Monday, December 16, 2013

అల్ప జీవి

                                                            

తాము తప్పు చేసి దానికి ఎదుటి వారిని నిందించడము ఇప్పటి ఆధునిక సమాజములో రివాజు అయి పోయినది. ఎవరో లూయీస్ పాశ్చర్ అట. ప్రతి వ్యాధికి సూక్ష్మ క్రిములే కారణమని చెప్పినాదుట. అదే సమయములో బె చాంప్ అనే శాస్త్రజ్ఞుడు వ్యాధులకు సూక్ష్మ క్రిములు కారణము  కావని చెప్పినాడు. అయినా  ఆయన మాటను ఎవరూ ట్టించుకోలేదు.  ఈ యొక్క దురభిప్రాయము భూమిని విష పురితము చేసినది.
ఒక సారి ఒక ఆయుర్వేద వైద్యుడిని అడిగాను.మీ వైద్యములో ఎక్కడైనా వ్యాధికి కారణమయిన సూక్ష్మ క్రిముల ప్రస్తావన ఉన్నదాఅని. ఆయన ఒక మాట అన్నారు. వాత పిత్త కఫములనబడు మూడు తుల్య స్థితిలో  నుండుట పూర్ణ ఆరోగ్య స్థితి అనిరోగిలో ఆ స్థితిని తీసుకొని రావడమే వైద్యుడు చేసే పని అని. అంటే సూక్ష్మ జీవుల యునికి రోగానికి ఏ విధమయిన సంబంధాన్ని కలిగి యుండదు. ప్రకృతి వైద్యములో కఠినమయిన ఆహార నియమాల ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్దరిస్తారు. హోమియోపతి లో సోరా, సిఫిలిస్ మరియు సైకోసిస్ అనే మూడు తత్వములను వాటిని సరి చేయడము ద్వారా రోగ నివారణ చేస్తారు. పదార్థములు రెండు రకములుగా తీసుకొంటారు. దేహానికి పుష్టిని ఇచ్చేవి ఆహార పదార్థములు. మిగిలినవి విష పదార్థములు. ప్రతి విష పదార్థము సూక్ష్మీకరణము ద్వారా మందుగా పని చేస్తుంది. అంటే ఆల్కహాల్ లేదా పంచదార లో ఈ పదార్థము యొక్క యునికిని తగ్గించుకుంటూ వస్తారు. ఈ విధముగా  సూక్ష్మీకరణము చేసే  కొద్దీ మందు మరింత  లోతుగా పని చేస్తుంది.
ఈ విధానములో విషయమేమిటంటే వ్యాధులు ఎన్నో లేవు. ఒకే దోషము ఒక్కొక్క దేహ భాగములో పని చేస్తే ఒక్కొక్క వ్యాధిగా కన బడుతుంది. ఈ విధముగా కనిపించే వ్యాధులు అన్నీ ఒకే దోషము భౌతికముగా ప్రకటించుకొనే మార్గాలే.
ఈ సిద్దాంతాల ప్రకారము సూక్ష్మ క్రిములు లేదా వైరస్ లు ప్రకృతిని శుభ్ర పరచేపరికరాలే. వ్యాధి వచ్చిన చోట అవి ఉన్నాయంటే వాటి వలన వ్యాధి వచ్చినదని అర్థము చేసుకొన కూడదు. పెంట యున్న చోట పందులున్నాయంటే, ఆ పెంటను తినడానికి వచ్చాయని అర్థముచేసుకోవాలి. అంతే కాని, ఆ పెంట అంతా అవి వేశాయని అర్థముచేసుకొన కూడదు. మన దేహములో ఏర్పడిన దోషము వలన వ్యాధి ఏర్పడుతుంది. మురికి లేదా చెత్త చేత ఈగలు ఆకర్షింప బదినట్లే, దేహములోని వ్యాధి చేత సూక్ష్మ క్రిములు ఆకర్షింప బడుతాయి. అంతే గాని సూక్ష్మ క్రిముల వలన వ్యాధి రాదు.
ఎందుకంటే ఇవి ప్రకృతిని శుభ్రము చేసే పరికరాలు. ౧౯ వ శతాబ్దములో పాశ్చర్ సమ కాలీనుడు అయిన పియరీ జాక్వెస్ ఆంటోయిన్ బేచాంప్ తన పరిశోధనల ద్వారా దీనినే స్పష్టము చేసినాడు. ఈ సూక్ష్మ క్రిములను బేచాంప్ చిన్న దేహికులు లేదా మైక్రోజైమ్స్ అని పిలిచినారు. కాని ఆయనను ఎవరూ పట్టించు కోలేదు. తరువాత కాలములో పియర్సన్ అనే శాస్త్రజ్ఞుడు మనుషులలో జంతువులలో యున్న సూక్ష్మ జీవులు వ్యాధులకు కారణము కావని స్పష్టము చేసినారు. శామ్యూల్ హనెమాన్ తన క్రానిక్ డిసీజస్ లో ఇదే విషయాన్ని స్పష్టము చేసినాడు.  దీర్ఘ కాల వ్యాధులున్న వారిలో వ్యాధిని పట్టించు కోకుండా సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తే రోగి మామూలు జీవన ప్రమాణాని కంటే ముందే మరణిస్తాడని సిద్దాంతీకరించినాడు.
          యూరప్ లోఏ కొత్త వైద్య వ్యవస్థ వచ్చినా ఆధునిక వైద్యుల సంఘాల ద్వారా దాడులకు గురి అయినది. మెస్మరిజం, హోమియోపతి ఈ విధముగా దాడులకు గురి అయినవి. ప్రముఖ భౌతిక శాస్త్ర వేత్త  ఫ్రిజాఫ్  కాప్రా   చెబుతారు, మనిషి దేహము లోని రోగాలను రసాయనాల ద్వారాతగ్గించుట మాని వేసి, మానవుడి దేహములోని చైతన్యము యొక్క ఉనికిని  గుర్తించే వరకు  మానవ జాతికి రోగముల బెడద వదలదని, దీనికి మన దృష్టి ప్రాచ్య విజ్ఞానము వైపు మరల్చాలి అని తన టర్నింగ్ పాయింట్ అనే పుస్తకములో వ్రాసినాడు.

          ఇంకా చెప్పాలని యున్నది, కాని మేము చెబితే ఎవరికీ ఎక్కుతుంది? మేము కూడా మీలాంటి జీవులమే. మానవ జాతిని నాశనము చేయాలన్న పెద్ద కోరికలు మాకు లేవు.  ప్రకృతి సహజమైన విధానాలకు దూరమయిన తరువాత దేహములో వచ్చిన మార్పులే వ్యాధులు.  ఆ సమయములో మేము దేహములో యున్నంత మాత్రాన మా వలన వ్యాధులు వచ్చినాయని సిద్ధాంతము చేయడము అన్యాయము. బె చాంప్ మరియు హనెమాన్ ఉద్దేశ్యములో మేము పాకీ పని వారము మాత్రమె. కానీ, మా నిర్మూలన కొఱకు రోజు కొక విష పదార్థము తయారు చేసి, వాటిని నేరుగా దేహములో వాడుట ద్వారా మానవుడి లోని కణజాలాన్ని నిర్వీర్యము చేస్తున్నారు. అందుకే మనుషులలో రోగ నిరోధక శక్తి తగ్గినది. ఈ విధముగా పాశ్చర్ విధానము వచ్చిన తరువాత రోగాల సంఖ్య పెరిగినది. ఇందు కొఱకు ఏర్పడిన రసాయనిక కర్మాగారాలు తము తయారు చేసిన పదార్థాలతో నేలను విష పూరితము చేస్తున్నాయి.
          ఒక్క సారి ప్రాచ్య విజ్ఞానము వైపు చూడండి. వారి యొక్క ఆయుర్వేద విజ్ఞానములో రోగము కంటే ముందు స్వస్థత గురించి మాట్లాడుతారు.  స్వస్థత అంటే తను తానుగా యుండుట. లేదా తనలో తను యుండుట.  అటువంటి శాస్త్రాలు ఆధునిక వైద్యము యొక్క తాకిడికి కూలి పోయి మళ్ళీ లేస్తున్నవి.  నూటికి తొంబది మంది  చెప్పిన విషయాన్ని సత్యముగా భావించ వలసిన అవసరము లేదు. ఈ విషయము ప్రతి యొక్కరికి తెలుసు. ఇపుడిపుడే చైనా లో ఆకుపంచర్, మన దేశము లో ఆయుర్వేద, ముద్రా విజ్ఞానము, ప్రకృతి వైద్యము లాంటివి ఆధునిక వైద్యము నయము చేయ లేని ఎన్నో రోగాలను నయము చేస్తున్నది. ఈ వైద్య విధానాలలో ఎక్కడా మా ప్రస్తావన ఎక్కడా లేదు. అయినా  మా  మీద దాడులు ఆగటము లేదు.

          అందరూ ఒక్క సారి ఆలోచించండి. మేరు వేసే నిందలను భరించాల్సిందేనా?

No comments:

Post a Comment