ఏమండోయ్ నేనే,
దోమను. కొందరు నన్ను మశ్చికం అంటారు. వాళ్లకు కొంత భాషాభిమానము ఎక్కువ లెండి.
సింపుల్ గా నన్ను దోమ అంటే చాలు. మా జాతి మీద మీకు చాలా కోపముగా యున్నది. ఆ విషయము
మీకూ తెలుసు. అది సహజము కూడా. ఎందుకంటే
మేము రక్త పిశాచ జాతికి చెందిన వాళ్లము. అంటే అన్ని రకాల జీవుల రక్తము మీద
జీవిస్తాము కాబట్టి. అయినా మేము మానవ జాతి యొక్క దయా దాక్షిణ్యాల మీద
బ్రతుకుతున్నామంటే మీరు ఆశ్చర్య పోతారు. కానీ, నిజాము మాత్రమదే.
సుమారుగా ఏబది ఏళ్ల
క్రిందట పల్లెటూళ్ళలో ఆరు బయట చల్లని
గాలిలో మంచాలు వేసుకొని పండుకొనే వారు. ఎందుకంటే
అప్పుడు మా జనాభా అంతగా పెరగ లేదు. ఇప్పుడలా పండుకోంది చూద్దాము. మా జనాభా
మిమ్ములనలా పండుకోనిస్తున్దేమిటి? మాకు మీ రక్తముతో బాటు మురికి పదార్థాలు అన్నా ఇష్టమే.
అందుకీ మా గుడ్లను మురికి గుంటల లోనే పెడుతాము. ఆ రోజుల్లో నత్తలు కప్పలు నేరుగా
వచ్చి మాగుడ్లను తిని వేసేవి. వాటిని తప్పించుకొని పగిలిన గుడ్లే మా జాతిని
నిలిపేవి. ఆ సమయములో మా జాతి అందుకే వేగముగా పెరిగేది కాదు.
ఈ విషయము లోనే మేము
మేము మానవ జాతికి ఏంటో ఋణ పడి యున్నాము. ఎందుకంటే వాళ్ళు పరిశోధనలకనీ, వంటల కనీ
కప్పలను ఖాళీ చేయించేసినారు. అంతే కాక చేపల చెరువుల్లో ఆహారము గా వేయుటకై
నత్తలన్నిటినీ ఏరి, చితగ కొట్టి వేసేస్తున్నారు. దీనితో మాకు ప్రాథమిక శత్రువులు
పోయినారు.
పాత రోజుల్లో
ఇళ్ళల్లో సాంబ్రాణి లాంటి ధూపాన్ని తరచుగా వేసే వారు. ఆ వాసన మాకు అసలు పడదు. అందుకని
మేము లోపలి ప్రవేశించే వాళ్లము కాదు. ఇప్పుడు బొగ్గులు పొడి చేసి అందులో సాంబ్రాణి
వేసి ధూపము వేయాలంటే మీకు బాగా బద్ధకము వచ్చేసింది. దీనితో మాకు బాగా స్వాతంత్రము
వచ్చేసింది.
మా వలన మలేరియా లేదా చలి జ్వరము
వ్యపిస్తున్నాడని తెలిసిన తరువాత మేమంటే జనానికి భయము పెరిగినది. ఆ తరువాత వ్యాధుల
పట్టీలో డింగీ బర్డ్ ఫ్లూ లాటి విష జ్వరాలు చేరిన తరువాత మమ్ములను నియంత్రించుటకై బజారులో పొగ చుట్టాలు,
కిరసిన్న్ పొగ డబ్బాలు చాలా వచ్చినాయి. వాటి దెబ్బకు మా దోమలు చాలా చని పోతున్నాయి.
అయితే ఇప్పటికీ జనానికి అర్థము కానిదొకటి యున్నది. దోమ నివారణ రసాయనాలు పెరిగినాయి, దోమలు కూడా చాల చని పోతున్నాయి,
అయినా మా సంఖ్య పెరుగుతూనే యున్నది.అది మీకు పూర్తిగా అర్థము కావుట లేదు.
అంతకంటే గమ్మత్తయిన
విషయమున్నది. దోమలకు రోగ నిరోధక శక్తి కూడా పెరిగినది. ఇంతకుముందు కొద్ది మోతాదుకు
చని పోయే దోమలు ఇప్పుడు ఎక్కువ మోతాదుల విషాన్ని కూడా తట్టుకొన గలుగుతున్నవి. ఈ
విషయములో నా చిన్న బుఱ్ఱకు తోచినదొకటే. విష ప్రయోగము వలన కొన్ని బలహీనమయిన దోమలు
చని పోయిన కొలదీ మిగిలిన దోమలకు దొరికే ఆహారము పెరిగి వాటి శక్తి కూడా
పెరుగుతున్నది.మరొకటేమిటంటే మీ లోని కొంత మంది శాస్త్ర వేత్తలు చెపుతున్న దాన్ని
బట్టి, (మ్యుటేషన్ అనబడే జీవ లక్షణమును
అనుసరించి ) మా యొక్క రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతున్నది. అందుకనే మీ విష
పదార్థముల ప్రభావము తగ్గిపోతున్నది. మీ ఓర్పు మరీ తగ్గి పోయి మమ్ములను పూర్తిగా
నాశనము చేయాలన్న కసి కొద్దీ మీరు భూమిని
విష పదార్థములతో నింపి వేస్తున్నారు.
ఒక మహర్షి
చెప్పినారు, మీరు మరొకరిని పరోక్షముగా నిందించుట వలన ఏర్పడే శక్తి మాకు బలాన్ని
చేకురుస్తున్నాదని. అది, నిజమో కాదో నా చిన్ని బుఱ్ఱకు అర్థము కాదు, కానీ,భౌతిక
వాదముతో కొట్టుక పోతున్న మీకు ఈ విషయాన్ని అంగీకరించే శక్తి లేదన్న మాట మాత్రము
నిజము.
మధ్యలో మరొక
సరాగము. ఇటీవల ఈగ అనబడే పేరుతొ సినీమా వచ్చినది. చని పోయిన కథానాయకుడు ఈగ దేహములో
చేరి పగ తీర్చుకుంటాడు. అంత పగను పెంచుకొని ప్రతి నాయకుడిని గుర్తుంచుకొనే శక్తి ఈగ
మెదడుకు ఉందా? నాకు అర్థము కాలేదు. అది వీలయితే రేపు నేను కూడా అలాటి పనులు చేయ
వచ్చును .
మళ్ళీ ఎపుడో
కలుద్దాము.
మీ చిన్ని దోమ.