Thursday, November 21, 2019

విత్తనము



భూమి మీద ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. అందుకే ప్రతి జీవిని దైవము యొక్క ప్రతిరూపముగా భావించాలని భారతీయ ఆధ్యాత్మికత చెబుతుంది.ఆచరణ అనేది తరువాత సంగతి.

మరి కొన్ని మత సాంప్రదాయాలు  భగవంతుడు అన్నిటిని సృజించి వాటి పై మానవుడికి అధికారము ఇచ్చినాదని (అంటే పరోక్షముగా మానవుడి వలన వాటికి  బాధ కలిగినా తప్పు కాదని అర్థము వచ్చేటట్లు) చెబుతారు. ఇందులో నిజానిజాలు నాకు తెలియవు.

ఈ నాడు మానవుడి ద్వారా వృక్ష జాతికి వచ్చిన ముప్పు సామాన్యమయినది కాదు. ఇది వేర్వేరు దశలలో జరిగింది.

తన కలప కోసము బ్రహ్మాండమయిన వృక్షాలను నరికి వేసినాడు. వాటి స్థానములో తిరిగి వృక్షాలను పెంచాలన్న విషయాన్ని మరచి పియినాడు. అందుకే పచ్చని ప్రదేశాలు ఎడారులుగా మారినాయి.

బ్రహ్మాండమయిన  వృక్షాలను తన కోసము, తన ప్రజ్ఞను చూపించుట కొరకు  మరుగుజ్జు వృక్షాలుగా (బోన్సాయ్) మార్చి పెంచుతున్నాడు. అది తన ప్రజ్ఞకు తార్కాణముగా భావించినాడు. ఆరడుగుల మనుషుల మధ్య మూడడుగుల మరుగుజ్జు యువకుడుంటే  అతడి మనస్సు ఎలా ఉంటుందో ఆలోచించండి.

ముఖ్యమయిన పండుగలు లేదా కలయికలలో మొక్కలను వేర్వేరు డిజైన్లు గా కత్తిరించి తమ ప్రతిభగా చూపించుకున్నా అందులో జరిగిన హింస కనిపించదేమో?

చెట్ల ఎదుగుదలకు వాటి ఏర్పాట్లు వాటికున్నాయి. అందమయిన పూలను, రుచికరమయిన పండ్లను ఇస్తాయి కాబట్టి వాటిని మనమే పెంచి పోషిస్తాము. ఇంకా అడవులలో వాటి పండ్లను తిన్న పక్షులు, జంతువులూ వాటి విత్తనాలను వేరే చోట పడేస్తాయి. అందుకే వృక్ష జాతి విస్తరిస్తుంది. మరి కొన్ని విత్తనాలు నీటి ద్వారా లేదా గాలి ద్వారా వేర్వేరు చోట్లకు విస్తరిస్తాయి. వాటికి సహకరించే కీటకాలకు రక్షణ ఉంటుంది. అని కలిగించే వాటిని పక్షులు భక్షిస్తాయి. ఈ పనులు సహజముగా జరుగుతాయి. కొన్ని తృణ ధాన్యాలు, కూరగాయలు ఆహారము కొరకు మానవుడు పందిస్తున్నాడు.

ఒకప్పుడు ప్రాచ్య/తూర్పు దేశాలు మార్గ దర్శకము చేసే స్థితిలో ఉన్నాయి  వారి ఆలోచనలో సంపద అంటే డబ్బు కాదు. కొన్ని ప్రాచ్య జాతులు ఆవుల  మందను సంపదగా భావించినారు. ధనమగ్నిః, ధనం వాయుః ధనం భూతాని  పంచచ అని వేదము చెబుతుంది. అంటే  పృధ్వీ/నెల , నీరు ,అగ్ని, వాయువు, ఆకాసము ఈ ఐదింటిని పంచ భూతాలని అంటారు. ఇందులో నేల మన స్థితిని చెబుతుంది. నీరు మన లో ద్రవాలను గురించి చెబుతుంది, అగ్ని వాయువు గురించి చెప్పనవసరము లేదు. ఆకాశము మన ఆలోచనలను నదిపీస్తున్నది. ప్రతి విషయములో దోషము లేకుండా చూడ వలసిన భాద్యత మనదే. ఇవి స్వచ్చముగా ఉంటే మన దేశము స్వచ్చ భారతము అవుతుంది.

మ్లేచ్చుల, పాశ్చాత్యుల ప్రభావము పెరిగిన తరువాత  ఆనందము కంటే సుఖ భోగాల మీద దృష్టి పెరిగి ప్రకృతి సంపద కంటే భౌతిక సుఖాల మీద దృష్టి పెరిగింది. దీని ప్రభావముతో మనము మన వసతి కోసము సృష్టించుకొన్న డబ్బు మీద దృష్టి పడింది. ఇటీవలే ఒకరన్నారు.”మనకు ఉన్న జబ్బంతా డబ్బే అని.  మనకు డబ్బు తక్కువయితే ఒక సమస్య. ఎక్కువయితే అంతకంటే పెద్ద సమస్యలు వచ్చి జీవితాన్ని అతలాకుతలము చేస్తాయి.

మణికట్టు పట్టుకొని రోగ నిర్ధారణ చేసే వైద్యులు పోయినారు. ఇంకా స్టెతస్కోప్ కూడా వాడటము చేతకాని వైద్యులు తయారయినారు. వారికి స్టెతస్కోప్ అలంకార ప్రాయముంది. రోగిని చూచి రోగ నిర్ధారణ చేసే శక్తి వైద్యులకు పోయింది. యంత్రాలు చెబితేనే రోగమున్నదని అంటాడు. తిరిగి యంత్రాలు చెబితేనే రోగము తగ్గిందంటాడు. ఆ యంత్రాలకు పెట్టే ఖర్చు రోగి భరించాల్సిందే. ఈ వృత్తిని మరింత స్వచ్చందముగా కార్పొరేట్ వైద్య శాలలు స్వీకరించాయి. రోగి విద్యాలయానికి వెళితే  ఎంత అప్పుతో తిరిగి వస్తాడో తెలియని పరిస్థితి ఇటీవల వార్తలలో ఒక మధ్య తరగతి పౌరుడికి వైద్యము పెను భారము అయిందని వ్రాసినారు.

వైద్యము తరువాత కార్పొరేట్ సంస్థల దృష్టి వ్యవసాయము మీద పడింది. మన  దేశపు రైతులలో స్వయం నిర్ణయము స్వయం పోషకత్వం ఉండేది. ఏ  నాడూ రైతు విత్తనము కొనే వాడు కాదు. ముందు పండిన పంటలో కొంత భాగాన్ని విత్తనాల కొరకు నిలువ ఉంచే వాడు. అందుకని విత్తనాలలో ప్రకృతి సహజమయిన  పరిణామముండేది. ఆ రోజుల్లో కావలసినంత పశు సంపద ఉండేది. వాటికి కొఠ్ఠాలు ఉండేవి. అక్కడ గడ్డి పరచి ఉంచే వారు. పగలంతా పొలాల్లో పచ్చిక బయళ్ళలో తిరిగిన ఆవులు రాత్రి పూట ఆ కొఠ్ఠాలలో విశ్రమించేవి. వాటి మల మూత్రాలతో తడిసిన గడ్డి మంచి ఎరువయ్యేది.

ప్రతి గ్రామానికి ఏదో ఒక చెరువుతో సంబంధముండేది. కావలసిన పొలాలకు ఏటా తామే కాలువలు త్రవ్వు కొనే  వారు. ఖర్చును సమిష్టిగా భరించే వారు. విత్తనాలను చల్లే ముందు పొలాలలో జనుము వెంపల విత్తనాలను చల్లి అవి ఎదిగిన తరువాత వాటితో కలిపి పొలాన్ని దున్నేసే వారు. ఈ విధముగా నేలకు సారమును పెంచి ఆ పొలాలను నారు మళ్ళుగా వాడే వారు. పంట కోతకు వచ్చే ముందు పెసలు లేదా మినుముల బస్తాలలో ఉంచి నాన బెట్టి మోము వచ్చిన తరువాత పొలములో చాల్లే వారు. ఇవి రెండవ పంటగా వచ్చేవి. ఈ విధముగా వ్యవసాయము చేసినపుడు  ఏనాడూ పురుగుల వలన పంట నాశనమయేది కాదు. ఇది చిన్నప్పుడు నేను చూచిన యథార్థము. ఏనాడూ విత్తనాలకు పురుగు మందులకు ఖర్చు పెట్టనందు వలన పండిన పంట అంతా రైతుదే. ఎప్పుడైనా ప్రకృతి విలయము సంభవించినా రైతు సులభముగా కోలుకోన గలిగే వాడు. రైతు చాలా ఆనందంగా ఉండ గలిగే వాడు. సంక్రాంతికి బియ్యపు బస్తా వాకిట్లో పెట్టుకొని వరుసగా వచ్చే జనానికి బియ్యము పంచె వారు.  ఇంకా వాకిట్లో ధాన్యపు కంకులు కట్టి పిచుకలు తింటూంటే ఆనందముగా చూచే వారు.

అపుడే రైతు జీవితములో పెను ముసలము ప్రవేశించింది. పంటలు ఎక్కువ పండుతాయని  సహజముగా యున్న మొలగొలకులు (వీటినే రాజనాలు అంటారు) తెల్లకేసర్లు, ఎర్ర కేసర్లు  కు బదులుగా కొత్తగా జిబి 24,          ఐ ఆర్ 8 మున్నగు పంటలను ప్రచారము చేసి ప్రభుత్వమూ ప్రవేశ పెట్టించింది. అంతే కాక ఇవి తక్కువ కాలము పంటలని వసతి ఉంటే రెండో పంట వేసుకోవచ్చని చెప్పించింది. కొత్త సమస్యలు మొదలయినాయి. ఈ పంటలసు కీటకాలు కమ్మగా చప్పరించి వేస్తున్నాయి. వాటిని నిర్మూలించుటకు కీటక నాశినిని వాడ వలసిందే. ఇంత వరకు నేల సారము గురించ రైతుకు పట్టించుకోవలసిన అవసరము రాలేదు. ఈ పంటలతో నేల యొక్క సారము భయంకరముగా పడి పోతున్నది. అందుకోసము రసాయనిక ఎరువులు సల్ఫేటులు, ఫాస్ఫేటులు లాటివి విరివిగా వాడవలసి వచ్చింది. రైతుకు ఆదాయము పెరిగింది, ఖర్చుకూడా పెరిగింది. రైతుకు అప్పులు చేయ వలసిన పరిస్ఠితులు ఏర్పడినాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ కీటకముల శక్తి పెరిగి శక్తివంతమయిన విష పదార్థాలు ఎక్కువ సార్లు కూడా పిచికారి చేయ వలసి వచ్చింది. దీనితో మధ్య తరగతి రైతు మరింత క్రుంగి పోయినాడు.

ఆశ రేపింది ప్రభుత్వ ప్రచారకులు. అలవాటు పడింది రైతులు. లాభాలు పెంచుకొన్నది ఎరువులు, పురుగు మందుల పరిశ్రమలు.

మరో ప్రమాదకరమయిన పరిస్థితి ఏమిటంటే రైతుకు క్రమనుగా విత్తనాల మీద అధికారము పోయింది. పండిన ధాన్యము విత్తనాలకు పనికి రావు. వీటినే టెర్మినేటర్ర్ విత్తనాలని అన్నారు. ఈ విధముగా రైతు ప్రకృతికి దూరముగా  అద్దములో కనిపించే డబ్బు వైపు ఆశగా చూస్తూ ఉండి పోయినాడు. అన్నీ ఇంట్లోనే సమకూర్చుకో గలిగిన వ్యక్తీ బజారున పడ్డాడు.

ఇంకా రోగ నిరోధక శక్తి పెంచాలని విత్తనాలకు సంబంధించిన మూల కణాల మీద ప్రయోగాలు చేసినారు. ఉదాహరణకు వంకాయ మూల కణములో  తేలు విషానికి సంబంధించిన రసాయనాన్ని కలిపారు. దీని వలన కీటకముల దాడి తగ్గ వచ్చును. కానీ తిన్న వారికి వెంటనే కాక పోయినా కాల క్రమేణా కొత్త  రోగాలు రావని ఎటువంటి  హామీ ఇవ్వ లేరు.  నేను చిన్నప్పుడు ఒక ఆవు  హైబ్రిడ్ జొన్న పంట తిని  చని పోయి ఉండడము చూచినాను. అదేమంటే ఆ జొన్న ఆకులలో సయనైడ్డ్దే ఏర్పడిందిట. ఇటీవలే విజయ వాడలో ఒక గోశాలలో గడ్డి తిని 80 ఆవులు చచ్చి పోయినాయని విన్నాము  ఆ గడ్డి ఏ జెనటిక్ ప్రయోగాలలో వచ్చిందో? ఇలా తయారయిన  హైబ్రిడ్ విత్తనాల ప్రభావము గురించి పూర్తిగా  తెలియదు.

ఒక పర్యావరణ వేత్త అంటాడు.”ఇలా వచ్చిన ధాన్యాన్ని తినగా వచ్చిన జబ్బులకు మందులు కూడా అవే కంపెనీలు తయారు చేస్తున్నాయని.” ఇంకో మాట కూడా ఉంది. తమ పొలములో పండిన పంటను ఎ రైతూ తినడట. ఎందుకంటే తను విష పదార్హాలు ఎన్ని చల్లినాడో తెలుసు కాబట్టి. పక్క వాడు ఎంత చల్లాదో తనకు తెలియదు కాబట్టి.
ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా మందికి నచ్చవు. మానవ జాతి పరిణామములో ప్రతి జీవికి సమున్నత స్థానముంది. విత్తనాలకు జెనెటిక్ కోడె మార్చినందు వలన దాని ఉనికికి ప్రమాదము ఏర్పడింది. ఈ సెంటిమెంట్  ఏమిటి అంటారేమో? పాశ్చాత్య సంస్కృతీ ప్రభావము లాగే అనిపిస్తుంది. మొక్కల దగ్గిర రోజూ కొద్ది సేపు కూర్చొని వాటికి మన ఆలోచనను అందిస్తే అవి స్పందిస్తాయని కొంత మంది తెలుసు.ఆలోచనలతో మొక్కలను ప్రభావితము చేసిన వాళ్ళు ఎందఱో ఉన్నారు. అందులో పరమ హంస యోగానంద శిష్యుడు ఒకరు.లూథర్ బర్బంక్ తన ఆలోచనల ప్రభావముతో రోజా ముళ్ళు లేకుండా పూచేటట్లు చేసినాడు. అతడిని న అనుసరించి అటువంటి ప్రయోగాలు చాలా మంది విజయవంతముగా చేసినారు. ఈ నాడు వ్యాపార మనస్తత్వముతో కొంత మంది మన జీవితాలతో బాటు ఇతర జీవ రాశులను కూడా హిమ్సిస్తున్నాడు.

(వృక్షాలపై జరిగిన ప్రయోగాలను ఇంకో చోట వ్రాయ వలసి ఉంది.)
**************************************************************





No comments:

Post a Comment