Thursday, March 29, 2018

ప్రస్థానము 5



బెంగుళూరు లో తన  తాతగారి దైనందినుల లోని విషయాలను అప్పుడప్పుడు తన స్నేహితుల తో చర్చించే వాడు. కొంత మంది దీనిని చాదస్తమని అనే వారు. ఒకరిద్దరు  మాత్రము తన అభిప్రాయాలను బాల పరచే వారు. అప్పుడే మరి కొన్ని విషయాలు చర్చకు వచ్చినాయి.
రాజేంద్ర సింగ్ అను పేరు గల ఒక యువకుడు సాధించిన విషయము రాజస్థాన్ లో కను విప్పు కలిగించింది.
ఆరావళీ పర్వతాలలో క్రమ క్రమముగా కొండల పై  నుండే  చెట్లు ఎండి పోవడము జరిగింది. వర్షాలు కూడా తగ్గి పోయినాయి.  ఇది మరొక సమస్యకు దారి తీసింది. కొండల  క్రింద ప్రవహించే  చంబల్  నదిలో కూడా క్రమ క్రమముగా నీరు తగ్గి సన్న బడింది. చివరకు పంటలకు నీరే గాక  త్రాగు నీటికి కూడా ఎద్దడి ఏర్పడింది. రాజేంద్ర సింగ్ కొన్ని ప్రజాహిత కార్య క్రమాలను తరుణ్ భారత్ సంఘ్ అణా బడు సేవా సంఘ్ ద్వారా నడిపే వాడు. కాస్త దూకుడు స్వభావము ఎక్కువ. మొట్ట మొదట ఇటువంటి కార్య క్రమాలను ఉత్తర ప్రదేశ్ లో నడుపుతూ పోలీస్  వ్యవహారాలలో ఇరుక్కొని  తప్పించు కొనడానికి రాజస్థాన్ చేరినాడు. ఆయన నడుపుతున్న సేవా సంస్థలో సభ్యుల ఆశయాలు చాలా గొప్పవి. కాని  ప్రజల దృష్టిలో వారందరూ పని చేయని జులాయీ ల క్రిందే లెక్ఖ.
చంబల్ నది చాలా ప్రసిద్దమయినది. కాళిదాసు తన మేఘ సందేశము లో దీనిని  చర్మణ్వతి అన్న  పేరుతొ ప్రస్తావించినారు. “ఆ ప్రముఖ నది యొక్క పరిస్థితిని  ఏ విధముగా మార్చాలి?” తరుణ్ భారత్ సంఘ్  సభ్యులు ఆలోచించినారు. పారలు గునపాలు తీసుకొని కొండలు ఎక్కినారు. జనం వద్దంటున్నా అక్కడక్కడ పై నుండి  క్రింద వరకు నీరు పూర్తిగా కొండలు దిగకుండా అడ్డు కట్టలు వేసినారు. ఈ విధముగా చేయడాన్ని ప్రజలే  కాక ప్రభుత్వమూ కూడా వ్యతిరేకించింది. ఎందుకంటే ఇంకా క్రిందకు దిగే నీరు తగ్గి పోతుందని భయము. కానీ కట్టలు వేసేసి నారు కాబట్టి వాటిని తీయించే ఓపిక ఎవరికీ లేదు. ఆ ప్రాంతములో కురిసే వర్షాలు చాలా తక్కువ. ఆ కొద్ది వర్శానికీ  ఆక్కడక్కడ కట్టల దగ్గర నీరు నిలిచింది. క్రమముగా ఎండి మోడులు అవుతున్న చెట్లు చిగురించినవి. పచ్చ దనము పెరిగింది. మరో వర్షా కాలము వచ్చేసరికి పెరుగు తున్న చెట్లను చూచి వరుణుడికి హుషారు పెరిగింది. వర్షము బాగా పెరిగింది. మరో సంవత్సరానికి చంబల్ నది బాగా పెరిగి అక్కడ నీటి అవసరాలను తీర్చ సాగినది. దీనితో అప్పటి వరకు జులాయి అనిపించుకున్న రాజేంద్ర సింగ్ కు ప్రజలలో గౌరవము పెరిగింది.
ఏ సమస్యకు తక్షణ పరిష్కారముండదు.  సరి అయిన పరిష్కారము కూడా  వెంటనే ఫలితాన్ని ఇవ్వదు. అందుకే మనకు ప్రధానముగా రెండు లక్షణాలు కావాలి. అవే శ్రద్ధ, సబూరి అంటే విశ్వాసము.
బౌద్ధ కథలలో ఒక కథను చెప్పుకోవాలి. బోధిసత్వుడు ఒక ఊరిలో పుట్టి పెరుగుతున్నాడు. ఆ ఊర్లో శుభ్రతను అసలు ఎవరూ పాటించుట లేదు. ఇంక పిల్ల వాడు అయిన బోధి సత్వుడి  మాటను ఎవరు వింటారు? ఇందుకు బోధి సత్వుడు తన పద్ధతిని ఎన్నుకున్నాడు. ఒక రోజు ఊరి చావడి దగ్గిరకు వెళ్లి తను కూర్చోడానికి అన్నట్లుగా కొంత స్థలాన్ని శుభ్రము చేసుకున్నాడు. ఇంకా కూర్చో బోతుండగా ఒక పెద్ద మనిషి వచ్చినాడు.  బోధి సత్వుడు పక్కకు జరిగినాడు. ఆ పెద్ద మనిషి ఆ శుభ్రము  చేసిన స్థలములో కూర్చున్నాడు. బోధిసత్వుడు పక్కనే మరికొంత స్థలాన్ని శుభ్రము చేసుకున్నాడు. ఇంతకు ముందు వలెనే అందులో మరొకరు కూర్చున్నారు. ఈ విధముగా కొన్ని నాళ్ళు చేసి ఆ వూరి వారిని సుభ్రమయిన స్థలములో కూర్చునే అలవాటు చేసినాడు. ఇది ఒక పధ్ధతి.
ఇటువంటిదే ఇటీవల జరిగిన మరొక సంఘటన. సిఖ్ గురువు  గురు నానక్ రోజూ కాలీబెన్ అనే నదిలో స్నానము చేసి, సుల్తాన్ పూర్ లోధీ అనే ఊరి దగ్గిర ఒక చెట్టు క్రింద అనుస్థానము చేసుకొనే  వాడట. అందుకనే సిక్ఖు సమాజానికి ఆ  నది  ఎంతో పవిత్రమయినది, ప్రాణ ప్రదము అయినది. కానీ, చుట్టూ ప్రక్కల మురుగు నీరును ఆ నదిలోనే కలిపే వారు. బల్బీర్ సింగ్ అనే వ్యక్తీ ఈ స్థితిని భరించ లేక పోయినాడు. తోటి వారి సహాయము అడిగితె ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒక  సారి నదిలోనికి దిగి, చెత్తనంతా బయటకు తీసి వేయడము మొదలు పెట్టినాడు. సంకల్ప బలము ఎంత గొప్పదంటే, అతడిది మూర్ఖత్వముగా భావించి పరిహాసము చేసిన వారందరూ అతడితో బాటు నదిలోనికి దిగి , మురుగు నీరు నదిలో కలపకుండా ఆపడమే  గాక నదిని పూర్తిగా శుభ్రము చేసినారు.ఇది యొక  అద్భుతముగా భావిస్తూ ఒక విదేశీయుడు, జోర్డాన్ నది క్రిస్టియన్లకు అత్యంత పవిత్రమయినదని, కానీ అది కూడా ఒక మురుగు కాలువ గా మారిందని, అక్కడ కూడా బల్బీర్ సింగ్ లాంటి వాళ్ళు పూనుకుంటే  తప్ప  జీసస్ కు బాప్తిఇజం ఇచ్చిన జోర్డాన్ నది శుభ్రము కాదని వాపోయాడు. ఇటీవలే బల్బీర్ సింగ్ కు కేంద్ర ప్రభుత్వ పురస్కారము కూడా లభించింది.
గోపీ మిత్రుల మధ్య మరొక విషయము ప్రస్తావనకు వచ్చింది. ఒకప్పుడు గోదావరి జిల్లాలో నేలలు చవిటి నేలలు ట.  ఇసుకలో ఉప్పు చాలా యున్నది. అందుకే ఏ పంటలూ  సరిగ్గా పండవు. కాటన్ దొర ధవళేశ్వరము దగ్గిర  అడ్డు కట్ట కట్టిన  తరువాత ఉప్పు నెలల లోని ఉప్పు పోవడానికి కొంత కాలము ఏ పంట  వేయకుండా నీటిని  పారించినారుట. అప్పుడా నెల వ్యవసాయ యోగ్యము అయిందిట.
కానీ నేటి  పరిస్థితి మళ్ళీ దారుణముగా తయారు అయింది.  పంట పొలాలలో రొయ్యల చెరువులు త్రవ్వి  సముద్రపు నీటిని రెండు  మూడు కిలో మీటర్ల  లోపలి తీసుకొని వస్తున్నారు. దీని వలన చుట్టూ ప్రక్కల భూ గర్భ జలాలు,బావులతో సహా ఉప్పు నీరు అయి పోతున్నది. విదేశీ డాలర్ల  మోజు  లేదా ప్రజా ప్రతినిదులనబడే  వారి ఒత్తిడి వలన ప్రభుత్వమూ దీనిని పట్టించుకోవడము లేదు. అందు వలన తీర ప్రాంతాలలో త్రాగు నీటికి కూడా కరువు ఏర్పడుతున్నది. ఈ కారణము వలన కొన్ని తీర ప్రాంతాలు ఖాళీ అయి పోతున్నాయి. ఆ ప్రాంతాలను తిరిగి నివాస యోగ్యము చేయుట కుదురుతుందా? నేలలో చేరిన ఉప్పును ఎలా తగ్గించాలి?
ఎవరికీ వారు తమ వరకు రాలేదని  భావిస్తున్నారు తప్ప  ఈ ముప్పు తమ వరకు వచ్చిన తరువాత  చేసేది ఏమీ ఉండదని  వారికి అర్థము అవుట లేదు.
ఈ చైతన్యమును ఎవరు తీసుకొని వస్తారు? తరచుగా ఎలుకల మీద దాడి చేసే పిల్లి మేడలో గంటను ఎవరు కడతారు? ఎలుకల సమాఖ్య తగ్గే కొద్దీ  వాటిలో ధైర్యము కూడా తగ్గి పోతుంది. పూర్తిగా మునిగి పోక ముందే తెరుకోవాలి.  కొద్ది మంది  స్వార్థము కొరకు  ఒక చెర్నోబిల్, ఒక ఫుకుషిమా... మొత్తము భూ గ్రహాన్నే కుదిపి వేసే పరిస్థితులు.
ఆకు పచ్చని ప్రకృతిని భూమి మీద ఎదగ నీయకుండా అడవులు తగ్గిపోతున్నాయి,  వేడి పెరిగి పోతున్నది. కొంత మంది ఈ విషయము మీద హెచ్చరిస్తూనే ఉన్నారు. మరి కొంత మంది వ్యాపార వేత్తలకు అమ్ముడు పోయిన వారు పెరిగే వేడికి వీటికి సంబంధము లేదని ఘంటా పథముగా చెపుతున్నారు. ఇటువంటి శక్తులను ఎదురుకోవడానికే  భారత దేశములో చిప్కో ఉద్యమము, గ్రీన్  పీస్  లాంటి ఉద్యమాలు బయలు దేరినవి. కానీ సామాజిక స్పృహ తీసుకొని రావటానికి , పోరాటానికి శక్తి సరి పోవటము లేదు.
తాతయ్య గారి దైనందినులలో ఉన్న విషయాలన్నీ మిత్రుల మధ్య చర్చకు వచ్చేవి. వీటితో బాటు భారత దేశములోని ప్రాచీన సామాజిక వ్యవస్థను గురించి కూడా చర్చ జరిగింది.
ఒకప్పుడు గృహస్థ ఆశ్రమములో ఆశ్రమ నియమాలన్నీ పాటిస్తున్న వారికి, ఈ నాటి సమస్యలు ఏర్పడ లేదు.  వాతావరణ  కాలుష్యము, పారిశుధ్యము గురించి సమస్యలు లేవు. అందు వలన ధర్మ ప్రచారమునకు  ఎక్కువ ప్రాధాన్యము లేదు. ఆ రోజులలో సమాజమును ప్రభావితము చేసిన ప్రతి ఋషి కూడా గృహస్థే. అందు వలన వారు ఎక్కడికి వెళితే అక్కడ ధార్మిక చర్చలు జరిగేవి. అంతే గాక  విద్యా వ్యవస్థలో ప్రతి శాస్త్రమునకు పునాది ధార్మిక వ్యవస్థ మీదే ఉండేది. కాలము గడిచే కొద్దీ ఇందులో మార్పులు వచ్చినవి. ప్రాధాన్యత ధర్మమూ నుండి అర్థము(సంపద/ఆస్తి) లోనికి మారిన తరువాత  మధ్య తరగతి గృహస్థు ధర్మమునకు క్రమముగా దూరము గా జరిగినాడు. ధర్మాచరణ తగ్గే కొద్దీ లౌకిక జీవితానికి ప్రాధాన్యత పెరిగింది. జీవితములో వేగము పెరిగింది. ఉన్న సమయము సరిపోవుట లేదు. స్వార్థము పెరిగిన తరువాత తరిగిన సామాజిక న్యాయాన్ని పునరుద్ధరించుటకు గౌతమ బుద్ధడు ప్రవేశించినాడు. అహింస, ప్రేమ ల గురించి ఆత్మా విశ్వాసము పెంచినాడు. ప్రజలలో  ఆత్మా విశ్వాసమును పెంచుటకొరకు వ్యావహారిక భాషలలో బోధన చేసినాడు. తరువాత ప్రాధాన్యత ధర్మాచరణకా , ఉపాసనకా అన్న అంశము మీద విభేదాలు వచ్చి బౌద్ధము హీన యాన  మహా యానములుగా చీలి పోయినది. ఇక్కడ మరొక సమస్య తలెత్టినది. ధర్మ్మాచరణ ప్రధానమే. కాని సరిహద్దుల దగ్గిర అహింసా బోధన పనికి రాదన్న విషయాన్ని మరచి పోయినందు వలన దేశపు సరిహద్దులు బలహీన పడినవి.
ఈ సమయములో అద్వైత బోధతో శ్రీ శంకరాచార్యులు సమాజమును పటిష్ట పరిచినారు. ప్రతి మనిషిలో ఉన్న దివ్యత్వ్వాన్ని తెలియ చెప్పియా శంకరుడిని ప్రచ్చన్న  బుద్ధుడిగా కొంత మంది  హిందువులు భావించినారు. ఈ సమయములో అంత  వరకు కనిపించని సన్యాస ధర్మమూ ప్రవేశించినది. సమాజము  యొక్క మేలు కోలుపుకు రోజంతా పని చేసే ఆధ్యాత్మిక సేవకులుగా సన్యాసులు ఏర్పదినారు.
కాలము నడిచే కొద్దీ సన్యాస వ్యవస్థ సమాజము మోక్షము కొరకు గాక వ్యక్తిగత మోక్షమే లక్ష్యముగా పని చేయడము మొదలయింది. సమాజములో తిరిగి బలహీనతలు పెరిగినాయి.
ధర్మమూ అర్థముల ప్రాధాన్యత మీద నిరంతరమూ  యుద్ధము కొన సాగుతూనే యుంది.
ఒక చిన్న కథ యున్నది. భారత దేశము పై దండ  యాత్రకు వచ్చినపుడు అలేక్జాందర్ ఒక  సన్యాసిని కలిసినాడు.ఆ  సన్యాసి అతడికి ఒక చిన్న చాప ఇచ్చి కూర్చోమన్నాడుట. అలేక్జాందర్ ఒక వైపు చాపను పరుస్తుంటే రెండవ వైపు ముడుచుకొని పోతున్నదట. “నేను గెలిచినా సామ్రాజ్యము ఎంత కాలము నిలుస్తుంది?” అని ఆ సన్యాసిని అడిగితె “ఇప్పుడు మీరు కూర్చున్న చాప వలెనె ఉంటుంది.”అని ఆ సన్యాసి జవాబు చెప్పినాడుట.
అదే  విధముగా ఒక వైపు ధర్మమూ విస్తరిస్తూ ఉంటె, మరొక వైపు ముడుచుకొని పోతున్నది. గోపీ మిత్ర బృందము ఈ విషయము మీద ఎన్నో చర్చలు జరిపినారు. ఆ సమయములో ఒక ప్రస్తావన వచ్చింది,” ఈ చర్చల వలన ఉపయోగమేమిటి? నీటిలో దిగకుండా ఈత మీద ఎన్ని పుస్తకాలు చదివినా  ఈత రాదు.ఇప్పుడు మనము చేస్తున్న పని అదే.” అంటూ గోపీని ఒక సారి అక్కడ పరిస్థితులను అధ్యయనము చేసి రమ్మని ప్రేరేపించినారు.
మొదటి ప్రస్థానము మొదలయింది.      


చురకలు



*1. ‘మాతృ దేవోభవ ‘ పేరును చూచి భ్రమ పడకండి.  ఇందు లో  మీకు  కావలసిన శాడిజం , క్రైం  మసాలాలు  ఉన్నాయి.  కొస విరుపు ఏమిటంటే ఆఖరి  ఎపిసోడ్ లో టార్చర్  భరించ లేక  తల్లి చని పోతుంటే  కొడుకు మారి పోతాడు. కాదు, మారినట్లు నటిస్తాడు. ఇదే దర్శకుడి నుండి తదుపరి వచ్చే  సీరియల్స్  వరుసగా  ;పితృ  దేవోభవ’, ‘ఆచార్య  దేవోభవ’

*2. వాట్సప్  లో  కొత్త  మెసేజ్ రాగానే  వరుసలు చక్కున  ఎలా మారిపోతాయో అలా మారి పోతాయి సీరియల్స్ లో పాత్రలు. ప్రతి 50 ఎపిసోడ్ లకు విలన్లు మారి పోవచ్చు. ఇలా చేస్తుంటే  చివరకు ఎవరికీ అభిషేకము చేయాలి అన్న విషయము మరచి పోయి  దర్శకుడికే  అభిషేకము చేయాలని నిర్ణయించినారట.

*3. ఒక  దుర్వార్త. ఒక రచయిత/రచయిత్రి  తన ప్రతి సీరియల్ ను రెండవ  తరము వరకు నడిపించింది. ఒక సీరియల్ ను మూడవ తరానికి తీసుకొని వచ్చింది. ప్చ్వ్.  అదృష్టము  కలిసి రాలేదు. అది మూడవ  తరము పూర్తీ కాకుండానే  ఆగి  పోయింది.

*4. శుభ వార్త.  మీకు తెగ  నచ్చేసిన గోల  మాలోకము లో వారమంతా యున్న  ఎపిసోడ్లలో యున్న ఏడుపు గొట్టు పగ ద్వేషము సీన్లన్నీ కలిపి  ఒక అరగంట  ఎపిసోడ్  గా ప్రతి శని వారము  రాత్రి  12-౦౦ గంటలకు మే క్సము ప్రత్యేకముగా ప్రసారము చేస్తున్నాము. మిస్  కాకండి.

*5. ఒకే  ఒక సంతోషకరమయిన విషయము ఏమిటంటే., “భలే  సుబ్బారావ్’  లాంటి సున్నితమయిన హాస్య  నాటికలను  అందరూ మరిచి పోయినారు.’నీ అంటూ చూస్తా’, ‘నీవు  ఎలా  సుఖముగా ఉంటావో  చూస్తా’ లాంటి  డైలాగులతో ప్రేక్షకులను మేస్మరైజ్  చేస్తున్నారు. ఇదంతా  కలి ప్రభావమే అనుకోకండి.  నాకనిపిస్తుంది, కలియుగాన్తమే అని.


Tuesday, March 13, 2018

ప్రస్థానము 4




ఈ లోపల కొత్తగా స్థాపించా బడే ఒక పరిశ్రమ విషయములో  సలహా కోసమని  ఒకరు వచ్చినారు. అందులో చాలా రసాయనాలు బయటికి పంప వలసి వస్తుంది. వాటిని ఎలా వదిలించుకుంటావని అడిగినాను.
“ఏముందీ పక్కనే యున్న ఏటిలో కలిపి వేస్తాను.”
“ఏటిలో నీరు ఎవరూ క్రింద జనాలు వాడుట లేదా?’
“అవన్నీ అనుకుంటే పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఈయ లేము?”
అతడి జవాబుకు నివ్వెర పోయినాను. ఒక్క విషయము మాత్రము అర్థమయింది. ప్రభుత్వాలు పరిశ్రమల ప్రతిపాదనలను బాల పరుస్తున్నాము. అందు వలన ఏంటో మందికి ఉద్యోగమూ, ఉపాధి దొరుకుతుందని చెప్పడము, ఈ మాటలన్నీ ఈ వచ్చిన వ్యక్తీ బుఱ్ఱకు బాగా ఎక్కినాయన్న మాట. లీటర్ నీళ్ళ సీసా పదిహేను రూపాయలకు అమ్ముతున్న పరిశ్రమలకు, కొన్ని లక్షల నీటిని త్రాగడానికి ఎవరధికారమిచ్చినారు?
ఒక్క సారి భరతుడు కౌసల్యకు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. “రాముడు  అరణ్యానికి వేల్లదములో నా పాత్ర యుంటే, త్రాగుతకనువయిన జలములను మురికి చేయు వానికి    పాపము వస్తుందో ఆ పాపము నాకు చుట్టుకుంటుంది.”
(పానీయ దూషకే పాపం  తదైవ  విషదాయకే   యత్తదేకః    లభతాంయస్యాs ర్యోs నుమతే  గతః”-అయోధ్య కాండ, వాల్మికి  రామాయణము )
మరొక్క సారి మనుషుల ప్రవర్తనను  గురించి ఆలోచించి బాధ పడినాను. ఇంకా ఇటువంటి విషయాలలో చేయ గలిగితే  చేయడము తప్ప బాధ పడకూడదని అనుకున్నాను.
ఆ రాత్రి తిరిగి తాతగారి దైనందిని ని చదువ సాగినాను.
పంటలు  వేసే ముందు  పంట కాలవలను  ఒక సారి త్రవ్వి  నీటి పారుదలకు అనువుగా చేయడము ఆనవాయితీ.  అందు కొరకు ఎకరానికి ఒక మనిషి వెళ్లి సమిష్టిగా త్రవ్వుకొనే వారు. మొదట్లో ఈ విధముగానే జరిగేది. పంచాయతీ నుండి ఒక ప్రతిపాదన వచ్చింది. ఎకరానికి కొంత సుంకము చెల్లిస్తే తామే కాలవలను త్రవ్వించి  వేస్తామని. అంటే  ఇంకా రైతులు  తమంత తాము కాలువలు త్రవ్వే  బాధ్యతలను  వదలి వేస్తున్నారని అర్థము. ఈ విధముగా రైతులకు పని తప్పినట్లు అనిపించా వచ్చును. మధ్యలో దళారీలు ప్రవేశిస్తారు. సగము పని చేసి డబ్బు తీసుకుంటారు. వ్యవస్థ పతనానికి ఇది మొదలు.
రేడియో లాటి ప్రసార సాధనాల ద్వారా  రసాయనిక ఎరువులు వాడితే పంటలు ఇబ్బడి ముబ్బడి గా పండించా వచ్చునని ప్రచారము మొదలు పెట్టినది. దీనిని పాత తరము వారు ఎవరూ పట్టించుకోలేదు. మొదట్లో వంగ తోటలో సల్ఫేట్ ఎరువుగా వేసినారు. పిడికిలంతా వంగ కాయ తలంత సైజుకు ఎదిగింది. ఇంట్లో పచ్చడి చేద్దామని  కాలిస్తే నీరు కారి పోయి పిడికిలంతా మాత్రమె మిగిలింది. సల్ఫేట్ కాపు అంటే జనానికి అర్థమయింది.
ఇంకా వారి చాలా ఎత్తుకు ఎదిగేది.పంట రావడానికి నాలుగు నెలలకు పైనే పట్టేది.అందు వలన పశువుల మేతకు ఇబ్బడి ముబ్బడి గా గడ్డి వచ్చేది. ఇంకా గడ్డి మరీ ఎక్కువగా ఉంటే పాకాల మీద కప్పే వారు. గడ్డిని కొని వాటిని శుభ్రము  చేసి, ఒత్తిడితో అట్టలుగా మార్చే వారు. దీని వలన రైతుకు ఆదాయము పెరిగింది, కొంత మందికి ఉద్యోగాలు వచ్చినవి, వచ్చిన నష్టమేమిటంటే పశు  గ్రాసము తగ్గి పోయింది.
ఇంత వఱకు రైతులకు పొలాలు దైవ క్షేత్రాలు. అందుకనే ఆరోజుల్లో పొలాన్ని కూడా క్షేత్రము అని పిలిచే వారు. ఖాళీ సమయాల్లో రైతు పంటల మధ్య పైరును చూస్తూ నడిచే వాడు.అప్పుడు పంట పొలానికి రైతుకు మధ్య ఏంటో అనుబంధము కనిపించేది. ఇంటికి వస్తే పశువులు రైతుకోసము  ఎదురు చూస్తూ ఉండేవి. పశువులు కుటుంబ సభ్యులయితే పంట పొలాలు దివ్య క్షేత్రాలు. మంచి పంట పండాలని కోరుకొనే వాడు. కానీ ఎంత పండినా తృప్తి గా జీవించే వాడు.
శాకుంతలము లో కాళిదాసు వ్రాసినారు,శకుంతల కాలు తగిలితే పూల మొక్కలు త్వరగా వికసించే విట. దీనిని నమ్మ లేని వారికి, ఇటీవల  కాలములో  పరమ హంస యోగానంద యొక్క శిష్యుడు లూథర్ బర్బాంక్ చేసిన ప్రయోగాలు తప్పకుండా గమనించ  దగినవి. ఆయన ముళ్ళ  మొక్కలయిన కాక్టస్  మొక్కలకు వాటి రక్షణ గురించి భరోసా ఇచ్చి, అవి ముళ్ళు లేకుండా ఎదిగే టట్లు చేసినాడు. అంతే కాదు, వాల్నట్ మొక్కలలో వంద ఏండ్లలో వచ్చే ఎదుగుదలను పన్నెండు  సంవత్సరాలలో చూపించినాడు. ఆయన వేసిన ఎరువల్లా అపరిమితమయిన ప్రేమ.. అంటే మొక్కలతో మానసిక బంధము పెంచుకుంటే వాటిలో ఏడుగు డలను, రోగ నిరోధక శక్తిని పెంచ వచ్చునని నిరూపించినాడు.
క్రమముగా ప్రభుత్వమూ ప్రజల ఆకలి తీర్చుటకై ఎక్కువ పండే వంగడాలను తయారు చేయాలని సంకల్పించినది. అందుకని ప్రకృతిలో సహజముగా ఉన్న విత్తనాలపై ప్రయోగాలు చేయించింది వాటి కేంద్రకాలలో మార్పులు తీసుకొని వచ్చి సరి కొత్త విత్తనాలను ప్రయోగ శాలల నుండి బజారుకు తెప్పించింది.  అయితే ఇవి ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడితే తప్ప ఎక్కువ పంటలను ఈయ లేవు. అందుకని రసాయనిక ఎరువులను వాడమని ప్రోత్సహించినది. దీని వలన దిగుబడి బాగా పెరిగింది. పంట పెరిగిందన్న సంతోషములో తను గోతిలో పడుతున్నానన్న విషయాన్ని రైతు గమనించ లేదు. ఇంట వఱకు రైతు విత్తనాలకు ఎరువులకు ఎవరి మీదా ఆధార పద లేదు. ఎక్కువ దిగుబడి  కోసము రైతులు విత్తనాలను కొనుటను  మొదలు పెట్టినాడు.
రసాయనిక ఎరువులు నెలలో శక్తిని కూడా పీల్చి వేస్తున్నాయి. గత సంవత్సరము వేసిన ఎరువులే వేస్తె పంట దిగుబడి తగ్గిపోతున్నది. అదే పంట రావాలంట్ఎరువులు ఎక్కువగా వెయ వలసి వస్తున్నది. ఎక్కువ ఎరువు వేసి పండించిన పంటలు క్రమముగా పురుగుల తాకిడికి గురి కా సాగినవి. పాత కాలములో ఇంతగా పురుగుల తాకిడి  ఉండేది కాదు. ఏ మాత్రమున్నా కాస్త వేప పిండి చల్లే వారు. దీనితే మొక్కలు పురుగు తాకిడికి తట్టుకో  గలిగేవి. ఈ విధముగా వేల సంవత్సరాలనుండి ప్రకృతి సహజముగా పరిణామము చెందినా పంటలు  క్రమముగా ప్రక్కకు పోయి, DNA  మార్పిడితో  ప్రతి క్షణము antibiotics  వేసి పిల్లలను పెంచినట్లు  పురుగు మందులు వేయ వలసి వస్తున్నది. పాత పద్ధతిలో నెలలో స్థిరముగా ఉన్న సారము , ఇప్పుడు బాగా తగ్గి పోతున్నది. అంటే గాక ఈ పంటలలో గడ్డి తగ్గి పశు గ్రాసము కు కొరత వచ్చినది.
ఈ విధముగా వస్తున్నా మార్పులను తాత గారు దైనందినులలో  వ్రాసుకుంటూ వచ్చినారు. ఇది దిన చర్య అనే కంటే వ్యాసాల సంపుతిలా అనిపించినది.
ఒక విషయము మాత్రము తెలుస్తున్నది. ఈ ప్రవాహములో  కొట్టుకొని పోకుండా ఆపుటకై  తాత గారు చాలా ప్రయత్నాలు చేసినట్లున్నది. కానీ ఆయనను ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. ఒక చాదస్తపు వ్యక్తిగా ఆయనను తోటి రైతులు పరిగణింఛినట్లున్నది.
ఆయన ఒక చిన్న రైతు.ఆర్థికముగా చెప్పుకో దాగిన వ్యక్తీ కాదు. అయినా ఊళ్ళో ఒక పోస్టు ఆఫీసు, ఒక ప్రాథమిక  పాఠశాల చాలా తిరిగి సాధించినాడు. అందుకే అందరి దగ్గిరా గౌరవమును పొందినాడు.
త్వరలోనే  ఆయన ఆలోచనా విధానానికి మరొక గట్టి దెబ్బ తగిలింది. హరిత విప్లవము (పంటలు) , శ్వేత విప్లవము(పాడి)తో బాతుకొట్ట ప్రభుత్వ విధానాలు నీలి విప్లవాన్ని ప్రోత్సహించినవి. ఇక అందరు వ్యవసాయము మాని వేసి చేపల చెరువులు త్రవ్వడము మొదలు పెట్టినారు.  పైనాం పురము కు తూర్పుగా ఉన్న ఖాళీ స్థలాలలో  చాలా రొయ్యల చెరువులు వచ్చినాయి. వాటికి బకింగ్ హాం కాలువ ద్వారా  సముద్రపు నీరు పారించినారు. దీని వలన రెండు చెడు ఫలితాలు వచ్చినాయి.
ఎక్కువ జీతాలు ఇస్తున్నందు వలన వ్యవసాయ కూలీలు చేపల చెరువులకు వెళ్ళడము మొదలు పెట్టినారు.ఈ ప్రభావము పీడా కమతాల వ్యవసాయము మీద పడినది.అప్పటికి వ్యసాయ పనులకు యంత్రాలు రాలేదు. అందు వలన వ్యవసాయపు పనులు దెబ్బ తిన్నవి.
వ్యవసాయపు పనులు దెబ్బ తినడముతో  పొలాలకు నీరు పెట్టడము ఆగి పోయింది. పొలాలలో నీరు భూమి క్రింద భాగములో తగులుతున్న  సముద్రపు నీటి ప్రభావాన్ని తగ్గించేవి. ఇప్పుడు ఆ నీరు లేక పోవడము, పెద్ద ఎత్తున చేపల చెరువులు వచ్చినందు వలన  ఊరిలో యున్న నీటి బావులలో నీరు క్రమముగా ఉప్పగా అయినవి. అందు వలన ఊళ్ళో  వాళ్లకు క్రమముగా నీటి ఇబ్బందులు మొదలయినాయి. ఈ సమయానికి తాత గారు దేహము వదిలి వేసినారు. ఆయన ఆలోచనలకు గుర్తుగా ఈ సంఘటనల వివరాలు  అన్నీ దైనందినులలో భద్ర పఱచ  బడినవి.
ఆ తరువాత ఏమి  జరిగినదీ గోపీ వివరాలు సేకరించినాడు. త్రాగే నీరు పాదయినది.చుట్టూ ప్రక్కల ఊళ్లలో ఎన్నో బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమలు నిర్మాణము జరిగినాయి. ఇందు వలన గాలిలో దుమ్ము, బొగ్గు పులుసు వాయువుల సాంద్రత పెరిగినవి.ఇంకా ఊళ్లు ఖాళీ చేసి నగరాలకు వెళ్ళే వారి సమాఖ్య పెరిగినది. పీడా వాళ్ళు, బాగా మొండి వాళ్ళు అక్కడే ఉంటున్నారు.
ఒకప్పుడు ఏంటో అందముగా ఉన్న ఊరు పాదయినది. తాత గారికి ఆ ఊరంటే ఎంత అభిమానమో అనిపించినది. ఆయన కూడా నైరాశ్యము లో వెళ్లి పోయినారు.
ఎందుకో ఒక్క సారి ఆ ఊరిని చూడాలని అనిపించినది. అమ్మా నాన్నలతో చెప్పినాను.నాన్న గారే ఆ ఊరికి వీల్లదము తగ్గించినాడు. ఆయనకు కూడా ఆ ఊరితో సంబంధము తెగి పోయినట్లు అనిపించినది.


Tuesday, April 11, 2017

ఒక మాట

                           
          రెండు చిలుకలు మొదట ఒక మామూలు కథ గానే మొదలు పెట్టినాను. కానీ కథ మరో రకముగా మారి పోయింది. మనుషుల మధ్య బంధాలు ఎలా ఉంటాయో వ్రాసినాను. మొదట సరోజ పాత్ర మామూలు పాత్ర గానే అనుకున్నాను. కానీ అది నన్ను దాటి వెళ్లి పోయింది. ఇంకా ప్రస్థానము కొన్ని రోజులు సాగుతుంది. ఈ నాటి సామాజిక పరిస్థితుల మీద  మాయ అనే కథ మొదలు పెట్టినాను. కానీ ఇప్పుడే అది మీ ముందుకు రాదు అనుకుంటున్నాను.
నాను ఈ ప్రాచీన సంస్కృతీ చిన్నప్పటి నుండి ఏంటో ప్రభావితము చేసింది. నా తండ్రి నుండి నన్ను ప్రత్యక్షముగా పరోక్షముగా ప్రభావితము చేసిన వారు ఎందఱో. అందులో స్వామి వివేకానంద మొదలు శ్రీ నండూరు రాదా కృష్ణ  గారు, వారి ద్వారా నా జీవితమూ మీద ప్రభావము చూపిన శ్రీ కృష్ణమాచార్యులు గారు, శ్రీ సత్య సాయి బాబా గారు.. ఎందఱో ఉపాధ్యాయులు, పేరు పేరున చెప్పక పోయినా వారి అందరికి నా ప్రణామములు.
ఇవి చదువుతున్న వారు ఒక్క వాక్యము అయినా ఖర్చు చేసి మీ అభిప్రాయము వ్రాయండి.
మీ

సుబ్బ రామయ్య.

రెండు చిలుకలు 6


                                      
 ఆ రోజు ఆదివారము. రాము వాకిట్లో కూర్చొని యున్నాడు.  వాణి కూడా ఎంతో హడావుడిగా ఉంది.
వయస్సు పదమూడు  ఏళ్ళే అయినా నాన్నకు అన్ని పనులలో ఇంట్లో సాయము చేసేది. కూతురు హుషారు చూచి రాము కూడా అడ్డము చెప్ప లేదు. అమ్మ వస్తుందని నాన్న చెప్పినాడు. అమ్మకు రాగానే ఏమయినా చేసి పెట్టాలి. పక్క ఇంట్లో అత్తయ్య గారిని  వంట ఇంట్లో కూర్చో పెట్టుకొని తనే స్వీట్ ఏదో చేస్తున్నది. తను చేయ గలనన్న నమ్మకము ఇంకా ఏర్పడ లేదు.
          తొమ్మిది గంటల బస్సు వచ్చింది. పల్లెటూర్ల లో ఏ కొత్త వ్యక్తీ వచ్చినా వింతగా చూడటము రివాజే.
          “సరోజమ్మ వచ్సిందిరో” ఎవరో అంటున్నారు.
“అయ్య గార్ని వదిలేసిందనుకున్నాము కదా. మళ్ళీ వచ్చిందేమిటి?” మరొకరు అంటున్నారు.
“ఆయనను అంత కష్ట బెట్టి  ఏమి బావుకుంది?” మరొకరు.
ఈ మాటలు అన్నీ సరోజకు వినబడుతూనే ఉన్నాయి. చేతిలో చిన్న సంచితో నేరుగా ఇంటికి వచ్చింది.
ఈ హడావుడి చూచి అందరి కంటే ముందు వాణి పరుగెత్తుకొని వచ్చింది.
“అమ్మా! వచ్చేశావా?” అమ్మను కావిలించుకుంది.
రాము లేచి నిలబడినాడు.
సరోజకు కళ్ళల్లో  నీరు కారి పోతున్నాయి.
“ఇంకా రాము కు తన మీద కోపముగా ఉందా?”
“తను ఏమి చేసిందని తనకు చెప్పకుండా ఎటో వెళ్లి పోయినాడు?”
“ఒక్క సారి డిల్లీ వచ్చి ఉండ వచ్చును కదా.” ఎన్నో ప్రశ్నలు.
“రాణీ ఏదమ్మా!” వాణి  ప్రశ్న.
“బాగున్నావా?” రాము ప్రశ్న.
“చూస్తున్నారు కదా నేను ఎలా యున్నానో?”
“లోపలికి  రావచ్చునా?” ప్రశ్నించింది.
సరోజ కళ్ళలో శక్తి లేదు. కళ్ళు లోపలి పోయి యున్నాయి. ముఖములో కనిపించే నవ్వు కృత్రిమముగా ఉంది. ఇవన్నీ రాముకు అర్థమవుతున్నాయి. అందరూ లోపలిక్ వెళ్ళినారు.
అత్తగారి పటాన్ని చూచి “అత్తయ్యా!” అంటూ మోకాళ్ళ మీద కూల బడి పోయింది.” అవసరానికి లేని ఈ బ్రదుకు ఎందుకండీ?” అంటూ వెక్కివెక్కి ఏడవ సాగింది. తనతో బాటు వాణీ కూడా ఏడుస్తున్నది.
“సరోజా! ఏడవ వద్దు. ఒక్క సారి వాణి ముఖాన్ని చూడు. బిక్క చచ్చి పోయింది.”అంటూ భుజాలు పట్టుకొని లోపలి గది లోనికి తీసుకొని వెళ్ళినాడు.
“ఏమండీ! ఏమయిందండీ? మీరిన్నాళ్ళు ఏమయినారండీ?”
“ఇదంతా ఎలా జరిగిందండీ? ఎటు వంటి సమాచారము మీరు ఇవ్వ లేదు. ఒక్క టెలిగ్రామ్ ఈయ లేక పోయినారా?”
“సరోజా!నీకు రెండు టెలిగ్రాం లు ఇచ్చినాను రెండేసి సార్లు ట్రంక్ కాల్ లు చేసినాను. దేనికీ జవాబు లేదు. నీవు ఒక్క జాబు కూడా వ్రాయ లేదు. డిల్లీలో కాక మరెక్కడ యున్నావో అనుకున్నాను. అయినా ప్రయాణపు బడలిక మీద యున్నావు. ముందు ముఖము కడుక్కొని రా. నెమ్మదిగా మాట్లాడుకుందాము.” రాము నెమ్మదిగా యన్నాడు.
“వద్దండీ! ముందు నన్ను మాట్లాడనీ. నా గుండెల్లో బాధను ముందు దింపేసుకోనీ. అత్తయ్య గారు పోయిన సమాచారము నాకు అందనే లేదు. మీ నుండీ ఏ సమాచారమూ లేదు.” రాము ఎదో చెప్పా బోతుంటే,
“నన్ను మాట్లాడనీయండి. నేను ప్రతి నాల్గు రోజులకొక ఉత్తరము వ్రాసినాను. మీ నుండీ ఏ జవాబు రాలేదు. మీరు ఫోన్  చేసిన విషయము నాకు తెలియదు. అమ్మ చాలా బాధతో యుంది. ఒంట్లో బాగా లేదు. మీ సమాచారము ఏమీ తెలియ లేదు. నేను కారణము ఊహించ లేక పోయినాను. ఒక రోజు నందిని ముందు గది లోనుండి కొన్ని చిత్తూ కాగితాలు తీసుకొని వచ్చి నాకు చూపించింది.”
“అన్నీ ముక్కలుగా ఉన్నాయి. చాలా కష్ట పడి పేర్చుకొని చూస్తే అది మీ ఉత్తరమే. అందులో మీరు ఫోన్ చేసిన విషయము కూడా ఉంది. అంతే కాదు, నానుండి ఒక్క ఉత్తరము కూడా లేదని ఉంది. నేను ఖంగు తిన్నాను. నేను వ్రాసిన ప్రతి ఉత్తరము పోస్ట్ బాక్స్ లో వేయమని అన్నయ్యకు ఇచ్చే దాన్ని. నేను గొడవ పెడితే చెప్పినాడు వాటిని బాక్స్ లో వేయమని రాహుల్ కు ఇచ్చినాడుట. అంత వరకే నాకు తెలుసు. అప్పుడర్థమయింది. నా మీద కోపముతో రాహుల్ వాటిని చింపి వేసి ఉంటాడని. ఇంకా ఫోన్ విషయమై  అన్నయ్యను గదమాయించినాను. ఒక రోజు ఫోన్లు రెండు సార్లు వస్తే రాహుల్ “ఎవరూ లేరని” ఫోన్ పెట్టేసినాదుట. నేను, నందిని ఇంకా రాహుల్ ఇంట్లోకి రావడము కుదరదని గట్టిగా చెప్పినాము.”
“ఈ విషయము తెలిసి మీ దగ్గిరకు రావాలనుకుంటే వెంటనే రిజర్వేషన్  దొరక లేదు. రిజర్వేషన్ లేక పోయినా  బయలు దేరాలనుకుంటే మా అమ్మ ఒప్పుకోలేదు. రిజర్వేషన్ దొరికి  ఊరికి వస్తే ఇల్లు తాళము వేసి ఉంది. ఎవరిని అడిగినా సమాధానము చెప్పా లేదు. అంతే గాక నా మీద వ్యాఖ్యానాలు చేసినారు. అయినా అది కూడా వారి తప్పు కాదు. వారికి మీ మీద యున్న ప్రేమ గౌరవము వలననే అలా చేసినారు. నాకు ఏమి చేయాలో తెలియ లేదు., పూజారి ఇల్లు కూడా తాళము  వేసి యుంది. ఎవరింటికి వెళ్ళాలి తెలియ లేదు. నా స్నేహితులు కూడా నెల్లూరు లో ఎవరూ లేరు. చివరకు జనరల్ కంపార్టుమెంట్లో డిల్లీ చేరినాను. మీరు ఇంటికి వస్తే చూస్తారని పిచ్చి దానిలా ఉత్తరాలు వ్రాసినాను. వేటికీ జవాబు లేదు.”
“ నిజానికి నామీద కోపముతో రాహుల్ చేసిన వెధవ పనుల వలన  మన మధ్య సంబంధము పోయింది. ఆ పాపము తనకూ కొట్టింది. ఒక రోజు అన్నయ్య రాహుల్ స్కూటర్ మీద వెళుతుంటే ప్రమాదము జరిగి రాహుల్ కు రెండు కాళ్ళు తీసి వేసినారు. అన్నయ్యకు ఒక కాలు కుంటిదయింది. వారిద్దరి మధ్య స్నేహము చెడింది. అన్నయ్యకు ఉద్యోగము పోలేదు. కానీ చెడు సహవాసము పోయింది. అప్పటి నుండీ నేరుగా ఇంటికి వస్తున్నాడు. మా వదిన ముఖములో కాస్త సంతోషము విరిసింది.”
“”అమ్మకు మీరు ఎక్కడున్నారో తెలియక రోజూ బాధ పాడేది. ఈ పరిస్థితులలో రాణి కి కూడా చిరాకు ఎక్కువయింది. ప్రతి దానికీ ఇప్పటికీ రుస రుస లాడుతూనే ఉంటుంది.”
“అన్నయ్య వలన నేను నష్ట పోయినాను. అందుకే తనది ఒక్క పైసా కూడా ముట్టుకోవడము నాకు ఇష్టము లేదు. ఇక్కడకు వచ్చి ఉండాలని యుంది. కాని మీ సమాచారము లేదు. అందుకే ధైర్యము చేయ లేక పోయినాను. అందుకే ఒక కార్పోరేట్ విద్యా సంస్థ లో చేరినాను. నేను  రోజూ పోగొట్టుకుంటున్న ఆనందాన్ని ఆ పిల్లల మధ్య వెదుక్కున్నాను. వాళ్లకు ఫిజిక్సు పాఠాలు చెబుతున్నపుడు మీరు నా ముందున్నట్లే ఊహించుకొనే దాన్ని. ఒక్కొక్క సారి వాణిని చూడాలని తీవ్రముగా అనిపించేది. రాత్రి పొద్దు పోయిన తరువాత అత్తయ్యను, మిమ్ములను, వాణిని తలచుకొని ఏడ్చే దాన్ని.”
“ మా విద్యా సంస్థల వాళ్ళు ఒకరిని ఇక్కడికి పంపించాలని అనుకున్నారు. వెంటనే ఆ వూరు నాకు బాగా తెలుసు నేనే వెళ్తానని బ్రదిమాలుకున్నాను. నా అదృష్టము కొద్దీ వారు ఒప్పుకున్నారు. ఇక్కడికి వచ్చే వరకు నా మనస్సు మనస్సులో లేదు. కానీ ఏదో నమ్మకము, మీరే ఆ పని చేస్తున్నారని అనిపించినది.”
ఇంతలో వాణి తీపి పదార్ధమును చేతిలో పట్టుకొని, ”అమ్మా! నీ కోసము నేనే చేశాను. ఎలాగుందో చెప్పమ్మా!” అంటూ వచ్చింది.
దాన్ని తీసుకొని రాముకు, వాణికి పెట్టి తనూ తీసుకొని, ”చాలా బాగుందమ్మా!” అని చెప్పింది. తరువాత రాము జరిగిన విషయాలు తాము తిరిగిన ప్రదేశాలు అన్నీ వివరించి చెప్పినాడు. తిరిగి వచ్చిన తరువాత తను సరోజ డైరీ చూచి, ఆ ప్రేరణ తోనే ఈ పని మొదలు పెట్టినానని చెప్పినాడు.
కొంచము భావావేశాలు  తగ్గిన తరువాత “అన్నయ్య గారూ!”అంటూ లలితమ్మ వచ్చింది.”వదినమ్మా! స్నానాదులు పూర్తీ చేసుకోండి. ఈ పూట  మా ఇంట్లోనే మీ భోజనము.” అని అన్నది.
మధ్యాహ్నము భోజనాలయిన తరువాత  రాము అడిగినాడు,”మళ్ళీ డిల్లీ ప్రయాణము ఎప్పుడో?”
కొంచెము ముఖము తేట పడింది సరోజకు. వెంటనే అంది.” ఎక్కడికి వెళ్ళినా మీతోనే. నేను ఒంటరిగా వెళితే మీరు ఎక్కడ జారి పోతారో?”
రాము అన్నాడు, ”రాణి సంగతి?”
“ఇప్పుడు పరిస్థితి అర్థము కాక రాణిని తీసుకొని వచ్చే ధైర్యము చేయ లేక పోయినాను.  ఇద్దరమూ వెళ్లి రాణిని తీసుకొని వద్దాము.. ఇంకా నేను కూడా మిమ్ములను విడచి డిల్లీలో ఉండ లేను. వెళ్ళగానే రాజీనామా చేస్తాను. అయితే ఒక్క షరతు” ఆగింది.
“ఏమిటి?” అన్నాడు.
“”మా విద్యా సంస్థల వారు మనలను కలిపినారు. మీరు వారి కోసము కొన్ని ఉపన్యాసాలు ఇవ్వాలి.”
“అలాగే! రాణీ వారి ఆజ్ఞ”
    ---------------------------------------------
వాణీ తో కలిసి ఇద్దరూ వెళ్లి నాలుగు రోజులు అక్కడే యున్నారు. సరోజ అన్నయ్య ప్రవర్తన చాలా సౌమ్యముగా మారింది. దానితో ఇంట్లో నందినికి కూడా గౌరవము పెరిగింది.  సరోజ అమ్మగారు కూడా ఈ మార్పులతో చాలా సంతోషముగా యున్నారు. ఇంక నందిని ఆమె చేత చిన్న పని కూడా చేయించుట లేదు.
ఇంతకూ ముందు భర్త ప్రవర్తన వలన సరోజను తన పుట్టింటికి రమ్మని ఎప్పుడూ పిలవ లేదు. మారిన పరిస్థితులలో సరోజను, రామును తన నాన్న ఇంటికి పిలుచుకొని వెళ్ళింది. వృద్దులయిన ఆ తల్లి దండ్రులు ఎంతో సంతోష పడినారు. వారి ఆశీస్సులు తీసుకొని ఇంటికి వచ్చినారు. సరోజ అమ్మను తనతో రమ్మని పిలిచింది. ఆమె,”నందిని కాస్త సంతోషముగా ఉంది. దానికి తోడుగా ఉంటాను. అందరమూ ఒక సారి వస్తాము” అన్నది. తిరిగి, సరోజ తన అన్నయ్యను , నందినిని బాబు తో సహా పైనాం పురము రమ్మని ఆహ్వానించి బయలు దేరింది తమ వెంట వాణి, రాణిలతో.
                   ---------------------------
రాము వేసిన షెడ్ ఒక విద్యా సంస్థ గా మారింది. కొంత మందిని టీచర్లు గా తీసుకున్నా వారి కి శిక్షణ ఇచ్చినారు. విద్య వ్యాపారము కాకుండా భవనాలు, జీతాలకు సరి పోయేంత మాత్రమేమె పిల్లల వద్ద జీతాలుగా తీసుకున్నారు. బాగా పేద వారు, తెలివి, మంచి లక్షణాలు ఉన్న పిల్లలకు మొత్తము జీతము వెనక్కు ఇచ్చేసే వారు. తమ పొలము మీద వచ్చే దానితో మాత్రమె ఇంటిని నడుపుకొనే వారు. తను అనుకున్న విద్యా విధానము అమలు పరిచినందుకు సరోజకు చాలా సంతోషముగా ఉంది.  తాము నిజముగా నేర్చుకుంటున్నామన్న భావన పిల్లలో ఉంది.  

వాణి ఎప్పుడూ హుషారుగా ఉన్నది. రాణి  చాలా మారింది, కానీ అప్పుడప్పుడు తెలియకుండా చిరాకు వచ్చేది. ఇద్దరూ వాళ్ళు పెరిగిన వాతావరణమును అనుసరించి అలా తయారయినారు. మరో రెండేళ్లకు రాముకు ఒక కొడుకు  పుట్టినాడు. మామయ్యా గారే పుట్టినారని సరోజ సంతోష పడింది. ఇంకా వాణి, రాణి లు ఆ తాతయ్య అంటూ వాడిని వదలి పెట్టడము లేదు.
ఒక ప్రణాళిక భూమిపై విరిసింది. కాలము మాత్రము నడిచి పోతూనే ఉంది.
                                                 తథాస్తు.



Monday, April 10, 2017

ప్రస్థానము 3

                                            



గోపీ లేదా గోపాల కృష్ణ ఇండియా కు తిరిగి వచ్చినాడు, తన మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కి  బిజినెస్స్ మేనేజ్మెంట్ ను జోడించుకొని.   శాస్త్ర  సాంకేతిక అవగాహన తో బాటు  సాంస్కృతిక అవగాహన పెంచుకున్నాడు.  రాగానే అంతర్జాలములో తన వివరాలను పెట్టినాడు. కొద్ది రోజులలోనే బెంగుళూర్  నగరములో నొక ప్రముఖ ఇంజనీరింగ్  సంస్థ లో  వ్యాపార సలహాదారు(బిజినెస్స్ కన్సల్టంట్) గా చేరినాడు.
ఒక సారి తిరుపతి లో తమ ఇంటిలో పాత పుస్తకాలన్నీ కలియ బెడుతుంటే అందు లో కొన్ని పాత దైనందినులు (డైరీలు) కనిపించినాయి. అన్నీ తన తాత  రాం గోపాల్ వ్రాసినవి. ఇప్పుడు ఆయన లేరు. కానీ ఆయన ఆలోచనల స్వరూపము తెలుసుకోవాలంటే ఇవి ఒక ఆధారము. వాటిలో ప్రతి చోటా మనుషుల  ఆలోచనలలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న స్వార్థము, తను ఎదగాలన్న కోర్కెతో  సమాజానికి ఎంత హాని చేస్తున్నాడు, ఈ విషయాలే వివరణలతో ఉన్నవి. అది ఆయనకు సంబంధించిన దైనందిని లా కనిపించ లేదు. మనుషులలో ఆలోచనలను రేకెత్తించే వ్యాసాల సంపుటి వాలే కనిపించినది. వాటిని హడావిడిగా చదవ లేము. రోజూ కాస్త నెమ్మదిగా చదవాలి. తండ్రి అనుమతితో అన్నీ తన వెంట బెంగుళూర్ తీసుకొని వెళ్ళినాడు.
పారిశ్రామిక సంస్థలలో పని చేసే ఇంజనీర్లు అప్పుడపుడు తన దగ్గిరకు వచ్చే వారు. వారి సమస్యలను వివరముగా చర్చించే వారు.వారి అవసరాలను బట్టి తను సలహా ఇచ్చే వాడు. అందుకవసరమయిన సమాచారము అంతటినీ అందించే వాడు. ఇందుకు కొంత రుసుమును(కన్సల్టేషన్ ఫీజ్ )  తీసుకొనే వారు.  ఈ చర్చలలో వారి ఆలోచన స్థాయి,  సామాజిక విషయములలో వాలకున్న నైతిక విలువలు ఇటువంటివి అన్నీ స్పష్టము గా తెలిసేవి.
కొంత మంది వచ్చే వారు,వారికి కావలసినది, తాము తయారు చేసే వస్తువు మన్నిక కలిగి ఉండాలి,ఖర్చు చాలా తక్కువ ఉండాలి, అందుకు మూడు సరుకును మార్చ వలెనా? యంత్రము యొక్క సామర్థ్యము పెంచాలంటే ఇంకేమి జాగ్రత్తలు తీసుకోవాలి? తమ వస్తువులను కొనే వారి యొక్క సంతృప్తిని ఎలా పెంచాలి? ఇవన్నీ న్యాయ బద్ధమయిన ఆలోచనలు. ఈ విధముగా చర్చించుటలో తనకు ఏంతో సంతృప్తి, సంతోషము కలిగేది. అయితే  ఇటువంటి వారి సమాఖ్య చాలా తక్కువగా ఉండేది.
ఎక్కువ మంది దృష్టి  సంపాదించే లాభాల మీదనే ఉండేది.  ఇలా చేస్తే లాభాలు పెరుగుతాయి కదా అని అడిగే వారు. అది తన సలహా తీసుకొన్నట్లు కాకుండా తనకు సలహా ఇచ్చినట్లు ఉండేది. పరిశ్రమలలో వచ్చిన మురికిని ప్రక్కన కాలువలలో కలుప వచ్చును కదా  అని అడిగిన వారికి ఏమి జవాబు ఇవ్వాలో తెలిసేది కాదు. దానిని తిరిగి శుద్ధి చేయడము, ఎలా చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, మొత్తము వివరాలను చెప్పే వాడు. కానీ, వారి మాటలలో తనకు తెలిసేది. బహుశా వారు ఖర్చులు తగ్గించుకొనుటకు లాభాలు పెంచుకోనుటకు ఆ పని చేయరని.
సిమెంటు పరిశ్రమలలో , థర్మల్  విద్యుత్ కేంద్రాలలో బూడిద  తో బాటు అతి సూక్ష్మ స్థాయి లో యున్న దుమ్ము కణాలు వస్తాయి. ఇవి మామూలు పద్ధతులలో బూడిద లోనికి వెళ్ళకుండా గాలిలో కలుస్తుంది. ఇది చుట్టు ప్రక్కల వారు పీల్చే గాలితో కలిసి, కొద్ది కాలములోనే చుట్టూ ప్రక్కల వారిలో ఊపిరి తిత్తుల వ్యాధికి కారణము అవుతుంది. ఈ కణాలను గాలికి వెళ్ళనీయకుండా ఎత్తైన గొట్టాల ద్వారా పైకి పంపిస్తూ స్థిర విద్యుదయస్కాంత శక్తి ద్వారా నెలలో కలిసి పోయేటట్లు చేయ వచ్చును. కానీ ఇందుకు పెట్టుబడి పెట్టాలి.
ప్రతి సమస్యకూ ఒక పరిష్కారము ఉంటుంది. కాని దానికి అయ్యే ఖర్చు లాభాలను బాగా తగ్గించి వేస్తుంది. ఈ విధముగా పరిశ్రమలనుంచి వచ్చే పర్యావరణ కాలుష్యాన్ని నివారించుట జరుగుట లేదు.
  అంతే కాదు, తమ తయారీ వస్తువు యొక్క సామర్థ్యము పెంచి అమ్మాలి అనే కంటే ఎదో విధముగా ప్రజలను మభ్య పెట్టి వారి చేత కొనిపించాలనేది లక్ష్యముగా ఉంది.
సోనీ కంపెనీ స్థాపకుడి ఆత్మ కథలో ఒక విషయముంది. తమ తయారీ లో ఒక్క పరికరములో దోషము కనిపించేసరికి, దానితో తయారయిన అన్ని పరికరాలన్నీ చెత్తలో వేయించేశారు. ఎందుకంటే సోనీ పరికరాలలో దోషము ఉండదనే నమ్మకము పోగూడదు.
మన దేశములో మొట్ట మొదట స్టీలు పరిశ్రమతో బాటు ఇతర పరిశ్రమలు స్థాపించిన వారు టాటాలు. జమ్షెడ్జీ టాటా వారిలో ప్రముఖుడు. వారి పరంపరలో ఒకడైన జే ఆర్ డి  టాటా ఒక ప్రముఖ విద్యా సంస్థలో ఉపన్యాసము ఇచ్చినపుడు, ఒక విద్యార్థి అడిగినాడు,” మన దేశములో మంచి క్వాలిటీ వస్తువులు ఎందుకు రావటము లేదు?” అని. అందుకు ఆయన ఇచ్చిన జవాబు,”నిర్మాణము పరిపూర్ణతను అందుకోనుటకు ఎవరికీ ఇష్టము లేదు. అది పని చేస్తుంది. అంతే చాలు.”(It is enough, it works, that’s all.. It is their motto)
వేయి సంవత్సరాల తరువాత కూడా తుప్పు పట్టని ఇనుమును  తయారు చేసిన భారతీయుల లోనా, ఇంత మార్పు. గోపీ లో ఆలోచనలు చేల రేగినాయి.
ఇంట్లో ఏదయినా పరికరము పాడయితే , దానిని సరి చేసుకొని వాడటమే తప్ప , తొందర పడి మరొకటి కొనే వారు కాదుట. నాన్న చెప్పే వారు. కానీ, విదేశీ మార్కెట్ల  ప్రభావము గ్లామర్/ఆకర్షణ  ఎంత వచ్చిందంటే , అవసరము లేకున్నా కొనే సంస్కృతి వచ్చి పర్యావరణానికి ముప్పు తెచ్చింది. డబ్బు చేతిలో ఉంటె ప్రతి యొక్క మాడల్ తప్పకుండా ఇంట్లోకి రావలసిందే.
 ఈ ఆలోచనల పరంపరలోనే రామ్ గోపాల్ తాత గారి దైనందినులను చదవడము మొదలు పెట్టినాడు. ఆయనకు చిన్నప్పుడు పైనాంపురము ఎలా ఉండేదో,  క్రమముగా ఎటువంటి మార్పులు వచ్చినాయో  అందులో వివరముగా ఉన్నాయి. ఆయన విశ్లేషణ కూడా అద్భుతముగా ఉంది.
అనంత పురము పైనాంపురము జంట గ్రామాలు. విశేషము ఏమిటంటే అనంతపురము తోటపల్లి గూడూరు మండలానికి పైనాంపురము ముత్తుకూరు మండలానికి సంబంధించినవి. ఈ ఊళ్లకు సముద్రము ఒక మైలు దూరములో
ఉంటుంది. అంటే సుమారుగా ౧.౬ కిలో మీటర్ దూరములో ఉంటుంది. అందుకే సముద్రము హోరు మీడున్నపుడు శబ్దము ఇక్కడికి వినిపిస్తుంది. ఈ  ఊర్లది పూర్తగా ఇసుక నేల. గాలి కొట్టిందంటే ఇసుక అంతా ఇంట్లోనే ఉంటుంది. అంతే కాదు, ఆ ఇసుక మీద పొరలినా ఏ మాత్రమూ అంటుకోదు. విదిలిస్తే పది పోతుంది.  అనంత పురము తరువాత  కుమ్మర పాలెము, ఆ పైన వరకవి పురము అనే గ్రామాలున్నవి. వరకవిపురములో వేయి యకరముల విస్తీర్ణము గల నీటి చెరువు ఉన్నది. చుట్టూ పక్కల గ్రామాల పంటలకు అదే ఆధారము. నెల్లూరు ప్రక్కన ప్రవహించే పినాకినీ నదికి శ్రీ రంగ నాయకుల గుడి సమీపములో ఒక అడ్డు కట్ట ఉంది.  దానిని ఎవరు నిర్మించినారో నెల్లూరు వారు మరిచి పోయినారు. నెల్లూరు కోవూరు ల మధ్య ఉన్న వంతెనను కాటన్ దొర కట్టించినారని ఉంది. గోదావరికి ధవళేశ్వరము వద్ద బారేజి కట్టించిన కాటన్ దొర బహుశా ఈ ఆనకట్టను(బారేజి)ను కూడా కట్టించి ఉండ వచ్చును. అక్కడనుండి నీరు వేరు వేరు చెరువులకు అందుతుంది. అందులో వరకవిపురము చెరువు కూడా ఒకటి.
          వరకవిపురము నుండి నీరు వచ్చే వాగుకు పంజల మడుగు అనే వారు. అది ఊరికి ఉత్తర దిశలో ప్రవహించి బకింగ్హాం కాలువలో కలుస్తుంది. కాకినాడ నుండి  చెన్న పట్నము(ఈ పేరు తరువాత మద్రాసు గాను తిరిగి చెన్నై గానూ మారింది.) వరకు వస్తువులను నీటి మార్గము ద్వారా తీసుకొని వచ్చుటకు తీరము వెంబడి సముద్రమునకు ఒక మైలు దూరములో  బకింగ్  హం అనబడే బ్రిటిషు అధికారి దీనిని తవ్వించినాడుట. అది ఊరికి తూర్పు వైపున ఉంది. ఈ కాలువను అక్కడక్కడ కాలువల ద్వారా సముద్రపు నీటితో  కలిపి సంవత్సరము పొడుగునా అందులో నీరు ఉండేట్లు చూచినారు. పెట్రోలు వాడకము తక్కువగా ఉన్న ఆ రోజులలో అక్కడ నుండి చెన్న పట్ణానికి ధాన్యము పడవల ద్వారా వెళ్ళేది. సమయము ఎక్కువయినా చాలా తక్కువ ఖర్చు అయేది. పర్యావరణ పరముగా కూడా అది సురక్షితము.
          బకింగ్ హాం కాలువ దాటితే వాగర్త గ్రామము వస్తుంది. పంజల మడుగు  బకింగ్ హాం కాలువల మధ్య అనంతపురము పైనాంపురము గ్రామాలు ఇమిడి ఉన్నవి. మధ్యలో కొన్ని పంట పొలాలు, పొలాలకు పడమరగా ఇసుక నేల ఇంకా పడమరగా ఇళ్ళు వస్తాయి.
          తాతగారికి ముందే అక్కడ వ్యావసాయిక వ్యవస్థ ఏర్పడి యున్నది. పొలాలలో వారి పంట వేసే వారు. ఆ రోజులలో ప్రకృతి లో ఆటు పోట్లను ఎదుర్కొన్న వారి వంగడాలు, తెల్ల కేసర్లు, ఎర్ర కేసర్లు, మరియు మొలగోలకులు అనే పంటలను వేసే వారు. కేసర్లు గింజ చాలా లావుగా ఉండేది. అందులో ఎర్ర కేసార్లు పంటను శ్రామికులు ఎక్కువగా తినే వారు. దాని రుచే వేరుగా ఉండేది. మధ్య రకం కుటుంబీకులు ఎక్కువగా తెల్ల కేసర్లు మొలగొలకులు తినేవారు. పై స్థాయి వారు మొలగొలకులు మాత్రమె తినే వారు. వీటి రుచి చాలా ప్రసిద్ధి గాంచినది. వీటిని రాజనాలు అని కూడా అనే వారు. వీటి వలననే నెల్లూరు జిల్లా బియ్యానికి పేరు వచ్చినది. ఇవి అన్నీ ప్రకృతి యొక్క పరిశోధనలో వచ్చిన పంటలు. అందుకే వాటి మీద పురుగుల దాడి కూడా ఉండేది కాదు. పురుగు మందుల అవసరము వచ్చేది కాదు.
          రైతులకు పొలాలు కాకుండా అవసరమయినవి పశు సంపద. ఆవులకు కోఠాలు ఉండేవి. పగలంతా అవి బయటికి మేతకు వెళ్ళేవి. రాత్రి వాటికి ఆ కొఠాలలో విశ్రాంతి. అక్కడే ఎందు గడ్డి పడేసే వారు. అవి తినగా నలిగినా మిగిలిన గడ్డి వాటి పేడ మూత్రముతో కలిసి ఎరువుగా తయారు అయేది అదే ఆ నాడు పొలాలకు ఎరువు.
          వాళ్లకు బాగా పండిన పొలాలలో వారి గింజలను బాగా ఎండ బెట్టి మూటలు కట్టి పెట్టె వారు. వాటినే తరువాత పంటకు ఎరువులుగా వాడే వారు. వారి ఇంకా పదిహేను రోజులలో కోతకు వస్తుందనగా పెసల మూటలు తడిపి మోము రాగానే  ఆ పొలాలలో చాల్లే వారు. వరి కోతలు అయిన తరువాత పెసలు పెరిగేది. కాయలు వచ్చి ఎండిన తరువాత కోసి నూర్చే వారు. ఇది అదనముగా వచ్చే లాభము. తిరిగి ఈ పెసలనే విత్తనాలుగా వాడే వారు. ఇందులో వచ్చిన చెత్త ఎద్దులకు  మేతగా ఉపయోగ పడేది. అంతే గాక ఎద్దులకు మాత్రమె పిల్లి పెసర (శతావరి) పంటను వేసే వారు. ఈ విధముగా తమ ఆహారముతో బాటు పశువులకు మంచి పోషణ ఇచ్చే ఆహారమును అందించే వారు.
          మెట్ట ప్రాంతములలో వంగ, మిరప, రామ మునగ(టమాటో) లాంటి పంటలు, కూర గాయాలు  వేసే వారు. ఆ రోజులలో మిరప తప్ప మిగిలిన కూర గాయలతో పెద్ద కుటుంబాల వారు వ్యాపారము చేసే వారు కాదు. ఎవరడిగినా కూర గాయలను ఊరికే ఇచ్చే వారు. ఇంకా ఆవు దూడలను ఎంత ప్రేమగా చూచే వారంటే, పేరుతొ పిలిస్తే అవి పరుగెత్తుకొని వచ్చేవి. అది ఆనాటి మనుషులకు పశువులకు ఉన్న అనుబంధము.
          అప్పుడప్పుడు నేలలో సత్తువ పెరగడానికి నీలి, జనుము, వెంపల వంటి విత్తనాలు చల్లి మొక్కలు ఎదిగిన తరువాత  వాటిని దున్నించే వారు. అవి మట్టితో కలిసి పోయేవి. ఈ రకముగా నేల సత్తువ పెంచి ఎక్కువ పంటలు పండించే వారు. అంతే గాని వారికి ఆనాడు రసాయనిక ఎరువుల అవసరము కనిపించేది కాదు.
తన దైనందినిలో ఒక చోట వ్రాసినారు.
          “ఇవన్నీ వ్రాయ వలసిన అవసరముందా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ, వస్తున్న మార్పులు, వాటి వలన వచ్చిన ఆలోచనలలో మార్పులు చూస్తుంటే, గతములో ఒకప్పుడు ఇలాగుండేది అని చెప్పే వారు కూడా ఉండరేమో అని అనిపిస్తుంది. ప్రకృతికి మనిషికి గతములో ఉండేది అనుబంధము, ఇప్పుడుండేది వ్యాపార బంధము. తిరిగి, తిరిగి, మనిషి ఎక్కడికి వేల్లుతున్నాడో తెలియటము లేదు. మనిషికి  నేలకు, మనిషికి పశువుకు  ఉన్న ప్రేమ  అనుబంధాలు కరిగి పోతున్నాయి.” ఈ విషయములో చిదానంద భారతి చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చినాయి.
          సంక్రాంతికి ఇంటికి పంటలు ఇంటికి వచ్చేవి. అదే సమయాన కూర గాయాలు కూడా బాగా పండేవి. సూర్యుడు మకర రాశికి చేరే ఆ కాలములో ఎవ్వరూ నిరాహారముగా ఉండ కూడదు అన్న భావన కొన్ని అలవాట్లకు దారి తీసింది. సంక్రాంతికి ముందు రోజు పాత వస్తువులను తగల పెట్టే వారు. దీనినే భోగి అనే వారు. సంక్రాంతి నాడు పితృ దేవతలకు తర్పణాలతో బాటు ఇంట్లో పిండి వంటలు చేసే వారు. ఆ మరునాడు పశువులను అందముగా అలంకరించి వాటికి ప్రత్యేకముగా ఆహారము పెట్టె వారు. దీనిని పశువుల పండగ అనే వారు. ఈ మూడు రోజులు  వాకిట్లో బియ్యపు బస్తా పెట్టి, ఇంట్లో చిన్న పిల్లలకు ఒక బాధ్యతా అప్ప చెప్పే వారు. వచ్చిన ప్రతి యొక్కరికి ఒక చిన్న పాత్రతో బియ్యము పోయదము పిల్లల పని. రోజూ వందల మంది వచ్చే వారు. ఈ ఒక్క పని సమాజములో ఒక బాధ్యతను గుర్తు చేసేది. అంతే గాక చిన్న పిల్లలకు దానము చేసే అలవాటు వచ్చేది. ఈ విధముగా ఇంకో తరము తయారు అయేది.

          ఆ సమయములోనే ఊళ్ళో ఆసక్తి ఉన్న వాళ్ళు వీధి నాటకాలు వేసే వారు. అర్థ రాత్రికి ముందు మొదలయి సూర్యోదయము వరకు జరిగేవి. ఇటువంటి రోజులు చెదిరి పోతున్నాయి మళ్ళీ వస్తాయో లేదో? ఇదే పెద్ద ప్రశ్న.
(To be continued )

రెండు చిలుకలు 5


తిరిగి వచ్చిన తరువాత వారి వారి పనులలో నిమగ్నమయినారు. సరోజ పాత శాలలలో చదువు చెప్పే పధ్ధతి కొంచెము బాధను కలిగించింది. ఇందులో తను ఏమయినా చేయ గలనా అని ఆలోచించేది. తను చదువుకున్నపుడు కూడా ఇదే పరిస్థితి. చదువు అంతా యాంత్రికముగా నడిచింది.  ఇది మంచి, ఇది చెడు అని చెప్పే చదువులు కావు. అంతా పోటీ. అనుక్షణము ఎలా చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి? ఎలా మొదటి స్థానములో ఉండాలి? ఇదే ప్రధానమయిన లక్ష్యము. అనుక్షణము మనస్సులో ఉండేదొకటే. పోటీ... పోటీ.... పోటీ.... “స్పర్థయా విందతే  విద్య” అని యన్నారు. అప్పుడు ఉద్దేశ్యము ఒకటయితే  ఇప్పుడది పూర్తిగా మారి పోయింది.  మామయ్యా గారి దగ్గర తెలుగు శతక వాఙ్మమయము గూర్చి తెలుసుకొంది. మనిషి ఎలా నడచుకోవాలన్నది సుమతి శతకము, కాస్త సామర్థ్యము ఉంటె భర్తృహరి  నీటి శతకము, లోక ప్రవృత్తికి భాస్కర శతకము, నృసింహ శతకము, ఇంత వైవిధ్యము తను హిందీ లో చదువుకున్నట్లు గుర్తు లేదు. అందుకు కారణము కూడా ఉంది. ఆ నాడు తనకు మార్కులు తెచ్చు కావాలన్న ధ్యాస తప్ప అతము చేసు కావాలన్న మానసిక స్థితి లేదు.
అంతే కాదు, ఛందస్సు తో కూడిన పద్యాలలో అంతరంగముగా సంగీతము వినిపించేది. ఇంకా పాట పాడుకోవడానికి , పద్యము చదువుకోవడానికి తేడా కనిపించేది కాదు. ఒక రిక్షా లాగే వ్యక్తీ నోట్లో కూడా  కృష్ణ రాయ భారము లేదా పోతన భాగవతము పద్యాలు వినిపించేవి. తను నెల్లూరు లో ఇవన్నీ గమనించినది.
వరి కోతలయిన తరువాత  దక్ష యజ్ఞము, భక్త ప్రహ్లాద నాటకాలను వేసే వారు. రాత్రంతా మేలుకొని జనము వీటిని చూచే వారు.
క్రమముగా  రాజకీయ నాయకుల వోట్ల వ్యాపారము  కొత్త పుంతలు దోక్కినది. తను అధికారములో ఉండాలంటే దేనినైనా అమ్ముకోవచ్చును, అనే ప్రవృత్తి విద్య విధానము మీద పడింది. ఒక నీతి కథ చెబితే మత ప్రచారము చేస్తున్నారనే ప్రబుద్ధులు తయారయినారు. ఇందులో భాగముగా ప్రైవేటు విద్య సంస్థలు పుట్టుకొని వచ్చినాయి. వాటికి పిల్లలకు చదువు చెప్పడము కంటే వారి తల్లి దండ్రులను ఆకట్టు కోవడము ఎక్కువయింది. నీతి, నడవడిక లను బోధించే పాఠ్యాంశాలు  క్రమముగా తగ్గి పోయినాయి.
తను చదువుకోక పోయినా వాణి చేత సుమతి శతక పద్యాలు చదివించేది. ఎప్పుడూ చిరాకు పడకుండా బుజ్జగించేది. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క  నీతి కథ చెప్పేది. వాణి కథ కోసము పద్యమును కంఠస్ఠము చేసేది.
తను లలితా సహస్ర నామము చదువుతుంటే శ్రద్ధగా వినేది. ఎంత శ్రద్ధగా వినేదంటే తను ఎక్కడయినా తడబడితే అందించేది. ఊళ్ళో బడికి పంపిస్తున్నా ఇంట్లో తన శిక్షణ లోనే ఉండేది.
రామును అడిగేది, “మన విద్యా విధానములో మార్పులు ఎటు దారి తీస్తున్నాయి?” యని.
“మనమే ముందు వెళ్ళాలేమో యనేది. తను చదివిన పి జి ఫిజిక్స్ తనకు ఒక అవగాహనను కల్గించింది. ఆ శిక్షణతో ఏ పాఠ్యాంశమును అయినా అర్థము చేసుకోవచ్చును. క్రమ క్రమముగా తన పిల్లల కోసము తను ప్రణాలికలు వేయాలనుకుంది.  కానీ,,”ఎలా మొదలు పెట్టాలి?” అంతే కాదు తన పిల్లల కున్న అవకాశము చుట్టూ ప్రక్కల ఉన్న ప్రతి వారికి రావాలి. ఇదే ఆలోచన. అప్పుడప్పుడు రాముతో బాటు నెల్లూరు వెళ్లి పాత పుస్తకాల షాపులలో పాత పాఠ్య పుస్తకాలను చూచేది. అప్పుడు మరొక విషయము కొట్టొచ్చినట్లు కనిపించినది. ఇరువది ఏళ్ల క్రిందట పిల్లలకు ఎలా సులభముగా అర్థమవుతాయా అనే ఉద్దేశ్యముతో పుస్తకాలు వ్రాయ బడినాయి. ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందంటే “ఎలా వ్రాస్తే , పరీక్షలలో ప్రశ్నలకు జవాబులు వ్రాస్తారు?”అనే ధోరణి వచ్చింది. రసము పోయింది, పిప్పి మిగిలింది.
రోజూ రామూ తో ఇవన్నీ చర్చించేది. విసుగు పడకుండా వినే వాడు. మెచ్చుకోలుగా చూచే వాడు. అంతకు మించి సూచనలు ఏమీ రాలేదు.
ఇలా కాదని తను ఒక ప్రణాలికను ఏర్పరచుకొని ఆ పద్ధతిలో వ్రాయడము మొదలు పెట్టింది. అప్పుడప్పుడు, రాము వాటిని చూచి,”మంచి పనిని చేస్తున్నావు.” అని యంటే  చాలా సంతోషము వేసేది. ఇంకా ముందుకు వెళ్ళాలి.
ఇద్దరు పిల్లలను గూర్చి తనే పట్టించుకోనేది. అత్తగారితో పగలు చాలా సమయము గడిపేది. పూల మొక్కలను వేసేది. తన లక్ష్యమంతా ఒక్కటే, అందరూ సంతోషముగా ఉండాలి. ప్రతి సెకనునును ఒడిసి పట్టుకోవాలి. అలసట తన దగ్గిరకు రాకుండా చూచుకొనేది.
        ----------------------------------------
అప్పుడప్పుడు తల్లినుండి ఉత్తరాలు వచ్చేవి. అందులోనే నందిని కూడా  తన పిల్లాడి కబుర్లు వ్రాసేది. నందిని ఎప్పుడూ హిందీ లోనే వ్రాసేది.
ఒక సారి నందిని”భాభీ!(వదినా) అత్తయ్య బాగా నీరస పడింది. నిన్నే అనుకుంటున్నాది. తను ప్రయాణము చేయ లేనంటున్నది. నీవు ఇక్కడికి రావడము మాత్రము ఇష్టము లేదు.” అంటూ పెద్ద ఉత్తరము వ్రాసింది.
తనకు అమ్మ మీద దిగులు  మొదలయింది. తన కోసము ఎంత కష్ట బడిందో? ఇప్పుడు ఎలాగుందో? మరొక వైపు అక్కడికి వెల్లడము ఇష్టము లేదు. అమ్మనే ఇక్కడికి తీసుక వస్తే బాగుంటందని అనిపించింది. ఒక సారి రాముతో ఇదే మాట యన్నది. “ అమ్మ కూడా సంతోష పడుతుంది. ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు.” అన్నాడు. నందినికి ఇదే మాట ఉత్తరములో వ్రాసింది. ఈ లోపలే  టెలిగ్రామ్  వచ్చింది.”మథర్ సీరియస్”.అని. ఇంకా సరోజ మనస్సు మనస్సు లో లేదు.
అప్పుడు శ్యామలమ్మకు కాస్త నలతగా ఉంది. అయినా సరోజను దింపి రమ్మని రాము కు చెప్పింది. రాము తనకు తిరిగి రాను రిజర్వేషన్ కూడా చేసుకున్నాడు. పక్క ఇంటి వారితో తల్లిని గమనిస్తూ ఉండమని చెప్పి ఇద్దరూ బయలు దేరినారు. సరోజను డిల్లీలో దింపి తను తిరిగి వచ్చేసినాడు. రాణి అమ్మ తోనే ఉంటానన్నది.  తిరిగి వచ్చేటప్పుడు వాణిని తనతోనే తీసుకొని వచ్చినాడు.
వారము రోజులయినా శ్యామలమ్మ్కు వంట్లో నలత తగ్గ లేదు. ఎంతో మంది వైద్యులకు చూపించినాడు. రోజు రోజుకు ఆమె ఆరోగ్యము క్షీణిస్తున్నది. కాలేజికి సెలవు పెట్టి ఇంట్లోనే యున్నాడు. వాణి వలన కొంత కాలక్షేపము అవుతున్నది. నిద్రను కూడా తగ్గించి తల్లి సేవ లోనే యున్నాడు. ఇప్పుడు సరోజ లేని లోటు కనిపిస్తున్నది. అంతా తన భుజాల మీదనే పెట్టుకొని ఎట్లో అన్నీ చూస్తున్నాడు.
తల్లి  మగత లోనికి వెళ్ళింది. ప్రక్క వాళ్ళను కాస్త గమనిస్తూ ఉండమని చెప్పి, నెల్లూరు వెళ్లి సరోజ ఇంటికి ట్రంక్ కాల్ చేసినాడు. గంట తరువాత ఫోన్ మోగింది. ఎవరో ఫోన్ ఎత్తి ఏమీ తెలియనట్లు మాట్లాడినాడు. మళ్ళీ ప్రయత్నమూ  చేసినాడు.”సరోజా,  ఆ పేరుతొ ఎవరూ లేరు” అని హిందీ లో చెప్పి పెట్టివేసినాడు. వెంటనే సరోజ పేరున ఉత్తరము వ్రాసి పోస్టులో వేసి, మళ్ళీ టెలిగ్రం ఇచ్చి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చేసరికి తల్లి గతించింది. ఆఖరు క్షణాల్లో తను కూడా లేదు. రాముకు నిజముగా పిచ్చి ఎక్కినట్లయింది. కూతురు వాణికి పది ఏండ్లు. భార్య కూడా పక్కన లేదు. దగ్గిర బంధువులు ఎవరూ ఊళ్ళో లేరు. ఒక పూజారి కుటుంబము మాత్రము తనకు అండ గా ఉంది.
అత్తగారు పొతే కోడలు లేదని ఊళ్ళో అంతా నోరు నొక్కు కున్నారు. తనకు  దుఃఖము ఆగుట లేదు. వాణి ని పూజారింట్లో ఉంచి కర్మ కాండ పూర్తీ చేసినాడు . సరోజ రానే లేదు. తను తిరిగి వచ్చిన తరువాత ఒక్క ఉత్తరము కూడా లేదు.”సరోజకు ఏమయింది? ఇక్కడకు రావాలని అనిపించ లేదా?” బాధ పడినాడు. కార్యక్రమాలు అయిన తరువాత మళ్ళీ నెల్లూరు వెళ్లి ట్రంక్ కాల్ చేసినాడు. సమాధానము మళ్ళీ అదే. ఎవరో ఎత్తినారు. తనకు సంబంధము లేనట్లు ఏదో హిందీ లో చెప్పినాడు.
తనే డిల్లీ కి పోదామని అనుకున్నాడు. కానీ, వారి నుండీ ఎటువంటి సమాచారము లేకుండా, వారు రాకుండా తను వెళ్ళడము ఉచితము కాదని అనిపించినది. కూతురు కోసము కాలేజి ఉద్యోగమూ మాని వేసినాడు. చివరకు ఇంటికి తాళాలు వేసి, పక్క ఇంటి వారికి చెప్పి తను వాణి బయలు దేరినారు.
నేరుగా కన్యా కుమారి వెళ్ళినాడు. లోక కంటకుడయిన బాణుడిని చంపుటకు శాశ్వతముగా భర్తకు దూరమయిన తల్లి కన్యా కుమారి. ఆమెకు సంబంధించిన సుచీంద్రమును దర్శించినాడు. ప్రతి క్షణము ప్రతి విషయము వాణికి వివరించి చెప్పినాడు.  అక్కడ నుండి తిరువనంతపురము  వెళ్లి  మూడు గదులకు విస్తరించి యున్న అనంత పద్మ నాభ స్వామిని దర్శించుకున్నాడు. అక్కడ నుండి ఆయనకు లీలగా ఒక దృశ్యము కనిపిస్తున్నది. ఎక్కడికి వెళ్ళినా విపరీతమయిన వేదనతో సరోజ కనిపించేది. “సరోజకు ఏమయిందో?” అనిపించినది. కాని, నాన్న గారు చెప్పిన మాట జొన్న వాడలో ఒక సాధువు చెప్పిన మాట గుర్తుకు వచ్చినాయి. ఏదో ఒక తీవ్రమయిన కర్మ ఇది. అనుభవించక తప్పదు అనుకున్నాడు. చెంగన్నూర్ వెళ్లి జగన్మాత రాజ రాజేశ్వరిని  దర్శించుకున్నాడు. సరోజ రోజూ ఆరాధించే ఆమెకు మనస్సుతో నమస్కారము చేసుకున్నాడు. అక్కడ నుండి వెనక్కు తిరిగి రామేశ్వరము వచ్చినాడు. శ్రీ రామ చంద్రుడు  రావణ వధ తరువాత తిరిగి వచ్చిన చోటు. అక్కడ సముద్రము పై కట్టిన పంబన్ వంతెన అద్భుత మైనది.
సముద్రములో పడవ షికారు చేసినారు. లంగరు వేసిన పడవ ఊగుతుంటే  నిముషానికి ఎన్ని సార్లు ఊగుతుందో గమనించినాడు. అది నిముషానికి పదునారు సార్లు. మన శ్వాస కూడా నిముషానికి పదునారు సార్లు. దీనినే టెస్లా షూమను పౌనః పున్యమని అన్నారు.
అక్కడ నుండి మధుర చేరినారు. భర్తను విడి పోయిన పార్వతీ మాత పాండ్య రాజ కుమార్తె గా జన్మించి  శివుడిని వివాహమాడిన చోటు. శ్రీ మన్నారాయణుడు దగ్గిర ఉండి ఈ వివాహమును జరిపించినాడుట. ఆమె పాండ్య రాజుల ఆరాధ్య దైవము. వేగవతీ నది ఒడ్డున పాండ్య రాజులు కట్టించిన మీనాక్షి మందిరపు వైభవమునకు దేవతలే ఆశ్చర్య పోతారుట.
అక్కడనుండి  చోళ రాజుల రాజధాని తంజావూరు చేరినారు. అది శ్రీ రాజ రాజ చోళుడి యొక్క రాజ దాని. ఆయన నిర్మించిన బృహదీశ్వర ఆలయము గత వేయి సంవత్సరాలుగా చెక్కు చెదర కుండా ఉన్నది. ఆయన సోదరి రాజమహేంద్ర వరాన్ని పాలించిన రాజ రాజ నరేంద్రుడి తల్లి. ఆయన కుమార్తె రాజ రాజ నరేంద్రుడి ధర్మ పత్ని. మహా భారతపు తెలుగు అనువాదానికి విశేష ప్రేరణ ఇచ్చిన మహా మనీషి ఆవిడ.  ఇంకా రాజ రాజ నరేంద్రుడు నిర్మించిన బృహదీశ్వర ఆలయ శిఖరము ఒకే శిల మీద చెక్క బడినది. శిఖరము నీడ ఎక్కడా నేల మీద పడదు. ఈ ఆలయ నిర్మాణము ఒక గొప్ప నిర్మాణ విశేషముగా భావిస్తారు.
అక్కడ నుండి జంబుకేశ్వరము, శ్రీ రంగమును దర్శించినారు.పంచ భూత లింగాలలో జంబుకేశ్వరము ఒకటి. ఈ లింగము ఎప్పుడూ నీటితో తడిసి ఉంటుంది. ఇంకా శ్రీ రంగ నాథుడు రఘు వంశీకులకే కాకుండా విభీషణుడికి కూడా ఆరాధ్య దైవము. ఇంకా పంచ భూత లింగాలలో ఒకటైన ఆకాశ  లింగము చిదంబరములో ఉంది. మధ్యలో ఉన్న కుంభకోణము లో ఉన్న గుడులను చూచుటకు ఒక వారము కూడా సరి పోదు. అక్కడి నుండి తిరుపతి వచ్చినాడు. ఇంకా నెల్లూరు ఇతర ఆంద్ర ప్రాంతములను దాటి, భువనేశ్వరము,  ఉజ్జయిని, వారణాసి, అయోధ్య, హరి ద్వారము, గంగోత్రి, యమునోత్రి, ఋశీ కేశ్, కేదారనాథ్ క్షేత్రాలను చూచినారు. నివాసమునకు ఏదో ఒక ఆశ్రమము ను ఆశ్రయించి వీలయినన్ని రోజులు ఉండే వారు. కలకత్తా వెళ్లి అక్కడ దక్షిణేశ్వరములో  ఎక్కువ కాలమున్నాడు. ఈ విధముగా సుమారు రెండు సంవత్సరాలు తిరిగినారు. ఇంకా వాణి “నాన్నా! అమ్మ వస్తుందేమో? ఇంటికి పోదాము.” అనడము మొదలు పెట్టింది. “నాన్నా! అమ్మ ఇంక రాదా? “ అని రోజూ అడిగేది. ఆ ప్రశ్నకు తనకు జవాబు తెలియదు. తను ఇంటికి వెళితే అమ్మ, నాన్న గుర్తుకు వస్తారు.
రెండేళ్ళ యాత్రల తరువాత పైనాంపురము చేరినాడు. తాళాలు తీస్తే ఇల్లంతా దుమ్ముతో నిండి యుంది. రైతును పిలిపించి ఇల్లంతా శుభ్రము చేయించినాడు. సరోజ వేసిన పూల మొక్కలు పూర్తిగా ఎండి పోయినాయి. తనకు ఎవరి దగ్గిరకు వెళ్లాలని అనిపించ లేదు. పొరపాటున వెళ్ళినా అందరూ సరోజ మీద వ్యాఖ్యానాలు చేసినారు. ఇంక సరోజ గురించి ఆలోచించడము మాని వేసినాడు.
ఈ రెండు సంవత్సరాల పంటను రైతే అమ్మి వేసి తనకు డబ్బు తెచ్చి ఇచ్చినాడు. తిరిగి నెల్లూరిలో ఉద్యోగమూ కోసము ప్రయత్నమూ చేయాలని అనిపించ లేదు. పగలు వాణిని బడికి పంపించే వాడు. సాయంత్రము వాణిని వెంట పెట్టుకొని పొలాల గట్ల మీద నడక సాగించే వాడు. రెండు వారాలు గడచినా తరువాత ఇంట్లో పుస్తకాల దుమ్ము దులపడము మొదలు పెట్టినాడు. అప్పుడు సరోజ డైరీ బయట పడింది. అందులో సరోజ అభిప్రాయాలు, కలలు, ఇప్పటి విద్య విధానములో లోటు పాట్లు, ప్రాథమిక విద్య నుండి ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది, ఇలా ఎన్నెన్నో వ్రాసింది. ఇప్పుడు ఉద్యోగమూ కోసము పాఠాలు చెప్పే టీచరు, విసుగు పుట్టినా తప్పదన్నట్లు వినే విద్యార్థి, ఇటువంటి వ్యవస్థ మారాలని వ్రాసింది.
ప్రాథమిక స్థాయిలో ఎటువంటి  ఆటలు ఉంటే బాగుంటుందో వ్రాసింది. అంతే కాదు, కొంచెము నిలకడ రాగానే “ఒరిగామి” వంటికాగితాలతో బొమ్మలు చేయడము ఉండాలని వ్రాసింది. అప్పుడున్న పాఠ్య ప్రణాళికలో ప్రతి పాతానికి ఒక ప్రయోగాన్ని చేర్చింది. అది కూడా ఎలా చేస్తే పిల్లలు ఎగ బడటారో,ఎలా అయితే ఖర్చు లేకుండా ఇంట్లో వాళ్లకు చూపించ గలరో అటువంటి ప్రయోగాలను వ్రాసింది. ఇంకా నైతిక విలువలు ఒకరు చెబితే వచ్చేవి కావు, ఒకరిని అనుసరిస్తే వచ్చేవి అని వ్రాసింది. అందుకే పిల్లలకు పెద్దలు ఆదర్శముగా నిలబడాలి అని వ్రాసింది.
సరోజ తనతో ఎన్నో సార్లు ఈ విషయాలన్నీ చెప్పేది. తనే సరిగా పట్టించుకోలేదేమో. చాలా బాధ వేసింది.
“సరోజా! సరోజా! నీవెక్కడ ఉన్నావు?” ఇదే ప్రశ్న” తను డిల్లీ వెళ్ళకుండా పొరపాటు చేసినాడేమో?” ఇదొక బాధ. కొన్నాళ్ళు ఇలా బాధ పడినాడు. తరువాత ఒక నిర్ణయానికి వచ్చినాడు.
ఇంటి వెనుక ఇసుక దిబ్బల మీద ఒక రేకుల షెడ్ వేయించినాడు. అక్కడయితే సాయంత్రము పూట బాగా గాలి సోకుతుంది. అందులో కొన్ని బల్లలు కుర్చీలు వేయించినాడు. ఊళ్లోనే యున్న ప్రభుత్వ పాత శాల టీచర్ తో సంపర్కము పెట్టుకున్నాడు. రోజూ తను రెండు గంటలు పాఠాలు , ప్రయోగాలు మొదలు పెట్టినాడు. క్రమముగా అన్నీ షెడ్డు లోనికి మార్చినాడు. ఇందుకు పిల్లల తల్లి దండ్రులను కూడా ఒప్పించినాడు.
వాణి కూడా తనతో బాటు ఉండేది. అక్కడ పిల్లలతో కలిసి పోయి, వారితో బాటు పని చేయడమే గాక తను కూడా సాయము చేసేది. ఆ ఊళ్ళో  పిల్లలకు ఈ పాఠ శాల ఎంత అలవాటు అయిందంటే వాళ్ళు ఒక రోజు మానాలంటే గొడవ చేసే వారు. ఇంటికి వెళ్లి వాళ్ళు ప్రయోగాలకు వస్తువులు పాడు చేసినా వాళ్ళ తల్లి దండ్రులు సంతోషించే వారు. ఆరు నెలల్లో ఈ పాత శాల గురించి పక్క ఊళ్లకు కూడా తెలిసింది. వారు రామును తమ పాత శాలలకు రమ్మని ఆహ్వానించినారు.ఇంకా కార్పోరేట్ పాత శాలల యాజమాన్యాలు రాముకు ఎంత జీతమయినా ఇస్తామని కబురు పెట్టినారు. రాము వేటికీ అంగీకరించ లేదు. మరో రెండేళ్లలో ఉన్నత పాత శాల స్థాయికి దీనిని తీసుకొని వెళ్లాలని ఆశ పడ్డాడు.
ఇప్పుడు రాముకు క్షణము తీరిక లేదు. ఆర్థికముగా ఇబ్బంది ఎప్పుడూ లేదు. కానీ దర్జాగా బ్రదకాలంటే  కుదరదు. కానీ, అటువంటి జీవితమూ పైన తనకు ఏనాడూ  ఆసక్తి లేదు.
ఈ రకముగా మరో సంవత్సరము గడచింది. ఇక్కడ విద్య విధానము యొక్క సమాచారము డిల్లీ వరకు వెళ్ళింది. అక్కడ ఒక కార్పోరేట్ విద్య సంస్థ  తమ వ్యక్తిని పైనాం పురము పంపించాలని అనుకున్నది. ముందు ఉత్తరము  వ్రాసింది. తప్పకుండా చూడ వచ్చని రాము వ్రాసినాడు. ఒక తెలుగు వచ్చిన టీచర్ ను తమ ప్రతినిథిగా అక్కడ పరిశీలించుటకు పంపిస్తున్నామని వ్రాసినారు. ఆ ప్రతినిథి పేరు కూడా వ్రాసి పంపించినారు.
(To be continued)