రెండు
చిలుకలు మొదట ఒక మామూలు కథ గానే మొదలు పెట్టినాను. కానీ కథ మరో రకముగా మారి
పోయింది. మనుషుల మధ్య బంధాలు ఎలా ఉంటాయో వ్రాసినాను. మొదట సరోజ పాత్ర మామూలు పాత్ర
గానే అనుకున్నాను. కానీ అది నన్ను దాటి వెళ్లి పోయింది. ఇంకా ప్రస్థానము కొన్ని
రోజులు సాగుతుంది. ఈ నాటి సామాజిక పరిస్థితుల మీద
మాయ అనే కథ మొదలు పెట్టినాను. కానీ ఇప్పుడే అది మీ ముందుకు రాదు
అనుకుంటున్నాను.
నాను ఈ ప్రాచీన సంస్కృతీ చిన్నప్పటి నుండి ఏంటో
ప్రభావితము చేసింది. నా తండ్రి నుండి నన్ను ప్రత్యక్షముగా పరోక్షముగా ప్రభావితము
చేసిన వారు ఎందఱో. అందులో స్వామి వివేకానంద మొదలు శ్రీ నండూరు రాదా కృష్ణ గారు, వారి ద్వారా నా జీవితమూ మీద ప్రభావము
చూపిన శ్రీ కృష్ణమాచార్యులు గారు, శ్రీ సత్య సాయి బాబా గారు.. ఎందఱో ఉపాధ్యాయులు,
పేరు పేరున చెప్పక పోయినా వారి అందరికి నా ప్రణామములు.
ఇవి చదువుతున్న వారు ఒక్క వాక్యము అయినా ఖర్చు
చేసి మీ అభిప్రాయము వ్రాయండి.
మీ
సుబ్బ రామయ్య.
No comments:
Post a Comment