Monday, August 22, 2022

వాయు నియంత్రిత

 

ఇదేదో కొత్త పదములా ఉంది. లేదా పలకడానికి చాలా కష్ట మయిన పదములా ఉంది. ఎందుకంటే మనము అటువంటి ప్రభావములో ఉన్నాము.  తెలుగు గ్రాంధిక భాష వ్రాస్తే  చాలా కష్టమండీ,  మాకది అర్థము కాదు అనే వారు ఉన్నారు. లేదా రైలు సిగ్నల్ కు ధూమ గమనా గమన సూచిక  అని నిర్వచించే ఛాందసుల తో బాటు దానిని ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా మందికి తెలియని విషయము ఏమిటంటే ప్రముఖ గణిత శాస్త్ర విభాగము న్యూటన్ మహాసయుడి ద్వారా  పరిచయము చేయబడినది అని చెప్ప బడిన కాల్కులస్ కు ఆ భాష లో  అర్థము గులక రాయి.

భయ పడుటకు మరి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నేను పుస్తకాల షాపు లో ఉన్నపుడు ఒక వ్యక్తీ  ఒక సంస్కృత పారాయణ  గ్రంథాన్ని పేజీలు  తిప్పి, సంస్కృతములో తప్పులు చదివితే  పాపమండీ  అని అన్నారు.”ఏమండీ, అప్పుడే నడవటానికి  ప్రయత్నిస్తు తప్పటడుగులు  వేస్తున్న   పసి పిల్ల వాడు తప్పు చేస్తున్నాడంటారా? భగవంతుడు అంత కఠినముగా ఉంటాడంటారా?” అని అడిగినాను. జవాబు రాలేదు. ఈ తత్త్వము కొన్ని భాషలకు మనము ఇచ్చిన శాపము.

సంస్కృతము వలెనె విపరీతముగా ఒత్తులు ఉన్న భాష జర్మన్ భాష. ఒత్తులు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు  Journal of applied physics అని ఆంగ్లములో ఉంటె  Zeischrift fur angewadte fiziks అని జేర్మన్లో  journal de physique అని  ఫ్రెంచ్ భాషలో పిలుస్తారు. ఈ విధముగా జేర్మన్లో ఒత్తులు  ఎక్కువగా ఉంటాయి. ఆంగ్ల భాష మధ్యలో ఉంటుంది. ఇంకా ఫ్రెంచ్  భాషలో అసలు ఒత్తులు ఉండవు. బాగా మద్యము సేవించినందు వలన మందమయిన నాలుకతో మాట్లాడినట్లు ఉంటుంది. ఎవరి అవసరాలను అనుసరించి వారి భాష ఏర్పడుతుంది. భాష కష్టము , మాట్లాడలేము అని పలికించే కరటకులు దమనకులు వెనుక ఉండి ఆడిస్తూ ఉంటారు.

నేను చేయలేను అనే పదము భారతీయ సాంప్రదాయములో ఉండేది కాదు వారి వృత్తికి వ్యాపృత్తికి  ఎంత అవసరమో ఆ భాషను అంత వరకు నేర్చుకొనే వారు. ఆ నాడు ఏది ఎక్కువ సంపాదన ఇస్తుంది , అదే చేద్దాము అనే భావన ఉండేది కాదు. ఎ శాస్త్రము అయినా ఉన్నత స్థాయికి వెళ్ళినపుడు జీవన భృతి ని ఇచ్చేది. జీవితమయినా యుద్ధ రంగమయినా ఒకే మానసిక స్థితి ఉండేది. సంస్కృత వ్యాకరణము వ్రాసిన వారి పరంపరలో  ఆఖరున ఉన్న వాడు ఈ నాడు పాకిస్తాన్ కు చెందినా తక్షశిలలో జన్మించిన పాణిని. సంస్కృతము  సరిగా రాక పొతే గురువుగారు నీకంత శక్తి లేదని,హస్త సాముద్రిక రేఖలలో విద్య రేఖ అసలు లేదని చెప్పినాడుట.  అప్పుడు పాణిని అర చేతి మీద విద్యా రేఖ ప్రస్ఫుటముగా కనబడేటట్లు కత్తితో గాటు పెట్టుకున్నాడుట. శివుడి  గూర్చి తపము చేసి ఆయన అనుగ్రహముతో డమరుక సబ్దాలనుండి ఆధునిక సంస్కృత వ్యాకరణాన్ని నిర్మించినాదుట.ఈ నాటి కంప్యూటర్ శాస్త్ర వేత్తలు పాణిని నిర్మించిన భాష కంప్యూటర్ కు సహజమయిన భాష అవుతుందని పలికినారు. ఇటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సాధనాలతో లక్ష్యాన్ని చేరుకున్న యుగ పురుషులు ఈ నేల లో జన్మించినారు. పొలాన్ని దున్నే రైతు ఎంత చెమట కారుతున్నా తన దృష్టి పొలము మీదే ఉంచుతాడు. కలాన్ని పట్టుకున్న కవి ఎంత కష్టమైనా తన దృష్టి తన రచన మీదే ఉంటుంది. తన బాధలే తను అయిన వాడు యోగ సాధనకు పనికి రాడనీ మహా యోగి పతంజలి చెబుతారు. నిప్పులో దూకినా నిప్పులాంటి వాతావరణములో ఉన్నా సాధకుడు తన్ను తాన మరిచి పోడు.

ఇంక అసలు విషయానికి వద్దాము.  పల్లెటూర్లలో ఇళ్ళకు  మధ్య  ఎక్కువ  దూరమున్నందు వలన  గాలి చక్కగా వీచేది. మురికి గూర్చి ఎక్కువ జాగ్రత్త తీసుకొనక పోయినా ఎండ పడినందు వలన చెడు ఫలితాలు వచ్చేవి కాదు. ఆవుల పోషణ ఉన్నంత కాలము వాటి పేడ  మూత్రము వలన  దోమల బాధ ఉండేది కాదు. పగలంతా నిద్ర పోయినా రాత్రి పూట హాయిగా ఆరు  బయట మంచాలు వేసికొని  చల్లని గాలిలో విశ్రమించే వారు. ఇంక విద్యుత్తు అవసరము ఉండేది కాదు.

సాంకేతికత పెరిగే కొద్దీ కొత్త పరికరాలు వచ్చినవి. వ్యాపారము పెంచు కొనుటకై  కొత్త అలవాట్లు, అవసరాలు వచ్చినవి. ఇరుకు గదులలో అయినా గాలి చక్కగా వీచుటకు వాతాయనములు/ పంఖాలు/ఫాన్లు వచ్చినవి. ఇందు వలన విద్యుత్తు ఖర్చు పెరిగింది తప్ప కొత్త గా ఏ  విధము  అయిన నష్టము రాలేదు. అటు తరువాత మొదటగా వచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలు మన దేశపు ఉష్ణోగ్రతలలో పాడు కాకుండా పని చేయాలంటే వాటిని తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచ వలసిన అవసరము వచ్చి, వాతావరణము చల్ల బరచుటకు వాత నియంత్రణ యంత్రాలు, లేదా  వాత నియంత్రితాలు లేక పొతే ఎయిర్ కండిషనర్లు వచ్చినవి. ఇవి మొదట పరిశోధన శాలలకు మాత్రమె పరిమిత మయి ఉండేవి. వాటిని తయారు చేసే వారి వ్యాపారము పెంచు కొనుటకు వీటిని జనానికి అలవాటు చేసినారు. వీటితో బాటు లేదా కొద్దిగా అటు ఇటు కాలములో వస్తువులను చల్లని వాతావరణలో ఉంచుకొనుటకు ఫ్రిజిడేర్లు తయారయినాయి. ఈ రెండిటికి ఒకే లక్షణము ఉంది.

ఫ్రిజిడేర్ లేదా ఫ్రిజ్ లోపల వస్తువులలో చేరే వేడి నంతటను కలిపి తన వెనుక భాగము గుండా బయటికి విసర్జిస్తుంది. అందుకే దాని వెనుక వైపు చాలా వేడి గా ఉంటుంది. ఇంకా ఎయిర్ కండిషనర్  లోపల చల్ల బరచి, వేడినంతా బయటకు పంపించి  వేస్తుంది. ఇందు వలన ప్రకృతికి మరియు మనిషికి  రెండు నష్టాలు ఉన్నవి. మొదటిది, చల్లబడుటకు వాడే రసాయనాలు కొంత వరకు అయినా వాతావరణములో కలుస్తాయి. భూమికి రక్షణను ఇస్తున్న ఓజోన్ పొర ఈ రసాయనాల వలన విఘటన చెంది, క్రమక్రమముగా ఇక్కడ ఉన్న జీవ జాలానికి హాని కలిగించే అవకాశముంది. ప్రపంచములో చాలా దేశాలు వీటిని నియంత్రించాలని ప్రయత్నములు చేస్తున్నవి. ఈ రెండిటి వాడుక మరింత పెరిగి పోవుతతో బాటు, అడవులు మరియు చెట్ల సంఖ్య తగ్గి పోయి భూ తాపము అపరిమితముగా పెరిగి పోతున్నది. భూతాపము పెరిగే కొద్దీ వీటి అవసరము మరింత పెరుగుతున్నది. తెలుగులో ఒక సామెత ఉంది. ఒకడికి పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు. పిచ్చి కుదిరితే గానీ పెళ్లి కాదు. అదే విధముగా ఈ యంత్రాల వాడుక తగ్గితే గాని భూ తాపము తగ్గదు. భూ తాపము తగ్గితే గానీ వీటి వాడుక తగ్గదు.

మనిషి జీవితమూ పూర్తిగా యాంత్రికము అవుతున్నది. ఏ పని కూడా తను చేయ లేని పరిస్థితికి వస్తున్నాడు. కూర్చుంటే లెవ లేడు. ఏ పనినీ చేయ లేడు, ఏ వేడికీ తట్టుకోలేదు. పరిశోధన  శాలలలో తప్ప మిగిలిన వాడుకలో వీటిని నియంత్రిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయము తగ్గ వచ్చును, కానీ భూ తాపము తగ్గుతుంది. ఇందు వలన భూమి మీద ఉన్న ఇతర జీవ రాసులకు కూడా సాయము చేసిన వారవుతారు.

నీతి:మన దేహాన్ని ప్రేమించుటే కాదు, మనలను కూడా మనము ప్రేమించ గలగాలి

Thursday, February 10, 2022

మన పరిస్థితి

                   

               


                        

 

 ఇక్కడ కొన్ని విషయాలను కాస్త కఠినమే అయినా చెప్ప వలసిన అవసరమున్నది. ఇందులో ఎవరినీ నొప్పించుట ఉద్దేశ్యము కాదు. ప్రతి విషయాన్నీ తమ ఆలోచనకు అనుకూలముగా మార్చి అదే సత్యముగా అనిపించేటట్లు చేయడము పాశ్చాత్యులలో ఒక వర్గము వారికి వెన్న తో పెట్టిన విద్య.(క్షమించాలి అందరూ కాదు వారిలో కూడా ఎందఱో మహాను భావులు ఉన్నారు.) వీరు తాము అనుకున్నదే సరి అయినది అని చెప్పుటకు ఎన్ని వక్ర మార్గాలయినా తొక్కుతారుఅందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయిశ్రీ మికాయో ఉసూయి షింగాన్ శాఖకు చెందిన బౌద్ధ మతావలంబి. రేకి అనే విద్యను ఆధునిక కాలములో ప్రవేశ పెట్టిన మహనీయులు. ఆయన ఏ నాడూ జపాన్ దాటి వెళ్ళ లేదు. ఇది స్పష్టముగా ఆయన వ్రాతలలో  ఇటీవల బయట పడినది. కానీ ఒక రేకి టీచర్ ను అనుసరించి ఆయన ఒక క్రిస్టియన్ స్కూలుకు అధికారి. ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు జవాబు కనుక్కోవాలని చికాగో వెళ్లి వైద్య విద్యను  అభ్యసించినాడని    .. ఇంకా.. ఇంకా.. ఎన్నో కథలు ఆవిడ చెప్పినారు  ఇవి ఇప్పటికి రేకి  క్లాసులలో చెబుతారు.

ఇంక ఈ నాడు భారతీయులలో కూడా చాలా మంది తమ ఋషులు ఏమి చెప్పారో తెలుసు కోవడానికి తమ గ్రంథాల మీద కాకుండా పాశ్చాత్యులు వ్రాసిన పుస్తకాలపై ఆధార పడి వారి పాటలకు తాళాలు వేస్తున్నారు. ఇటీవల చాణక్య అనే టీవీ సీరియల్ తీసిన ఒక మహనీయుడు ఎక్కడో చదివినాడు. ఒక పాశ్చాత్య గ్రంథములో చాణక్యుడి కాలానికి భారత దేశములో తాటి చెట్లు ప్రవేశించ లేదని. దురదృష్టమేమిటంటే ఆయన అన్నీ చదివినాడు కానీ మన గ్రంథాలు పూర్తిగా చదువ లేదుభాగవతములో బాల రాముడు తాటి పండ్లు తిన్నట్లు ఆయన దృష్టికి రా లేదు. రామాయణములో ఎన్నో చోట్ల తాటి చెట్ల ప్రస్తావన వస్తుంది. అది ఆయన దృష్టికి రాక పోవడము మన దురదృష్టము.

నా కొలీగ్ ఒకరు రామాయణ విష్ వృక్షము గురించి  చెబుతుంటే నేను ఒక మాట అన్నాను. “మీరు అసలు గ్రంథము చదవకుండా ఈ వ్యాఖ్యానాలు చదివితే మీకు చర్చించే అధికారము లేదు.” అని.

ఒక నిజాయితీ గల పాశ్చాత్యు రాలు వారణాసి గురించి పరిశోధించుటకు  హార్వర్డ్ వచ్చింది ఆమె పేరు నాకు గుర్తు లేదు. వారణాసి లో ఆమె మూడు సంవత్సరాలు గడిపింది.ప్రతి ప్రాంతము అక్కడ తిరిగి విషయాలను సేకరించింది. అది ఆమె గొప్ప తనము. పల్లెటూర్లను గురించి పరిశోధించే కొంత మంది  పల్లెటూర్లకు వెళ్ళకుండానే ఏవేవో పుస్తకాలు చదివి పల్లెటూర్ల మీద విమర్శనాత్మక వ్యాసాలూ వ్రాయడము   మన దేశములో కొత్త కాదు. అది గర్హించ వలసిన విషయము.

     

 


Saturday, October 3, 2020

ప్రేమ కథ

 


అందరికీ ప్రేమ కథలు అంటే ఆసక్తి. విఫల మయిన ప్రేమతో పాత్రలు బాధ పడుతుంటే చూచే వాళ్ళు కూడా ఎక్కి ఎక్కి ఏడుస్తుంటారు. మన పురాణాల లో కూడా చాలా ప్రేమ కథలున్నాయి. వాటిని గురించి ఎక్కువ మందికి పూర్తిగా తెలియదు. వాటిని గమనిస్తాము. అందు లో రురువు ఒకరు.

చ్యవన మహర్షి యొక్క మనుమడు రురువు. ఈ  చ్యవనుడే ఆరోగ్య వర్ధకము అయిన చ్యవన ప్రాసకు మూల పురుషుడు. స్థూల కేశ మహర్షి యొక్క దత్త పుత్రిక అయిన ప్రమద్వరను రురువు ప్రేమిస్తాడు. రురువు యొక్క కోరికను అంగీకరించి స్థూల కేశ  మహర్షి వివాహ ముహూర్తమును నిర్ణయిస్తాడు.

ప్రమద్వర పెళ్ళికి ముందే తన స్నేహితురాండ్రతో ఆటలలో ఉన్నపుడు పాము కాటుకు గురి అవుతుంది. కళను కోల్పోయి విష ప్రభావముతో ప్రమద్వర మరణిస్తుంది.

ప్రమద్వర మరణము తో విలపిస్తూ రురువు రేయింబవళ్ళు పిచ్చి వాడిలా తిరుగుతాడు. రేయింబవళ్ళు విలపిస్తాడు. అప్పుడు ఒక దేవత రురువుకు కనిపించి తన ఆయుస్సులో సగము ఆయుస్సును ధార పోస్తే ప్రమద్వర జీవిస్తుందని చెబుతుంది. దీర్ఘాయుష్కుడు అయిన రురువు తన ఆయుస్సులో సగమును ప్రమద్వరకు ధార పోస్తాడు. యమ ధర్మ రాజు అందుకు అంగీకరించి ప్రమద్వరను జీవింప చేస్తాడు.

మరొక కథ సావిత్రిది. అల్పాయుష్కుడు అని తెలిసి కూడా తను సత్యవంతుడ్ని ప్రేమించి పెళ్లి చేసు కుంటుంది. అదీ తల్లి దండ్రుల అభిప్రాయానిక్ వ్యతి రేకముగా.  అడవిలో ఒకరోజు సత్యవంతుడు మరణిస్తాడు. భర్త ప్రాణాల కోసము యమ ధర్మ రాజు వెంట బడి, భర్తను బ్రదికించుకుంటుంది. మానవాళికి ఆరాధ్య దేవత అవుతుంది. ఈమె కథనే అరవింద రిషి ఆంగ్లములో అద్భుతముగా వ్రాసినాడు.

మన పురాణాల్లో ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు నల దమయంతులు, శకుంతలా దుష్యంతులు మొదలయినవి. వీరందరూ ఎన్నో కష్టాలు పడినారు, ఓటమిని అంగీకరించ కుండా పోరాడి విజయాన్ని సాధించినారు. చరిత్రలో నిలబడి పోయినారు.

ఇక లైలా మజ్నూ, రోమియో జూలియట్ లాటివి విదేశాలలో, ఇక మన దేశములో కృత్రిమమముగా కల్పించ బడిన అనార్కలీ, ముంతాజ్ మహల్ లాటి వారు. లైలా మజ్నూ లు ఏడుస్తూ మరణిస్తారు. ఇంకా అనార్కలి అసలు మరణించ లేదని నుర్జేహాన్ పేరుతొ సలీమ్ నే పెళ్లి చేసుకుందని కొన్ని కథలున్నాయి.

ఇంక  షా జెహాన్ కు ఉన్న పెద్ద జనాభా కలిగిన భార్యలో ముంతాజ్  ఒకరు. ఆమె తను రాణిగా ఉన్న కొద్ది కాలములో అవిశ్రాన్తముగా సంవత్సరానికి ఒకరు చొప్పున పదునాలుగు మంది పిల్లలకు తల్లి అయి ఆఖరి కాన్పులో భరించ లేని బాధతో మరణిస్తుంది. షా జెహాన్ కు ఆమె అంటే అంత ప్రేమ. మేవాడ్ రాజుల రాజ మహల్ ను తాజ్ మహల్ గా మార్చి, ఆమె సమాధిని అందులో ఉంచారన్నది నిర్వివాదాంశము. దానిని అమర ప్రేమగా, కొన్ని సంవత్సరాను కష్ట బడి తాజ్ మహల్ నిర్మాణము చేసినారని కొంత మంది కథలు చెబుతారు.

వీటి ప్రేరేపణతో వచ్చిన మరొక ప్రేమ కథ దేవదాసు.,బెంగాలీ రచయిత శరత్ చేత వ్రాయ బడినది. ఇందులో నాయక నాయికా  పత్రాలు బాగా బలహీనమయినవి. వాటిని చూచిన వారి మనస్సులను బలహీన పరుస్తాయి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావము వారిని అమర ప్రేమికులుగా మార్చింది.

మనిషిలో ప్రేమ తొటి జీవులను బ్రదుకనిస్తుంది. ప్రేమికుల ప్రేమ కూడా ఓటమిని అంగీకరించదు. మరి ఈ ఆధునిక ప్రేమ జీవుల  కథలు వారి అభిమానులను ఎందుకూ పనికి రాని బలహీనులుగా మారుస్తాయి. ఇది నా అభిప్రాయము మాత్రమె.

ఒప్పుకుంటారా?

Monday, May 11, 2020

ఆంధ్రా పూరీ


                                                            

          పూరీ జగన్నాద్ గారు తమ అబ్బాయి నాయకుడిగా ఒక సినిమా తీసినాడు. దాని పేరు ఆంధ్రా పోరి. ఆంధ్రులలో పోరీ అనే పదము అసలు వాడరు. అది హిందీ , లేదా హైదరాబాదీ/ఉర్దూ పదము అయి ఉండాలి. విశేషమేమిటంటే ఆ పోరీ గా నటించినది ఆంధ్రా అమ్మాయి కాదు.  ఆంధ్రా తెలంగాణా  నాయకులు వైరుధ్యాలతో కొట్టుకుంటుంటే పరస్పర వైరుధ్యాలను తలపించే పేరు గల ఈ చిత్రము సామరస్యమిస్తున్దనుకున్నారేమో? లేదా ఆంధ్రా పూరీ అంటే బాగుందడనుకున్నారేమో?
`         దీని మీద తెలంగాణా ముఖ్యమంత్రి గారికి ఎలాటి  ఆసక్తి కలిగినట్లు లేదు. బహుశా కంఫ్యూజన్ లో ఉన్నాడేమో? లేదా తెలంగాణా పోరీ అనకుండా  ఆంధ్రా పోరీ అన్నందుకు ఇక్కడ రిలీజ్ చేస్తాడా, నిర్మాత నాలుక కత్తిరించి వేస్తానని అంటారేమో అనుకున్నాము.
         


Friday, March 27, 2020

అగ్గిపుల్ల/సోనా



 కథ ఇలా మొదలయింది. నేను సోనా అగ్గిపెట్టేలను కొనాలని కిరాణా  కొట్టుకు వెళ్లాను. నేను ఎప్పుడూ డజన్  కట్టగా కొంటూ ఉంటాను.  ఇంట్లో అవి అయి పోవచ్చినాయి. మొదట్లో చెక్కనుండి చీల్చ బడిన అగ్గి పుల్లలను వాడే వాడిని. కానీ వర్షాలు బాగా  కురిసి , ఆర్ద్రత పెరిగినపుడు  అవి అంటుకునేవి కాదు. మిగిలిన వాళ్ళ సంగతి ఏమో కానీ ఇది నా వ్యక్తిగత అనుభవము. ఒక పుల్లకు బదులు నాలుగు పుల్లలు ఖర్చు అయేవి. కానీ సోనా  మైనపు/వాక్స్ పుల్లలతో అటువంటి సమస్యలూ వచ్చేవి కాదు. ఆ విధముగా అవి అలవాటు అయినాయి.

కిరాణా కొట్టుకు వెళ్లి సోనా అగ్గి పెట్టేలకోసము అడగగానే ,”మేము వాటిని అమ్మమండీ! అవి పొట్టిగా ఉంటాయి. అంటుకోనేటప్పుడు వేళ్ళు  కాలతాయి కూడా.” అని అన్నాడు.

“అబ్బే ! నేను జాగ్రత్త గానే వెలిగిస్తాను. వాటికి అవి నెమ్మదిగా మంట పైకి  వస్తుంది. ఏమీ కాలదు “ అని చెప్పాను.

‘అయినా, చెక్కతో ఉన్న పుల్లలు వాడ వచ్చు కదా!” అన్నాడు. పక్క కొట్లలోలో కూడా ఇదే జవాబు. అంటే వాళ్లకు అనుకూలమయిన వస్తువులే అమ్ముతారన్న  మాట. వస్తువులు కొనడానికి వచ్చే వారడిగినవి కాదు. అవసరమయితే తమ సరుకే మంచిదని ఒప్పిస్తారు. ఇదంతా కల్పితము కాదు. నిజంగా జరిగింది. వెంటనే మా పాత విద్యార్థి మామ గారిది ఒక కొట్టు ఉంటె అక్కడకు వెళ్లి ఒకటి కాదు, రెండు డజను అగ్గి పెట్టెలను కొని ఇంటికి వెళ్లాను.

మా వీధి చివర ఒక కిరాణా కొట్టు ఉంది. అక్కడ కూడా ఇదే తంతు. నేను అక్కడికి వెళ్లి గాడ్రెజ్  షేవింగ్ క్రీం కావాలని అడిగాను. “అబ్బే! అదెవరూ వాడటము లేదండీ! మా కొట్టులో ఎవరూ దానిని కొనరు. మా దగ్గిర జెల్ క్రీం ఉంది తీసుకొండి” అని యన్నారు. ఇంచు మించు నాలుగు లేక అయిదు ఐటమ్స్ కు నేను ఇదే రకపు జవాబు వచ్చింది. ఇంక అక్కడికి వెళ్ళడము తగ్గించేశాను. కొంత మంది చేసే వ్యాపారము ఇలా ఉంటున్నది. ఇది పెద్ద వ్యాపార సంస్థల నుండి నేర్చుకొని ఉంటారు.

ఇంక టూత్  పేస్టుల సంగతి చూద్దాము. కొంత వినోదానికి తెలుగు పదాలు ఉంటె ఎలా ఉంటుందా అని వాటిని వాడాను.  ఏదో ఒక కంపెనీ. దానిని XX అని అందాము. మన దేశములో పాత కాలములో బూడిదతో, లేదా ఉప్పు పొడి కలిపినా బూడిదతో , మరి కాస్త ఓపిక ఉన్న వారు కానగ లేదా గానుగ పుల్లతో, ప్రముఖముగా అయితే వేప పుల్లతో దంత ధావనము చేస్తారు. ఇది రోజూ ఖచ్చితముగా చేయుట అలవాటయిన పని. ఇంక విదేశాల్లో వాళ్ళు (అక్కడ స్థిర పడిన మన వాళ్ళు కాదు) అసలు పళ్ళు తోముకోరని ఏదో సిరప్ తో నోటిని కడుక్కుంటారని విన్నాను. ఇది తప్పయితే నన్ను క్షమించండి.

ఇంక కొన్ని వ్యాపార సంస్థలు మన పళ్ళ మీద దృష్టి పెట్టినాయి. మన  సెంటిమెంటును డబ్బుగా మార్చు కోవాలనుకున్నాయి. మీరు మా టూత్ పేస్టూ లేదా దంత లేహ్యాన్ని వాడితే మీ పళ్ళు తళ తళా మెరిసి పోతాయి లేదా వాడక పొతే అవి జల జలా రాలి పోతాయి అనే నినాదముతో మొదలవుతుంది. అంతే కాక ప్రకటనలలో ఒక తెల్ల కోటున్న వైద్యుడు ఇవన్నీ చెప్పి మనకు మంచి సలహా ఇస్తున్నట్లే చెబుతాడు. అంతా ఎగబడి కొన్నారు. ఇంక రెండవ మెట్టు ఉంది. “మేరు మీ వేలుతో తోమితే మా దంత లేహ్యము దంతాలంతా పాకటము లేదు. అందుకని మీకు పూర్తీ ప్రయోజనము కలుగుట లేదు. అక్కడంతా బాక్టీరియా/సూక్ష్మ జీవులు చేరి పళ్లకు తొర్రలు పోడుస్తాయి “ అని మరో ప్రచారము మొదలు పెట్టినారు. “ఇప్పుడు మీరేమి చేయాలంటే ఇదుగో మీకోసము మేము ఎంత కష్ట పడుతున్నామో గమనించండి. మీ దంతాల కోసము ప్రత్యేకముగా చేయ బడిన దంతపు దులుపుడు పుల్ల వాడండి.”అని అన్నారు.ఏ విధముగా మరొక వ్యాపారము ప్రారంభ మయింది. ఇదే నా వరకు వేలును అంటి  ఒక కంపెనీ మా దంత లేహ్యమును వాసన చోస్స్తే చాలు... అంటూ అబ్బాయిలను, అమ్మాయిలను కలిపి చూపించే వరకూ వచ్చినారు.

ఇప్పుడు దంత వైద్య  శాలల ప్రకరణము మొదలయింది.  దంతపు లేహ్యాలు, దంతపు దులుపుడు పుల్లలు వచ్చిన తరువాత కూడా దంత వైద్య శాలల వ్యవస్థ బాగా పెరిగింది. దంత వైద్యులు అమెరికా లో పై స్థాయి వైద్యుల జాబితా లో చేరుతారు. ఇంక భారత దేశములో కూడా అదే స్థితి  వస్తుంది.

వ్యాపారము పెరిగింది, వసూళ్లు  పెరిగినవి. ఇంక పోటీ కూడా పెరిగింది.ఇంక పోటీ తట్టుకోనడానికి ఒకే కంపెనీ ఎక్కువ బ్రాండులు తయారు చేయడము మొదలు పెట్టింది. ఒకటి బాగా లేదంటే మరొకటి లేక పొతే మరొకటి, అదే సంస్థ ది అంటే వర్తకము తన గుప్పిట్లోనే ఉండాలి. మైళ్ళలో పాత కాలములో ఉప్పుతో పళ్ళు తోమే వారంటే, ఇదిగో xx ఉప్పు  వేప పుల్ల మంఛిది కదా అంటే ఇదిగో xx వేప, మంచి సువాసన కావాలంటే ఇంకొకటి , దానితో తోమగానే వీధి లొ అమ్మాయిలూ పరిగెత్తుకొని వచ్చేస్తారు, అందరూ ఆయుర్వేదము కూర్చి మాట్లాడుతున్నారంటే ఇదిగో  xx వేద.  దీనికి బలి అయ్యే  బకరాల సంగతి చెప్ప వలెనంటారా?

కొన్ని సంవత్సరాల క్రిందట ఒక బ్రాండ్ దంత లేహ్యము పూర్తిగా vegetarian అని ప్రకటించినాడు. అంటే మిగిలిన బ్ర్రండ్ల సంగతేమిటి?కొందరు ఖంగు తిన్నారు.బాగా పరి శీలించిన తరువాత తెలిసిన దేమిటంటే,ఆయా దంత లేహ్యాలలో మూల పదార్థము ఎముకల పొడి యని. శాకాహారులమని చెప్పుకొనే వారి కి ఈ సంగతి తెలిస్తే ఏమవుతుంది?

అంతే కాదు నా స్నేహితుడు ఒకరు చెప్పినాడు. ఈ ఎముకల పొడి కారణముగా నే ఆ దంత లేహ్యమును వాడిన వారికి దంతాల పై ఉన్న గార తొందరగా పోతున్న దట. ఈ విషయాన్ని వ్యాపారస్తులు ఒప్పుకుంటారా? పొతే ఎవరు పోతారు? బకరాలే కదా.

          మీ ఉత్పత్తికి ఏమి కలిపినారు? అని అడిగే దమ్ము ఎవరికయినా ఉన్నదా? అ కంపెనీలు అన్నీ పేటెంటు హక్కులను నమ్ముకున్నాయి కదా!

          ఈ దంత వేదాంతము ఎందుకు చెప్పండి? తవ్వుకొనే కొద్దీ తల నొప్పులే కదా! ఈ విషయాలన్నీ బయట పడితే మా పరువు ఏమి కావాలి? ఇది కొంత మంది బాధ. వదిలి వేసేయండి. ఇంకొకరికి చెప్పే ముందు మీరు మారండి.

ఒక్క అగ్గి పుల్ల కథ ఎంత వరకూ వెళ్ళింది? అతి సర్వత్ర వర్జయేత్.

ఓం స్వస్తి.


Thursday, December 26, 2019

వసంతాగమనము (అహల్య 2)


                     
           
           
           
            సుందరి : ఎవరే,..... ఎవరే....
                        అట దాగినదెవరే....
                      విరిసిన పూవుల పొదల మాటున
                        పరిమళ లహరుల పొందు కోరుతూ..
                        ఎవరే ..........దాగినదెవరే......
              రుచిర: సూర్యుడు పైకి లేచిన వేళ
                     విరిసిన పూలు ఉండవా?
                     విరిసిన పూలను సోకిన గాలులు
                        పరిమళ లహరుల చిందవా?
              సుందరి: ఇది యే ఋతువే?......
              రుచిర:    ........వసంతమే.
             సుందరి:   నిజమేనా?
               రుచిర:    ఇది  సుమర్తువేనే .
             సుందరి: ఏది వసంతం? ఎక్కడ కోయిల?
                        ఆకుల రాలగ సోలే అడవి.
                       ఏది వసంతం? ఎక్కడ కోయీ?
               రుచిర : చూడవే అటు చూడవే..
                       పొదల మాటున దాగిన మన చెలి
                           పూర్ణిమ ముఖాన చూడు.
                      పుప్పొడి ఎల్లెడ సోకి పాకెనట
                           పూచిన పున్నాగ మ్రోల.
                       ఇది వసంత మేనే...
                          ఇది  సుమర్తువేనే .
                సుందరి:  మరి కోయిల గొంతుక ఏదే?
                        మద కోయిల గొంతుక ఏదే?
            పూర్ణిమ :సూర్యుడు తూరుపు సోకక ముందే
                          సుందర ప్రకృతి పొంగును చూచి,
                          విరిసిన రంగుల విరి కన్నియల
                           సొగసుల కన్నుల కాంచి,
                           తన సహజ ప్రకృతిని మఱచి కోయల
                            చూత వృక్షపు చిగురుల చేరక.
                           అందుకే
                          దిక్కుల చూచెనదే మరి కోయల
                           ఎటు పోవాలో తెలియక.
            పూర్ణిమ: చెలియా! సుందరి ఇటు రావే,
                      నను తరిమే భ్రమరుడి చూదవే.
            సుందరి: నీ ముద్దుల మోము చంద్రుడి పోల,
                       చంద్రుడి మోమున పుప్పొడి పొడల
                       ఆస్వాదించగ వచ్చిన భ్రమరుడి
                       కంతగ భయ పడనేల?
                       ఓ చెలి! విరి బాలా!
               సుచిర: సరదాగా ఉన్నదే....
                      విరులను చూచి పొంగిన కోయిల
                       ఇలనే మఱచేనే.
                      విరులనుకొని మన చెలి వెంట బడె
                       భ్రమరుడు ఇట నేడే......
            పూర్ణిమ: అటు చూడవే...........
            సుందరి:  ఏమిటే?
          పూర్ణిమ: కుహూ! కుహూ! కోయల వచ్చేనే
                      సుమ మల్లియలే విరిసేనే
                        నవ వసంతమే వచ్చేనే
                       నవ్యత ఎల్లెడ విరిసేనే.
            పూర్ణిమ: వలపులతో వికసించి,
                        పరిమళాల పంపించి,
                        భ్రమరుడి ధాటికి సోలి,
                         పరిపూర్ణత పొందె విరి.
            సుందరి: ప్రతి హృదయము పొంగగా
                           చెలి యెడద పులకించ,
                           నవ వసంతు జంట గాడి
                           చంద్రుడి చూపెను వరుడు.
            ముగ్గురు: ననలు వేసి, పూత పూసె,
                         నిలువెల్లా చూతము.
                            పూతను తిన్న కోయిలకు
                       భూతలమే  సుమవంతము.
                        ఇది వసంత మేనే,
                              ఇది  సుమర్తువేనే.
                 సుచిర: గరిక పూలు, శిరీషాలు,
                           గాలికి వలవల లాడెను,
                           చంద్ర మౌళి శిరసునందు
                            సుందరముగ దాగుటకా? 
              పూర్ణిమ: పొదల లోన పూసిన యా
                          మల్లికలు పిలువ సాగె.
                             అభిసారిక సిగలో నిలువ
                            అభిసారిక వోలె లేచి.
                  ముగ్గురు: ఇది వసంత మేనే
                             ఇది  సుమర్తువేనే .
                     
                    సుందరి: చూచితివా? ఓ చెలి చూచితివా?
                           తియ తీయని పరిమళాల
                           వెదజల్లే సుమ దళాల
                          సొగసుల సుందర హొయలను
                             |చూచితివా|
            రుచిర: అడుగడుగున విరుల వాన
                       అణువణువున సిరుల సోన
                       తియ తీయని పరిమళాల
                       వెదజల్లే సుమ దళాల                           | చూచితివా | 
            పూర్ణిమ: విరివిరి పై వాలి వాలి
                      పొడి పుప్పొడి పైన సోలి,
                        రంగుల రెక్కల హొయల
                           పొంగులతో భ్రమరుడిని                 |చూచితివా|
                       తియ తీయని పరిమళాల
                         వెదజల్లే సుమ దళాల                  | చూచితివా|

              సుందరి: చిరు రసాల చిగురులను
                           చిరు బొజ్జకు పట్టించి
                           పొంగు హొరంగుల ప్రకృతి
                          పిలిచే కోయిల రాజును                            
                            |తియ తీయని పరిమళాల|
         పూర్ణిమ : నారాయణ నామమునే
                          పారాయణ చేయు ఋషులు
                          నవ వసంతు సొగసులలో
                          నవ లోకము చూచితిరే
                       ఈ వసంత  సుందర ప్రకృతిలో
                      మల్లెలు విర జాజులు సమ
                      మందారపు మకరందాలు
                      ఎడద  ఎడద  పొంగి పొంగి
                       విరుల వాడికి వంగి వంగి
                        ప్రక్రుతి అలసి మెరిసే
                      నవ వసంత మేనే
                     ఇది
                      నవ వసంత మేనే.
          సుందరి:      చెలీ!...................
         రుచిర:            ఏమే?..........................

                    చూడవే .......
                    ఏటే?.............
                    ఆటే...............................
                    ప్రతి  వృక్షము మింటి దాటి
                    ప్రతి  పువూ శ్వాస కంది
                   పరవశించు ప్రక్రుతి సుమ
                   పరిమళ లహరుల లోన
                         ఆ.....లహరులలో       
                          మదనుడి విరి తూపుల
                         పదనుకు ఎద వేగ లేక
                         వరుడి కొఱకు వేచి చూచు
                           వధూమణుల వేదుకలో
                      ఆ ................వేడుకలో
                      కోయిలల కూతలలో
                      కోరికలే   పలికేనా ?
                            మల్లికల వాసనలా
                            కలల కన్ను గీటేనా?
                       ఔనా?........
                       ఇంతకూ  నీవు చెప్పేది ఏమిటే?
                        చెప్తాను అటు కానవే.
                        భ్రమరుడు  విరి వీరిని వాలి
                        మధువు పాన మత్తతతో
                        ఝుంఝుమ్మని పాడే ఈ
                        సమ వసంత  మాసములో
                        ఆ..............మాసములో
                        కనవే అటు కనవే అటు
                        వెల వెల పోయిన విరి వని
                        మరు మారుత మధుర స్పర్శ
                        తూలీ పోవు సుమ వసంత
                        మధురిమలో సోలు ఇలలో
                        తోచే నట  పర్ణ శాల
                        చూడవే ఓ చెలి చూడవే
                        తర  తరాల ప్రకృతిలో
                        తరలి వచ్చు మార్పులతో
                        వాడి  వడలి పర్ణ హీన
                        అయినది ఈ  పర్ణ  శాల
                        చూచితిరా, చెలులారా  చూచితిరా?   
                           కొత్త కొత్త కోరికల
                          ఎడద వేచి చూచేనా?
                           చూడవే, అటు చూడవే......
                    
                         (ఒక్కొక్కరు లోపలికి వస్తారు.)
            సుందరి: ముని కుటుంబ మిట నాడు
                        పచనము చేసిన పాత్రల
                         అవశేషములా ఇవి,
                        హా! విధి, ఎవరిది గృహము.

                          గాలులు ఈ నాటికైన
                          చొరబడ లేదేమొ గాని
                          ముని యొక్క దర్భ శయన
                          మిదె మరి చూడవె ఓ చెలి.
                          పూజా సుమముల నిచ్చెడి
                         మరుమల్లెల పొదలు
                         మాలి లేక వాడి పోయె
                         మధుర గతము గుర్తు చేయ.

                      ఎవరే ఈ ధీ శాలి,
                      ఎవరే ఈ మహా ఋషి,
                        ఏల గృహము వదిలెనో
                      ఎపుడు తిరిగి వచ్చునో?
            సుచిర: నాదు తండ్రి చెప్పినాడు
                         ఘనుడట ఈ ముని వరుడు
                         కరువులోన ఇల జనంబు
                         ఆకలితో అలమటించ
                       గోదావరినిలకు తెచ్చి
                        కరువును మాపిన ఘనుడట,
                        ఘన నామము గౌతముడట,
                        ఎటకేగెను ఏమో మరి,
                        ఎపుడు తిరిగి వచ్చేనో?    
(ఇంతకూ ముందు నేను వ్రాసినదంతా ఉంచ లేదు. అందుకని దీనిని మరలా upload  చేస్తున్నాను. దీనిని అహల్య రెండవ భాగముగా తీసుకోన గలరు.)