ఆ సంవత్సరము 1977. నా
జీవితములో పెను మార్పులు మొదలయిన సంవత్సరము. ఒక
వర్క్ షాప్ లో పాల్గొంటున్నాను. ఆ సమయములో ఒక రోజు నాకు ఉష్ణోగ్రత వచ్చి
లెవ లేక పోయినాను. నా స్నేహితులు నన్ను వైద్య శాలలో చేర్పించినారు. అక్కడ కారణము
నాకు తెలియదు కానీ, నగరములో యున్న అన్ని వ్యాధులకు సంబంధించిన మందులు అన్నీ
వాడినారు. నాల్గు రోజులకు నా జ్వరము తగ్గింది . కానీ హాస్టల్ లో నా రెండవ
అంతస్తులో నున్న గదికి వెళ్ళుటకు శక్తి చాల లేదు. అప్పటినుండీ నేనొక నిర్ణయానికి
వచ్చినాను. ఆధునిక/అలోపతీ మందులను వాడకూడదని. ఇప్పటి వరకు (నలువది సంవత్సరాలుగా)
నేను ఆ నియమాన్ని పాటిస్తున్నాను.
1997
లో నా మోకాళ్ళు
పట్టి వేసినాయి. కూర్చుంటే నిలబడ లేను. అటువంటి స్థితిలో నన్ను నా స్నేహితులు చాలా భయ పెట్టినారు. 15రోజులలో నేను
మామూలు స్థితికి వస్తానని చేపినాను. అలాగే జరిగింది. అప్పుడు నేను అలోపతి/ఆయుర్వేదము
మాత్రలు వాడ లేదు.
2001
సంవత్సరములో నాకు చత్వారము వచ్చినది. చదవడానికి చాలా కష్ట
పడుతున్నాను. నా స్నేహితుల బలవంతము మీద కంటి వైద్యుడి దగ్గిరకు వెళ్ళినాను. అన్ని
పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చినారు. వాటిని వాడడము మొదలు పెట్టిన తరువాత చూపు బాగుంది, కానీ తలలో నదురుగా ఏదో నొప్పిగా
ఉంటున్నది. కళ్ళద్దాలు వాడే నా మిత్రులు
మొదట్లో అలాగే ఉంటుందన్నారు. అంతే కాక
కళ్ళద్దాలు వాడక ముందు నేను చదవ గలిగిన అక్షరాలను ఇప్పుడు అవి లేకుండా నేను చదవ లేక పోతున్నాను. అంటే నా కళ్ళ
సున్నితత్వము కూడా తగ్గుతున్నది. అప్పుడే Better Eyesight Without Glasses పుస్తకాన్ని
తెప్పించుకున్నాను. అందులో ఈ నాడు మనము చేస్తున్న పొరపాటు కళ్ళద్దాలను వాడటమే అని వివరించినారు.
నాకు అంతా సమస్య గానే
ఉండినది. అందుకని కళ్ళద్దాలను పక్కన పడి వేసినాను. ఆరు నెలల పైన పుస్తకాలను చదువుట
మాని వేసినాను.యోగ, ప్రాణ విద్య, రేకి లాటి వన్నీ కళ్ళ విషయములో వాడటము మొదలు
పెట్టినాను. సంవత్సరము లోపల నా దృష్టి లో మార్పు వచ్చింది. ఆ తరువాత అన్నీ
కళ్ళద్దాలు లేకుండా చదవ గలిగినాను.
నా అనుభవాల కారణముగా నాకు
ఆయుర్వేదము, హోమియోపతి, యోగ, ప్రాణవిద్య, రేకి లాంటి వాటిని ఎక్కువ విశ్వసించినాను.
ఏ సమస్యకూ వెంటనే
పరిష్కారము లభించదు. లేదా లభించిన పరిష్కారము తాత్కాలికమే. వ్యాధి
లక్షణాలకు వైద్యము చేస్తే సరి పోదు. హోమియోపతి సూత్ర గ్రంథము ఆర్గనాన్ ను
అనుసరించి, వైద్యము చేయ వలసినది రోగానికి కాదు, రోగికి. అందుకు రోగము యొక్క లక్షణములు ఉపయోగ పడుతాయి.
ఇంకా ఆయుర్వేదాన్ని అనుసరిస్తే మరో మెట్టు ఎక్క వలసి వస్తుంది. ఆయుర్వేదము స్వస్థ
వృత్తముతో మొదలవుతుంది. తనలో తను ఉంటే స్వస్థత తో ఉన్నారని అంటారు. అంటే మనస్సు
నియంత్రణ లో ఉండటము. ఈ విధముగా ప్రతి రోగానికి మనస్సు మూలము అని తెలుస్తుంది. అలోపతి
వైద్యము ఈ నాటి వరకు ఈ విషయాన్ని గుర్తించే స్థితికి ఎదగ లేదు. ఇందులో రోగము
రావడానికి మన చుట్టూ ప్రకృతిలో యున్న
సూక్ష్మ జీవులే కారణమని ప్రతిపాదించి, అందరి చేత అంగీకరింప చేసి, ఆ సూక్ష్మ
జీవులను నాశనము చేయుట అన్ని రకాల విష పదార్థాలన్ ఉపయోగించుట మొదలు పెట్టినారు.
వాతావరణములో పెద్ద మార్పులకు కారణ మయినాడు.
ఈ సందర్భములో ఇద్దరు వైద్య పరిశోధకులను గురించి
ప్రస్తావించ వలసి యుంది. ఇద్దరూ ఫ్రాన్స్ దేశము వారే. అందులో మొదటి వాడు సూక్ష్మ జీవుల ప్రభావము
గురించి ప్రస్తావించిన లూయిస్ పాశ్చర్. ఆ
సిద్ధాంతాన్ని అనుసరించి, మన వ్యాధులకు కారణము మన మీద దాడి చేసిన సూక్ష్మ క్రిములు. వాటినుండి మనలను
రక్షించుకోవాలి. ప్రతి వ్యాధికి
ప్రత్యేకమయిన సూక్ష్మ క్రిములు కారణము. వీటి కారణముగా వ్యాధి ఎవరికయినా రావచ్చును.
రెండవ వాడు పాశ్చర్ కు సమ
కాలీనుదయినా బెచాంప్. ఈయన సిద్ధాంతము
పూర్తిగా వ్యతిరేకముగా ఉంటుంది. దీనిని అనుసరించి మన దేహములోనున్న సూక్ష్మ
క్రిములు మన దేహములో జరిగే చర్యలకు తోడ్పడుతాయి. రోగానికి కారణము మనలో ఏర్పడిన
అనారోగ్య పరిస్థితులు. సూక్ష్మ క్రిములు రోగానికి కారణమని బెచాంప్ ఎప్పుడూ
అంగీకరించ లేదు.
కానీ పాశ్చర్ యొక్క సిద్ధాంతము
ఎక్కువ మంది చేత అంగీకరించ బడినది. మనకు వస్తున్న వ్యాదులన్నిటికీ సూక్ష్మ
క్రిములే కారణమని నమ్మి, వాటినుండి రక్షణ కొరకు విష పదార్థములను మందుల రూపములో
మింగుటకు అలవాటు చేసినారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలన్నీ దీనినే అంగీకరించినాయి. విశ్వ
వ్యాప్తముగా ఈ వైద్యము అంగీకరించ బడినది. వేర్వేరు రోగాలకు వేర్వేరు మందులు తయారు
చేయ బడినవి.
ఈ విధముగా వైద్య శాలలు, వైద్యులు,.........ఎన్నో
వచ్చినవి. వచ్చిన ఫలితాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఈ విధముగా ప్రకటించింది. 1999లో వంద సంవత్సరాల అలోపతి వైద్యము కొనసాగించిన తరువాత “ప్రపంచములో
అంటు రోగాలు పిల్లలను, యువకులను మింగి వేస్తున్నవి. సంవత్సరానికి 1.3 కోట్ల సంఖ్యకు చావులు చేరినవి.” అంతే కాదు, ఉన్న
మందులు సూక్ష్మ జీవుల మీద పని చేయని స్థితి వచ్చింది. వాటి మీద యుద్ధము కొన సాగుతూనే ఉంది. కొత్త రోగాల ఒత్తిడి పెరుగుతూనే
ఉంది.”
“గత రెండు
దశాబ్దాలుగా ముప్పయి వ్యాధులు కొత్తగా
వచ్చినాయి. పాత రోగాలు ప్లేగు,
డిఫ్తీరియా,ఎల్లో జ్వరము, డెంగీ, మేనిన్జిటిస్ లాంటి పాత రోగాల్ బల పడినాయి.”
ఇక్కడే బెచాంప్ మాటలన
గుర్తుంచుకోవాలి. “ఈ సూక్ష్మ క్రిములు మన శత్రువులు కాదు. మనలో చేరిన మురికిని
తిని అవి బ్రదుకుతాయి. అందు వలన మనకు వాటి వలన మేలే జరుగుతుంది.” “మనకు రోగాలు
అనారోగ్య పరిస్థితుల వలన వస్తాయి. సూక్ష్మ క్రిముల వలన కాదు.”
ఇంకా చాలా మంది
ఒప్పుకుంటున్నారు.”ఆరోగ్యవంత మయిన దేహాలలో కూడా సూక్ష్మ క్రిములున్నాయి. వాటి వలన
ఎటువంటి హానీ జరుగదు. కానీ వాడిన మందుల వలన అవి కూడా నశిస్తున్నాయి.”
“ఇంక ఇతర వైద్య శాఖలను
గురించి తెలుసుకుందాము. ఆయుర్వేదము ప్రకారము మన దేహములో వాత, పిత్త, కఫములనబడు
మూడు తత్వాలున్నాయి. అవి సమముగా లేనపుడే వ్యాధులు వస్తున్నాయి. వాటికి సమత్వాన్ని
ఏర్పరిస్తే వ్యాధి మాయమవుతుంది. ఇంకా హోమియోపతిలో ఇదే విధముగా సోరా, సిఫిలిస్,
సైకోసిస్ తత్వాల వలన వ్యాధులు వస్తాయి. యోగ శాస్త్రము లో
మనలో నున్న చక్రాలలో శక్తి క్షీణత వలన రోగాలు వస్తాయి. ఇవి అన్నీ విజయాన్ని సాధించినవే. ఇవేవీ సూక్ష్మ
క్రిములను గురించి మాట్లాడవు.
ప్రకృతిలో ప్రతి జీవి
భగవంతుడి స్వరూపమే. అందుకే సూక్ష్మ జీవుల వలన మనకు ఎటువంటి వ్యాధి రాదు. వ్యాధికి
కారణము మనలో ఏర్పడిన అనారోగ్య పరిస్థితులే.
మరొక విషయము.
ఆరోగ్యవంతుడి మందు ఆహారము. అనారోగ్యవంతుడి
ఆహారము మందు.
డాక్టర్ ఫ్రెంకేల్
చెబుతాడు.” నాజీల నిర్బంధము లో నుండి బయట పడిన వాళ్ళలో ఎక్కువ మంది నిర్దిష్టమయిన
జీవితలక్ష్యమున్న వారే. అది యున్న వారిని ఎటువంటి పరిస్థితులు హాని చేయ లేవు.”
మసనోబు ఫుకువోకా తన పొలాలను
దున్న లేదు. ఎరువులను వాడ లేదు. పురుగు మందులను చల్ల లేదు. కలుపు మొక్కలను తీయ
లేదు. ప్రకృతిని పూర్తిగా అనుసరించి
ఆధునిక వ్యవసాయ పద్ధతులలో అందుకొనే పద్ధతులలో ఫలితాలను అందుకున్నాడు.
అందుకే మన అనారోగ్యానికి
కారణము మన మనసు మీద ఉన్న ఒత్తిడి, మనము చూపే ప్రేమ వలన .......ఏ సూక్ష్మ జీవులు మనకు
హాన చేయ లేవు.
ఆ సూక్ష్మ జీవుల పేరు
చెప్పి, ఫాక్టరీల ద్వారా పొలాల ద్వారా భూమిని విష పదార్థాలతో నింపకండి. భూమిని
కాపాడండి.
*****************************క్ష్***********************