Friday, April 13, 2018

ప్రస్థానము 6



పైనాంపురం లో ఇప్పుడు ఒక పాతిక  అంటే  దగ్గిరగా ఇరువది అయిదు కుటుంబాలున్నాయి. రోజూ ఏదో యొక  లారీలో నీళ్ళు తెస్తేనే  త్రాగుటకు బాగుంటుంది. లేక పొతే లవణాలతో కూడిన నీటినే అక్కడ త్రాగుతున్నారు. ఆ చుట్టూ ప్రక్కల యున్న చాలా గ్రామాల పరిస్థితి అదే. పంజల మడుగు నీరు ఎక్కువ యున్నప్పుడు అంత ఉప్పగా యుండవు, కానీ నాగరికత తెచ్చిన లాభాల కంటే అనుమానాలు, భయాలు మరీ ఎక్కువ పీడిస్తున్నాయి. ఆ నీరు త్రాగితే ఏ క్రిములో  దేహములోకి వెళ్లి, అనారోగ్యము వస్తుందన్న భయము ఎక్కువ. వచ్చే నీరు తగ్గితే  సముద్రపు నీరు ఎదురు తన్ని  ఆ నీరు కూడా ఉప్పగా తయారవుతుంది. నూతుల్లో, బావులలో నీరు రొయ్యల చెరువు రాకతో ఎప్పుడో ఉప్పగా తయారయినాయి.
గోపి ఆ ప్రాంతము అంతా తిరిగినాడు. అక్కడక్కడ కొన్ని ఇళ్ళు ఉన్నవి. ఎవరికి వారు బ్రదుకుతూ ఉన్నారు. ఇంకా ప్రభుత్వాలు కల్పించ గలిగిన  విద్య వసతులు అక్కడికి చేరే అవకాశము  లేదు. ప్రపంచములో అన్ని దేశాల  ఆర్ధిక వ్యవస్థలు నూతన విధానాల  వలన దెబ్బ తిన్నట్లే, వాటిని అనుసరించినపుడు  ఆ ప్రభావము భారత దేశము మీద కూడా పడింది. కానీ, ప్రజలలో విదేశీ ప్రభావములో పూర్తిగా పడినా కొందరి వలన పడి పోకుండా కొంత వరకు లేచి నిలబడ  గలిగింది. అయినప్పటికీ అంతకు ముందు ఉన్న ఆర్ధిక పటిస్థత రాలేదు. ఆర్ధిక వ్యవస్థ ఈ విధముగా దెబ్బ తినడానికి కారణము స్పష్టము గా కనిపించినప్పటికీ  ప్రజలే  మార్పుకు సిద్ధముగా కనిపించ లేదు. ఇదే దేశము ఆర్థికముగా లేవడానికి అడ్డుగా ఉంది.
ఎక్కువ పెట్టుబడి పెట్టి పెద్ద పరిశ్రమలు పెట్టాలంటే చాలా కష్టము. అందుకని, నల్గురు లేదా వచ్చిన పది మందీ పెట్టుబడి పెట్టి, పరిశ్రమ నిర్మాణము  చేసిన తరువాత  వచ్చిన లాభములో కొంత పెట్టుబడికి కలిపి మిగిలిన మొత్తమును పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకొనుటకు షేర్ మార్కెట్  ఏర్పడినది. నికరపు పెట్టుబడిని పదులు యొక్క  గుణిజములుగా ఏర్పరచి ఒక పదిని ఒక షేర్ గా  తీసుకున్నారు. లక్ష రూపాయల  పెట్టుబడి యంతే పదివేల షేర్లు ఉన్నట్లు లెక్ఖ. పరిశ్రమలో  ఎక్కువ లాభాలు వస్తే  పెట్టుబడి పెట్టాలనుకొనే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ విధముగా షేర్/వాటా   కున్న గిరాకీ ని బట్టి ఎక్కువ విలువ ఇచ్చి కొనడానికి జనము సిద్ధ పడతారు. ఈ విధముగా లక్ష రూపాయల పెట్టుబడి యున్న పరిశ్రమలో షేరు  లేదా వాటా విలువ పది నుండి ఇరువదికి పెరిగినపుడు  ఆ పరిశ్రమ విలువ లక్ష నుండి రెండు లక్షలకు పెరుగుతుంది. ఇది అసలు విలువ కాదు, ప్లావిత మయిన విలువ(ఫ్లోటింగ్ విలువ) లేదా కృత్రిమ మయిన విలువ. అదే ఆ పరిశ్రమ నష్టాలలో పడినపుడు వాటా విలువ అయిదు రూపాయలకు పడి పోవచ్చును. అంటే ఆ పరిశ్రమ విలువ యాబది వేలు మాత్రము అవుతుంది.
మొదటి దశ లో పరిశ్రమ విలువ యంత్రముల విలువకు మాత్రమె సరి పోయినపుడు ఎక్కువ సమస్యలు రాలేదు. ముడి సరుకుల విలువ కలిపినపుడు కూడా అంత సమస్య రాలేదు. అదే ఒక వ్యాపారముల ముడి సరుకులలో నిత్యావసర వస్తువులను కూడా  వ్యాపారములో చూపించినపుడు  సరికొత్త సమస్యలు ఏర్పడినాయి. ఇక్కడ ఒక విష వలయము ఏర్పడింది. ఒక పరిశ్రమ/వ్యాపారము యొక్క నికర లాభము వారు చేస్తున్న వ్యాపారము పెంచుకున్నందు వలన వస్తుంది. ఈ లాభాల వలన  వారి వాటా యొక్క విలువ పెంచుతుంది. అంటే  అక్కడ పరిశ్రమలు, యంత్రములు, సరకుల వలువ కంటే ఆపాదించా బడిన విలువ చాలా ఎక్కువ అన్న మాట. ఈ విధముగా లాభాల పంపకము జరుగుతుంది. ఇవి పెరిగితే ప్రభుత్వానికి వివిధ పన్నుల వలన అంత లాభము వస్తుంది.
ఇక షేర్ మార్కెట్ తన క్రింద నమోదయిన  అన్ని పరిశ్రమల వాటా  విలువను అనుసరించి  తన ఇండెక్స్ ను ప్రకటిస్తుంది.   ఇండెక్స్  పెరగక పొతే  వ్యాపారము నిరాసక్తతతో  ఉంటుంది.  ఈ సూచిక పెరగాలంటే  వాటా విలువ పెరగాలి. వాటా విలువ పెరగాలంటే లాభాలు పెరగాలి. లాభాలు పెరగాలంటే  ఉత్పత్తి పెరిగి ఎక్కువగా  అమ్ముడు పోవాలి.  అలా జరగనప్పుడు, మరొక మార్గాన్ని అనుసరిస్తారు. ఉత్పత్తి అయిన వస్తువు విలువను కృత్రిమముగా పెంచుతారు. లేదా కృత్రిమముగా వాటా పెంచుతారు. షేర్  మార్కేట్  లో మోసాలు ఇక్కడినుండే మొదలవుతాయి. కృత్రిమముగా సూచీ పెంచడానికి  కృత్రిమముగా లాభాలు పెంచి,  నల్ల ధనాన్ని పెంచుటకు వాటాదార్లు ప్రయత్నమూ చేయడము, ఈ సూచీ ప్రభుత్వ  ఆదాయము మీద ప్రభావము చూపుట వలన, దానిని బల పరచడానికి ప్రభుత్వాలు కూడా  సాయము చేయడము, ఈ విధముగా దేశము యొక్క ఆర్ధిక వ్యవస్థ  ఒక విష వలయము లోనికి పడిపోవడము  జరుగుతున్నది. దీనిని వారించుటకే  సత్య సాయి బాబా గారు  ధార్మిక మయిన వ్యాపారాన్ని గురించి ఎప్పుడూ మాట్లాడే  వారు.
ధార్మిక  వ్యాపారములో ప్లావిత విలువలు ఉండవు. ఎక్కువ లాభము రాక పోయినా ఖచ్చితముగా నష్టము  రాదు. అదే  షేర్  మార్కెట్లో  కృత్రిమముగా  వాటా విలువ పెరిగినపుడు, పెట్టుబడిని పెంచి,  వాటా విలువ పడి పోయినపుడు, తమ పెట్టుబడులను పోగొట్టుకొన్, ఆత్మా హత్యలు చేసుకున్న సందర్భాలు  కోకొల్లలు.
క్రమ క్రమముగా వ్యాపారాలు  నష్టాల్లో పడి, సూచీ బాగా పడిపోయినపుడు, కృత్రిమముగా సూచీ పెంచుటకు, పప్పు దినుసుల  విలువలను కూడా స్టాక్  మార్కెట్  లో నమోదు చేయుటకు ప్రభుత్వమూ అనుమతించండి. దీని వలన సూచీ నిలకడ ను సూచించినా  సామాన్య మానవుడికి బలవర్ధకమాయి అత్యంత  ఆవశ్యకమయిన పప్పు దినుసుల ధరలు ఆకాశమును అందుకున్నవి. ఈ విధముగా  వ్యాపార పరమయిన నిర్ణయాలు  సామాన్యుల  జీవితాలను శాసించుట మొదలు పెట్టినవి. ఇటువంటి నిర్ణయాలే కొన్ని దేశాలలో ఆర్ధిక  వ్యవస్థ కూలి పోవుటకు కారనమయినవి.
అందుకే  ఆర్ధిక వ్యవస్థ  సరి అయిన మూలాల మీద ఏర్పడాలి. ఆ ప్రాంతములో దొరికే  మౌళిక వనరుల మీద ఆధార పడాలి. ప్రప్రథమముగా ప్రాంతీయముగా యున్న ప్రజల  అవసరాలను తీర్చ గలగాలి. అటు తరువాత బయటి  ప్రాంతాల వారికి బయట దేశాల వారికి అందించుటకు ప్రయత్నించాలి. ఎగుమతుల కొరకే పరిశ్రమలని  స్థాపించిన దేశాల ఆర్ధిక వ్యవస్థలో కలిగే ఒడిదుడుకులను మనము గమనించ వలసి ఉంది.

Thursday, March 29, 2018

ప్రస్థానము 5



బెంగుళూరు లో తన  తాతగారి దైనందినుల లోని విషయాలను అప్పుడప్పుడు తన స్నేహితుల తో చర్చించే వాడు. కొంత మంది దీనిని చాదస్తమని అనే వారు. ఒకరిద్దరు  మాత్రము తన అభిప్రాయాలను బాల పరచే వారు. అప్పుడే మరి కొన్ని విషయాలు చర్చకు వచ్చినాయి.
రాజేంద్ర సింగ్ అను పేరు గల ఒక యువకుడు సాధించిన విషయము రాజస్థాన్ లో కను విప్పు కలిగించింది.
ఆరావళీ పర్వతాలలో క్రమ క్రమముగా కొండల పై  నుండే  చెట్లు ఎండి పోవడము జరిగింది. వర్షాలు కూడా తగ్గి పోయినాయి.  ఇది మరొక సమస్యకు దారి తీసింది. కొండల  క్రింద ప్రవహించే  చంబల్  నదిలో కూడా క్రమ క్రమముగా నీరు తగ్గి సన్న బడింది. చివరకు పంటలకు నీరే గాక  త్రాగు నీటికి కూడా ఎద్దడి ఏర్పడింది. రాజేంద్ర సింగ్ కొన్ని ప్రజాహిత కార్య క్రమాలను తరుణ్ భారత్ సంఘ్ అణా బడు సేవా సంఘ్ ద్వారా నడిపే వాడు. కాస్త దూకుడు స్వభావము ఎక్కువ. మొట్ట మొదట ఇటువంటి కార్య క్రమాలను ఉత్తర ప్రదేశ్ లో నడుపుతూ పోలీస్  వ్యవహారాలలో ఇరుక్కొని  తప్పించు కొనడానికి రాజస్థాన్ చేరినాడు. ఆయన నడుపుతున్న సేవా సంస్థలో సభ్యుల ఆశయాలు చాలా గొప్పవి. కాని  ప్రజల దృష్టిలో వారందరూ పని చేయని జులాయీ ల క్రిందే లెక్ఖ.
చంబల్ నది చాలా ప్రసిద్దమయినది. కాళిదాసు తన మేఘ సందేశము లో దీనిని  చర్మణ్వతి అన్న  పేరుతొ ప్రస్తావించినారు. “ఆ ప్రముఖ నది యొక్క పరిస్థితిని  ఏ విధముగా మార్చాలి?” తరుణ్ భారత్ సంఘ్  సభ్యులు ఆలోచించినారు. పారలు గునపాలు తీసుకొని కొండలు ఎక్కినారు. జనం వద్దంటున్నా అక్కడక్కడ పై నుండి  క్రింద వరకు నీరు పూర్తిగా కొండలు దిగకుండా అడ్డు కట్టలు వేసినారు. ఈ విధముగా చేయడాన్ని ప్రజలే  కాక ప్రభుత్వమూ కూడా వ్యతిరేకించింది. ఎందుకంటే ఇంకా క్రిందకు దిగే నీరు తగ్గి పోతుందని భయము. కానీ కట్టలు వేసేసి నారు కాబట్టి వాటిని తీయించే ఓపిక ఎవరికీ లేదు. ఆ ప్రాంతములో కురిసే వర్షాలు చాలా తక్కువ. ఆ కొద్ది వర్శానికీ  ఆక్కడక్కడ కట్టల దగ్గర నీరు నిలిచింది. క్రమముగా ఎండి మోడులు అవుతున్న చెట్లు చిగురించినవి. పచ్చ దనము పెరిగింది. మరో వర్షా కాలము వచ్చేసరికి పెరుగు తున్న చెట్లను చూచి వరుణుడికి హుషారు పెరిగింది. వర్షము బాగా పెరిగింది. మరో సంవత్సరానికి చంబల్ నది బాగా పెరిగి అక్కడ నీటి అవసరాలను తీర్చ సాగినది. దీనితో అప్పటి వరకు జులాయి అనిపించుకున్న రాజేంద్ర సింగ్ కు ప్రజలలో గౌరవము పెరిగింది.
ఏ సమస్యకు తక్షణ పరిష్కారముండదు.  సరి అయిన పరిష్కారము కూడా  వెంటనే ఫలితాన్ని ఇవ్వదు. అందుకే మనకు ప్రధానముగా రెండు లక్షణాలు కావాలి. అవే శ్రద్ధ, సబూరి అంటే విశ్వాసము.
బౌద్ధ కథలలో ఒక కథను చెప్పుకోవాలి. బోధిసత్వుడు ఒక ఊరిలో పుట్టి పెరుగుతున్నాడు. ఆ ఊర్లో శుభ్రతను అసలు ఎవరూ పాటించుట లేదు. ఇంక పిల్ల వాడు అయిన బోధి సత్వుడి  మాటను ఎవరు వింటారు? ఇందుకు బోధి సత్వుడు తన పద్ధతిని ఎన్నుకున్నాడు. ఒక రోజు ఊరి చావడి దగ్గిరకు వెళ్లి తను కూర్చోడానికి అన్నట్లుగా కొంత స్థలాన్ని శుభ్రము చేసుకున్నాడు. ఇంకా కూర్చో బోతుండగా ఒక పెద్ద మనిషి వచ్చినాడు.  బోధి సత్వుడు పక్కకు జరిగినాడు. ఆ పెద్ద మనిషి ఆ శుభ్రము  చేసిన స్థలములో కూర్చున్నాడు. బోధిసత్వుడు పక్కనే మరికొంత స్థలాన్ని శుభ్రము చేసుకున్నాడు. ఇంతకు ముందు వలెనే అందులో మరొకరు కూర్చున్నారు. ఈ విధముగా కొన్ని నాళ్ళు చేసి ఆ వూరి వారిని సుభ్రమయిన స్థలములో కూర్చునే అలవాటు చేసినాడు. ఇది ఒక పధ్ధతి.
ఇటువంటిదే ఇటీవల జరిగిన మరొక సంఘటన. సిఖ్ గురువు  గురు నానక్ రోజూ కాలీబెన్ అనే నదిలో స్నానము చేసి, సుల్తాన్ పూర్ లోధీ అనే ఊరి దగ్గిర ఒక చెట్టు క్రింద అనుస్థానము చేసుకొనే  వాడట. అందుకనే సిక్ఖు సమాజానికి ఆ  నది  ఎంతో పవిత్రమయినది, ప్రాణ ప్రదము అయినది. కానీ, చుట్టూ ప్రక్కల మురుగు నీరును ఆ నదిలోనే కలిపే వారు. బల్బీర్ సింగ్ అనే వ్యక్తీ ఈ స్థితిని భరించ లేక పోయినాడు. తోటి వారి సహాయము అడిగితె ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒక  సారి నదిలోనికి దిగి, చెత్తనంతా బయటకు తీసి వేయడము మొదలు పెట్టినాడు. సంకల్ప బలము ఎంత గొప్పదంటే, అతడిది మూర్ఖత్వముగా భావించి పరిహాసము చేసిన వారందరూ అతడితో బాటు నదిలోనికి దిగి , మురుగు నీరు నదిలో కలపకుండా ఆపడమే  గాక నదిని పూర్తిగా శుభ్రము చేసినారు.ఇది యొక  అద్భుతముగా భావిస్తూ ఒక విదేశీయుడు, జోర్డాన్ నది క్రిస్టియన్లకు అత్యంత పవిత్రమయినదని, కానీ అది కూడా ఒక మురుగు కాలువ గా మారిందని, అక్కడ కూడా బల్బీర్ సింగ్ లాంటి వాళ్ళు పూనుకుంటే  తప్ప  జీసస్ కు బాప్తిఇజం ఇచ్చిన జోర్డాన్ నది శుభ్రము కాదని వాపోయాడు. ఇటీవలే బల్బీర్ సింగ్ కు కేంద్ర ప్రభుత్వ పురస్కారము కూడా లభించింది.
గోపీ మిత్రుల మధ్య మరొక విషయము ప్రస్తావనకు వచ్చింది. ఒకప్పుడు గోదావరి జిల్లాలో నేలలు చవిటి నేలలు ట.  ఇసుకలో ఉప్పు చాలా యున్నది. అందుకే ఏ పంటలూ  సరిగ్గా పండవు. కాటన్ దొర ధవళేశ్వరము దగ్గిర  అడ్డు కట్ట కట్టిన  తరువాత ఉప్పు నెలల లోని ఉప్పు పోవడానికి కొంత కాలము ఏ పంట  వేయకుండా నీటిని  పారించినారుట. అప్పుడా నెల వ్యవసాయ యోగ్యము అయిందిట.
కానీ నేటి  పరిస్థితి మళ్ళీ దారుణముగా తయారు అయింది.  పంట పొలాలలో రొయ్యల చెరువులు త్రవ్వి  సముద్రపు నీటిని రెండు  మూడు కిలో మీటర్ల  లోపలి తీసుకొని వస్తున్నారు. దీని వలన చుట్టూ ప్రక్కల భూ గర్భ జలాలు,బావులతో సహా ఉప్పు నీరు అయి పోతున్నది. విదేశీ డాలర్ల  మోజు  లేదా ప్రజా ప్రతినిదులనబడే  వారి ఒత్తిడి వలన ప్రభుత్వమూ దీనిని పట్టించుకోవడము లేదు. అందు వలన తీర ప్రాంతాలలో త్రాగు నీటికి కూడా కరువు ఏర్పడుతున్నది. ఈ కారణము వలన కొన్ని తీర ప్రాంతాలు ఖాళీ అయి పోతున్నాయి. ఆ ప్రాంతాలను తిరిగి నివాస యోగ్యము చేయుట కుదురుతుందా? నేలలో చేరిన ఉప్పును ఎలా తగ్గించాలి?
ఎవరికీ వారు తమ వరకు రాలేదని  భావిస్తున్నారు తప్ప  ఈ ముప్పు తమ వరకు వచ్చిన తరువాత  చేసేది ఏమీ ఉండదని  వారికి అర్థము అవుట లేదు.
ఈ చైతన్యమును ఎవరు తీసుకొని వస్తారు? తరచుగా ఎలుకల మీద దాడి చేసే పిల్లి మేడలో గంటను ఎవరు కడతారు? ఎలుకల సమాఖ్య తగ్గే కొద్దీ  వాటిలో ధైర్యము కూడా తగ్గి పోతుంది. పూర్తిగా మునిగి పోక ముందే తెరుకోవాలి.  కొద్ది మంది  స్వార్థము కొరకు  ఒక చెర్నోబిల్, ఒక ఫుకుషిమా... మొత్తము భూ గ్రహాన్నే కుదిపి వేసే పరిస్థితులు.
ఆకు పచ్చని ప్రకృతిని భూమి మీద ఎదగ నీయకుండా అడవులు తగ్గిపోతున్నాయి,  వేడి పెరిగి పోతున్నది. కొంత మంది ఈ విషయము మీద హెచ్చరిస్తూనే ఉన్నారు. మరి కొంత మంది వ్యాపార వేత్తలకు అమ్ముడు పోయిన వారు పెరిగే వేడికి వీటికి సంబంధము లేదని ఘంటా పథముగా చెపుతున్నారు. ఇటువంటి శక్తులను ఎదురుకోవడానికే  భారత దేశములో చిప్కో ఉద్యమము, గ్రీన్  పీస్  లాంటి ఉద్యమాలు బయలు దేరినవి. కానీ సామాజిక స్పృహ తీసుకొని రావటానికి , పోరాటానికి శక్తి సరి పోవటము లేదు.
తాతయ్య గారి దైనందినులలో ఉన్న విషయాలన్నీ మిత్రుల మధ్య చర్చకు వచ్చేవి. వీటితో బాటు భారత దేశములోని ప్రాచీన సామాజిక వ్యవస్థను గురించి కూడా చర్చ జరిగింది.
ఒకప్పుడు గృహస్థ ఆశ్రమములో ఆశ్రమ నియమాలన్నీ పాటిస్తున్న వారికి, ఈ నాటి సమస్యలు ఏర్పడ లేదు.  వాతావరణ  కాలుష్యము, పారిశుధ్యము గురించి సమస్యలు లేవు. అందు వలన ధర్మ ప్రచారమునకు  ఎక్కువ ప్రాధాన్యము లేదు. ఆ రోజులలో సమాజమును ప్రభావితము చేసిన ప్రతి ఋషి కూడా గృహస్థే. అందు వలన వారు ఎక్కడికి వెళితే అక్కడ ధార్మిక చర్చలు జరిగేవి. అంతే గాక  విద్యా వ్యవస్థలో ప్రతి శాస్త్రమునకు పునాది ధార్మిక వ్యవస్థ మీదే ఉండేది. కాలము గడిచే కొద్దీ ఇందులో మార్పులు వచ్చినవి. ప్రాధాన్యత ధర్మమూ నుండి అర్థము(సంపద/ఆస్తి) లోనికి మారిన తరువాత  మధ్య తరగతి గృహస్థు ధర్మమునకు క్రమముగా దూరము గా జరిగినాడు. ధర్మాచరణ తగ్గే కొద్దీ లౌకిక జీవితానికి ప్రాధాన్యత పెరిగింది. జీవితములో వేగము పెరిగింది. ఉన్న సమయము సరిపోవుట లేదు. స్వార్థము పెరిగిన తరువాత తరిగిన సామాజిక న్యాయాన్ని పునరుద్ధరించుటకు గౌతమ బుద్ధడు ప్రవేశించినాడు. అహింస, ప్రేమ ల గురించి ఆత్మా విశ్వాసము పెంచినాడు. ప్రజలలో  ఆత్మా విశ్వాసమును పెంచుటకొరకు వ్యావహారిక భాషలలో బోధన చేసినాడు. తరువాత ప్రాధాన్యత ధర్మాచరణకా , ఉపాసనకా అన్న అంశము మీద విభేదాలు వచ్చి బౌద్ధము హీన యాన  మహా యానములుగా చీలి పోయినది. ఇక్కడ మరొక సమస్య తలెత్టినది. ధర్మ్మాచరణ ప్రధానమే. కాని సరిహద్దుల దగ్గిర అహింసా బోధన పనికి రాదన్న విషయాన్ని మరచి పోయినందు వలన దేశపు సరిహద్దులు బలహీన పడినవి.
ఈ సమయములో అద్వైత బోధతో శ్రీ శంకరాచార్యులు సమాజమును పటిష్ట పరిచినారు. ప్రతి మనిషిలో ఉన్న దివ్యత్వ్వాన్ని తెలియ చెప్పియా శంకరుడిని ప్రచ్చన్న  బుద్ధుడిగా కొంత మంది  హిందువులు భావించినారు. ఈ సమయములో అంత  వరకు కనిపించని సన్యాస ధర్మమూ ప్రవేశించినది. సమాజము  యొక్క మేలు కోలుపుకు రోజంతా పని చేసే ఆధ్యాత్మిక సేవకులుగా సన్యాసులు ఏర్పదినారు.
కాలము నడిచే కొద్దీ సన్యాస వ్యవస్థ సమాజము మోక్షము కొరకు గాక వ్యక్తిగత మోక్షమే లక్ష్యముగా పని చేయడము మొదలయింది. సమాజములో తిరిగి బలహీనతలు పెరిగినాయి.
ధర్మమూ అర్థముల ప్రాధాన్యత మీద నిరంతరమూ  యుద్ధము కొన సాగుతూనే యుంది.
ఒక చిన్న కథ యున్నది. భారత దేశము పై దండ  యాత్రకు వచ్చినపుడు అలేక్జాందర్ ఒక  సన్యాసిని కలిసినాడు.ఆ  సన్యాసి అతడికి ఒక చిన్న చాప ఇచ్చి కూర్చోమన్నాడుట. అలేక్జాందర్ ఒక వైపు చాపను పరుస్తుంటే రెండవ వైపు ముడుచుకొని పోతున్నదట. “నేను గెలిచినా సామ్రాజ్యము ఎంత కాలము నిలుస్తుంది?” అని ఆ సన్యాసిని అడిగితె “ఇప్పుడు మీరు కూర్చున్న చాప వలెనె ఉంటుంది.”అని ఆ సన్యాసి జవాబు చెప్పినాడుట.
అదే  విధముగా ఒక వైపు ధర్మమూ విస్తరిస్తూ ఉంటె, మరొక వైపు ముడుచుకొని పోతున్నది. గోపీ మిత్ర బృందము ఈ విషయము మీద ఎన్నో చర్చలు జరిపినారు. ఆ సమయములో ఒక ప్రస్తావన వచ్చింది,” ఈ చర్చల వలన ఉపయోగమేమిటి? నీటిలో దిగకుండా ఈత మీద ఎన్ని పుస్తకాలు చదివినా  ఈత రాదు.ఇప్పుడు మనము చేస్తున్న పని అదే.” అంటూ గోపీని ఒక సారి అక్కడ పరిస్థితులను అధ్యయనము చేసి రమ్మని ప్రేరేపించినారు.
మొదటి ప్రస్థానము మొదలయింది.      


చురకలు



*1. ‘మాతృ దేవోభవ ‘ పేరును చూచి భ్రమ పడకండి.  ఇందు లో  మీకు  కావలసిన శాడిజం , క్రైం  మసాలాలు  ఉన్నాయి.  కొస విరుపు ఏమిటంటే ఆఖరి  ఎపిసోడ్ లో టార్చర్  భరించ లేక  తల్లి చని పోతుంటే  కొడుకు మారి పోతాడు. కాదు, మారినట్లు నటిస్తాడు. ఇదే దర్శకుడి నుండి తదుపరి వచ్చే  సీరియల్స్  వరుసగా  ;పితృ  దేవోభవ’, ‘ఆచార్య  దేవోభవ’

*2. వాట్సప్  లో  కొత్త  మెసేజ్ రాగానే  వరుసలు చక్కున  ఎలా మారిపోతాయో అలా మారి పోతాయి సీరియల్స్ లో పాత్రలు. ప్రతి 50 ఎపిసోడ్ లకు విలన్లు మారి పోవచ్చు. ఇలా చేస్తుంటే  చివరకు ఎవరికీ అభిషేకము చేయాలి అన్న విషయము మరచి పోయి  దర్శకుడికే  అభిషేకము చేయాలని నిర్ణయించినారట.

*3. ఒక  దుర్వార్త. ఒక రచయిత/రచయిత్రి  తన ప్రతి సీరియల్ ను రెండవ  తరము వరకు నడిపించింది. ఒక సీరియల్ ను మూడవ తరానికి తీసుకొని వచ్చింది. ప్చ్వ్.  అదృష్టము  కలిసి రాలేదు. అది మూడవ  తరము పూర్తీ కాకుండానే  ఆగి  పోయింది.

*4. శుభ వార్త.  మీకు తెగ  నచ్చేసిన గోల  మాలోకము లో వారమంతా యున్న  ఎపిసోడ్లలో యున్న ఏడుపు గొట్టు పగ ద్వేషము సీన్లన్నీ కలిపి  ఒక అరగంట  ఎపిసోడ్  గా ప్రతి శని వారము  రాత్రి  12-౦౦ గంటలకు మే క్సము ప్రత్యేకముగా ప్రసారము చేస్తున్నాము. మిస్  కాకండి.

*5. ఒకే  ఒక సంతోషకరమయిన విషయము ఏమిటంటే., “భలే  సుబ్బారావ్’  లాంటి సున్నితమయిన హాస్య  నాటికలను  అందరూ మరిచి పోయినారు.’నీ అంటూ చూస్తా’, ‘నీవు  ఎలా  సుఖముగా ఉంటావో  చూస్తా’ లాంటి  డైలాగులతో ప్రేక్షకులను మేస్మరైజ్  చేస్తున్నారు. ఇదంతా  కలి ప్రభావమే అనుకోకండి.  నాకనిపిస్తుంది, కలియుగాన్తమే అని.


Tuesday, March 13, 2018

ప్రస్థానము 4




ఈ లోపల కొత్తగా స్థాపించా బడే ఒక పరిశ్రమ విషయములో  సలహా కోసమని  ఒకరు వచ్చినారు. అందులో చాలా రసాయనాలు బయటికి పంప వలసి వస్తుంది. వాటిని ఎలా వదిలించుకుంటావని అడిగినాను.
“ఏముందీ పక్కనే యున్న ఏటిలో కలిపి వేస్తాను.”
“ఏటిలో నీరు ఎవరూ క్రింద జనాలు వాడుట లేదా?’
“అవన్నీ అనుకుంటే పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఈయ లేము?”
అతడి జవాబుకు నివ్వెర పోయినాను. ఒక్క విషయము మాత్రము అర్థమయింది. ప్రభుత్వాలు పరిశ్రమల ప్రతిపాదనలను బాల పరుస్తున్నాము. అందు వలన ఏంటో మందికి ఉద్యోగమూ, ఉపాధి దొరుకుతుందని చెప్పడము, ఈ మాటలన్నీ ఈ వచ్చిన వ్యక్తీ బుఱ్ఱకు బాగా ఎక్కినాయన్న మాట. లీటర్ నీళ్ళ సీసా పదిహేను రూపాయలకు అమ్ముతున్న పరిశ్రమలకు, కొన్ని లక్షల నీటిని త్రాగడానికి ఎవరధికారమిచ్చినారు?
ఒక్క సారి భరతుడు కౌసల్యకు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. “రాముడు  అరణ్యానికి వేల్లదములో నా పాత్ర యుంటే, త్రాగుతకనువయిన జలములను మురికి చేయు వానికి    పాపము వస్తుందో ఆ పాపము నాకు చుట్టుకుంటుంది.”
(పానీయ దూషకే పాపం  తదైవ  విషదాయకే   యత్తదేకః    లభతాంయస్యాs ర్యోs నుమతే  గతః”-అయోధ్య కాండ, వాల్మికి  రామాయణము )
మరొక్క సారి మనుషుల ప్రవర్తనను  గురించి ఆలోచించి బాధ పడినాను. ఇంకా ఇటువంటి విషయాలలో చేయ గలిగితే  చేయడము తప్ప బాధ పడకూడదని అనుకున్నాను.
ఆ రాత్రి తిరిగి తాతగారి దైనందిని ని చదువ సాగినాను.
పంటలు  వేసే ముందు  పంట కాలవలను  ఒక సారి త్రవ్వి  నీటి పారుదలకు అనువుగా చేయడము ఆనవాయితీ.  అందు కొరకు ఎకరానికి ఒక మనిషి వెళ్లి సమిష్టిగా త్రవ్వుకొనే వారు. మొదట్లో ఈ విధముగానే జరిగేది. పంచాయతీ నుండి ఒక ప్రతిపాదన వచ్చింది. ఎకరానికి కొంత సుంకము చెల్లిస్తే తామే కాలవలను త్రవ్వించి  వేస్తామని. అంటే  ఇంకా రైతులు  తమంత తాము కాలువలు త్రవ్వే  బాధ్యతలను  వదలి వేస్తున్నారని అర్థము. ఈ విధముగా రైతులకు పని తప్పినట్లు అనిపించా వచ్చును. మధ్యలో దళారీలు ప్రవేశిస్తారు. సగము పని చేసి డబ్బు తీసుకుంటారు. వ్యవస్థ పతనానికి ఇది మొదలు.
రేడియో లాటి ప్రసార సాధనాల ద్వారా  రసాయనిక ఎరువులు వాడితే పంటలు ఇబ్బడి ముబ్బడి గా పండించా వచ్చునని ప్రచారము మొదలు పెట్టినది. దీనిని పాత తరము వారు ఎవరూ పట్టించుకోలేదు. మొదట్లో వంగ తోటలో సల్ఫేట్ ఎరువుగా వేసినారు. పిడికిలంతా వంగ కాయ తలంత సైజుకు ఎదిగింది. ఇంట్లో పచ్చడి చేద్దామని  కాలిస్తే నీరు కారి పోయి పిడికిలంతా మాత్రమె మిగిలింది. సల్ఫేట్ కాపు అంటే జనానికి అర్థమయింది.
ఇంకా వారి చాలా ఎత్తుకు ఎదిగేది.పంట రావడానికి నాలుగు నెలలకు పైనే పట్టేది.అందు వలన పశువుల మేతకు ఇబ్బడి ముబ్బడి గా గడ్డి వచ్చేది. ఇంకా గడ్డి మరీ ఎక్కువగా ఉంటే పాకాల మీద కప్పే వారు. గడ్డిని కొని వాటిని శుభ్రము  చేసి, ఒత్తిడితో అట్టలుగా మార్చే వారు. దీని వలన రైతుకు ఆదాయము పెరిగింది, కొంత మందికి ఉద్యోగాలు వచ్చినవి, వచ్చిన నష్టమేమిటంటే పశు  గ్రాసము తగ్గి పోయింది.
ఇంత వఱకు రైతులకు పొలాలు దైవ క్షేత్రాలు. అందుకనే ఆరోజుల్లో పొలాన్ని కూడా క్షేత్రము అని పిలిచే వారు. ఖాళీ సమయాల్లో రైతు పంటల మధ్య పైరును చూస్తూ నడిచే వాడు.అప్పుడు పంట పొలానికి రైతుకు మధ్య ఏంటో అనుబంధము కనిపించేది. ఇంటికి వస్తే పశువులు రైతుకోసము  ఎదురు చూస్తూ ఉండేవి. పశువులు కుటుంబ సభ్యులయితే పంట పొలాలు దివ్య క్షేత్రాలు. మంచి పంట పండాలని కోరుకొనే వాడు. కానీ ఎంత పండినా తృప్తి గా జీవించే వాడు.
శాకుంతలము లో కాళిదాసు వ్రాసినారు,శకుంతల కాలు తగిలితే పూల మొక్కలు త్వరగా వికసించే విట. దీనిని నమ్మ లేని వారికి, ఇటీవల  కాలములో  పరమ హంస యోగానంద యొక్క శిష్యుడు లూథర్ బర్బాంక్ చేసిన ప్రయోగాలు తప్పకుండా గమనించ  దగినవి. ఆయన ముళ్ళ  మొక్కలయిన కాక్టస్  మొక్కలకు వాటి రక్షణ గురించి భరోసా ఇచ్చి, అవి ముళ్ళు లేకుండా ఎదిగే టట్లు చేసినాడు. అంతే కాదు, వాల్నట్ మొక్కలలో వంద ఏండ్లలో వచ్చే ఎదుగుదలను పన్నెండు  సంవత్సరాలలో చూపించినాడు. ఆయన వేసిన ఎరువల్లా అపరిమితమయిన ప్రేమ.. అంటే మొక్కలతో మానసిక బంధము పెంచుకుంటే వాటిలో ఏడుగు డలను, రోగ నిరోధక శక్తిని పెంచ వచ్చునని నిరూపించినాడు.
క్రమముగా ప్రభుత్వమూ ప్రజల ఆకలి తీర్చుటకై ఎక్కువ పండే వంగడాలను తయారు చేయాలని సంకల్పించినది. అందుకని ప్రకృతిలో సహజముగా ఉన్న విత్తనాలపై ప్రయోగాలు చేయించింది వాటి కేంద్రకాలలో మార్పులు తీసుకొని వచ్చి సరి కొత్త విత్తనాలను ప్రయోగ శాలల నుండి బజారుకు తెప్పించింది.  అయితే ఇవి ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడితే తప్ప ఎక్కువ పంటలను ఈయ లేవు. అందుకని రసాయనిక ఎరువులను వాడమని ప్రోత్సహించినది. దీని వలన దిగుబడి బాగా పెరిగింది. పంట పెరిగిందన్న సంతోషములో తను గోతిలో పడుతున్నానన్న విషయాన్ని రైతు గమనించ లేదు. ఇంట వఱకు రైతు విత్తనాలకు ఎరువులకు ఎవరి మీదా ఆధార పద లేదు. ఎక్కువ దిగుబడి  కోసము రైతులు విత్తనాలను కొనుటను  మొదలు పెట్టినాడు.
రసాయనిక ఎరువులు నెలలో శక్తిని కూడా పీల్చి వేస్తున్నాయి. గత సంవత్సరము వేసిన ఎరువులే వేస్తె పంట దిగుబడి తగ్గిపోతున్నది. అదే పంట రావాలంట్ఎరువులు ఎక్కువగా వెయ వలసి వస్తున్నది. ఎక్కువ ఎరువు వేసి పండించిన పంటలు క్రమముగా పురుగుల తాకిడికి గురి కా సాగినవి. పాత కాలములో ఇంతగా పురుగుల తాకిడి  ఉండేది కాదు. ఏ మాత్రమున్నా కాస్త వేప పిండి చల్లే వారు. దీనితే మొక్కలు పురుగు తాకిడికి తట్టుకో  గలిగేవి. ఈ విధముగా వేల సంవత్సరాలనుండి ప్రకృతి సహజముగా పరిణామము చెందినా పంటలు  క్రమముగా ప్రక్కకు పోయి, DNA  మార్పిడితో  ప్రతి క్షణము antibiotics  వేసి పిల్లలను పెంచినట్లు  పురుగు మందులు వేయ వలసి వస్తున్నది. పాత పద్ధతిలో నెలలో స్థిరముగా ఉన్న సారము , ఇప్పుడు బాగా తగ్గి పోతున్నది. అంటే గాక ఈ పంటలలో గడ్డి తగ్గి పశు గ్రాసము కు కొరత వచ్చినది.
ఈ విధముగా వస్తున్నా మార్పులను తాత గారు దైనందినులలో  వ్రాసుకుంటూ వచ్చినారు. ఇది దిన చర్య అనే కంటే వ్యాసాల సంపుతిలా అనిపించినది.
ఒక విషయము మాత్రము తెలుస్తున్నది. ఈ ప్రవాహములో  కొట్టుకొని పోకుండా ఆపుటకై  తాత గారు చాలా ప్రయత్నాలు చేసినట్లున్నది. కానీ ఆయనను ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. ఒక చాదస్తపు వ్యక్తిగా ఆయనను తోటి రైతులు పరిగణింఛినట్లున్నది.
ఆయన ఒక చిన్న రైతు.ఆర్థికముగా చెప్పుకో దాగిన వ్యక్తీ కాదు. అయినా ఊళ్ళో ఒక పోస్టు ఆఫీసు, ఒక ప్రాథమిక  పాఠశాల చాలా తిరిగి సాధించినాడు. అందుకే అందరి దగ్గిరా గౌరవమును పొందినాడు.
త్వరలోనే  ఆయన ఆలోచనా విధానానికి మరొక గట్టి దెబ్బ తగిలింది. హరిత విప్లవము (పంటలు) , శ్వేత విప్లవము(పాడి)తో బాతుకొట్ట ప్రభుత్వ విధానాలు నీలి విప్లవాన్ని ప్రోత్సహించినవి. ఇక అందరు వ్యవసాయము మాని వేసి చేపల చెరువులు త్రవ్వడము మొదలు పెట్టినారు.  పైనాం పురము కు తూర్పుగా ఉన్న ఖాళీ స్థలాలలో  చాలా రొయ్యల చెరువులు వచ్చినాయి. వాటికి బకింగ్ హాం కాలువ ద్వారా  సముద్రపు నీరు పారించినారు. దీని వలన రెండు చెడు ఫలితాలు వచ్చినాయి.
ఎక్కువ జీతాలు ఇస్తున్నందు వలన వ్యవసాయ కూలీలు చేపల చెరువులకు వెళ్ళడము మొదలు పెట్టినారు.ఈ ప్రభావము పీడా కమతాల వ్యవసాయము మీద పడినది.అప్పటికి వ్యసాయ పనులకు యంత్రాలు రాలేదు. అందు వలన వ్యవసాయపు పనులు దెబ్బ తిన్నవి.
వ్యవసాయపు పనులు దెబ్బ తినడముతో  పొలాలకు నీరు పెట్టడము ఆగి పోయింది. పొలాలలో నీరు భూమి క్రింద భాగములో తగులుతున్న  సముద్రపు నీటి ప్రభావాన్ని తగ్గించేవి. ఇప్పుడు ఆ నీరు లేక పోవడము, పెద్ద ఎత్తున చేపల చెరువులు వచ్చినందు వలన  ఊరిలో యున్న నీటి బావులలో నీరు క్రమముగా ఉప్పగా అయినవి. అందు వలన ఊళ్ళో  వాళ్లకు క్రమముగా నీటి ఇబ్బందులు మొదలయినాయి. ఈ సమయానికి తాత గారు దేహము వదిలి వేసినారు. ఆయన ఆలోచనలకు గుర్తుగా ఈ సంఘటనల వివరాలు  అన్నీ దైనందినులలో భద్ర పఱచ  బడినవి.
ఆ తరువాత ఏమి  జరిగినదీ గోపీ వివరాలు సేకరించినాడు. త్రాగే నీరు పాదయినది.చుట్టూ ప్రక్కల ఊళ్లలో ఎన్నో బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమలు నిర్మాణము జరిగినాయి. ఇందు వలన గాలిలో దుమ్ము, బొగ్గు పులుసు వాయువుల సాంద్రత పెరిగినవి.ఇంకా ఊళ్లు ఖాళీ చేసి నగరాలకు వెళ్ళే వారి సమాఖ్య పెరిగినది. పీడా వాళ్ళు, బాగా మొండి వాళ్ళు అక్కడే ఉంటున్నారు.
ఒకప్పుడు ఏంటో అందముగా ఉన్న ఊరు పాదయినది. తాత గారికి ఆ ఊరంటే ఎంత అభిమానమో అనిపించినది. ఆయన కూడా నైరాశ్యము లో వెళ్లి పోయినారు.
ఎందుకో ఒక్క సారి ఆ ఊరిని చూడాలని అనిపించినది. అమ్మా నాన్నలతో చెప్పినాను.నాన్న గారే ఆ ఊరికి వీల్లదము తగ్గించినాడు. ఆయనకు కూడా ఆ ఊరితో సంబంధము తెగి పోయినట్లు అనిపించినది.


Tuesday, April 11, 2017

ఒక మాట

                           
          రెండు చిలుకలు మొదట ఒక మామూలు కథ గానే మొదలు పెట్టినాను. కానీ కథ మరో రకముగా మారి పోయింది. మనుషుల మధ్య బంధాలు ఎలా ఉంటాయో వ్రాసినాను. మొదట సరోజ పాత్ర మామూలు పాత్ర గానే అనుకున్నాను. కానీ అది నన్ను దాటి వెళ్లి పోయింది. ఇంకా ప్రస్థానము కొన్ని రోజులు సాగుతుంది. ఈ నాటి సామాజిక పరిస్థితుల మీద  మాయ అనే కథ మొదలు పెట్టినాను. కానీ ఇప్పుడే అది మీ ముందుకు రాదు అనుకుంటున్నాను.
నాను ఈ ప్రాచీన సంస్కృతీ చిన్నప్పటి నుండి ఏంటో ప్రభావితము చేసింది. నా తండ్రి నుండి నన్ను ప్రత్యక్షముగా పరోక్షముగా ప్రభావితము చేసిన వారు ఎందఱో. అందులో స్వామి వివేకానంద మొదలు శ్రీ నండూరు రాదా కృష్ణ  గారు, వారి ద్వారా నా జీవితమూ మీద ప్రభావము చూపిన శ్రీ కృష్ణమాచార్యులు గారు, శ్రీ సత్య సాయి బాబా గారు.. ఎందఱో ఉపాధ్యాయులు, పేరు పేరున చెప్పక పోయినా వారి అందరికి నా ప్రణామములు.
ఇవి చదువుతున్న వారు ఒక్క వాక్యము అయినా ఖర్చు చేసి మీ అభిప్రాయము వ్రాయండి.
మీ

సుబ్బ రామయ్య.

రెండు చిలుకలు 6


                                      
 ఆ రోజు ఆదివారము. రాము వాకిట్లో కూర్చొని యున్నాడు.  వాణి కూడా ఎంతో హడావుడిగా ఉంది.
వయస్సు పదమూడు  ఏళ్ళే అయినా నాన్నకు అన్ని పనులలో ఇంట్లో సాయము చేసేది. కూతురు హుషారు చూచి రాము కూడా అడ్డము చెప్ప లేదు. అమ్మ వస్తుందని నాన్న చెప్పినాడు. అమ్మకు రాగానే ఏమయినా చేసి పెట్టాలి. పక్క ఇంట్లో అత్తయ్య గారిని  వంట ఇంట్లో కూర్చో పెట్టుకొని తనే స్వీట్ ఏదో చేస్తున్నది. తను చేయ గలనన్న నమ్మకము ఇంకా ఏర్పడ లేదు.
          తొమ్మిది గంటల బస్సు వచ్చింది. పల్లెటూర్ల లో ఏ కొత్త వ్యక్తీ వచ్చినా వింతగా చూడటము రివాజే.
          “సరోజమ్మ వచ్సిందిరో” ఎవరో అంటున్నారు.
“అయ్య గార్ని వదిలేసిందనుకున్నాము కదా. మళ్ళీ వచ్చిందేమిటి?” మరొకరు అంటున్నారు.
“ఆయనను అంత కష్ట బెట్టి  ఏమి బావుకుంది?” మరొకరు.
ఈ మాటలు అన్నీ సరోజకు వినబడుతూనే ఉన్నాయి. చేతిలో చిన్న సంచితో నేరుగా ఇంటికి వచ్చింది.
ఈ హడావుడి చూచి అందరి కంటే ముందు వాణి పరుగెత్తుకొని వచ్చింది.
“అమ్మా! వచ్చేశావా?” అమ్మను కావిలించుకుంది.
రాము లేచి నిలబడినాడు.
సరోజకు కళ్ళల్లో  నీరు కారి పోతున్నాయి.
“ఇంకా రాము కు తన మీద కోపముగా ఉందా?”
“తను ఏమి చేసిందని తనకు చెప్పకుండా ఎటో వెళ్లి పోయినాడు?”
“ఒక్క సారి డిల్లీ వచ్చి ఉండ వచ్చును కదా.” ఎన్నో ప్రశ్నలు.
“రాణీ ఏదమ్మా!” వాణి  ప్రశ్న.
“బాగున్నావా?” రాము ప్రశ్న.
“చూస్తున్నారు కదా నేను ఎలా యున్నానో?”
“లోపలికి  రావచ్చునా?” ప్రశ్నించింది.
సరోజ కళ్ళలో శక్తి లేదు. కళ్ళు లోపలి పోయి యున్నాయి. ముఖములో కనిపించే నవ్వు కృత్రిమముగా ఉంది. ఇవన్నీ రాముకు అర్థమవుతున్నాయి. అందరూ లోపలిక్ వెళ్ళినారు.
అత్తగారి పటాన్ని చూచి “అత్తయ్యా!” అంటూ మోకాళ్ళ మీద కూల బడి పోయింది.” అవసరానికి లేని ఈ బ్రదుకు ఎందుకండీ?” అంటూ వెక్కివెక్కి ఏడవ సాగింది. తనతో బాటు వాణీ కూడా ఏడుస్తున్నది.
“సరోజా! ఏడవ వద్దు. ఒక్క సారి వాణి ముఖాన్ని చూడు. బిక్క చచ్చి పోయింది.”అంటూ భుజాలు పట్టుకొని లోపలి గది లోనికి తీసుకొని వెళ్ళినాడు.
“ఏమండీ! ఏమయిందండీ? మీరిన్నాళ్ళు ఏమయినారండీ?”
“ఇదంతా ఎలా జరిగిందండీ? ఎటు వంటి సమాచారము మీరు ఇవ్వ లేదు. ఒక్క టెలిగ్రామ్ ఈయ లేక పోయినారా?”
“సరోజా!నీకు రెండు టెలిగ్రాం లు ఇచ్చినాను రెండేసి సార్లు ట్రంక్ కాల్ లు చేసినాను. దేనికీ జవాబు లేదు. నీవు ఒక్క జాబు కూడా వ్రాయ లేదు. డిల్లీలో కాక మరెక్కడ యున్నావో అనుకున్నాను. అయినా ప్రయాణపు బడలిక మీద యున్నావు. ముందు ముఖము కడుక్కొని రా. నెమ్మదిగా మాట్లాడుకుందాము.” రాము నెమ్మదిగా యన్నాడు.
“వద్దండీ! ముందు నన్ను మాట్లాడనీ. నా గుండెల్లో బాధను ముందు దింపేసుకోనీ. అత్తయ్య గారు పోయిన సమాచారము నాకు అందనే లేదు. మీ నుండీ ఏ సమాచారమూ లేదు.” రాము ఎదో చెప్పా బోతుంటే,
“నన్ను మాట్లాడనీయండి. నేను ప్రతి నాల్గు రోజులకొక ఉత్తరము వ్రాసినాను. మీ నుండీ ఏ జవాబు రాలేదు. మీరు ఫోన్  చేసిన విషయము నాకు తెలియదు. అమ్మ చాలా బాధతో యుంది. ఒంట్లో బాగా లేదు. మీ సమాచారము ఏమీ తెలియ లేదు. నేను కారణము ఊహించ లేక పోయినాను. ఒక రోజు నందిని ముందు గది లోనుండి కొన్ని చిత్తూ కాగితాలు తీసుకొని వచ్చి నాకు చూపించింది.”
“అన్నీ ముక్కలుగా ఉన్నాయి. చాలా కష్ట పడి పేర్చుకొని చూస్తే అది మీ ఉత్తరమే. అందులో మీరు ఫోన్ చేసిన విషయము కూడా ఉంది. అంతే కాదు, నానుండి ఒక్క ఉత్తరము కూడా లేదని ఉంది. నేను ఖంగు తిన్నాను. నేను వ్రాసిన ప్రతి ఉత్తరము పోస్ట్ బాక్స్ లో వేయమని అన్నయ్యకు ఇచ్చే దాన్ని. నేను గొడవ పెడితే చెప్పినాడు వాటిని బాక్స్ లో వేయమని రాహుల్ కు ఇచ్చినాడుట. అంత వరకే నాకు తెలుసు. అప్పుడర్థమయింది. నా మీద కోపముతో రాహుల్ వాటిని చింపి వేసి ఉంటాడని. ఇంకా ఫోన్ విషయమై  అన్నయ్యను గదమాయించినాను. ఒక రోజు ఫోన్లు రెండు సార్లు వస్తే రాహుల్ “ఎవరూ లేరని” ఫోన్ పెట్టేసినాదుట. నేను, నందిని ఇంకా రాహుల్ ఇంట్లోకి రావడము కుదరదని గట్టిగా చెప్పినాము.”
“ఈ విషయము తెలిసి మీ దగ్గిరకు రావాలనుకుంటే వెంటనే రిజర్వేషన్  దొరక లేదు. రిజర్వేషన్ లేక పోయినా  బయలు దేరాలనుకుంటే మా అమ్మ ఒప్పుకోలేదు. రిజర్వేషన్ దొరికి  ఊరికి వస్తే ఇల్లు తాళము వేసి ఉంది. ఎవరిని అడిగినా సమాధానము చెప్పా లేదు. అంతే గాక నా మీద వ్యాఖ్యానాలు చేసినారు. అయినా అది కూడా వారి తప్పు కాదు. వారికి మీ మీద యున్న ప్రేమ గౌరవము వలననే అలా చేసినారు. నాకు ఏమి చేయాలో తెలియ లేదు., పూజారి ఇల్లు కూడా తాళము  వేసి యుంది. ఎవరింటికి వెళ్ళాలి తెలియ లేదు. నా స్నేహితులు కూడా నెల్లూరు లో ఎవరూ లేరు. చివరకు జనరల్ కంపార్టుమెంట్లో డిల్లీ చేరినాను. మీరు ఇంటికి వస్తే చూస్తారని పిచ్చి దానిలా ఉత్తరాలు వ్రాసినాను. వేటికీ జవాబు లేదు.”
“ నిజానికి నామీద కోపముతో రాహుల్ చేసిన వెధవ పనుల వలన  మన మధ్య సంబంధము పోయింది. ఆ పాపము తనకూ కొట్టింది. ఒక రోజు అన్నయ్య రాహుల్ స్కూటర్ మీద వెళుతుంటే ప్రమాదము జరిగి రాహుల్ కు రెండు కాళ్ళు తీసి వేసినారు. అన్నయ్యకు ఒక కాలు కుంటిదయింది. వారిద్దరి మధ్య స్నేహము చెడింది. అన్నయ్యకు ఉద్యోగము పోలేదు. కానీ చెడు సహవాసము పోయింది. అప్పటి నుండీ నేరుగా ఇంటికి వస్తున్నాడు. మా వదిన ముఖములో కాస్త సంతోషము విరిసింది.”
“”అమ్మకు మీరు ఎక్కడున్నారో తెలియక రోజూ బాధ పాడేది. ఈ పరిస్థితులలో రాణి కి కూడా చిరాకు ఎక్కువయింది. ప్రతి దానికీ ఇప్పటికీ రుస రుస లాడుతూనే ఉంటుంది.”
“అన్నయ్య వలన నేను నష్ట పోయినాను. అందుకే తనది ఒక్క పైసా కూడా ముట్టుకోవడము నాకు ఇష్టము లేదు. ఇక్కడకు వచ్చి ఉండాలని యుంది. కాని మీ సమాచారము లేదు. అందుకే ధైర్యము చేయ లేక పోయినాను. అందుకే ఒక కార్పోరేట్ విద్యా సంస్థ లో చేరినాను. నేను  రోజూ పోగొట్టుకుంటున్న ఆనందాన్ని ఆ పిల్లల మధ్య వెదుక్కున్నాను. వాళ్లకు ఫిజిక్సు పాఠాలు చెబుతున్నపుడు మీరు నా ముందున్నట్లే ఊహించుకొనే దాన్ని. ఒక్కొక్క సారి వాణిని చూడాలని తీవ్రముగా అనిపించేది. రాత్రి పొద్దు పోయిన తరువాత అత్తయ్యను, మిమ్ములను, వాణిని తలచుకొని ఏడ్చే దాన్ని.”
“ మా విద్యా సంస్థల వాళ్ళు ఒకరిని ఇక్కడికి పంపించాలని అనుకున్నారు. వెంటనే ఆ వూరు నాకు బాగా తెలుసు నేనే వెళ్తానని బ్రదిమాలుకున్నాను. నా అదృష్టము కొద్దీ వారు ఒప్పుకున్నారు. ఇక్కడికి వచ్చే వరకు నా మనస్సు మనస్సులో లేదు. కానీ ఏదో నమ్మకము, మీరే ఆ పని చేస్తున్నారని అనిపించినది.”
ఇంతలో వాణి తీపి పదార్ధమును చేతిలో పట్టుకొని, ”అమ్మా! నీ కోసము నేనే చేశాను. ఎలాగుందో చెప్పమ్మా!” అంటూ వచ్చింది.
దాన్ని తీసుకొని రాముకు, వాణికి పెట్టి తనూ తీసుకొని, ”చాలా బాగుందమ్మా!” అని చెప్పింది. తరువాత రాము జరిగిన విషయాలు తాము తిరిగిన ప్రదేశాలు అన్నీ వివరించి చెప్పినాడు. తిరిగి వచ్చిన తరువాత తను సరోజ డైరీ చూచి, ఆ ప్రేరణ తోనే ఈ పని మొదలు పెట్టినానని చెప్పినాడు.
కొంచము భావావేశాలు  తగ్గిన తరువాత “అన్నయ్య గారూ!”అంటూ లలితమ్మ వచ్చింది.”వదినమ్మా! స్నానాదులు పూర్తీ చేసుకోండి. ఈ పూట  మా ఇంట్లోనే మీ భోజనము.” అని అన్నది.
మధ్యాహ్నము భోజనాలయిన తరువాత  రాము అడిగినాడు,”మళ్ళీ డిల్లీ ప్రయాణము ఎప్పుడో?”
కొంచెము ముఖము తేట పడింది సరోజకు. వెంటనే అంది.” ఎక్కడికి వెళ్ళినా మీతోనే. నేను ఒంటరిగా వెళితే మీరు ఎక్కడ జారి పోతారో?”
రాము అన్నాడు, ”రాణి సంగతి?”
“ఇప్పుడు పరిస్థితి అర్థము కాక రాణిని తీసుకొని వచ్చే ధైర్యము చేయ లేక పోయినాను.  ఇద్దరమూ వెళ్లి రాణిని తీసుకొని వద్దాము.. ఇంకా నేను కూడా మిమ్ములను విడచి డిల్లీలో ఉండ లేను. వెళ్ళగానే రాజీనామా చేస్తాను. అయితే ఒక్క షరతు” ఆగింది.
“ఏమిటి?” అన్నాడు.
“”మా విద్యా సంస్థల వారు మనలను కలిపినారు. మీరు వారి కోసము కొన్ని ఉపన్యాసాలు ఇవ్వాలి.”
“అలాగే! రాణీ వారి ఆజ్ఞ”
    ---------------------------------------------
వాణీ తో కలిసి ఇద్దరూ వెళ్లి నాలుగు రోజులు అక్కడే యున్నారు. సరోజ అన్నయ్య ప్రవర్తన చాలా సౌమ్యముగా మారింది. దానితో ఇంట్లో నందినికి కూడా గౌరవము పెరిగింది.  సరోజ అమ్మగారు కూడా ఈ మార్పులతో చాలా సంతోషముగా యున్నారు. ఇంక నందిని ఆమె చేత చిన్న పని కూడా చేయించుట లేదు.
ఇంతకూ ముందు భర్త ప్రవర్తన వలన సరోజను తన పుట్టింటికి రమ్మని ఎప్పుడూ పిలవ లేదు. మారిన పరిస్థితులలో సరోజను, రామును తన నాన్న ఇంటికి పిలుచుకొని వెళ్ళింది. వృద్దులయిన ఆ తల్లి దండ్రులు ఎంతో సంతోష పడినారు. వారి ఆశీస్సులు తీసుకొని ఇంటికి వచ్చినారు. సరోజ అమ్మను తనతో రమ్మని పిలిచింది. ఆమె,”నందిని కాస్త సంతోషముగా ఉంది. దానికి తోడుగా ఉంటాను. అందరమూ ఒక సారి వస్తాము” అన్నది. తిరిగి, సరోజ తన అన్నయ్యను , నందినిని బాబు తో సహా పైనాం పురము రమ్మని ఆహ్వానించి బయలు దేరింది తమ వెంట వాణి, రాణిలతో.
                   ---------------------------
రాము వేసిన షెడ్ ఒక విద్యా సంస్థ గా మారింది. కొంత మందిని టీచర్లు గా తీసుకున్నా వారి కి శిక్షణ ఇచ్చినారు. విద్య వ్యాపారము కాకుండా భవనాలు, జీతాలకు సరి పోయేంత మాత్రమేమె పిల్లల వద్ద జీతాలుగా తీసుకున్నారు. బాగా పేద వారు, తెలివి, మంచి లక్షణాలు ఉన్న పిల్లలకు మొత్తము జీతము వెనక్కు ఇచ్చేసే వారు. తమ పొలము మీద వచ్చే దానితో మాత్రమె ఇంటిని నడుపుకొనే వారు. తను అనుకున్న విద్యా విధానము అమలు పరిచినందుకు సరోజకు చాలా సంతోషముగా ఉంది.  తాము నిజముగా నేర్చుకుంటున్నామన్న భావన పిల్లలో ఉంది.  

వాణి ఎప్పుడూ హుషారుగా ఉన్నది. రాణి  చాలా మారింది, కానీ అప్పుడప్పుడు తెలియకుండా చిరాకు వచ్చేది. ఇద్దరూ వాళ్ళు పెరిగిన వాతావరణమును అనుసరించి అలా తయారయినారు. మరో రెండేళ్లకు రాముకు ఒక కొడుకు  పుట్టినాడు. మామయ్యా గారే పుట్టినారని సరోజ సంతోష పడింది. ఇంకా వాణి, రాణి లు ఆ తాతయ్య అంటూ వాడిని వదలి పెట్టడము లేదు.
ఒక ప్రణాళిక భూమిపై విరిసింది. కాలము మాత్రము నడిచి పోతూనే ఉంది.
                                                 తథాస్తు.