Sunday, September 25, 2022

వ్యాధి

 

                                       

         వ్యాధి  అంటే  అలవాటు భాషలో  ‘” రోగము” గా పిలువ బడుతుంది. రోగము మనిషి కి కాక మొక్కకు  కు వస్తుందా ? అనేది ప్రశ్న. ఈ ప్రశ్నను కొందరు వేస్తారు. అయితే రోగము వచ్చి చచ్చి పోయే  మొక్కలను కోవస్తూనే ఉన్నాము. అత్యంత ప్రాచీన కాలము నుండి రోగ్యములను  కొని ఏకచ్చి పెట్టు కొనే  వారిని చూస్తూనే ఉన్నాము.

              ఇంతకూ  రోగము/వ్యాధి అంటే  ఏమిటి? మనిషి తన సహజ స్థితి లో లేక పోవడమే రోగము. ఇంతకూ సహజ స్థితి అంటే ఏమిటి?  ఆనందము లేదా సంతోషము. ఏ రోగ్యమూ లేని వాడు అటువంటి స్థితి లో ఉంటాడు. ఏ దేహ భాగము లోనేయినా బాధను అనుభవిస్తున్న వాడు, సంతోషముగా ఉందా లేదు. ఏ పనినీ చేయ లేడు .

              భారతీయ సాంప్రదాయములో మనిషి దేహములో వాతము, పిత్తము, కఫము అనే మూడు లక్షణములు ఉండేటట్లు, వీటిలో తేడాలు వచ్చిన వారికి ఆ యా దోషము వచ్చినట్లు చెప్పేవారు. ఏ లక్షణము అయినా ఉండ  వలసిన దాని కంటే తేడాగా ఉన్నపుడు రోగ్యమున్నట్లుగా భావించే వారు. మణి కట్టు దగ్గిర నాడీని పట్టుకొని  పరీక్ష చేసే వారు. సామాన్య వ్యాధులకు మూలికలు, చూర్ణాలు,  లెహ్యాలు  లాటి వాటిని మందుగా వాడే వారు. వ్యాధి తీవ్రతను బట్టి  పాద రసము, వెండి, బంగారము లాంటి లోహాలను  రస భస్మములు  లేదా   మందులను తయారు చేసి రోగి రోగానికి అనుగుణముగా వాడే వారు.  ధన్వంతరి, వాగ్భటుడు, అగ్ని వేశుడు  మున్నగు వారితో బాటు రసాయన  విద్యలో నిష్ణాతుడయిన నాగార్జునుడు ప్రముఖ ఆయుర్వేద వైద్యులలో కొందరు.

                   ఈ వైద్య విధానాలలో  ఎక్కడా వ్యాధి  సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చునట్లు  చెప్పబడ  లేదు. అంతే  గాక ప్రయవరణము మీద ప్రభావము చూపించే  రసాయనాలు ఎక్కడా వాడి  నట్లు లేదు.

                    ఈ పద్ధతులను అలవాటు చేసుకోని  ఐరోపా  దేశాలలో  లూయీస్  పాశ్చర్   పేరు గల వ్యక్తి  మలేరియా , కలరా లాంటి  వ్యాధులకు సూక్ష్మ క్రిములే  కారణమని సిద్ధాంతీకరించి  అందుకు తగ్గ క్రిమి నిరోధకాల వాడుక ద్వారా  ఈ రోగాలను నీయంత్రించ  వచ్చునని సిద్ధాంతీ కరించినాడు . అయితే పాశ్చర్ యొక్క  సమ కాలీనుడయిన  బే చాంప్  ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ  క్రిముల వలన వ్యాధి  రాదని, వ్యాధి వచ్చిన దేహ భాగాలలో  ఈ క్రిములు చెరతాయని సిద్ధాంతీ కరించినాడు. ఆ నాటి శాస్తరజనులు  బే చాంప్  ప్రతిపాదనను అంగీకరించ లేదు. ఈ విధముగా  సూక్ష్మ క్రిమి నిరోధకాలు లేదా  యాంటీ బయోటిక్స్  ఉపయోగము పెరిగింది. ఇది ఎటువంటి సమస్యలకు దారి  తీసిందొ  చెప్పనవసరము  లేదు.

                    ఈ సందర్భములో  సంస్కృత భాగవత శ్లోకాలు  గుర్తుకు వస్తాయి.

          ఆమయో  యశ్చ  భూతానాం  జాయతో యేన సువ్రత

          తదేవ  తదేవ హ్యా మయో  ద్రవ్యః    సః పునాటి చికిత్స తమ్ .|

          ఏవం  నృ ణాం  క్రియా యో గాః  సర్వే సం సృతి  హేత వః

            ఏవాత్మ  వినాశాయ  క ల్ప న్తె కల్పితాః  పరే ||

         ఏ పదార్థము వలన జీవులకు వ్యాధి కలుగుతుందో  అదే ద్రవ్యము (కొద్ది మార్పులతో) చికిత్సను అందిస్తుంది. ఇదే విధముగా మనము చేసుకున్న కర్మలు బంధాలకు దారి తీస్తాయి.  భాగవత్సమర్పణ  వలన  ఈ కరమలే మన విడుదలకు తోడ్పడుతాయి. ఇందులో మొదటి మాటను మనకు బాగుగా తెలిసిన విషయముగా అంగీకరించి  వేదాంత సూత్రీ కరణను  చేసినారు.

             ఇందులో మొదటి మాటనే  సిమిలా సిమిలర్  క్యూ రాటర్  గ్రీకు గ్రంథాలలో చెప్పబడినది. ఈ సూత్రమునే శామ్యూల్  హానే మాన్  విస్తృతముగా పరిశోధనలు  చేసి, హోమియో పతి  వైద్య విధానాన్ని అందించినారు.  ఆయన వ్రాసిన మూల సూత్రముల సంపుటి ఆర్గనాన్ లో నొక సూత్రము వైద్యము చేయ వలసినది రోగానికి కాదు, రోగికి.

              ఆయుర్వేదము, హోమియోపతిలలో రోగికి ప్రాధాన్యము నిస్తే ఆలోపతి లో రోగానికి ప్రాధాన్యతని ఇచ్చి,సూక్ష్మ క్రిమి హంతకులకు ప్రాధాన్యతను యిచ్చినారు. ఇంతకంటే లోతుగా వెళ్లడము మంచిది కాదు.