అంతు తెలియని ఒక రహస్యము
ఇది ఒక రహస్యంగా ఉండి పోయిన
విషయము. ౧౯ వ శతాబ్దము యొక్క చివరి
భాగములో బొంబాయిలో శ్రీ శివ శంకర తలవడే ఒక విమానాన్ని నిర్మించి ప్రదర్శించి
నాడని, అది ౧౫౦౦ అడుగులు పైకి ఎగిరిందని ఒక కతనమున్నది. ఇది ౧౮౯౫ లో రైట్
సోదరుల విమాన ప్రయోగానికి ౮ సంవత్సరాల
ముందు జరిగిందని శ్రీ వాసు దేవా విష్ణు
దయాళ్ వ్రాసిన హిందూ స్క్రిప్చర్ అనే గ్రంధములో యున్నది.
శ్రీ తల్వడే ముంబాయి లో చైనా బజార్ లో జీవించే వాడు. వైదిక
వాజ్మయములో విద్వాంసుడు. జే జే ఆర్ట్సు స్కూల్ లో అధ్యాపకుడు. నిరంతరమూ దామోదర్
సాత్వలేకర్ అనే వేదం పండితుడితో చర్చిస్తూ ఉండే వాడు. కొన్ని వేద మంత్రాల ఆధారముగా
విమానాన్ని నిర్మించి దానికి మరుత్సఖి అని పేరు పెట్టినాదుట. దానిని బాంబే ఆర్టు
సొసైటీ ఆధ్వర్యములో టౌన్ హాల్ లో ప్రదర్శించినాడు. ఇందులో ఆయన పాద రసాన్ని సూర్య
శక్తిని వాడినాడు. ముంబాయి చౌపాత్తి మైదానములోపలువురు ప్రేక్షకుల సమూహములో అది
ప్రదర్శించ బడినది. ఆ నాడు దీనిని చూచిన వారిలో మహా దేవ గోవింద రానడే , బరోడా మహా రాజు కావలసిన లాలాజీ రాయంజీ కూడా యున్నారు.
మరాఠీ లో తల్వడే “ప్రాచీన విమాన విద్యే చాసోద” అనే గ్రంథాని వ్రాసినారు.
తన భార్య చని పోయిన
తరువాత తలవడే తన ప్రయోగాలని మాని
వేసినారుట. ఆ తరువాత ఆయన వారసులు దానిని ఒక బ్రిటిష్ కంపెనీకి అమ్మి
వేసినారుట.(ఆచారాలు శాస్త్రీయత గ్రంథమునుండి)
ఇటీవలే బయట పడిన మరొక రహస్య
సమాచారము.అమెరికన్ సైనికులు ఆఫ్ఘని స్తాన్ లోని బాల్క్ నగరానికి సమీపములో యున్న
కొండ గుహలలో ఒక యంత్రాన్ని చూచినారు.అది యొక పురాతన విమానముగా
గుర్తించినారు.దానిని వారు ఎంత రహస్యము ఉన్చాలనుకునా బయట పడినది ఇది రష్యా దృష్టి
కి వెళ్ళినది. దానిని అక్కడినుండి తరలించాలని చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫల
మయినాయి.ప్రముఖ అమెరికా అధికారులందరూ వెళ్లి ఆ విమానాన్ని సందర్శించినారు. ఇది ఈ
నాటి నిర్మాణానికి అనుగుణముగా లేదని, ఎన్నో విధ్వంసక ఆయుధాలతో యున్నాదని, దాని
సాంకేతికత ముందు ప్రస్తుతపు విమానాల సాంకేతికత ఎందుకు పనికి రాదనీ
నిర్ధారించినారు. అంటే గాక అది భారత దేశానికి సంబంధించినదని చెప్పినారు. దాని
నిర్మాణము చిత్రములో చూస్తే ఇప్పటి విమానాలకు ఎ విధముగా పోలిక లేదు. (ఆంద్ర భూమి
లో ఒక వ్యాసము ఆదారము)
No comments:
Post a Comment