Sunday, September 25, 2022

వ్యాధి

 

                                       

         వ్యాధి  అంటే  అలవాటు భాషలో  ‘” రోగము” గా పిలువ బడుతుంది. రోగము మనిషి కి కాక మొక్కకు  కు వస్తుందా ? అనేది ప్రశ్న. ఈ ప్రశ్నను కొందరు వేస్తారు. అయితే రోగము వచ్చి చచ్చి పోయే  మొక్కలను కోవస్తూనే ఉన్నాము. అత్యంత ప్రాచీన కాలము నుండి రోగ్యములను  కొని ఏకచ్చి పెట్టు కొనే  వారిని చూస్తూనే ఉన్నాము.

              ఇంతకూ  రోగము/వ్యాధి అంటే  ఏమిటి? మనిషి తన సహజ స్థితి లో లేక పోవడమే రోగము. ఇంతకూ సహజ స్థితి అంటే ఏమిటి?  ఆనందము లేదా సంతోషము. ఏ రోగ్యమూ లేని వాడు అటువంటి స్థితి లో ఉంటాడు. ఏ దేహ భాగము లోనేయినా బాధను అనుభవిస్తున్న వాడు, సంతోషముగా ఉందా లేదు. ఏ పనినీ చేయ లేడు .

              భారతీయ సాంప్రదాయములో మనిషి దేహములో వాతము, పిత్తము, కఫము అనే మూడు లక్షణములు ఉండేటట్లు, వీటిలో తేడాలు వచ్చిన వారికి ఆ యా దోషము వచ్చినట్లు చెప్పేవారు. ఏ లక్షణము అయినా ఉండ  వలసిన దాని కంటే తేడాగా ఉన్నపుడు రోగ్యమున్నట్లుగా భావించే వారు. మణి కట్టు దగ్గిర నాడీని పట్టుకొని  పరీక్ష చేసే వారు. సామాన్య వ్యాధులకు మూలికలు, చూర్ణాలు,  లెహ్యాలు  లాటి వాటిని మందుగా వాడే వారు. వ్యాధి తీవ్రతను బట్టి  పాద రసము, వెండి, బంగారము లాంటి లోహాలను  రస భస్మములు  లేదా   మందులను తయారు చేసి రోగి రోగానికి అనుగుణముగా వాడే వారు.  ధన్వంతరి, వాగ్భటుడు, అగ్ని వేశుడు  మున్నగు వారితో బాటు రసాయన  విద్యలో నిష్ణాతుడయిన నాగార్జునుడు ప్రముఖ ఆయుర్వేద వైద్యులలో కొందరు.

                   ఈ వైద్య విధానాలలో  ఎక్కడా వ్యాధి  సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చునట్లు  చెప్పబడ  లేదు. అంతే  గాక ప్రయవరణము మీద ప్రభావము చూపించే  రసాయనాలు ఎక్కడా వాడి  నట్లు లేదు.

                    ఈ పద్ధతులను అలవాటు చేసుకోని  ఐరోపా  దేశాలలో  లూయీస్  పాశ్చర్   పేరు గల వ్యక్తి  మలేరియా , కలరా లాంటి  వ్యాధులకు సూక్ష్మ క్రిములే  కారణమని సిద్ధాంతీకరించి  అందుకు తగ్గ క్రిమి నిరోధకాల వాడుక ద్వారా  ఈ రోగాలను నీయంత్రించ  వచ్చునని సిద్ధాంతీ కరించినాడు . అయితే పాశ్చర్ యొక్క  సమ కాలీనుడయిన  బే చాంప్  ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ  క్రిముల వలన వ్యాధి  రాదని, వ్యాధి వచ్చిన దేహ భాగాలలో  ఈ క్రిములు చెరతాయని సిద్ధాంతీ కరించినాడు. ఆ నాటి శాస్తరజనులు  బే చాంప్  ప్రతిపాదనను అంగీకరించ లేదు. ఈ విధముగా  సూక్ష్మ క్రిమి నిరోధకాలు లేదా  యాంటీ బయోటిక్స్  ఉపయోగము పెరిగింది. ఇది ఎటువంటి సమస్యలకు దారి  తీసిందొ  చెప్పనవసరము  లేదు.

                    ఈ సందర్భములో  సంస్కృత భాగవత శ్లోకాలు  గుర్తుకు వస్తాయి.

          ఆమయో  యశ్చ  భూతానాం  జాయతో యేన సువ్రత

          తదేవ  తదేవ హ్యా మయో  ద్రవ్యః    సః పునాటి చికిత్స తమ్ .|

          ఏవం  నృ ణాం  క్రియా యో గాః  సర్వే సం సృతి  హేత వః

            ఏవాత్మ  వినాశాయ  క ల్ప న్తె కల్పితాః  పరే ||

         ఏ పదార్థము వలన జీవులకు వ్యాధి కలుగుతుందో  అదే ద్రవ్యము (కొద్ది మార్పులతో) చికిత్సను అందిస్తుంది. ఇదే విధముగా మనము చేసుకున్న కర్మలు బంధాలకు దారి తీస్తాయి.  భాగవత్సమర్పణ  వలన  ఈ కరమలే మన విడుదలకు తోడ్పడుతాయి. ఇందులో మొదటి మాటను మనకు బాగుగా తెలిసిన విషయముగా అంగీకరించి  వేదాంత సూత్రీ కరణను  చేసినారు.

             ఇందులో మొదటి మాటనే  సిమిలా సిమిలర్  క్యూ రాటర్  గ్రీకు గ్రంథాలలో చెప్పబడినది. ఈ సూత్రమునే శామ్యూల్  హానే మాన్  విస్తృతముగా పరిశోధనలు  చేసి, హోమియో పతి  వైద్య విధానాన్ని అందించినారు.  ఆయన వ్రాసిన మూల సూత్రముల సంపుటి ఆర్గనాన్ లో నొక సూత్రము వైద్యము చేయ వలసినది రోగానికి కాదు, రోగికి.

              ఆయుర్వేదము, హోమియోపతిలలో రోగికి ప్రాధాన్యము నిస్తే ఆలోపతి లో రోగానికి ప్రాధాన్యతని ఇచ్చి,సూక్ష్మ క్రిమి హంతకులకు ప్రాధాన్యతను యిచ్చినారు. ఇంతకంటే లోతుగా వెళ్లడము మంచిది కాదు.

 

Wednesday, August 24, 2022

సంస్కారము

 


జ్ఞానము రెండు రకాలుగా వస్తుంది. మొదటిది పరంపరాను గతముగా లేదా శిక్షణ ద్వారా వస్తే  రెండవది పరిశీలన ద్వారా వస్తుంది.

ఒక కథ ఉంది. ఒక ఏరు చాలా వేగముగా ప్రవహిస్తున్నాది. నీటిలో అర్ఘ్యము వదులుతున్న ఒక యోగి నీటిలో కొట్టుకొని పోతున్న ఒక తేలును చూచి, దాన్ని ఎత్తి గట్టున పడేద్దామని అనుకున్నాడు. చేతితో ఎత్తి  దాన్ని గట్టు మీద పడ వేయ పోతూ అది తనను కుట్టగానే వదిలి వేసినాడు. మళ్ళీ దానిని తీసి అది తిరిగి కుట్టినా జాగ్రత్తగా గట్టు మీదికి విసిరి వేసినాడు.

ప్రక్కనే యున్న ఒక కుర్రాడు,”స్వామీ! అది మిమ్ములను కుట్టుతున్నా కూడా దానిని  రక్షించాలని  ఎందుకు అనుకున్నారు?”,అని అడిగినాడు. అందుకు ఆ యోగి ,”ఎరా! అంత భయముతో కూడా అది తన కుట్టే స్వభావాన్ని మానుకోలేక పోయింది. మరి నా స్వభావాన్ని ఎలా మానుకొనేది?”  అని జవాబిచ్చినారు.

ఈ కథ చాలా మందికి తెల్సిందే.

ఇటీవల శ్రాద్ధ కర్మము అయిన తరువాత అన్నపు పిండాలను చెరువులో కలుపుటకు ఒక స్మార్త విద్యార్థిని తోడు తీసుకొని చెరువు దగ్గిరకు వెళ్ళినాను. వదిలిన పిండాలతో బాటు దర్భలు కుడా నీళ్ళలో వేసినాను. ఆ విద్యార్థి వెంటనే దర్భలను తీసుకొని గట్టు మీద పడి వేసినాడు.అడిగితె చెప్పాడు,”నీటిలో చేపలు, ఇతర జీవులు ఆహారముతో బాటు, అది మామూలు గడ్డి యని కొరికితే వాటి నాలుకకు గాయమవుతుంది.”

మన మురికినంతా ప్రక్క వారి స్థలాలలో వేసే ఈ రోజులలో, మన పరిశ్రమల మురికినంతా కాలువల్లో, నదుల్లో వేస్తూ త్రాగు నీటిన్ కలుషితము చేస్తున్న ఈ రోజుల్లో  ఆ కుర్రాడి సంస్కారము ఎటువంటిది? మన సంస్కారము నేల కు దగ్గిరగా యుంటే, అతడి సంస్కారము ఆకాశముకు దగ్గిరగా ఉంది. అందుకే ప్రతి యెక్కడి నుండీ మనము పాఠాలను నేర్చుకొన వలసి యుంది.

ఒక సారి పండరి నుండి తిరిగి వస్తూ షోలాపూర్ బస్ నిలయములో యున్నాము. బయట అరటి పండ్లు కొని బస్ నిలయంలో ఉన్నాను. సన్నగా, పొడుగ్గా యున్న యొక పేద కుర్రాడు బిచ్చ మెత్తుకుంటూ నా దగ్గిరకు వస్తే డబ్బుకు బదులుగా రెండు అరటి పండ్లు అతడి చేతిలో పెట్టాను. వెంటనే ఆ కుర్రాడు సాష్టాంగ నమస్కారము చేసినాడు. పాపము ఎంత ఆకలిగా ఉన్నాడో? నాకు చాలా ఆశ్చర్యము వేసింది. అక్కడే నిలబడి యున్న ఒక ఆవుకు అరటి పండు పెట్ట బోతే అది తల తిప్పెసుకుంది. అంటే ఆ ఆవుకు అరటి పండ్లు అఖ్ఖర లేదుట. మరి ఏ తిండి కావాలో? చాలా ఆశ్చర్యము వేసింది.

 

 

వాసు దాసు గారు.

 


ఈయన గుంటూరు జిల్లా కు చెందిన ఒక రామ భక్తుడు. ఒక యోగి. ఈయన మనుమడు (పేరు రామ ప్రసాదు గారు) భీమవరము ఒక కాలేజి లో పని చేసి పదవీ విరమణ చేసినాఋ. నాకు బాగా పరిచయమున్న వారు. ఈయన వాసు దాసు గారి జీవితములో కొన్ని సంఘటనలను నాకు చెప్పినారు. మన సమర్పణ భావముతో నే భగవంతుడు అంతా చూచు కొంటారని చెప్పటానికి ఇవి మంచి ఉదాహరణలు.

వాసు దాసు గారి పూర్తీ పేరు వావిల కొలను సుబ్బారావు గారు. వాల్మీకి రామాయణాన్ని యథా తథముగా తెలుగు లో మంథరము అన్న పేరుతొ పద్య కావ్యముగా వ్రాసినారు. ఈయనకు చాలా శిష్య బృందముంది. ఆశ్రమములో  రాముడి పేరు మీద ఎదో యొక కార్యక్రమము జరిగేది.

ఒక రోజు  వాసు దాసు గారు “రేపు రాముడి పేర సంతర్పణ జరగాలి రా.” అని యన్నాదుట. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. సరుకులు లేవు. అప్పటికప్పడు అనుకుంటే ఎలా జరుగుతుంది? ఆశ్రమములో అందరి బుర్రలలో ఇదే  ప్రశ్న. మర్నాడుదయాన్నేఆశ్రమము ముందు ఎడ్ల బండ్లు ఆగినాయిట.వాటి నిండా బియ్యము, పప్పులు, కూర గాయలు వచ్చినాయి.అప్పుదందరికీ అర్థమయింది, ఆయన మాటలకు అర్థము.

ఒక సారి ఆయనకు భద్రాచలము వెళ్ళాలనిపించి  తన శిష్యులతో చెప్పినారుట.వారు బాగా హడావిడి పడి పోతూ  ఇంటికి వెళ్లి డబ్బాల నిండా జన్తికలూ తిను బందారాలూ చేయించి ఆశ్రమానికి తీసుకొని వచ్చినారుట.  వాటిని చూచి వాసు దాసు గారు పగలబడి నవ్వినారుట. “అదేమిటి గురువు గారూ!” అంటే, “మనము వెళ్ళేది ఒక చక్రవర్తి దర్శనానికి. మన అవసరాలు ఆయన చూచు కోరా ఏమిటి? ఇంత కంగారెందుకు?” అంటూ చుట్టూ పక్కల పాకలలో ఉండే వారి పిల్లలను పిల్చుకొని రమ్మని చెప్పి వారి చేతుల మీదుగానే మొత్తము తిను బండారాలన్నీ అ పిల్లలకు పంపకము చేయించినారుట.

ఇంకా వారి భజన యాత్రలో దారిలో భోజన వేళకు ఎవరో ఒకరు వచ్చి ఇంటికి పిల్చుకొని వెళ్లి భోజనాలు పెట్టించే వారుట. అందుకే సమర్పణ భావమున్న చోట లోటుండదని చెబుతారు.

ఒక సంఘటన

 


ఇది  అమెరికా లో కొన్న నెలల క్రిందట జరిగినది. ఒక కంప్యూటర్  సాఫ్ట్ వేర్ ఉద్యోగికి అమెరికా లో పోస్టింగ్ వచ్చింది. మొదటి సారి అయినా తను ఒక్కడే వెళ్ళకుండా భార్యతో సహా వెళ్ళినాడు.

ఒక సారి భార్యకు ఎదో రుగ్మత వచ్చింది.  స్నేహితుల సలహా మీద ఒక కార్పొరేట్ హాస్పిటల్  కు వెళ్ళినాడు. వాళ్ళు నిర్ణయించిన వైద్య పరీక్షలన్నీ చేయించినాడు. ముందు జాగ్రత్త కై ఎంత ఖర్చు అవుతుందని అడిగినాడు. వాళ్ళు ఇచ్చిన లెఖ్ఖ చూచి డీలా పది పోయినాడు.

ఈ సమస్య అందరికీ వస్తుంది కదా!

నిజానికి అమెరికా లో ఇది ఒక సమస్య కాదు. అందరూ మెడికల్ ఇస్యూరన్స్ నుండి ఈ బిల్లు కడతారు. వెళ్ళిన వ్యక్తీ ఇటీవలే ఇన్స్యూరన్స్ తీసుకున్నాడు. వెంటనే డబ్బు తీసుకొనుటకు అర్హత లేదు. మరి కొత్త పాలసీ దారు కదా! ఉన్న డబ్బు వైద్య పరీక్షలకు అయి పోయింది. వేరే మార్గాలు ఏమయినా ఉన్నాయేమో తెలియదు. అందుకని వైద్యము చేయించకుండా గుట్టుగా ఇంటికి వచ్చేసినారు.

రెండు రోజులలో అతడికి లీగల్ నోటీస్  వచ్చింది. భార్యకు బాగు  లేక పొతే వైద్యము చేయించ కుండా వచ్చేసినాడు అన్నది ఆరోపణ. ఆ తరువాత ఏమి జరిగిందో మన వార్తా పత్రికలూ వ్రాయ లేదు, వ్రాయవు కూడా.

దీనికి ఈ క్రింది మలుపు ఉంటె బాగుంటుందని అనిపించింది.

ఈ విషయానికిది మరో మలుపని ఊహించుకుందాము. ఈ విధము గానే జరగాలని  కాదు.

జడ్జి గారి ముందుకు ఈ కేసు వచ్చింది. జడ్జి గారు “డబ్బులు లేనపుడు ఇది ఎలా వీలవుతుంది? అని అడగ లేదు. భార్యకు వైద్యము చేయించక పోవడము నేరము” అని అన్నాడు.

నిందితుడయిన ఉద్యోగి తన పరిస్థితి అంటా వివరించి చెప్పినాడు. జడ్జి గారు అంగీకరించ లేదు. చివరగా నిందితుడు ఒక విజ్ఞప్తి చేసినాడు. “మీరు జడ్జిమెంట్ చెప్పే ముందు మా ఇద్దరికీ అంటే  భార్యా భర్తలకు మీ చేంబర్ లో విడిగా మాట్లాడుటకు ఒక అవకాశము ఇస్తారా?” అని అడిగినాడు. ముందు ప్రాసిక్యూటర్ అందుకు అభ్యంతరము పెట్టినా , చివరకు ఒప్పుకున్నాడు. ఆ సెషన్ అయిన తరువాత ఓ పది నిముషాలు అవకాశము ఇవ్వడానికి జడ్జి ఒప్పుకున్నాడు.

సెషన్ పూర్తీ అయింది. భార్యా భర్తలు ఇద్దరూ జడ్జి గారి చేంబర్ కు వెళ్ళినారు.

జడ్జి గారి ముందు ఇద్దరూ నిలబడినారు.

“మై  లార్డ్! ఇప్పటి వైద్యము గురించి చెప్పే ముందు మీ ఆరోగ్యము గురించి మాట్లాడుటకు అనుమతి ఇస్తారా?”

“ఈ  నాన్సెన్స్  ఏమిటి? అసందర్భము గా ఉంది. అయినా నాగురించి నీ కేమి తెలుసు? వెంటనే చీప్పాలి”’

“ మై లార్డ్!  మీకు కొంత కాలముగా అనారోగ్యముగా ఉంది కదా, దానిని గుండె జబ్బుగా వైద్యులు నిర్ధారించి ఉండాలి. కాని, అది గుండె జబ్బు కాదు.”

“నీవు కంప్యూటర్ సైంటిస్ట్ వు. నీకు రోగాల గురించి ఏమి తెలుసు?”

“మై లార్డ్! నేనొక హీలర్ ను. నాకు వైద్య శాస్త్రము లో దేహ తత్వము గూర్చి తెలిసిన వాడిని. మా ఇండియా లో చేయి మణికట్టు పట్టుకొని రోగాన్ని స్పష్టముగా నిర్ధారించ గలిగిన ఆయుర్వేద వైద్యులున్నారు. చూడగానే రోగాన్ని పసి గట్టె యోగులున్నారు. వీరు దేహములో  శక్తి గమనాన్ని బట్టి రోగ నిర్ధారణ చేస్తారు ఎక్కడా ఎ యంత్రమూ అవసరముండదు. నేను కాస్త యోగ తెలిసిన వాడిని. అందుకే మీ పరిస్థితిని చూడగానే తెలుసుకున్నాను. ముందు మీ విషయము చెబుతాను. మీరు కొన్ని రోజుల క్రిందట ఎక్కడిఅనా విందు భోజనము చేసి ఉంటారని అనుకుంటాను. అది మీ పొట్టలో గాస్త్రిక్ సమస్యను తీసుకొని వచ్చింది. దానిని గుర్తించనండు వలన గుండె క్రింద  దయాఫ్రము మీద ఒత్తిడి పెరిగి మీకు గుండె నొప్పిగా అనిపిస్తున్నది. పరీక్షలో అది గుండె నొప్పిగానే తేలుతుంది.”

“మరి నేనేమి చేయాలి?”

“యోగ సాధనన్నా చేయాలి. అవసరమయితే హోమియోపతి ని ఆశ్రయించండి.”

“ఇన్ని తెలిసి హాస్పిటల్ కు ఎందుకు వెళ్ళారు?”

‘సదన్ గా వచ్చేసరికి మానసిక ఒత్తిడి వలన ఇటువంటి పొరపాట్లు జరుగుతాయి. ఆ టెస్టులకు వాడిన డబ్బు వైద్యానికి సరిపోతుంది. అయనా వైద్యాన్ని నేను చేసుకో గలను. కానీ ఇప్పుడు నేను ఫిక్స్ చేయ బదినాను. మీరు ఇది అర్థము చేసుకొని నన్ను తప్పించాలి.”

“చాలు .చాలా మంచి విషయాలు హేప్పావు. నేను చేయగలిగినది ఏమయినా ఉంటె సాయము చేస్తాన్.’

కథ ఇలా ముగిస్తే బాగుంటుంది కదా. ఈ ఊహతో కూడిన కథను ఆపేద్దాము. నాకు ప్రయాణములో జరిగిన సంఘటన ను చెబుతాను.

ఒక సారి నేను చెన్నై వెళ్ళుటకై సర్కార్ ఎక్స్ ప్రెస్స్స్ ఎక్కినాను. నా పక్క బెర్త్ ల లో ఒక వృద్ధ డాక్టర్ దంపతులున్నారు. వారు కాకినాడ లో ఎక్కి సూళ్ళూర్ పేట వెళ్ళుతున్నారు. వారితో మాట్లాడుతూ ఉంటె గుడివాడ దగ్గిరకు చేరిన తరువాత ఏర్పడిన చనువుతో మగ డాక్టర్ ను అడిగినాను.

“ప్రతి రోగానికీ ఇన్ని పరీక్షలు(బాగా డబ్బు ఖర్చు చేస్తూ) అవసరమంటారా?” అని అడిగినాను.

“నా వైద్య శాల లో నేనుగా ఎవరికీ ఎటువంటి పరీక్షను వ్రాయ లేదు. నా స్టేత స్కోపు తో ఎ రోగాన్నయినా నేను ఖచ్చితముగా గుర్తించ గలను. ఒక సారి ఒక పేషంట్ అడిగితె ముందు నేను రిపోర్టు వ్రాసుకొని అతని చేత బయట ప్రయోగ శాల లో పరీక్ష చేయించి నా రిపోర్టు ను అతడి రిపోర్టు ను పోల్చి చూపించాను.” అని చెప్పినాడు. మరి ఇప్పుడు పరీక్షలకే వేల రూపాయలను ఖచు పెట్టిస్తున్నారు.

ఇదే వ్యాపారమంటే. ఖచ్చితముగా సేవ కాదు.

 

 

 

 

Monday, August 22, 2022

ఆంధ్రా పూరీ

 

                                                          

 

      పూరీ జగన్నాద్ గారు తమ అబ్బాయి నాయకుడిగా ఒక సినిమా తీసినాడు. దాని పేరు ఆంధ్రా పోరి. ఆంధ్రులలో పోరీ అనే పదము అసలు వాడరు. అది హిందీ , లేదా హైదరాబాదీ/ఉర్దూ పదము అయి ఉండాలి. విశేషమేమిటంటే ఆ పోరీ గా నటించినది ఆంధ్రా అమ్మాయి కాదు.  ఆంధ్రా తెలంగాణా  నాయకులు వైరుధ్యాలతో కొట్టుకుంటుంటే పరస్పర వైరుధ్యాలను తలపించే పేరు గల ఈ చిత్రము సామరస్యమిస్తున్దనుకున్నారేమో? లేదా ఆంధ్రా పూరీ అంటే బాగుందడనుకున్నారేమో?

`     దీని మీద తెలంగాణా ముఖ్యమంత్రి గారికి ఎలాటి  ఆసక్తి కలిగినట్లు లేదు. బహుశా కంఫ్యూజన్ లో ఉన్నాడేమో? లేదా తెలంగాణా పోరీ అనకుండా  ఆంధ్రా పోరీ అన్నందుకు ఇక్కడ రిలీజ్ చేస్తాడా, నిర్మాత నాలుక కత్తిరించి వేస్తానని అంటారేమో అనుకున్నాము.

     

వాయు నియంత్రిత

 

ఇదేదో కొత్త పదములా ఉంది. లేదా పలకడానికి చాలా కష్ట మయిన పదములా ఉంది. ఎందుకంటే మనము అటువంటి ప్రభావములో ఉన్నాము.  తెలుగు గ్రాంధిక భాష వ్రాస్తే  చాలా కష్టమండీ,  మాకది అర్థము కాదు అనే వారు ఉన్నారు. లేదా రైలు సిగ్నల్ కు ధూమ గమనా గమన సూచిక  అని నిర్వచించే ఛాందసుల తో బాటు దానిని ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా మందికి తెలియని విషయము ఏమిటంటే ప్రముఖ గణిత శాస్త్ర విభాగము న్యూటన్ మహాసయుడి ద్వారా  పరిచయము చేయబడినది అని చెప్ప బడిన కాల్కులస్ కు ఆ భాష లో  అర్థము గులక రాయి.

భయ పడుటకు మరి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నేను పుస్తకాల షాపు లో ఉన్నపుడు ఒక వ్యక్తీ  ఒక సంస్కృత పారాయణ  గ్రంథాన్ని పేజీలు  తిప్పి, సంస్కృతములో తప్పులు చదివితే  పాపమండీ  అని అన్నారు.”ఏమండీ, అప్పుడే నడవటానికి  ప్రయత్నిస్తు తప్పటడుగులు  వేస్తున్న   పసి పిల్ల వాడు తప్పు చేస్తున్నాడంటారా? భగవంతుడు అంత కఠినముగా ఉంటాడంటారా?” అని అడిగినాను. జవాబు రాలేదు. ఈ తత్త్వము కొన్ని భాషలకు మనము ఇచ్చిన శాపము.

సంస్కృతము వలెనె విపరీతముగా ఒత్తులు ఉన్న భాష జర్మన్ భాష. ఒత్తులు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు  Journal of applied physics అని ఆంగ్లములో ఉంటె  Zeischrift fur angewadte fiziks అని జేర్మన్లో  journal de physique అని  ఫ్రెంచ్ భాషలో పిలుస్తారు. ఈ విధముగా జేర్మన్లో ఒత్తులు  ఎక్కువగా ఉంటాయి. ఆంగ్ల భాష మధ్యలో ఉంటుంది. ఇంకా ఫ్రెంచ్  భాషలో అసలు ఒత్తులు ఉండవు. బాగా మద్యము సేవించినందు వలన మందమయిన నాలుకతో మాట్లాడినట్లు ఉంటుంది. ఎవరి అవసరాలను అనుసరించి వారి భాష ఏర్పడుతుంది. భాష కష్టము , మాట్లాడలేము అని పలికించే కరటకులు దమనకులు వెనుక ఉండి ఆడిస్తూ ఉంటారు.

నేను చేయలేను అనే పదము భారతీయ సాంప్రదాయములో ఉండేది కాదు వారి వృత్తికి వ్యాపృత్తికి  ఎంత అవసరమో ఆ భాషను అంత వరకు నేర్చుకొనే వారు. ఆ నాడు ఏది ఎక్కువ సంపాదన ఇస్తుంది , అదే చేద్దాము అనే భావన ఉండేది కాదు. ఎ శాస్త్రము అయినా ఉన్నత స్థాయికి వెళ్ళినపుడు జీవన భృతి ని ఇచ్చేది. జీవితమయినా యుద్ధ రంగమయినా ఒకే మానసిక స్థితి ఉండేది. సంస్కృత వ్యాకరణము వ్రాసిన వారి పరంపరలో  ఆఖరున ఉన్న వాడు ఈ నాడు పాకిస్తాన్ కు చెందినా తక్షశిలలో జన్మించిన పాణిని. సంస్కృతము  సరిగా రాక పొతే గురువుగారు నీకంత శక్తి లేదని,హస్త సాముద్రిక రేఖలలో విద్య రేఖ అసలు లేదని చెప్పినాడుట.  అప్పుడు పాణిని అర చేతి మీద విద్యా రేఖ ప్రస్ఫుటముగా కనబడేటట్లు కత్తితో గాటు పెట్టుకున్నాడుట. శివుడి  గూర్చి తపము చేసి ఆయన అనుగ్రహముతో డమరుక సబ్దాలనుండి ఆధునిక సంస్కృత వ్యాకరణాన్ని నిర్మించినాదుట.ఈ నాటి కంప్యూటర్ శాస్త్ర వేత్తలు పాణిని నిర్మించిన భాష కంప్యూటర్ కు సహజమయిన భాష అవుతుందని పలికినారు. ఇటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సాధనాలతో లక్ష్యాన్ని చేరుకున్న యుగ పురుషులు ఈ నేల లో జన్మించినారు. పొలాన్ని దున్నే రైతు ఎంత చెమట కారుతున్నా తన దృష్టి పొలము మీదే ఉంచుతాడు. కలాన్ని పట్టుకున్న కవి ఎంత కష్టమైనా తన దృష్టి తన రచన మీదే ఉంటుంది. తన బాధలే తను అయిన వాడు యోగ సాధనకు పనికి రాడనీ మహా యోగి పతంజలి చెబుతారు. నిప్పులో దూకినా నిప్పులాంటి వాతావరణములో ఉన్నా సాధకుడు తన్ను తాన మరిచి పోడు.

ఇంక అసలు విషయానికి వద్దాము.  పల్లెటూర్లలో ఇళ్ళకు  మధ్య  ఎక్కువ  దూరమున్నందు వలన  గాలి చక్కగా వీచేది. మురికి గూర్చి ఎక్కువ జాగ్రత్త తీసుకొనక పోయినా ఎండ పడినందు వలన చెడు ఫలితాలు వచ్చేవి కాదు. ఆవుల పోషణ ఉన్నంత కాలము వాటి పేడ  మూత్రము వలన  దోమల బాధ ఉండేది కాదు. పగలంతా నిద్ర పోయినా రాత్రి పూట హాయిగా ఆరు  బయట మంచాలు వేసికొని  చల్లని గాలిలో విశ్రమించే వారు. ఇంక విద్యుత్తు అవసరము ఉండేది కాదు.

సాంకేతికత పెరిగే కొద్దీ కొత్త పరికరాలు వచ్చినవి. వ్యాపారము పెంచు కొనుటకై  కొత్త అలవాట్లు, అవసరాలు వచ్చినవి. ఇరుకు గదులలో అయినా గాలి చక్కగా వీచుటకు వాతాయనములు/ పంఖాలు/ఫాన్లు వచ్చినవి. ఇందు వలన విద్యుత్తు ఖర్చు పెరిగింది తప్ప కొత్త గా ఏ  విధము  అయిన నష్టము రాలేదు. అటు తరువాత మొదటగా వచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలు మన దేశపు ఉష్ణోగ్రతలలో పాడు కాకుండా పని చేయాలంటే వాటిని తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచ వలసిన అవసరము వచ్చి, వాతావరణము చల్ల బరచుటకు వాత నియంత్రణ యంత్రాలు, లేదా  వాత నియంత్రితాలు లేక పొతే ఎయిర్ కండిషనర్లు వచ్చినవి. ఇవి మొదట పరిశోధన శాలలకు మాత్రమె పరిమిత మయి ఉండేవి. వాటిని తయారు చేసే వారి వ్యాపారము పెంచు కొనుటకు వీటిని జనానికి అలవాటు చేసినారు. వీటితో బాటు లేదా కొద్దిగా అటు ఇటు కాలములో వస్తువులను చల్లని వాతావరణలో ఉంచుకొనుటకు ఫ్రిజిడేర్లు తయారయినాయి. ఈ రెండిటికి ఒకే లక్షణము ఉంది.

ఫ్రిజిడేర్ లేదా ఫ్రిజ్ లోపల వస్తువులలో చేరే వేడి నంతటను కలిపి తన వెనుక భాగము గుండా బయటికి విసర్జిస్తుంది. అందుకే దాని వెనుక వైపు చాలా వేడి గా ఉంటుంది. ఇంకా ఎయిర్ కండిషనర్  లోపల చల్ల బరచి, వేడినంతా బయటకు పంపించి  వేస్తుంది. ఇందు వలన ప్రకృతికి మరియు మనిషికి  రెండు నష్టాలు ఉన్నవి. మొదటిది, చల్లబడుటకు వాడే రసాయనాలు కొంత వరకు అయినా వాతావరణములో కలుస్తాయి. భూమికి రక్షణను ఇస్తున్న ఓజోన్ పొర ఈ రసాయనాల వలన విఘటన చెంది, క్రమక్రమముగా ఇక్కడ ఉన్న జీవ జాలానికి హాని కలిగించే అవకాశముంది. ప్రపంచములో చాలా దేశాలు వీటిని నియంత్రించాలని ప్రయత్నములు చేస్తున్నవి. ఈ రెండిటి వాడుక మరింత పెరిగి పోవుతతో బాటు, అడవులు మరియు చెట్ల సంఖ్య తగ్గి పోయి భూ తాపము అపరిమితముగా పెరిగి పోతున్నది. భూతాపము పెరిగే కొద్దీ వీటి అవసరము మరింత పెరుగుతున్నది. తెలుగులో ఒక సామెత ఉంది. ఒకడికి పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు. పిచ్చి కుదిరితే గానీ పెళ్లి కాదు. అదే విధముగా ఈ యంత్రాల వాడుక తగ్గితే గాని భూ తాపము తగ్గదు. భూ తాపము తగ్గితే గానీ వీటి వాడుక తగ్గదు.

మనిషి జీవితమూ పూర్తిగా యాంత్రికము అవుతున్నది. ఏ పని కూడా తను చేయ లేని పరిస్థితికి వస్తున్నాడు. కూర్చుంటే లెవ లేడు. ఏ పనినీ చేయ లేడు, ఏ వేడికీ తట్టుకోలేదు. పరిశోధన  శాలలలో తప్ప మిగిలిన వాడుకలో వీటిని నియంత్రిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయము తగ్గ వచ్చును, కానీ భూ తాపము తగ్గుతుంది. ఇందు వలన భూమి మీద ఉన్న ఇతర జీవ రాసులకు కూడా సాయము చేసిన వారవుతారు.

నీతి:మన దేహాన్ని ప్రేమించుటే కాదు, మనలను కూడా మనము ప్రేమించ గలగాలి

Thursday, February 10, 2022

మన పరిస్థితి

                   

               


                        

 

 ఇక్కడ కొన్ని విషయాలను కాస్త కఠినమే అయినా చెప్ప వలసిన అవసరమున్నది. ఇందులో ఎవరినీ నొప్పించుట ఉద్దేశ్యము కాదు. ప్రతి విషయాన్నీ తమ ఆలోచనకు అనుకూలముగా మార్చి అదే సత్యముగా అనిపించేటట్లు చేయడము పాశ్చాత్యులలో ఒక వర్గము వారికి వెన్న తో పెట్టిన విద్య.(క్షమించాలి అందరూ కాదు వారిలో కూడా ఎందఱో మహాను భావులు ఉన్నారు.) వీరు తాము అనుకున్నదే సరి అయినది అని చెప్పుటకు ఎన్ని వక్ర మార్గాలయినా తొక్కుతారుఅందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయిశ్రీ మికాయో ఉసూయి షింగాన్ శాఖకు చెందిన బౌద్ధ మతావలంబి. రేకి అనే విద్యను ఆధునిక కాలములో ప్రవేశ పెట్టిన మహనీయులు. ఆయన ఏ నాడూ జపాన్ దాటి వెళ్ళ లేదు. ఇది స్పష్టముగా ఆయన వ్రాతలలో  ఇటీవల బయట పడినది. కానీ ఒక రేకి టీచర్ ను అనుసరించి ఆయన ఒక క్రిస్టియన్ స్కూలుకు అధికారి. ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు జవాబు కనుక్కోవాలని చికాగో వెళ్లి వైద్య విద్యను  అభ్యసించినాడని    .. ఇంకా.. ఇంకా.. ఎన్నో కథలు ఆవిడ చెప్పినారు  ఇవి ఇప్పటికి రేకి  క్లాసులలో చెబుతారు.

ఇంక ఈ నాడు భారతీయులలో కూడా చాలా మంది తమ ఋషులు ఏమి చెప్పారో తెలుసు కోవడానికి తమ గ్రంథాల మీద కాకుండా పాశ్చాత్యులు వ్రాసిన పుస్తకాలపై ఆధార పడి వారి పాటలకు తాళాలు వేస్తున్నారు. ఇటీవల చాణక్య అనే టీవీ సీరియల్ తీసిన ఒక మహనీయుడు ఎక్కడో చదివినాడు. ఒక పాశ్చాత్య గ్రంథములో చాణక్యుడి కాలానికి భారత దేశములో తాటి చెట్లు ప్రవేశించ లేదని. దురదృష్టమేమిటంటే ఆయన అన్నీ చదివినాడు కానీ మన గ్రంథాలు పూర్తిగా చదువ లేదుభాగవతములో బాల రాముడు తాటి పండ్లు తిన్నట్లు ఆయన దృష్టికి రా లేదు. రామాయణములో ఎన్నో చోట్ల తాటి చెట్ల ప్రస్తావన వస్తుంది. అది ఆయన దృష్టికి రాక పోవడము మన దురదృష్టము.

నా కొలీగ్ ఒకరు రామాయణ విష్ వృక్షము గురించి  చెబుతుంటే నేను ఒక మాట అన్నాను. “మీరు అసలు గ్రంథము చదవకుండా ఈ వ్యాఖ్యానాలు చదివితే మీకు చర్చించే అధికారము లేదు.” అని.

ఒక నిజాయితీ గల పాశ్చాత్యు రాలు వారణాసి గురించి పరిశోధించుటకు  హార్వర్డ్ వచ్చింది ఆమె పేరు నాకు గుర్తు లేదు. వారణాసి లో ఆమె మూడు సంవత్సరాలు గడిపింది.ప్రతి ప్రాంతము అక్కడ తిరిగి విషయాలను సేకరించింది. అది ఆమె గొప్ప తనము. పల్లెటూర్లను గురించి పరిశోధించే కొంత మంది  పల్లెటూర్లకు వెళ్ళకుండానే ఏవేవో పుస్తకాలు చదివి పల్లెటూర్ల మీద విమర్శనాత్మక వ్యాసాలూ వ్రాయడము   మన దేశములో కొత్త కాదు. అది గర్హించ వలసిన విషయము.