయట ఎక్కడో పని చేసి గడుపుతున్నాది’ రెండు నెలలుగా అద్దె కట్ట లేదట. ఇల్లు గల ఆయన బెదిరించి వెళ్ళినాడు. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు. ఆ సమయములో నేను వెళ్ళడము నాకే సిగ్గు వేసింది. “
అయితే”
రవి చాలా మంచి వాడమ్మా. మేమిద్దరమూ కూర్చుంటే సైన్స్ తప్ప వేరే విషయము మాట్లాడుకోము. ఏ విషయమైనా ఎంత బాగా వివరిస్తాడనుకున్నావు. “ కా సేపు ఆగినాడు.
జయ వాడి వైపే చుస్తున్నాది.
అమ్మా! నా పుట్టిన రోజున నాన్న అంత ఖర్చు పెట్టినాడు కదా. ఒక వేయి రూపాయలు రవి కి సాయము చేస్తే మనకు నష్టము లేదు కదమ్మా.”
నాన్నను అడిగినానమ్మా! రవిని చూస్తే నాకు ఏడుపు వస్తుందమ్మా! కానీ నాన్న సాయము చేయడానికి ఒప్పుకోలేదమ్మా!”
మళ్ళీ ఆగినాడు.
రవి కి సాయము చేద్దామని ఉంది. కాని ఎలా చేయాలో తెలియ లేదమ్మా!”
ఈ పోటీ లో గెలిస్తే మేము ఇద్దరమే గెలవాలి. కానీ రవి ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనేదే నన్ను ఎడిపిస్తున్నాది.”
మళ్ళీ ఆగినాడు.
అందుకనే జవాబు గుర్తు రాలేదా?” జయ అడిగింది.
అమ్మా! ఈ బహుమతి రాక పోయినా మనకు ఏ విధముగా నష్టము లేదు. అదే రవికి వస్తే ఇంట్లో ఇబ్బందులు కొంత తీరి రవి ముఖములో సంతోషము కనిపిస్తుంది. అందుకే అమ్మా! ఆఖరులో జవాబు తెలిసి కూడా ఉంది పోయాను.”
అమ్మా! నాకు గుర్తు లేదని అబద్ధము చెప్పాను. క్షమించవా? సారీ అమ్మా!”
నిజం చెప్పు అమ్మా! మనకు ఆ లక్ష రూపాయలు అంట అవసరమని అంటావా?” ఏడుపు ముఖముతో తేజ అడిగే సరికి జయ కు జాలి వేసింది.
నాన్నా! నీవు మంచి పనే చేసినావు. మీ నాన్నకు నేను చెబుతాలే. ముందు వెళ్లి ముఖము కడుక్కో.” జయ నవ్వుతూనే అనేసరికి తేజ హుషారుగా లేచి కుళాయి దగ్గిరకు పరుగెత్తాడు.
**********************************************************************************





Sunday, April 5, 2015

నిప్పు రవ్వలు



మనటీవి లో పెద్ద అక్షరాలలో ప్రత్యేక ప్రకటన.
ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా మీకు ఉత్సుకత రేపే సీరియల్
నిప్పు రవ్వలు.
అనుక్షణము మిమ్ములను ఉద్వేగములో ముంచెత్తుతుంది. మీరు చాలా కాలమునుండి ఎదురు చూస్తున్న రచయిత నుండి, మీ కోసం, మీ కుటుంబము కోసము, మీ ఆనందము కోసము ........
ఒక రోజు,
హృదయానికి హత్తుకొనే సంభాషణలతో, మీ కోసం, మీ కోసం, మీ ఆనందము కోసం.......
మరో రోజు,
ఒక నిజమయిన హీరో తనకు జరిగిన అన్యాయాన్ని ఎంత నిబ్బరముగా ఎదుర్కొన్నాడో  చూడాలంటే..
ఇలా రోజుకు ఒక ప్రకటన.
ఈ ప్రకటనలను చూచే ప్రేక్షకులకు ముందే పిచ్చి ఎక్కుతున్నాది. నెల రోజుల ప్రకటనల తరువాత సీరియల్ మొదలయింది.
          ఈ సీరియల్ లో అయిదు మంది నాయకులు, రాజ్యాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిదు మంది నాయికలు.
అందులో కథా నాయకుడికి కాస్త ఆవేశము పాలు ఎక్కువ. ఒక ఊత పదము కూడా పెట్టినారు, అతడి మాటలకు. నది రోడ్డు లో అతడిని ఒకరు అవమానిస్తారు. అప్పుడు అతడు మాట్లాడిన ఆవేశ పూరిత డైలాగులను చూచి, అంటే అతడి వాచికమును చూచి ఒకతడు ఆశ్చర్య పోతాడు. తను తీయ బోయే సినీమా లో నాయకుడి పాత్రకు సరిపోతాడని అనిపించి, అక్కడే అతడిని నాయకుడిగా బుక్ చేస్తాడు. ఆ సినీమా సూపర్ హిట్ అవుతుంది. దానితో అతడు తిరుగు లేని నాయకుడు అవుతాడు. అతడి ఊత పదము జనం నోట్లో నాని పోతుంది. ఆడికి అవకాసము ఇచ్చిన దర్శకుడి రేంజ్ కూడా బాగా పెరిగి పోతుంది.
రాజకీయాలలో  ఎదగాలని అనుకున్న ఒక యువకుడు ఈ సినీమా ను చూచి స్ఫూర్తి పొందుతాడు. ఆ కథా నాయకుడితో పరిచయము, స్నేహము, అనుబంధము పెంచుకుంటాడు.
ఈ దర్శకుడు, నాయకుడు, రాజకీయ నాయకుడు, ముగ్గురు కలిసి భారీ పరిశ్రమలతో ఒక ప్రాంతాన్ని అభి వృద్ధి చేయాలని అనుకుంటారు. అంటే కాక ఆ పరిశ్రమల ద్వారా ఏంటో మందికి ఉపాధి కల్పించాలని అనుకుంటారు. ఆ ప్రాంతములో ఒక యువకుడు వీరి పరిశ్రమల వలన వాళ్ళ పంట పొలాలన్నీ పోతాయని గొడవ చేస్తాడు. అయితే ఏమీ లేని వాళ్లకు అక్కడ వాళ్లకు లభించే కూలీకి అయిదు రెట్లు ఆదాయాన్ని కళ్ళ చూపిస్తామని వీరు హామీ ఇస్తారు. వీరు నిస్వార్తముగా ( ఈ కథలో ) చేయాలనుకున్న సేవను ఎక్కువ మంది నమ్మరు. ఆ నమ్మని వారికి నాయకుడే మన నాల్గవ కథా నాయకుడు. అతడు రైతులకు ఈ ముగ్గురికి వారధి.
ఒక రైతుకు కూతురు పెళ్లి నిర్ణయము అవుతుంది. మరో వారము రోజుల్లో పెళ్లి అనగా అతడి పొలాన్ని వీళ్ళు తీసేసుకుంటారు.  గుండె ఆగి పోయి ఆ రైతు మరణిస్తాడు. ఆ పెళ్లి ఆగి పోతుంది. చివరకు పెళ్లి కూతురు అన్న ఆక్రోశము తో బయటకు వస్తాడు. అతడు అయిదవ కథా నాయకుడు. ఆ పెళ్లి కూతురు ఒకానొక నాయిక అవుతుంది.
వీరు అయిదు మందే మన నిప్పు రవ్వలు.
ఈ సీరియల్ లో డైలాగులు ఎంత తీవ్రముగా ఉంటాయంటే  ప్రతి యొక్కరు నాయకుల వలె కనిపిస్తారు. ఒక్కొక్క సారి వీళ్ళు నాయకులా, ప్రతి నాయకులా అనే  అనుమానము రాక పోదు. అయినా రోజు రోజుకూ చూచే వారి సంఖ్య పెరుగుతున్నది. ఇంకా తమకు వచ్చే అనుమానాలు తీర్చుకోవడానికి నిప్పు రవ్వలు అభిమాన కమిటీలు ఏర్పడినాయి. ఇంకా వాళ్లకు రోజంతా ఇందులోని మలుపుల మీదే చర్చ.
కంప్యూటర్ గేమ్స్  ఆడే వాళ్ళ మత్తు కంటే  ఈ మత్తు మరీ ఎక్కువగా ఉందని  సామాజిక వేత్తలు గమనించి,దీని మీద పితూరీలు(కంప్లైంట్స్ )పెట్టినారు. ఇది అన్యాయమనీ వ్యక్తిగత స్వాతంత్రానికి భంగకరమని మానవ హక్కుల సంఘాలు ఆ పితూరీలను ఎదుర్కొన్నాయి.  ఇంకా ఈ కేసు జరుగుతున్నంత కాలము ఈ సీరియల్ కు ఎలాటి భయము లేదు.
ఇంకా ఈ విషయములో వస్తున్న కంప్లైంట్స్ మీద ప్రభుత్వానికి ఎలా స్పందించాలో తెలియటము లేదు. కుల ద్వేషము పేరు చెప్పి దీనిని ఆపేయాలంటే, ఇందులో కులాంతర వివాహాలున్నాయి. మత ద్వేషము పేరు చెప్పాలంటే  ఇందులో మతాంతర వివాహాలు కూడా ఉన్నాయి. ఏ ఇతర కారణము చూపించినా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘము నుండి నోటీసులు వస్తున్నాయి.
ఈ విధముగా ఈ సీరియల్ కొన్ని సంవత్సరాలు నడిచింది. ప్రతి సంవత్సరానికి ఒకరు విలన్ అవుతాడు. ఆరు నెలలకొకసారి ఒకరు హాస్పిటల్ కు వెళ్లుతారు. ఎప్పుడెప్పుడు కోమాలోకి వెళ్ళాలి అనేది రచయిత నిర్ణయిస్తాడు. అప్పుడప్పుడు జైలుకు కూడా వెళ్ళుతూ ఉంటారు. ఇంకా అనుమానాలు, అవమానాలు, పగలు, ద్వేషాలు ఒక సీరియల్ కు తప్పనిసరే కదా. ఇన్నాళ్ళు గడిచిన తరువాత ఎవరు కథానాయకుడు అనే విషయాన్ని అందరూ మరిచి పోయినారు. ఆ సంభాషణల తీవ్రతలో సీరియల్ నడుస్తున్నంత సేపు ఆ విషయము గుర్తుకు రాదు.
కళ్ళల్లో నీరుబికిస్తూ  హృదయాన్ని తాకుతున్న ఆ సంభాషణల వలన స్త్రీ ప్రేక్షకులు ఆ సీరియల్ ను వదల లేక పోతున్నారు.
అందరూ విలువలను గూర్చి మాట్లాడే వారే కానీ విలువలను ఆచరణలో ఎత్తే వారు కనిపించుట లేదు. ప్రేక్షకులు ఒక విధమయిన  కంఫ్యూజన్  లో ఉన్నారు.
దీనికి ముగింపుగా ఒక కథ చెప్ప వలసి ఉన్నది. ఒక గురువు సత్యాన్నే పలకాలని తన ముగ్గురు శిష్యులకు పాఠము ద్వారా బోధించినాడు. మరు నాడు  ఆ ఆతము గూర్చి అడిగినాడు.
మొదటి శిష్యుడు, “మీరు చెప్పినది మొత్తము వచ్చేసింది” అని మొత్తము ఒప్ప చెప్పినాదుట. (ఆధునిక విద్యార్థి)
రెండవ శిష్యుడు,” దీని అంతరార్థము తెలిసింది.” అని చెప్పినాడుట.( మధ్యే మార్గము)
మూడవ శిష్యుడు,”గురువు గారు!నేను అన్నిటి లోను ఆలస్యమే. అసత్యము చెప్పకుండా బ్రడుకదానికి చాలా సాధన చేస్తున్నాను. అందుకే  నాకు పరిపూర్ణత ఇంకా రాలేదు.” అని, కన్నీలు పెట్టుకున్నాడు.
“ నా పాఠాలను అప్ప చెప్పే వాళ్ళ కంటే  ఆచరించే వాళ్ళే  నాకు సరి అయిన శిష్యులు. నీవే అందుకు తగిన వాడివి.”,అని ముద వాడిని ఆసీర్వదిన్చినాడుట.
గమనించండి ఈ తేడాను.



Sunday, March 8, 2015

పాపాయి



అతడు నెమ్మదిగా నడుస్తున్నాడు. చుట్టూ ఎడారిలా ఉంది. నైరాశ్యము అతడిని కమ్మేసింది. ఇక్కడ నాతొ మాట్లాడే వారు ఎవరూ లేరా? అటూ ఇటూ చూచాడు.
“ఖచ్చితముగా ఎవరో ఒకరు కనిపిస్తారు, నాకు ఏమి చేయాలో చెబుతారు.”, అనుకున్నాడు.
దగ్గర లో ఒక గొంతు వినిపించినది. “నాయనా! ఏమిటి, ఒక్కడి వే ఎక్కడికి వెళ్ళుతున్నావు?”
తల తిప్పి చూచినాడు. ఆ పక్కనే కొండ కింద ఒక గుహ లా ఉంది. గుహ ముందు ఒక సన్యాసి చేతిలో రుద్రాక్ష  మాలతో నిలబడి వున్నాడు.
తను ఆశ్చర్య పడినాడు. ఇంత వరకు తను చూడని కొండ గుహ ఎక్కడ నుండి వచ్చింది. అక్కడ ఒక సన్యాసి. అది ఒక మాయా లోకము లా ఉన్నది.
నెమ్మది గా ఆయన వైపు నడిచినాడు.
“ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నా వాళ్ళు ఎవరూ నన్ను పలకరించుట లేదు. ఒకటే ఏడుపులు.  ఇంకేమీ వినిపించుట లేదు.”
“మార్పు కలిగినపుడు  ఇలాగే ఉంటుంది, నాయనా! ఇంతకూ నీకు ఏమి కావాలి?”
“అదే తెలియదు. ఇదేమి లోకము?  ఇక్కడ ఎవరూ ఉండరా?”
“ఎందుకు ఉండరు? నీవు గట్టిగా కోరుకుంటే అందరూ నీ ముందే ఉంటారు. ఇలా రా నాయనా! ఇక్కడికి వచ్చి కూర్చో.”
ఇద్దరు చెరొక బండ రాయి మీద  కూర్చున్నారు.
“మీరడిగినారు చూడండి, అదే నాకు తెలియటము లేదు. ఇంతకూ నేను ఎవరిని?”
“ఒక్క సారి అటు చూడు నాయనా! నీకే తెలుస్తుంది.”
హఠాత్తుగా ఎదురుగా ఉన్న ఎడారి మాయమయింది. అపరిమితమయిన కాంతి.  అందులో నుండి ఒక కాంతి కణము బయటికి వచ్చింది.
ఆ కాంతి కణము కొండలో ఉన్నంత సేపు సొంత వ్యక్తిత్వము కలిగి లేదు. బయటికి రాగానే కొత్త కొత్త ప్రశ్నలు ఎన్నో వచ్చినాయి.
“రాక్షసులు, మనుషులు, దేవతలు,... ఇంకా నాగులు, గంధర్వులు, కిన్నరులు, యక్షులు ... ఇన్ని రకాల విభిన్న జీవులు. వీళ్ళంతా ఎవరు? ఋషులు అంటే ఎవరు? కష్టాలు అంటారు. సుఖాలు అంటారు. ఇవన్నీ ఎవరికీ? ఎందుకు?”, అన్నీ ప్రశ్నలే.
గట్టిగా మళ్ళీ అనుకున్నది.
“ఇవి చెబితే తెలిసేవి కావు. ఇవి చర్చకు అందనివి.”, ఎక్కడినుండో జవాబు వచ్చింది.
“ మరి చెప్పక పొతే ఎలా తెలుస్తాయి?”, తనలో ప్రశ్న రేగింది.
“ అనుభవము. అనుభవమే జ్ఞానాన్ని నిలుపుతుంది.”
“ప్రశ్నిస్తే తప్పేమిటి? జవాబు రాదా?”
“ఒక ప్రశ్న వంద ప్రశ్నలకు దారి తీస్తుంది. ఇది ఒక వలయములా కమ్మేస్తుంది. అదే అనుభవమయితే మరో ప్రశ్న ఉండదు.”
“అదే, అనుభవము ఎలా వస్తుంది?”
“కావాలనుకుంటున్నావా?”
 “కావాలి.”
“అయితే నీవొక కొత్త లోకములో ప్రవేశించాలి.  నిన్ను మాయ కమ్మి వేస్తుంది. నీవన్న కష్టాలు, సుఖాలు అన్నీ నిన్ను మరిపిస్తాయి. అందుకు సిద్ధమేనా?”
“సిద్ధమే.”
ఒక్క సారి ఆ దృశ్యమంతా మాయమయింది.
“ స్వామీ ఇదంతా ఏమిటి?”
“ఆ కాంతి కణానివే నీవు. ఆ అనుభవము కోసమే కాంతి రూపము వదలి క్రిందికి దిగినావు.”
“ఆ తరువాత.”
“కష్టాలు, కడగళ్ళు, సుఖాలు వీటితో వచ్చే అనుభవము నీలో సరి కొత్త మార్పును తీసుకొని వస్తుంది. ఒక్కొక్క జన్మలో అనుభవాలు నీలో చేరే కొద్దీ ఈ మార్పు పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది.  ఒక కాంతి జీవి అబద్ధము చెప్ప వలసిన అవసరము లేదు. కాని ఒక దేహములో ఉన్న జీవికి ఆ అవసరము రా వచ్చును. దానిని ఎలా ఎదురు కోవాలో తన అనుభవమే నేర్పుతుంది.”
“ మరి దేవతలు అంటే ఎవరు?”
“దేవతలు అందరికీ అనుభవాలు ఉండవు. అనుభవము తోనే వారు ఎదుగుతారు. అందుకే  దేవతలు అయినా పై స్థాయిని అందుకోవాలంటే భౌతిక దేహములో జన్మ తీసుకోవలసి ఉన్నది.”
“ మరి ఋషులు.”
“నిరంతర పరిణామముకు తపిస్తూ ముందుకు సాగుతున్న వారే ఋషులు. దేవతలకు కూడా వారు మార్గాన్ని చూపించ గలరు.”
“అయితే వాళ్ళు ఋషులు ఎలా అయినారు?”
“అటు చూడుము..”
అక్కడొక్క దృశ్యము కనిపించింది.
ఎదురుగా ఒక దారి ఉంది. ఆ దారి లో నలుగురు వెళ్ళుతున్నారు. వారి ముందు ముళ్ళ చెట్లు పది దారి మూసుకొని పోయినది.
మొదటి వ్యక్తీ విసుగ్గా ముఖము పెట్టి మరో దారిలో వెళదామని వెనక్కు తిరిగినాడు.
రెండవ వ్యక్తీ పరిస్థితి మారు తుందేమో చూద్దామని అక్కడే కూర్చున్నాడు.
మూడవ వ్యక్తీ తన వరకు కాస్త ముళ్ళ కొమ్మలు తొలగించి, ముందుకు వెళ్ళాలని ప్రయత్నము చేస్తున్నాడు.
నాల్గవ వ్యక్తి మాత్రము చుట్టూ చూచి, పెద్ద కర్ర తీసుకొని, చాలా శ్రమ పడుతూ, ఆ ముళ్ళ కొమ్మలను పక్కకు తొలగించుటకు తంటాలు పడుతున్నాడు. మూడవ వ్యక్తిని సహాయము అడిగినాడు. కానీ ఆ మూడవ వ్యక్తికీ తన దారి కనిపించ గానే వెళ్లి పోవడమే లక్ష్యముగా ఉంది.
“ఇదంతా ఏమిటి స్వామీ జీ!”, అని అడిగినాడు.
“మొదటి వాడు ఈ ఇబ్బందిని ఎదుర్కొనుటకు ఇష్టము లేని వాడు. మార్పు మీద ఆశ కూడా లేని వాడు. రెండవ వాడికి ఆశ ఉంది. శ్రమ పడుట ఇష్టము లేదు. మూడవ వాడికి శ్రమ పడినా తన వరకు చూసుకోవాలి అనుకున్న వాడు. ఇంక నాలుగవ వాడు ఇప్పుడు తను పడుతున్న శ్రమ , ఇబ్బంది మరెవరు పడకూడదని అనుకున్న వాడు. ఈ విధముగా పరుల హితములో తన హితమును  చూచుకొన గలిగిన వాడే ఋషి కా గలడు.”, స్వామీ జీ ముగించినాడు.
తిరిగి మరో దృశ్యాన్ని చూపించినాడు.
“అక్కడ ఒక కాలువ ప్రవహిస్తున్నది. అందులో ఒక తేలు కొట్టుకొని పోతున్నది.  ఒకతడు ఆ తేలు మీద జాలి పడి, దానిని వేగముగా చేతి లోనికి తీసుకొని  గట్టు మీది కి విసిరి వేద్దామని అనుకున్నాడు. అది గట్టిగా కుట్టినా భరిస్తూనే  దానిని గట్టుకు చేర్చినాడు.”
“అంటే ఆయనకు తేలు కుడుతుందని తెలియదా?”
“ అదే మాట ఆయనను అడిగితే, “ఆ తేలు ఎవరి నయినా కుట్టే తన లక్షణము మానుకో లేదు కదా! మరి దేని నయినా రక్షించాలన్న నా లక్షణాన్ని ఎలా మానుకో గలను?” అన్నాడు.”
“ఈ విధముగా ఉండలేని వాడు, పరిస్థితులను బట్టి తన లక్ష్యాలను మార్చుకొనే వాడు ముందుకు వెళ్ళ లేడు. అంటే తేలు చేత కుట్టించుకోవాలని కాదు. పర హితాయచ జీవితమూ అనే భావన ఉన్న  ప్రతి యొక్కరు ఎదుగుతున్న వారే.”
“అయితే స్వామీజీ! అటువంటి పరిస్థితులలో  నాకు రక్షణను లేదా సలహాను ఇచ్చే వారు ఎవరు?”
“ఎలా నడచుకోవాలి అనే విషయములో నీవు చదివిన మంచి  పుస్తకాలు సహాయ పడతాయి. నీవు అలా నడచుకొంటె దైవిక శక్తులతో నీకు సంబంధము ఏర్పడుతుంది. నీవు దారి తప్పుతుంటే నీ అంతస్సాక్షి  గుర్తు చేస్తూనే ఉంటుంది. అన్నిటి కంటే నీకు కావలసింది శ్రద్ధ, సబూరి(విశ్వాసము).”
“అవి నిలబడాలంటే ఎలా? నాకు భగవంతుడితో సంబంధము ఎలా నిలబడుతుంది?”
“భగవంతుడితో నీకున్న సంబంధాన్ని నీవే మరచి పోతున్నావు. సామాన్య పరిభాషలో చెప్పాలంటే నీకు కావలసిన వసతులన్నే భగవంతుడే ఏర్పాటు చేస్తున్నాడు. పుట్టిన నాటినుండి నిరంతరమూ ప్రాణ ప్రవాహము నీలో ప్రవహిస్తూనే ఉంది. ఆ శక్తి ధార తెగి పోయినపుడే మరణము.ఇది కూడా భగవంతుడు నీకు ఇచ్చిన ఉపకరణము. పసి పిల్లాడుగా బయటికి వచ్చినప్పటి నుండి, పంచ భూతాల నుండి  విడి పోయే వరకు,నీకు శ్వాసను ఏర్పాటు చేసినదీ భగవంతుడే. అదీ మరచి పోయినావు.
ఆ శ్వాస లో కూడా ప్రాచ్య దేశాలు  యింగ్ మరియు యాంగ్ అనే పేర్లతో కొన్ని విభాగాలను గుర్తించినాయి. అందులో యింగ్  అంటే భౌతిక శరీరానికి సంబంధించినది. యాంగ్ శక్తి తత్వానికి సంబంధించినది. మొదటిది మనస్సుకు, రెండవది బుద్ధికి, మొదటిది రాత్రికి, రెండవది పగలుకు, మొదటిది చంద్రుడికి రెండవ ది సూర్యుడికి సంబంధించినవి. కానీ ఈ రెండిటి యొక్క సంధిని పట్టుకుంటే దైవీ తత్త్వము దగ్గరకు వస్తుంది. దీనినే భారతీయులు అగ్ని తత్త్వము లేదా కుండలినీ తత్త్వము అని అన్నారు. ఈ శ్వాసను నియంత్రించుట ద్వారా ఆలోచనల మీద నియంత్రణ  ఏర్పడుతుంది.  ఈ విధముగా ఆయనను గుర్తించే తాళాలను ఆయన ఏర్పాటు చేసినారు. ఈ సాధనల ద్వారా అపరిత మయిన అనుభవాలు, జ్ఞానము మనకు లభిస్తాయి. మనము బలహీనులము, అసహాయులము అనే భావనలు మనల నుండి తొలగి పోతాయి.
“ మరి మానవుడు ఎందుకు నిరంతరము బాధలు పడుతూ బల హీనుడుగా తయారవుతున్నాడు?”
“ ఆవు దూడ తల్లి గర్భము నుండి బయటకు రాగానే తనకు తల్లి నుండి పాలు లభిస్తాయి. ఒక పిల్లాడు కుడా తనకు ఇష్టమయిన వాటి వైపు ఆకర్షితుడవుతాడు. పూర్ణ మయిన ఆత్మ కూడా భౌతిక ప్రవేశించినపుడు మొదట అన్నే లభించినా కొంత కాలానికి తన మూల తత్వాన్ని మరచి పోతాడు. దీనిని మాయ అంటారు. ఇది కూడా ఒక రకమయిన మతి మరుపు. తను అనుభవము ద్వారా సాధించిన జ్ఞానము సంస్కారముగా తనలో కారణ శరీరము లో నిక్షిప్తమై తనకు సంస్కారముగా తన తోనే ఉండి పోతుంది. తను నేర్చుకొని (అనుభవము లోనికి రాని సమాచారము )జ్ఞానము కాదు. అందుకే అది మాయ చేత కప్పి వేయ బడుతుంది. పూర్తి జ్ఞానాన్ని అనుభూతి లోనికి తెచ్చుకున్న వ్యక్తి మానవుడు గా కాక దైవీ మానవుడుగా మారతాడు. ఇది పరిణామములో అయిదవ స్థితి.”
“ అయితే మిగిలిన నాలుగు స్థితులు ఏమిటి?”
“పరిణామములో ఖనిజ స్థితిని అనుభవిస్తాడు. అక్కడ కొద్దిగా సూక్ష్మ దేహము ఉంటుంది. అక్కడ అనుభవాలు చాలా తక్కువగా ఉంటాయి. తరువాత వృక్ష స్థాయికి వస్తాడు. వీటికి ప్రకృతి నుండి శక్తిని స్వీకరించుకుంటుంది. ఇక్కడ భావావేశములు ఏవీ ఉండవు? తరువాత జీవి జంతు స్థాయికి వస్తుంది. ఇక్కడ సూక్ష్మ దేహము వృద్ధి పొంది , భావావేశములకు నిలయము అయిన కామ దేహము లేదా ఆస్ట్రల్ బాడి ఏర్పడుతుంది. కామ దేహములో శక్తులను విపరీతముగా ప్రేరేపించ వచ్చును. వీటిని సద్వినియోగము లేదా దుర్వినియోగము చేయ వచ్చును. ఈ కామ దేహ స్థితిలో ఉన్నపుడే జంతు స్థాయినుండి, మానవుడుగా జన్మ లభించును. అట్లాంటిస్ లోని మానవ జాతి కామ దేహమును ఉపయోగించి మొత్తము మానవ జాతిని నియంత్రించడానికి ప్రయత్నించినారు. మనస్సు అనే ఉపకరణము మానవ జాతికి ఏర్పడటము తో మానవ అనే శబ్దముకు అర్థము ఏర్పడినది.   
  మనస్సు మనలను నియంత్రించినపుడు అది అగ్ని లాగ మనలను దహిస్తుంది.  దానిని మనము నియంత్రించినపుడు దాని ద్వారా మనకు అపరిమితమయిన శక్తులు లభిస్తాయి. ఇవి లోక కల్యాణానికి ఉపయోగ పడుతాయి. ఈ స్థితినే దైవీ మానవ స్థితి అన్నారు. ఇప్పటి మానవుల లక్ష్యమదే.”
 “మరి ఉన్నత తలాలని అన్నారు. అవి ఎమిటో చెబుతారా?”
“వీటినే మితి లేదా డైమెన్షన్ అని అంటారు. ఇప్పుడు మనము పృధ్వీ తత్త్వము లోనే ఉన్నాము. అది మూడు మితులకు (అంటే 3 డైమెన్షన్) సరిపోతుంది. కాలాన్ని గుర్తించాము. కాని దాని లోనికి ప్రవేశించడం మానవుడికి చేత కాలేదు అది చేతనయితే మనము నాల్గవ మితి లోకి ప్రవేశిస్తాము. దీని వలన మనిషికి భూత , భవిష్య వర్తమానాలలో సమముగా బ్రదుకుట తెలుస్తుంది. విపరీతముగా మానవుడి శక్తి యుక్తులు పెరుగుతాయి. వీటి గురించి సూచనలు ఉన్నాయి, కానీ వీటిని అందుకొనే స్థితికి మానవుడు చేర లేదు.”
“స్వామీజీ! ఇపుడు మీరు చెప్పిన జ్ఞానమంతా నాతోనే ఉంటుందా?”
“ఉంటుంది. కానీ నీకు అందదు. కారణము ముందే చెప్పాను. అది నీ అనుభవము కాదు. నీవు సంపాదించుకున్నదే నీ కారణ దేహములో ఉంటుంది. మిగిలినది మాయతో కప్ప బడి ఉంటుంది. కారణము ఒకటే. దానిని అందుకునే స్థితిలో మీరు ఉండరు.”
“ఇది అన్యాయము కాదా స్వామీజీ!”
“ ఎ మాత్రము కాదు. ఒక ఉదాహరణ  చెబుతాను. కంప్యుటర్ ఉపకరణాలతో కూడిన కారును నడిపే వ్యక్తీ యొక్క సామర్థ్యము మామూలు అంబాసిడర్ కారు నడపుటలో ఉపయోగ పడదు. యోగస్థితి అందుకున్న వ్యక్తీ మామూలు మానవుడి దేహములో ప్రవేశిస్తే తన పూర్తి స్థితి అందుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతాడు. అంటే దేహము కూడా సామర్ధ్యానికి తగినట్లుగా ఉండాలి. అందుకే యోగ పురుషులు పుట్ట వలసి వచ్చినపుడు యోగుల గృహాలనే ఎన్నుకుంటారు.”
“తన కున్న జ్ఞానముతో తన దేహాన్ని మార్చుకోలేరా?”
“దేహము తట్టుకో గలిగిన  శక్తి కన్నా ఎక్కువ శక్తిని దేహానికి అందిస్తే దేహ కణాలు ఆ శక్తిని తట్టుకో లేక విఘటనము చెందుతాయి. దీని వలన భయంకరమయిన వ్యాధులు రావచ్చును.”
“మరి ఒక జన్మలో ఈ మార్పు తీసుకొని రాలేమంటారా?”
“ చేయ వచ్చును. కానీ దానికి చాలా కఠిన మయిన నియమాలను పాటించ వలసి వస్తుంది. ముందు మనస్సును నియంత్రించాలి. మనస్సును ఆహారము చాలా ప్రభావితము చేస్తుంది కాబట్టి,, శవాహారము (అంటే మాంసము లాటివి )ను పూర్తిగా వదలి వేయాలి. తరువాత తామసిక ఆహారము (నిలవ ఉన్నవి మరియు ఉల్లి, వెల్లుల్లి తో కూడినవి) ను వదిలించుకోవాలి. అటు తరువాత కోపాన్ని పెంచే మసాలాలు కూడిన రాజసిక ఆహారము ను వదిలించుకోవాలి. ఇంతకూ ముందు చేరిన మురికిని ఆసనాలు, ప్రాణాయామములు, ధ్యానము ద్వారా శుద్ధి చేసుకోవాలి. తరువాత వండిన ఆహార పదార్థాలను కూడా వదిలి వేయ వలసి యుంటుంది.. ఇదంతా సమర్థుడయిన గురువు పర్యవేక్షణలో చేస్తే మంచిది.”
“మరి, మనిషి శవాహారాన్నే ఎందుకు ఇష్ట పడుతున్నాడు?”
 “” అది అతడి పరిణామ స్థితి మీద ఆధార పడుతుంది. తన సంస్కార ప్రభావము ఎంత తీవ్రముగా ఉంటుందంటే  ఇంకొకరు చెప్పినా నమ్మడు.”
“ఇప్పుడు మీరు చెప్పిన జ్ఞానము మాకు అందుబాటు లో ఉంటుందా?”
“ఇప్పుడు చెప్పిన వన్నీ ఆకాశములో నిక్షిప్తమై ధ్యానములో ఉన్న వారికి అందుబాటులోనే ఉంటాయి.”
“మరి స్వర్గము, నరకము లాంటివి....”
“ఈ లోకము అద్దము లాటిది. దుష్ట సంస్కారములు కల వారికి ఈ లోకము చెడు అనుభవాలనే ఇస్తుంది. అప్పుడు మన కర్మకు అధినేత  యమ ధర్మ రాజు పేరుతొ చాలా క్రూరుడు గా కనిపిస్తాడు. మంచి సంస్కారములు కలిగిన వారికి ఆయనే ఉపదేశకుడుగా అందగాడుగా, మృదు స్వభావిగా కనిపిస్తాడు.”  
“ఇంకా నాకు తెలుసుకోవాలని ఉంది. మీరు నాకు అందుబాటులో ఉంటారా?”
“చిత్త శుద్ధితో నేర్చుకోవాలని అనుకున్న ప్రతి వారికి భగవంతుడు జ్ఞానాన్ని అందుబాటులో ఉంచుతాడు.”
స్వామీజీ మళ్ళీ చెప్పినాడు.
“మనిషి మరణించినపుడు అతడి పై ఏ గ్రహము ప్రభావముతో ఉంటుందో, ఆ గ్రహము తిరిగి ప్రభావిత మయినపుడు మళ్ళీ జన్మించే అవకాశము వస్తుంది. ప్రస్తుతము నీకు ఆస్థితి వచ్చింది. సిద్ధమేనా?”
“ఖచ్చితముగా వెంటనే జన్మించాలా?”
“పుట్ట వలనా లేదా అనేది నీ నిర్ణయము పై ఆధార పడి యుంటుంది. ఇప్పుడు తప్పితే తిరిగి ఈ స్థితి రావటానికి చాలా కాలము పడుతుంది. నీ నిర్ణయమేమిటి?” 
 “అయితే నేను సిద్ధమే.”
“మరొక విషయము నీవు జన్మించిన తరువాత మూడు నెలల వరకు ఈ జ్ఞానము నీతోనే ఉంటుంది.అందుకే మూడు నెలల వరకు పుట్టిన పిల్లలు దైవీ ప్రజ్ఞతో ఆనందముగా ఉంటారు. ఆ తరువాత నీ సంస్కారాలు నీలో జొరబడి ఆ జ్ఞానాన్ని కప్పి వేస్తుంది.. ఇంక బయలు దేర వచ్చును.”
తిరిగి యాత్ర మొదలయింది. తను తల్లి గర్భమునుండి బయటకు వచ్చినాడు.  ప్రతి యొక్కరు తనను ఎత్తుకొని ముద్దాడుతుంటే చాలా ఆనందముగా ఉంది.
అందరికి తను ప్రత్యేకముగా కనిపిస్తున్నాడు. తల్లి పాలు అమృతము లాగున్నవి. ఆ సమయములో స్వామీజీ చెప్పిన ప్రతి విషయము గుర్తు ఉంది. వాటిని మరచి పోగూడదని గట్టిగా నిర్ణయము చేసుకున్నాడు.
కొన్నాళ్ళ తరువాత తల్లి పాలలో ఏదో తేడా కనిపించినది. బాగా కడుపు నొప్పి వచ్చి, ఏడుపు వచ్చింది. అందరూ హడావుడి చేస్తున్నారు. అప్పుడు ఒకావిడ “పచ్చి బాలింటావు. అంట ఘాటు పచ్చడి ఎందుకు తిన్నావు?”అని అడిగింది.
“ఇన్నాళ్ళు పథ్యము  తిని నోరు చవి చెడింది,”అన్నది.
అప్పుడు అమ్మ మీద కోపము వచ్చింది.
ఇంకో రోజు అమ్మ ఇంకో పిల్ల వాడిని ఆడిస్తుంటే నన్ను వదిలి వేరే వాడిని ఆడిస్తున్నావా? అని బాగా అసూయ వచ్చింది.
ఈ విధముగా రోజుకు ఒక అవతారము ఎత్తినాను. మూడు నెలలు అయేసరికి ఎంత ప్రయత్నించినా స్వామీజీ మాటలు గుర్తుకు రావటము లేదు.

************************************